ఇండియా నరకకూపం అన్న వారాల వ్యవధిలోనే.. మాట మార్చిన ట్రంప్

Publish Date:May 25, 2026

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుండి  ఏ నిముషానికి ఏ మాట వస్తుందో ఎవరూ ఊహించలేరు.  కేవలం కొన్ని వారాల కిందట  అమెరికాను దోపిడీ చేయడానికి ఇండియా తన పౌరులను ఎగుమతి చేస్తున్నదన్న డోనాల్డ్ ట్రంప్.. ఇండియాను ఒక నరకకూపంగా అభివర్ణించారు. అదే నోటితో తాజాగా ఆయన ఇండియా అమెరికాకు గొప్ప మిత్రదేశమని, తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బిగ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.  అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన సందర్భంగా..  ప్రత్యక్ష ప్రసారంలో వర్చువల్‌గా కనిపించిన డొనాల్డ్ ట్రంప్, తాను ఇండియాను  ప్రేమిస్తున్నాన్నారు. అందరికీ   అందరికీ హలో చెప్పాలనుకుంటున్నాననీ, తాను ప్రధాని మోడీకి బిగ్ ఫ్యాన్ ననీ చెబుతూ.. ప్రధాని మోడీని ఒక గొప్ప వ్యక్తిగా, తనకు అత్యంత సన్నిహితమైన ఫ్రెండ్ గా పేర్కొన్నారు.  గతంలో ఎన్నడూ అమెరికా ఇండియాకు ఇంత సన్నిహితంగా లేదన్న ట్రంప్.. ఇండియా అమెరికాపై వంద శాతం ఆధారపడవచ్చనీ,   వారికి ఏదైనా సహాయం అవసరమైతే,  ఒక్క ఫోన్ కాల్ చాలు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు.  ఇండియా  అమెరికాకు   మిత్రదేశమనీ, కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం భరోసా ఇచ్చే ప్రకటన కావచ్చునేమో కానీ, పాలనా చర్యల విషయానికి వస్తే, అమెరికా భారత జనాభాకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అమెరికాలోని భారత జనాభా భారతదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించే ఇటీవలి ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.     
వాస్తవానికి, అంతర్జాతీయ దౌత్య వేదికలపై ట్రంప్ భారతదేశంతో  హాట్ అండ్ కోల్డ్ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకవైపు భారత వస్తువులపై భారీగా పన్నులు   విధిస్తూ, కఠినమైన వాణిజ్య నిబంధనలను అమలు చేస్తూనే.. మరోవైపు ప్రధాని మోదీని పబ్లిక్ వేదికలపై ఆకాశానికెత్తేయడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. గతంలోనూ రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. అయినప్పటికీ, వాణిజ్య ఒప్పందాల విషయంలో మోదీతో కలిసి పని చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని ట్రంప్  సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.

ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ దేశాధినేతల స్థాయిలో భారత్‌తో మైత్రి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమెరికా యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం భారతీయ పౌరులకు  ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నూతన వలస నిబంధనల ఉత్తర్వులు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, వారు తిరిగి తమ స్వదేశానికి  వెళ్లి అక్కడి నుంచే ఫైల్ చేయాలని నూతన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో స్థిరపడాలనుకునే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

రాజకీయంగా, దౌత్యపరంగా ట్రంప్ ప్రకటనలు భారత్‌కు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ..  అమెరికా అంతర్గత విధానాలు మరియు వాణిజ్య ఆంక్షలు మాత్రం భారతదేశ ప్రయోజనాలకు భిన్నంగా సాగుతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. ట్రంప్ మాటల్లోని సాన్నిహిత్యం చేతల్లో కూడా కనిపిస్తేనే ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని అంటున్నారు.  ఏది ఏమైనప్పటికీ, అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా వంటి అగ్రరాజ్యం భారత్‌కు వంద శాతం అండగా ఉంటామని, ఒక్క ఫోన్ కాల్‌తో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అంతర్జాతీయంగా భారతదేశ వ్యూహాత్మక బలాన్ని చెప్పకనే చెబుతోంది. 

రాబోయే రోజుల్లో ట్రంప్ చేసిన ఈ సానుకూల వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి,  వీసా నిబంధనలను సరళీకరించడానికి ఎంతవరకు దోహదపడతాయన్నది చూడాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడి తాజా యూ-టర్న్ ప్రకటనతో భారత్-అమెరికా రక్షణ, ఆర్థిక భాగస్వామ్యం సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

By
en-us Political News

  
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
వరంగల్ రేంజ్‌కు చెందిన ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిపై ఉక్కుపాదం మోపారు.
ఇరుపక్షాలు 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించనున్నాయి.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న సూలూరులో ఒక 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన కిరాతక అత్యాచారం మరియు హత్య ఉదంతం
తెలంగాణలో మద్యం ప్రియులు సరికొత్త నిర్ణయంతో వార్తల్లోకెక్కారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో జరిగిన ప్రముఖుల, రాజకీయ నాయకుల హత్యల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేగాయి.
పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, అవశేషాలు పరిరక్షణ పై గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వారు సిద్దిపేట జిల్లా నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను ఆదివారం సందర్శించారు.
ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ఇరువురి మధ్యా ఆవేశాలు తగ్గలేదు. మ్యాచ్ అనంతరం కోహ్లీ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు.
ఆ ఇద్దరు చిన్నారుల చిత్రాల దిగువ ప్రధాని మోది.. నిన్నటి రోజున నా ఇద్దరు చిన్నారి మిత్రులు నన్ను కలవడానికి సేవా తీర్ద్ కు వచ్చారు అని చెప్పుకురావడంతో.. ఎవరా చిన్నారులు అని అంతా ఆరా తియ్యడం మొదలు పెట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.