పబ్లిక్ ప్రదేశాల్లో సామూహిక విషప్రయోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఐసిస్ అనుబంధ బయో టెర్రర్ కుట్ర కేసులో కీలక పరిణా మం చోటుచేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముగ్గురిపై అధికారికంగా చార్జ్షీట్ దాఖలు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో అనుబంధం కలిగిన ఈ నిందితులు జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సామూహిక విషప్రయోగం చేసి భయాన్ని వ్యాప్తి చేయాలని కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కాగా, సహ నిందితులు ఉత్తర ప్రదేశ్ కు చెందినఆజాద్, మొహమ్మద్ సుహేల్ . వీరిపై యూఏపీఏ, బీఎన్ఎస్, ఆర్మ్స్ యాక్ట్కు సంబంధించిన పలు సెక్షన్ల కింద అహ్మదాబాద్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జ్షీట్ దాఖలైంది.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
ఈ కేసును మొదటగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ) నమోదు చేసింది. నవంబర్ 2025లో టోల్ ప్లాజా వద్ద డాక్టర్ మొహియుద్దీన్ను అరెస్ట్ చేశారు. అతని కారులో అక్రమ ఆయుధాలు, నాలుగు లీటర్ల ఆముదం నూనె లభించాయి. అదే రోజు ఏటీఎస్ మిగతా ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేసింది.అధికారుల దర్యాప్తులో ఆజాద్, సుహేల్ హనుమాన్ ఘాట్ లోని డెడ్-డ్రాప్ సైట్ నుంచి డబ్బు పార్సిళ్లు, అక్రమ ఆయుధాలు సేకరించి వాటిని గుజరాత్లోని ఛత్రాల్ ప్రాంతంలో మొహియుద్దీన్కు అందేలా వదిలినట్లు వెల్లడైంది.
జనవరి 2026లో కేసు దర్యాప్తు చేపట్టి5న ఎన్ఐఏ కీలక విషయాలను బయటపెట్టింది. మొహియుద్దీన్ను అతని హ్యాండ్లర్ దక్షిణ ఆసియా ప్రాంతానికి ఐఎస్ అమీర్ గా చేస్తామని హామీ ఇచ్చి ఈ కుట్రలోకి దింపినట్లు తెలిసింది. మొహియుద్దీన్ తన హైదరాబాదు నివాసాన్ని ఆముదం విత్తనాల నుంచి రిసిన్ తయారీకి రహస్య ప్రయోగశాలగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో ఇతర ఇద్దరు నిందితుల పాత్ర కూడా కీలకంగా బయటపడింది. వారు విదేశీ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు చేసినట్లు ఎన్ఐఏ తేల్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nia-charges-three-in-isislinked-bioterror-conspiracy-case-36-219035.html
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
గత నెల 14న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్ఎంటీ రోడ్డుపై రాకేష్ శర్మ, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరుగురు దుండగులు వారిపై దాడి చేసి 7.5 గ్రాముల బంగారు గొలుసు తో పాటు ఒకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
రాజస్థాన్ లోని పర్యాటక నగరంఉదయ్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.