ఇంటిపై గంజాయి సాగు...సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

Publish Date:Apr 21, 2026

Advertisement

 

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందని కుటుంబం ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే పరిమితమైంది. చెడు సావాసం కారణంగా యువకుడు తన జీవితాన్నే తలకిందులు చేసుకున్నాడు. చివరకు ఐటీ ఉద్యోగి నుంచి గంజాయి రైతుగా మారి పోలీసుల చేతికి చిక్కాడు. సిహెచ్ శశిధర్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఉద్యోగం వచ్చిందన్న వార్తతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే కొద్దికాలానికే చెడు స్నేహితుల ప్రభావంతో గంజాయికి బానిసయ్యాడు. 

జీతం మొత్తం  ఖర్చవడంతో ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు.డబ్బుల కొరత రావడంతో మరింత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. గంజాయి కొనడానికి డబ్బు లేకపోవడంతో తన ఇంటి పైకప్పుపైనే గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ దాడి చేసి అక్కడ పెంచుతున్న గంజాయి మొక్కలను చూసి షాక్‌కు గురయ్యారు. శశిధర్ ఇంటి పైకప్పుపై మొత్తం 17 గంజాయి మొక్కలు కనిపించాయి. వాటిలో కొన్ని పూత దశలో ఉండగా, మరికొన్ని మూడు మీటర్ల ఎత్తు వరకు పెరిగి ఉన్నాయి. ఈ మొక్కల నుంచి సుమారు 10 కిలోల గంజాయి లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో శశిధర్‌ను అరెస్టు చేసి ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

ఇంతటితో కథ ముగియలేదు…

అదే టీమ్ మేడిపాటి నగర్‌లో మరో కేసును ఛేదించింది. బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 480 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బండి అరుణ్ కుమార్, బి. ఆశిష్‌లను కూడా అరెస్టు చేశారు.ఈ రెండు ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను అధికారులు అభినందించారు.

By
en-us Political News

  
ప్రగతి దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి.
నాదెండ్ల భాస్కరరావు ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీ అన్న పుస్తకంలో అసలు ఏముంది?
భారత తలసరి ఆదాయం ఇప్పటికీ చైనా తలసరి ఆదాయంలో ఐదో వంతు మాత్రమే కావడంతో ఉత్పాదకత పెరుగుదలకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ వృద్ధికి కావలసినంత స్పేస్ ఉంది. అంతే కాకుండా ఆర్థిక పురోగతి మరింత వేగం పుంజుకోవడానికి ఇండియాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న తరుణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొన్న ట్రంప్.. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ పౌరులకు అసౌకర్యాన్ని తగ్గించే ఉద్దేశంతో మెట్రో రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం విషమించి.. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య అజెండాలో భాగంగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అనేక దేశాలపై అదనపు సుంకాలను విధించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేలాది కంపెనీలు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఫిబ్రవరిలో హైకోర్టు ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చడంతో.. సుమారు 127 బిలియన్ డాలర్ల మొత్తం రీఫండ్‌కు అర్హత పొందింది. ఈ చారిత్రాత్మక తీర్పు ట్రంప్ ఆర్థిక విధానాలకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా కెనడా విదేశీయులకు స్వర్గధామంగా నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడి దృష్ట్యా కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. తాజాగా తీసుకువచ్చిన బిల్ ప్రధానంగా కెనడా పౌరసత్వం పొందే ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు.. అనర్హులను ఏరివేసేందుకు ఉద్దేశించినదని చెబుతున్నారు.
ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల సమయంలో అమెరికా స్థావరాల కంటే యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలే సమర్థవంతంగా పనిచేయడం విశేషం. దీంతో అల్ ధఫ్రా వంటి భారీ అమెరికా సైనిక స్థావరాలు దేశానికి ఆస్తిగా కాకుండా.. శత్రువుల దాడులను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది.
యూఏఈ తన భద్రత, ఆర్థిక, కరెన్సీ వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? లేక ఇది దేశానికి అదనపు ప్రమాదాన్ని తెస్తుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.