Publish Date:Feb 21, 2026
మాజీ ఎంపీ బుట్టా రేణుక , ఆమె భర్త నీరుకర్ శివ ప్రసాద్కు చెందిన ఆస్తుల ఈ-వేలం ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో తీసుకున్న భారీ రుణాన్ని చెల్లించకపోవడంతో ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ రంగంలోకి దిగింది. బకాయిల వసూళ్ల కోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎ స్పందన లేకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది.
ఆ సంస్థ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, బుట్టా రేణుక దంపతులు ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.340 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ప్రారంభంలో కొంతకాలం వరకూ వాయిదాలు చెల్లించినా ఆ తరువాత చెల్లిం పులు నిలిపివేశారు. దీంతో వడ్డీలు, పెనాల్టీలు కలసి మొత్తం బాకీ రూ.782.07 కోట్లకు చేరింది. దీంతో రుణానికి భద్రతగా పెట్టిన ఆస్తులను విక్రయించి బకాయిలను వసూలు చేసుకునేందుకు సంస్థ చర్యలు ప్రారంభించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎల్డీఎస్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ బెంగళూరు శాఖ పరిధిలోని సర్వే నంబర్ 1009, ఫేజ్–6లో ఉన్న 3,833.28 చదరపు గజాల స్థలాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించ నున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆ స్థలంలో మెరిడియన్ పాఠశాల భవనం ఉండటం గమనార్హం. సంబంధిత ఆస్తి విలువను రూ.65 కోట్లుగా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది.ఈ-వేలంలో పాల్గొనదలిచిన వారు మార్చి 23లోగా ఈ-బిడ్ దరఖాస్తులు సమర్పించాలనీ, మార్చి 24న ఈ-వేలం నిర్వహిం చనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వేలం ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది. మాజీ ఎంపీకి చెందిన ఆస్తుల ఈ-వేలం వ్యవహారం కర్నూలు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుండ గా, అనంతరం మరిన్ని ఆస్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయంపై మాజీ ఎంపీ నుంచి స్పందన రావాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-mp-butta-renuka-assets-to-be-auctioned-on-march-24-36-214427.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.