నాదెండ్ల ఆత్మకథలో....అసలేముంది!

Publish Date:Apr 22, 2026

Advertisement

 

నాదెండ్ల భాస్కరరావు ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీ అన్న పుస్తకంలో అసలు ఏముంది? ఆ కోర్ పాయింట్స్ ఏమిటి? అసలాయన ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది? అని పరిశీలిస్తే.. నాదెండ్ల భాస్కరరావు రాసిన వాకింగ్ విత్ డెస్టినీ అనే ఆత్మకథ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా చరిత్ర ఆయన్ని ఒక వెన్నుపోటుదారుడుగా చిత్రీకరిస్తే, ఈ పుస్తకంలో ఆయన తన వెర్షన్‌ను ప్రపంచానికి వివరించారు.

టీడీపీ ఏర్పాటులో ఎన్టీఆర్ కేవలం పార్టీ ముఖచిత్రం మాత్రమేనని, పార్టీకి పునాది వేసింది, సిద్ధాంతాలు రూపొందించింది తానేనని ఈ పుస్తకంలో వాదించారు. తానొక కోఫౌండర్ గా వివరించారు. పార్టీ జెండా, గుర్తు, అభ్యర్థుల ఎంపికలో తన మేధస్సు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒక నటుడిగా ప్రజలను ఆకర్షించగలరని, కానీ రాజకీయ పరిపాలన తనకే తెలుసన్నది ఆయన ప్రధాన వాదన. అంతే కాదు ఎన్టీఆర్ రాజకీయ గురువు ఎవరంటే తానేనంటారు నాదెండ్ల. 1984లో ఎన్టీఆర్‌ను దించడం వెన్నుపోటు కాదని, అది పార్టీలోని ఎమ్మెల్యేలందరి అసంతృప్తి వల్ల జరిగిన పరిణామమని ఆయన తన పుస్తకంలో రాసుకొచ్చారు.

ఎన్టీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని, అందుకే వారంతా తన దగ్గరకు వచ్చి నాయకత్వం వహించమని కోరారని ఆయన రాసుకొచ్చారు. గవర్నర్ రామ్ లాల్ తనను నిబంధనల ప్రకారమే ముఖ్యమంత్రిగా ఆహ్వానించారని సమర్థించుకున్నారు.

ఈ పుస్తకంలో ఆయన చంద్రబాబు నాయుడిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల భాస్కరరావు. 
1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉండి టీడీపీని ఓడించడానికి ప్రయత్నించారని, కానీ తర్వాత ఎన్టీఆర్ అల్లుడిగా పార్టీలోకి వచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. తనపై పడ్డ వెన్నుపోటు ముద్ర వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ పరిపాలనపై పలు విమర్శలు చేశారు నాదెండ్ల భాస్కరరావు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బతీశాయని అంటారు నాదెండ్ల. ముఖ్యంగా 2 రూపాయల కిలో బియ్యం పథకం వంటివి ఆర్థిక క్రమశిక్షణను తప్పించాయని, ఆర్థిక మంత్రిగా తాను వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చాయని తన పుస్తం ద్వారా విశదీకరించారు నాదెండ్ల.

ఇక ఢిల్లీ పెద్దలతో సంబంధాల విషయానికి వస్తే.. ఆ సమయంలో ఇందిరా గాంధీతో తనకు ఉన్న సంబంధాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం తప్పు కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.మొత్తంగా ఈ పుస్తకం ద్వారా నాదెండ్ల భాస్కరరావు చెప్పాలనుకున్నది ఒక్కటే..నేను రాజకీయ కుట్రదారుడిని కాదు, ఎన్టీఆర్ రాజకీయ అపరిపక్వత వల్ల దెబ్బతిన్న మేధావిని.. చరిత్రలో ఆయనను ఒక నెగటివ్ రోల్‌లో చూపించినప్పటికీ, తన వైపు న్యాయం ఉందని నిరూపించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నమే ఈ వాకింగ్ విత్ డెస్టినీ. 

ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావు మధ్య జరిగిన ఆ వాగ్వాదం, వారిద్దరి మధ్య ఉన్న స్నేహానికి శాశ్వతంగా ముగింపు పలికింది. ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీలో నాదెండ్ల వివరించిన దాని ప్రకారం, వారి విభేదాలకు ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఇద్దరూ కలిసి ఒకే సోఫాలో కూర్చుని చర్చలు జరిపేవారు. అయితే, కాలక్రమేణా ఎన్టీఆర్ తనను తాను ఒక మహా నాయకుడిగా, కల్ట్ ఫిగర్ గా చూసుకోవడం ప్రారంభించారని ఆరోపిస్తారు నాదెండ్ల. 

ఒక సందర్భంలో, ఎన్టీఆర్ తన వద్దకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు నేల మీద కూర్చోవాలని లేదా చాలా దూరంగా ఉండాలని ఆశించేవారని, ఇది నాదెండ్ల తనకు నచ్చలేదని కూడా రాసుకొచ్చారు. మేమిద్దరం కలిసి పార్టీని నిర్మించాం, అచ్యుతానంతం.. అంటే ఒకే ప్రాణంలాంటి వాళ్ళం అని చెప్పిన ఎన్టీఆర్, అధికారంలోకి వచ్చాక నన్ను కేవలం ఒక సాదాసీదా మంత్రిగా చూడటం ప్రారంభించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావుకు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు మధ్య పాలనాపరమైన ఫైళ్ల విషయంలో పెద్ద గొడవ జరిగినట్టు ఆ బుక్ లో ఉంది. ఎన్టీఆర్ కొన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకునేవారని, ఆర్థిక మంత్రిగా తాను సంతకం చేయకపోతే ఆగ్రహించేవారని అంటారు నాదెండ్ల. 

ఒకరోజు ఒక ఫైల్ విషయంలో వాగ్వాదం జరిగినప్పుడు, ఎన్టీఆర్ చాలా కోపంగా మాట్లాడారని, దానిని నాదెండ్ల తన ఆత్మగౌరవానికి దెబ్బగా భావించారని రాశారు. నువ్వు రాకముందే నేను రాజకీయాల్లో ఉన్నాను, నాకు నియమాలు నేర్పించొద్దు!అనే అర్థం వచ్చేలా నాదెండ్ల ఎదురు తిరిగారట. నాదెండ్ల తన పుస్తకంలో ప్రధానంగా నిందించింది చంద్రబాబు నాయుడును. ఎన్టీఆర్‌కు, తనకు మధ్య ఉన్న దూరాన్ని చంద్రబాబు వాడుకున్నారని ఆయన ఆరోపించారు. తండ్రి లాంటి ఎన్టీఆర్‌ను నేను వదులుకోలేదు, కానీ ఆయన పక్కన చేరిన శక్తులు.. అంటే చంద్రబాబు..నన్ను పార్టీకి దూరం చేశాయి..అని ఆయన తన ఆత్మకథలో మెయిన్ కోర్ పాయింట్‌గా చెప్పారు.

ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లే ముందు, బాధ్యతలను నాదెండ్లకు అప్పగించకుండా మరొకరికి ఇవ్వాలని చూడటం వారి మధ్య ఉన్న విబేధాలను మరింత పెద్దది చేసింది. అదే సమయంలో నాదెండ్ల భాస్కరరావు ఎమ్మెల్యేలను కూడగట్టి, గవర్నర్‌ను కలవడానికి నిర్ణయించుకున్నారు. నాదెండ్ల దృష్టిలో ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు కానీ మొండి పరిపాలకుడు. ఎన్టీఆర్ దృష్టిలో నాదెండ్ల ఒక వ్యూహకర్త కానీ నమ్మకద్రోహి. ఈ రెండు వెర్షన్ల మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర నలిగిపోయింది. ఇలా చెబుతూ పోతే ఈ పుస్తకం ఎన్నో రాజకీయ రహస్యాలను విడమరచి చెబుతుంది.

By
en-us Political News

  
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.