మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్‌కు జైలు

Publish Date:Jan 1, 2026

Advertisement

హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవన్న సంగతి మరో సారి నాంపల్లి కోర్టు తీర్పుతో వెల్లడైంది.   మద్యం సేవించి ప్రయాణికులతో నిండిన  బస్సును నడిపిన డ్రైవర్‌కు నాంపల్లి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఇంటర్‌సిటీ యూనివర్సల్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న కన్నెబోయిన మహేష్‌బాబు అనే వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆ మత్తులో బస్సు నడిపినట్లు గా రుజువు కావడంతో  నాంపల్లి కోర్టు అతనికి జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా కూడా విధించింది.

గతేడాది డిసెంబర్ 15న ఎస్‌ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లోకన్నెబోయిన మహేష్‌బాబు  పట్టుబడ్డాడు. మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు అనుమానం రావడంతో పోలీసులు వెంటనే బస్సును ఆపి డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వ హించారు.ఆ పరీక్ష లో  డ్రైవర్ రక్తంలో 119.100 mg ఆల్కహాల్ సాంద్రత ఉన్నట్లు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఇతను అనుమతించిన పరిమితికి చాలా ఎక్కువగా మద్యం సేవించినట్లు  తేలడంతో  పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరచారు.

కోర్టు విచారణలో పోలీసులు  మద్యం సేవించి భారీ వాహనాన్ని నడపడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడు తుం దని వాదించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకా శముందని పోలీసులు కోర్టుకు వివరించారు.

వాదనలు, ఆధారాలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం డ్రైవర్‌కు 15 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని... ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని ఈ తీర్పు ద్వారా కోర్టు వెల్లడించింది.
ఈ తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మరోసారి స్పష్ట మైంది. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు అత్యంత బాధ్యతగా వ్యవహరిం చాలని పోలీసులు సూచిస్తున్నారు.

By
en-us Political News

  
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. కొత్త సంవత్సర వేడుకలకు జపాన్ ముస్తాబవుతున్న వేళ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 233 ప్రాంతంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న మహమ్మద్ ఇర్ఫాన్ ఉద్దిన్‌ జింక మాంసం విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్టు అధికారులు అతడి షాపులో తనిఖీలు నిర్వహించి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాతల కుమారుడు మురళీకృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడేళ్ల కిందట అంటే అతడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. స్నేహితులతో పందెం కాసి పెన్ను మింగేశాడు. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు.
మంటల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భవనం పై అంతస్తు నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి వయస్సు 24 ఏళ్లు.
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో 2025 సంవత్సరం మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. రాజధాని అమరావతి ప్రాంతంలో సైతం వివిధ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు విజన్, కార్యదక్షత, ఎడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కళ్లకు కడుతుంది.
బుధవారం రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
వాస్తవానికి తిరుమ‌ల ఈ స్థాయిలో ఉండ‌టానికి ఇక్క‌డి పూజారి వ్య‌వ‌స్థ ఎంతో ముఖ్య‌ కారణమని అంటారు. ఆ వ్యవస్థే తిరుమ‌ల‌ను మిగిలిన ఏ ఆల‌యం కన్నా కూడా మిన్నగా నిలుపోందని చెబుతారు. ఎవ‌రైతే ఆ ఆల‌యంలో సాక్షాత్ వైకుంఠంలో జ‌రిగిన‌ట్టే అన్ని పూజాదికాల‌ను జ‌రుపుతారో ఆ ఆల‌యం ఇల వైకుంఠం అవుతుంది. తిరుమ‌ల ఆల‌యం కన్నా పెద్ద ఆల‌యాలు లేక పోలేదు. శ్రీరంగం తిరుమ‌లకే కాదు ఏకంగా, వైష్ణ‌వ మ‌తానికే కేంద్ర కార్యాల‌యం. కానీ, తిరుమ‌ల శ్రీరంగం, తిరువ‌నంత‌పురం ప‌ద్మ‌నాభ స్వామి వారి ఆల‌యాల‌కు మించిన ప్రాభ‌వాన్ని, వైభ‌వాన్ని సొంతం చేసుకుందంటే అందుకు కార‌ణం ఇక్క‌డ జ‌రిగే క్ర‌తువులు అన్నీ ఆగ‌మ శాస్త్ర బ‌ద్ధంగా ఉంటాయి.
శివలింగాన్ని సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వసంం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే కోససీమ జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసుపుస్తకాలను రైతులకు అంద జేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఒక వేళ ఆ పాసుపుస్తకాలలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునే అవకాశం కూడా అధికారులు కల్పిస్తున్నారు. ఈ పాసుపుస్తకాల పంపిణీ కోసం ఊరూరా గ్రామ సభలు నిర్వహించనున్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ ఉన్నతాధికారులు ఆ విమానంలో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారు.
కోర్టు విధించిన షరతు మేరకు ఆయన జనవరి 2 సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సి ఉంది.
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తరకం ఎత్తుగడలకు తెరలేపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.