పుదుచ్చేరికి రాష్ట్ర హోదా... రంగస్వామి ముందు పెను సవాలు

Publish Date:May 4, 2026

Advertisement

 

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించే గురుతరబాధ్యత ఆయనకు  ఈ సారి పెను సవాల్‌గా మారనుంది. ఆయన గతంలో 2001 నుండి 2008 వరకు రెండు సార్లు, 2011 నుండి 2016 వరకు కాంగ్రెస్ నుంచి  ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన రంగస్వామి  2011లో కాంగ్రెస్ నుండి విడిపోయి ఏర్పడిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సి) అని తన పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 

2011 ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుని మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు.  2016 ఎన్నికల నాటికి ఏఐడీఎంకేతో తెగ తెంపులు  చేసుకుని ఒంటరిగా పోటీ చేసిన ఏఐఎన్ఆర్‌సి ప్రతిపక్షానికి పరిమితమైంది. 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన రంగస్వామి, నాలుగోసారి సీఎం అయ్యారు. 2026 ఎన్నికల్లో అదే భాగస్వామ్యంతో అయిదో సారి సీఎం పీఠం అధిరోహించడానికి సిద్దమయ్యారు. రంగస్వామి పూర్తి పేరు నటేశన్ కృష్ణస్వామి గౌండర్ రంగస్వామి.1950 ఆగస్టు 4న పుదుచ్చేరిలో నటేశన్ కృష్ణస్వామి మరియు పంచాలి దంపతులకు జన్మించారు . 

లా పట్టభద్రుడైన రంగస్వామి ముందు ప్రస్తుతం పెద్ద సవాలే ఉంది. ప్రజలు తనపై ఉంచిన అపార నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రంగస్వామి కూడా పట్టుదలతో ఉన్నారు. అదే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడం.   కేవ‌లం 30 అసెంబ్లీ స్థానాలున్న ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఏం చేయాల‌న్నా.. కేంద్రం నుంచి అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. దాంతో పుదుచ్చేరి వాసులు కొన్ని ద‌శాబ్దాలుగా పెట్టుకున్న ఆకాంక్ష‌లు పెద్ద‌గా నెర‌వేర‌డం లేదు.  75 ఏళ్ల‌కు పైగా వ‌య‌సున్న రంగ‌స్వామి, నిరాబరంగా జీవిస్తారు. అన్ని సార్లు సీఎం అయినా ఆయన కారు ఎక్కడానికి పెద్దగా ఇష్టపడరు. టూ వీలర్ తానే స్వయంగా నడుపుతూ ప్రజల్లో తిరుగుతుంటారు. అందుకే ఆయన బుల్లెట్ రంగస్వామిగా ప్రజలకు ప్రీతిపాత్రులయ్యారు.  అయితే కీల‌క‌మైన రాష్ట్ర హోదా సాధించే విష‌యంలో రంగ‌స్వామి వెనుక‌బ‌డుతున్నారనే విమర్శలున్నాయి. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా దాన్ని ఆయన సాధించలేకపోయారు. గత అయిదేళ్లుగా ఎన్టీఏ భాగస్వామిగా ఉన్న ఆ హోదా తీసుకురాలేక పోయారు. ఆయనపై అదొక్కటే అసంతృప్తి. అయితే.. ఆయ‌న ప్ర‌ధాని మోడీని గ‌త ఐదేళ్ల కాలంలో 35 సార్లు క‌లిసి.. విజ్ఞ‌ప్తి చేయ‌డం.. తాజా ఎన్నికల్లో సానుకూల‌త‌ పెంచింది. ఆ క్రమంలో తాము అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌త్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామ‌ని ఎన్టీఏ పెద్దలు ప్రచారంలో హామీ ఇచ్చారు. రంగ స్వామి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. తనపై న‌మ్మ‌కం ఉంటే.. ఈ సారికి మీ ఓటు తనకే వేయాలనిచ ఈ ద‌ఫా హోదా తీసుకువ‌స్తానని శ‌ప‌థం కూడా చేశారు. అదే ఇప్పుడు రంగస్వామి పార్టీకి కలిసి వచ్చింది.  ఇక ఆ పెద్దాయన పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించడమే మిగిలి ఉంది

By
en-us Political News

  
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.