Publish Date:Feb 18, 2026
కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుపై కోర్టు ధిక్కరణ నేరం రుజువు కావడంతో తెలంగాణ హైకోర్టు ఆయనకు ఆరు నెలల జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే..తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇక కేసు వివరాల్లోకి వెడితే.
మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మికి సంబంధించిన భూ వివాదంపై గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత భూమి పై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకుని పిటిషనర్కు న్యాయం చేయాలని కోర్టు సూచించింది. అయితే ఆ ఉత్తర్వు లను అమలు చేయడంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం విఫలమైందని, కావాలనే పట్టించుకోలేదని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన హైకోర్టు, గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడం సాధారణ పరిపాలనా లోపం కాదని, ఇది న్యాయ వ్యవస్థను అవమానించే చర్యగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తూ, కలెక్టర్ రాహుల్ రాజ్పై కోర్టు ధిక్కరణ నేరం రుజువు కావడంతో ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును పై కోర్టులో సవాల్ చేయడానికి వీలుగా తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసింది. ఈ వ్యవధిలో కలెక్టర్ అప్పీల్ చేసు కునే అవకాశం కల్పించింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే.. ఎంతటి ఉన్నతాధికారులైనా శిక్షకు లోనవుతారనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-court-impose-jail-to-medak-district-collector-jail-36-214270.html
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
గత నెల 14న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్ఎంటీ రోడ్డుపై రాకేష్ శర్మ, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరుగురు దుండగులు వారిపై దాడి చేసి 7.5 గ్రాముల బంగారు గొలుసు తో పాటు ఒకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
రాజస్థాన్ లోని పర్యాటక నగరంఉదయ్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.