రోహిత్ శర్మ, రికెల్టన్ పరుగుల వరద.. ఎల్ఎస్ జీపై ముంబై ఇండియన్స్ ఘన విజయం

Publish Date:May 4, 2026

Advertisement

ముంబైలోని వాంఖెడే మైదానంలో ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం (ఏప్రిల్ 4) జరిగిన జరిగిన  పోరులో ముంబై ఇండియన్స్ సునాయాస విజయం సాధించింది.  టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన  లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఆటగాళ్లు ఆడుతూపాడుతూ ఛేదించేశారు. ముఖ్యంగా  ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే ముంబై 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

 టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా మిచెల్ మార్ష్ (44), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) రాణించడంతో లక్నో భారీ స్కోరును నమోదు చేయగలిగింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు.  తొలి వికెట్‌కు వీరిద్దరూ కేవలం 10.5 ఓవర్లలోనే 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పారు. రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రికెల్టన్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు బాదడం విశేషం.

ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత తిలక్ వర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (12) స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే.. నమన్ ధీర్  23 నాటౌట్ , విల్ జాక్స్  10 నాటౌట్  బాధ్యతాయుతంగా ఆడి ముంబైకి విజయాన్నందించారు.  

ఈ విజయం ముంబై ఇండియన్స్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం, రికెల్టన్ విధ్వంసకర బ్యాటింగ్ లీగ్‌లో ఇతర జట్లకు హెచ్చరికగా మారింది. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని ముంబై అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు, భారీ స్కోరును కాపాడుకోవడంలో విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ తమ బౌలింగ్ విభాగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  

By
en-us Political News

  
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.