టెలిగ్రామ్ ద్వారా సినిమాల కొనుగోలు.. ఐబొమ్మ రవి కేసులో విస్తుపోయే వాస్తవాలు!

Publish Date:Jan 1, 2026

Advertisement

ఆన్‌లైన్ సినిమా పైరసీ కేసులో అరెస్టయిన  ఐ బొమ్మ రవి విచారణలో ఒక్కొక్కటిగా సంచలన వాస్తవాలు వెల్లడౌతున్నాయి. పోలీసుల  విచారణలో.. రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకొని అనేక సంవత్స రాలుగా  వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తేలింది. ముఖ్యంగా బొమ్మ రవి టెలిగ్రామ్ యాప్‌ను వేదికగా చేసుకొని సినిమాలను అక్రమంగా  కొనుగోలు చేసి.. వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం ద్వారా కోట్లలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు.

 ఐబొమ్మ రవిని మూడ దఫాలుగా కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు   రవి టెలిగ్రామ్ యాప్‌ ద్వారా నేరుగా సినిమా కంటెంట్‌ను కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. సాధారణ సినిమా లకు ఒక్కో సినిమాకు సగటున 2 డాలర్లు చెల్లించగా, పెద్ద హీరోల సినిమాల విషయంలో మాత్రం భారీగా 500 డాలర్లు వరకూ చెల్లించినట్లు నిర్ధారించారు. చిన్న బడ్జెట్ సినిమాల కోసం 100 నుంచి 200 డాలర్ల మధ్య చెల్లింపులు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విధంగా ముందుగానే సినిమాలను సేకరించి, విడుద లైన వెంటనే అక్రమంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఐ బొమ్మ రవి నేర జీవితం తాజాగా ప్రారంభమైనది కాదని, 2007 నుంచే ఈ అక్రమ కార్యకలాపాలను మొదలెట్టాడనీ పోలీసులు తమ విచారణలో తేలినట్లు చెప్పారు.  విద్యార్థిగా ఉన్న దశలోనే విలాసవం తమైన జీవితం గడపాలనే ఆశతో చిన్నచిన్న నేరాలకు అలవాటు పడిన రవి.. ఆ తరువాత సైబర్ నేరాల వైపు అడు గులు వేసినట్లు చెబుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన  రవి, ఆ పరిజ్ఞా నాన్ని చట్టవిరుద్ధ కార్యకలా పాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా ఐబొమ్మ ద్వారా సంపాదించిన అక్రమ ఆదాయాన్ని దాచిపెట్టేందుకు రవి అనేక మార్గాలను ఆశ్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు వేర్వేరు పేమెంట్ గేట్‌వేల ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపి నట్లు తేలింది. అంతేకా కుండా.. అనేక బ్యాంకు ఖాతా లను తెరిచి, వాటి ద్వారా లావాదేవీలు నిర్వహించిన రవి, కొన్ని ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు కూడా మర్చిపోయినట్లు విచారణలో చెప్పడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అంశం ద్వారా రవి ఎంత విస్తృతం గా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాడో అర్థమవు తోందని పోలీసులు అంటున్నారు.రంగారెడ్డి జిల్లా అడ్రస్ పేరుతో రవి మూడు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కంపెనీలు వాస్తవ వ్యాపార లావాదేవీ లకు కాకుండా, అక్రమ ఆదాయాన్ని చట్టబద్ధంగా చూపించేందుకు మాత్రమే ఉపయోగించిన షెల్ కంపెనీలుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కంపెనీల పేరుతో టాక్స్ ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గాలను వెతికినట్లు, నకిలీ ఖాతాలు, తప్పుడు లెక్కలు చూపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.  

ఈ కేసులో ఐ బొమ్మ రవికి సహకరించిన వ్యక్తులు, కంటెంట్ సరఫరా చేసిన వర్గాలు, అంతర్జాతీయ లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణను మరింత విస్తృతం చేస్తున్నారు. రవి కార్యకలాపాలతో సినిమా పరిశ్రమకు జరిగిన నష్టంపై కూడా అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్‌పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు అయింది.
కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులు ఆమోదం తెలిపింది
ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠిన చట్టాన్ని తీసుకువచ్చిన తొలి దేశంగా నిలిచింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును డిజిటల్ మెజారిటీ గా నిర్ణయించింది.
అదే సమయంలో మందుబాబులు కూడా పండుగ చేసుకున్నారు. పబ్ లు బార్ లలో అర్ధరాత్రి వరకూ తాగి చిందులేశారు. అక్కడితో ఆగకుండా నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు పట్టుబడిన వారి సంఖ్య కూడా హైదరాబాద్ లో అధికంగానే ఉంది.
ఇటీవలే ముంబైలో రెండవ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. ఆ విమానాశ్రయం ప్రతిపాదన దశ, నిర్మాణాలను పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభం కావడానికి దాదాపు పాతికేళ్లు పట్టింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయంలోనే పరిస్థితి ఇది. ఇక గత దశాబ్ద కాలంగా బెంగ‌ళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.
దట్టమైన పొగమంచు కారణంగా డిల్లీ నుంచి శంషాబాద్‌కు రావా ల్సిన, అలాగే శంషాబాద్ నుంచి డిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ విమానాలు రద్దు కావడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన, తిరుపతి నుంచి శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమనాలు పొగ మంచు కారణంగా ఆలస్యమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.