మాఫియాడాన్ ఇందర్జీత్ నివాసంపై ఈడీ దాడులు.. భారీగా నగదు, బంగారం సీజ్

Publish Date:Jan 1, 2026

Advertisement

అండర్ వరల్డ్ డాన్ ఇందర్జీత్ సింగ్ యాదవ్, అతని అనుచరుల నివాసాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో లెక్కలలో చూపని   5 కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.  అలాగే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బంగారం, 35 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇందర్జీత్, అతడి అనుచరుల నివాసాలపై జరిపిన సోదాలలో మొత్తం   48 కోట్ల రూపాయల  విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాలు సోమవారం (డిసెంబర్ 29)న ఆరంభమై, బుధవారం (డిసెంబర్ 31) అర్దరాత్రి దాటే వరకూ కొనసాగాయి. ఇందర్జీత్ నివాసంలో స్వాధీనం చేసుకున్న కరెన్సీని లెక్కించేందుకు బ్యాంకు అధికారులను నోట్ల లెక్కింపు యంత్రంతో సహా పిలిపించారు.  రాజకీయ అండతో ఇందర్జీత్ సింగ్ యాదవ్ బెదరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇందర్జీత్ యాదవ్ ప్రస్తుతం పరారీలో  ఉన్నాడు. 

హరియాణాకు చెందిన ఇందర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. అతడు యూఏఈ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండేవాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఇందర్జీత్ యాదవ్,  అతడి అనుచరులపై హర్యానా, యూపీ రాష్ట్రాల్లో 15కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆయుధాల చట్టం, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసి, ఛార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. ఈ యాదవ్ అక్రమ సంపాదన వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది.  

By
en-us Political News

  
ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠిన చట్టాన్ని తీసుకువచ్చిన తొలి దేశంగా నిలిచింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును డిజిటల్ మెజారిటీ గా నిర్ణయించింది.
అదే సమయంలో మందుబాబులు కూడా పండుగ చేసుకున్నారు. పబ్ లు బార్ లలో అర్ధరాత్రి వరకూ తాగి చిందులేశారు. అక్కడితో ఆగకుండా నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు పట్టుబడిన వారి సంఖ్య కూడా హైదరాబాద్ లో అధికంగానే ఉంది.
ఇటీవలే ముంబైలో రెండవ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. ఆ విమానాశ్రయం ప్రతిపాదన దశ, నిర్మాణాలను పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభం కావడానికి దాదాపు పాతికేళ్లు పట్టింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయంలోనే పరిస్థితి ఇది. ఇక గత దశాబ్ద కాలంగా బెంగ‌ళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.
దట్టమైన పొగమంచు కారణంగా డిల్లీ నుంచి శంషాబాద్‌కు రావా ల్సిన, అలాగే శంషాబాద్ నుంచి డిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ విమానాలు రద్దు కావడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన, తిరుపతి నుంచి శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమనాలు పొగ మంచు కారణంగా ఆలస్యమయ్యాయి.
ఐబొమ్మ రవిని మూడ దఫాలుగా కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు రవి టెలిగ్రామ్ యాప్‌ ద్వారా నేరుగా సినిమా కంటెంట్‌ను కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. సాధారణ సినిమా లకు ఒక్కో సినిమాకు సగటున 2 డాలర్లు చెల్లించగా, పెద్ద హీరోల సినిమాల విషయంలో మాత్రం భారీగా 500 డాలర్లు వరకూ చెల్లించినట్లు నిర్ధారించారు.
పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహ నాలు, కార్లు, భారీ వాహ నాలు అన్నీ హెడ్‌లైట్లు వేసు కుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. కొత్త సంవత్సర వేడుకలకు జపాన్ ముస్తాబవుతున్న వేళ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 233 ప్రాంతంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న మహమ్మద్ ఇర్ఫాన్ ఉద్దిన్‌ జింక మాంసం విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్టు అధికారులు అతడి షాపులో తనిఖీలు నిర్వహించి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాతల కుమారుడు మురళీకృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడేళ్ల కిందట అంటే అతడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. స్నేహితులతో పందెం కాసి పెన్ను మింగేశాడు. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు.
మంటల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భవనం పై అంతస్తు నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి వయస్సు 24 ఏళ్లు.
ఇంటర్‌సిటీ యూనివర్సల్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న కన్నెబోయిన మహేష్‌బాబు అనే వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆ మత్తులో బస్సు నడిపినట్లు గా రుజువు కావడంతో నాంపల్లి కోర్టు అతనికి జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా కూడా విధించింది.
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో 2025 సంవత్సరం మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. రాజధాని అమరావతి ప్రాంతంలో సైతం వివిధ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు విజన్, కార్యదక్షత, ఎడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కళ్లకు కడుతుంది.
బుధవారం రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.