తెలుగునాడుగా ఏపీ.. పేరుమార్పుపై మళ్లీ మొదలైన చర్చ!

Publish Date:Mar 2, 2026

Advertisement

కేంద్ర క్యాబినెట్ ఎప్పుడైతే కేరళ పేరుని.. కేరళంగా మార్చేందుకు ఆమోదం తెలిపిందో.. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రాల పేర్ల మార్పుపై చర్చ మొదలైంది.  ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అంశంపైనా  చర్చ జరుగుతోంది.  ప్రసిద్ధ ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు  ఆంధ్రప్రదేశ్ పేరుని.. తెలుగునాడుగా మార్చాలనే ప్రస్తావన తేవడంతో.. ఈ చర్చ సాంస్కృతికంగానూ, రాజకీయంగానూ సెగ పుట్టిస్తోంది.   

ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలనే ప్రతిపాదన.. 3వ ప్రపంచ తెలుగు మహాసభ నుంచి వచ్చింది. తమిళం మాట్లాడే రాష్ట్రాన్ని తమిళనాడుగా ఏర్పాటు చేశారు  కాబట్టి.. తెలుగు మాట్లాడేవారి రాష్ట్రమైన ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలంటున్నారు. అయితే.. రాష్ట్రం పేరు మార్పు అనేది.. కేవలం అక్షరాల మార్పు కాదు. ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశం. అందువల్లే.. తెలుగు భాష పేరు మన రాష్ట్రం పేరులోనూ ఉండాలనే చర్చ మొదలైంది. ఎందుకంటే..   దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసింది తెలుగువారే.  పొట్టి శ్రీరాములు  ప్రాణత్యాగం ఫలితంగా.. 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాయ్.  అప్పుడే.. కొందరు మేధావులు తెలుగునాడు పేరుని సూచించినా, ఆనాడు ఆంధ్ర అనే పదానికే మొగ్గు చూపారు. 1969లో మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా మారింది. ఇటీవలే.. ఒరిస్సా ఒడిశాగా, పాండిచ్చేరి పుదుచ్చేరిగా మారాయి. ఇప్పుడు కేరళని.. కేరళంగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో.. తెలుగు అస్థిత్వం కోసం ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలన్న వాదన  తెరమీదకొచ్చింది. 

ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చాలన్న గరికపాటి నరసింహారావు వాదనపైనే.. ఇప్పడు ఏపీలో డిబేట్ నడుస్తోంది. ఏపీని తెలుగునాడుగా మార్చాలనీ..  ఇందుకోసం అప్పట్లో ఎన్టీఆర్ ఎంతో ప్రయత్నించారని చెప్పారు గరికపాటి. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదని, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదనం లేదని అన్నారాయన. రాష్ట్రం పేరు విషయంలో.. కేరళ వాళ్లకున్న పట్టుదల మనకు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్య చర్చకు దారి తీసింది. అయితే.. గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుకాదని ఎలా అంటారు,  రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందన్నారాయన. గరికపాటి వ్యాఖ్యలపై ఎవరి వాదన, వివరణ ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలనే డిమాండ్ సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. కేరళ పేరుని కేరళంగా మార్చిన తర్వాత.. సోషల్ మీడియాలో ఏపీ ప్రజల నుంచి ఇలాంటి వాదన మొదలైంది. వాస్తవానికి.. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా.. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది.

అయితే.. ఆంధ్ర అనే పదం ఒక జాతిని, కోస్తాంధ్ర లాంటి నిర్దిష్ట ప్రాంతాన్ని సూచిస్తుందనే భావన చాలా కాలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో.. భాష కంటే ప్రాంతం ఎక్కువగా ధ్వనిస్తుంది. తమిళనాడులో భాష ఉన్నట్లుగా.. మన దగ్గర భాషా గుర్తింపు పేరులో లేదనేదే అసలైన వాదన. అందువల్ల.. తెలుగునాడు అనే ప్రతిపాదనపై ఇప్పుడు డిస్కషన్ మొదలైంది. అది కేవలం ఓ ప్రాంతానికో, కులానికో సంబంధించింది కాదు. పూర్తిగా.. భాషకు, అస్థిత్వానికి సంబంధించింది. తెలుగు అనేది అందరిదీ. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కలిపి ఉంచే ఏకైక సూత్రం తెలుగు భాష. అందువల్ల.. ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మారిస్తే.. సమైక్య భావన వస్తుందనే చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్రం మద్రాస్ స్టేట్ నుంచి తమిళనాడుగా మారినప్పుడు లేని అభ్యంతరం.. ఆంధ్రప్రదేశ్ తెలుగునాడుగా మారితే ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

సాంస్కృతిక మూలాలపరంగా చూస్తే.. ప్రాచీన సాహిత్యంలో.. తెలుగు పదానికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. ఆంధ్ర అనేది సంస్కృత పదం. తెలుగు అనేది అచ్చమైన దేశీ పదం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు.. తనని తాను తెలుగువాడని చెప్పుకునేందుకు గర్వపడతాడు. ఆంధ్రుడు అనే పదం కంటే.. తెలుగువాడు అన్నది.. ఎక్కువ కలుపుగోలుతనంతో ఉంటుంది. పైగా.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు ఉంది. రాష్ట్రం పేరులో ఆ భాషా ముద్ర ఉండటం వల్ల.. ఆంధ్రులకు ప్రత్యేక అస్థిత్వం వస్తుంది. కేరళ తన మూలాలను వెతుక్కుంటూ.. కేరళంగా పేరు మార్చుకున్నప్పుడు, తెలుగు వారు కూడా తమ అస్థిత్వం కోసం తెలుగునాడు అని పిలుచుకోవడంలో ఏమాత్రం తప్పులేదనేది భాషా ప్రేమికుల వాదన. అయితే.. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రాజధాని సమస్యల నేపథ్యంలో.. ఈ వాదనకు, ఈ డిమాండ్ కుఇది సరైన సమయమా? కాదా? అనేది కూడా చర్చకు వస్తోంది.  అయినా.. పేరులో ఏముంది? అనే వాళ్లున్నా.. ఆ పేరులోనే మా ఆత్మగౌరవం ఉందని చెప్పే సంస్కృతి తెలుగు ప్రజలది. ఏపీ పేరు మార్పుపై.. గరికపాటి నరసింహారావు తెచ్చిన ప్రస్తావన.. కేవలం చర్చగా మిగిలిపోతుందా? లేక భవిష్యత్తులో ఉద్యమంగా మారుతుందా? అన్న డిబేట్ కూడా మొదలైంది.

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.
హైదరాబాద్ తారామతి రిసార్ట్‌లో ఈగల్ ఫోర్స్ దాడులు.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్
ఇటీవలి పరిణామాలు సంప్రదాయ పోరాటాల నుండి ఇరాన్ యొక్క వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా దాని క్షిపణి మరియు అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దెబ్బతీయడం వైపు దృష్టి మళ్లుతున్నట్లు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతాన్ని ఈ పులి తన ఆవాసంగా మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఈ పరిసరాల్లోనే పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పశువుల కాపరులు, కొండపైకి వెళ్లే గ్రామస్థులు పులిని నేరుగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. రామదుర్గం కొండపై పులి కదలికలను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా.
రిసార్ట్‌లో జాక్ అండ్ జాన్సన్ పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు అధికారులకువిశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం, హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి.
జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.