Publish Date:Mar 10, 2026
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కేసు దర్యాప్తుకు సంబంధించిన విస్తృతమైన పత్రాలను సీబీఐ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు నిందితులకు అందజేశారు. సీబీఐ అధికారులు ఈ కేసులో తమ దర్యాప్తు నివేదికతో పాటు గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన నివేదికలు, కేసుకు సంబంధించిన ఇతర రికార్డులను కూడా నిందితులకు అందజేశారు.
మొత్తం సుమారు 13 లక్షల పేజీలకు పైగా ఉన్న ఫైల్స్ను ఇండెక్స్ రూపంలో సిద్ధం చేసి అందజేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో ఉన్న కేసు పత్రాలను సాంకేతిక లోపాలు లేకుండా అందజేస్తున్నామని కోర్టుకు వివరించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా భావిస్తున్న అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్లను సీబీఐ అధికారులు విచారించారు. ఆ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పిం చారు. ఈ ఇద్దరి విచారణ ద్వారా కేసులోని పలు అంశాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో కడప ఎంపీ Y. S. అవినాష్ రెడ్డి మినహా మిగతా నిందితులంతా కోర్టు ముందు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన పత్రాలు భారీ స్థాయిలో ఉండటంతో వాటిని పరిశీలించడానికి కొంత సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కేసు పత్రాల పరిశీలనకు సమ యం ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విచారణలో ప్రతి దశలో కొత్త పరిణామాలు చోటుచేసుకుం టుండటంతో కేసు తీర్పు పై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. భారీ సంఖ్యలో సేకరించిన సాక్ష్యాలు, పత్రాలు విచారణలో కీలక పాత్ర పోషించే అవకాశముందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/viveka-murder-case-36-215291.html
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
చిన్నపాటి సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యుడికి జీఎస్టీ అధికారులు కళ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చారు.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై పది వేలు పెరిగి 2,65,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయి. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు.
గచ్చిబౌలి మంగళ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి అనే యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన వెంకట కృష్ణ డెస్టినేషన్ మ్యారేజ్ జరగనుంది. ఒకవైపు అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వివాహ ఏర్పాట్ల కోసం వెంకట కృష్ణ 20 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల సమయం లో స్కానింగ్లో బుల్లెట్లు బయటపడటంతో అధికా రులు వెంటనే అప్రమత్తమ య్యారు. ఆయుధాలకు సంబంధించిన సరైన అను మతులు, పత్రాలు చూపించ లేకపోవడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు.
పోలీసులు కథనం ప్రకారం సికింద్రాబాద్ బేగంపేటలోని ఒక ట్రైనింగ్ సంస్థకు పైలట్ కోర్సు కోసం వచ్చిన యువ తిని ట్రైనర్ నసిముద్దీన్ మాయ మాటలతో నమ్మించాడు. ట్రైనింగ్లో సహాయం చేస్తానని చెప్పి యువతిని తన వశం చేసు కున్నాడు. అనంతరం పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.