Publish Date:Mar 13, 2026
ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొం టున్న సమయంలో హోటల్ బిల్లులు కూడా పెరుగుతున్నాయి. ఈ పెంపులో హోటల్ యాజమాన్యాలు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తాజాగా ఒక హోటల్ బిల్లులో టిఫిన్ ధరతో పాటు ప్రత్యేకంగా గ్యాస్ ఛార్జీలు కూడా వేసి వసూలు చేయడం గమనార్హం.
ఆ బిల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బిల్లులో టిఫిన్ ధరతో పాటు గ్యాస్ ఛార్జ్ పేరిట అదనపు సొమ్ము మెన్షన్ చేయడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పెరుగుతున్న ఎల్పీజీ ధరల కారణంగా కొన్ని హోటల్ యాజమాన్యాలు ఈ విధంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. టిఫిన్ ధరలోనే వంట ఖర్చులు ఉండాలి గానీ, ప్రత్యేకంగా గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం సరైన పద్ధతి కాదంటున్నారు.
అసలు విషయంలోకి వస్తే చెన్నైలోని పెరుంగుడి పరిధి తిరువెంకడనగర్ ప్రాంతంలో ఉన్న గీరాస్ రెస్టారెంట్ కివెళ్లి చేసిన ఓ కస్టమర్.. ఆ తరువాత హోటల్ సిబ్బంది ఇచ్చిన బిల్లు చూసి స్టన్ అయిపోయాడు. ఇంతకీ ఆ బిల్లులో తాను తిన్న టిఫిన్ ధరలతో పాటు బిల్లులో గ్యాస్ యూసేజ్ చార్జ్ పేరుతో అదనంగా కొంత మొత్తాన్ని చేర్చి ఉంది. హోటల్లో వండిన ఆహారం తినడానికి వచ్చిన కస్టమర్లపై వంట గ్యాస్ ఖర్చును ప్రత్యేకంగా వేయడం ఏమిటని షాక్ అయిన ఆ కస్టమర్ వెంటనే ఆ బిల్లును సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అది వెంటనే వైరల్ అయ్యింది. దీనిపై నెటిజనులు తెగ సెటైర్లు వేస్తున్నారు. వినియోగదారుల సంఘాలైతే మండిపడుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gas-usage-charge-aditional-in-hotelbill-36-215422.html
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తమ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వేద పండితులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టిమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్టించి జలాలతో అభిషేకాలు చేశారు.
అమ్మాయి తరపు వారు పది మంది ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. యువన్తో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్తా తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిందితులు ఒక్కసారిగా యువన్ పై కత్తులతో దాడి చేశారు. అందరూ చూస్తుండగానే తల, మెడ, చేతులపై విచక్ష ణారహితం గా కత్తులతో దాడి చేయడంతో యువన్ అక్కడికక్కడే కుప్పకూ లిపోయాడు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. మిచెల్ మార్ష్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు.
ఈ కేసుకు సంబంధించి నాసిక్ సెషన్స్ కోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన రోజుల వ్యవధిలోనే ఈ అరెస్ట్ జరగింది. తాను గర్భిణీనని.. తనకు ఈ కేసుతో పరిమిత సంబంధం మాత్రమే ఉందని పేర్కొంటూ ఆమె బెయిల్ కోసం ప్రయత్నించిన సంగతి తెలిసిందే.