మహాలక్ష్మికి ‘ఉచిత’ కష్టాలు

Publish Date:Jul 17, 2025

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  18 నెలలు పూర్తయింది. ఈ 18 నెలల కాలంలో ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఎన్ని అమలు చేసింది.. ఎన్నిటికీ ఎగనామం పెట్టింది? అంటే..  మంత్రులు, కాంగ్రెస్ నాయకులు  బట్టిపట్టిన అప్పగించే పాఠం ఉచిత బస్సు తోనే  మొదలవుతుంది.  కానీ.. గ్యారెంటీలు, హామీలు ఎంతవరకు అమలవుతున్నాయో వాస్తవంలో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియదు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో  ఫెయిల్  అయిందనే అభిప్రాయమే గట్టిగా వినిపిస్తోంది.  

ఇతర గ్యారెంటీలు,హామీల విషయం ఎలా ఉన్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే    అత్యంత ఆర్భాటంగా శ్రీకారం చుట్టిన మహాలక్ష్మి ‘ఉచిత’ ప్రయాణం పథకం పై కూడా పెదవి విరుపులే వినిపిస్తున్నాయి. ఆరంభలో ఎలా ఉన్నా.. మెల్లమెల్లగా  ఉచిత బస్సు’ సమస్యలను ఎదుర్కుంటోంది. పథకం ప్రయోజన పొందుతున్న మహిళల్లో సైతం  పెద్ద ఎత్తున  అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక పురుషుల సంగతి అయితే చెప్పనక్కరలేదు. బస్సులలో రద్దీ పెరిగి, మహిళలతోపాటుగా, పురుష ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో  ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. ప్రధానంగా  పథకం ప్రయోజనం పొందుతున్న మహిళల్లోనూ సగం మందికిపైగా అంటే దాదాపు 52 శాతం  మహిళలు నెగిటివ్ మార్కులు వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఏమో కానీ.. ఉచిత కష్టాలు  ఎక్కువయ్యాయని మహిళలు అంటున్నారు.  

రద్దీకి తగినట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వంటి ఉచిత బస్సు కష్టాలను ఏకరవు పెడుతున్నారు.   అంతే కాదు, సీట్ల కోసం మహిళలు సిగపట్లు కారణంగా ప్రయాణం ఆలస్యం అవుతోందని.. ఫలితంగా పురుషుల దూషణలు భరించవలసి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సర్వే ఫలితం చెబుతోంది.
కాగా ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులు  43 రోజుల పాటు నిర్వహించిన సర్వేలో 480 మంది మహిళలతో మాట్లాడినట్టు  సర్వేకు సారధ్యం వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సహేరా ఫాతిమా, డాక్టర్‌ నాగలక్ష్మి కుందేటి తెలిపారు. అలాగే.. ఫలితాను విడుదల చేసిన సందర్భంగా వారు.. తప్పుల్ని వెతకడం కాదు..మార్గాలను సూచించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

ప్రజా రవాణా కోట్లాది మందికి జీవనాధారమనీ.. తెలంగాణ ఆర్టీసీలో రోజుకు 9వేల బస్సులు తిరుగుతుండగా,40 లక్షల మందికిపైగా సేవలు పొందుతున్నారనీ, వీరిలో అధికశాతం మహిళలే ఉన్నారని  పేర్కొన్నారు.  ప్రయాణంలో సీట్లు దొరక్క అసౌకర్యాన్ని ఎదురొంటున్నట్టు 52 శాతం మంది మహిళలు చెప్పారన్నారు.  అలాగే, 23 శాతం మంది మహిళలకు మాత్రమే భద్రతా టూల్స్‌ గురించి తెలుసని సర్వే సిబ్బంది చెప్పారు.ఆర్టీసీ సిబ్బందికి జెండర్‌ సెన్సిటివిటీపై శిక్షణ ఇవ్వాలని కోరారు.
కాగా  ఈ సర్వేపై స్పందించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, ఈథేమ్స్‌ అధ్యయనాన్ని స్వాగతిస్తున్నా.. సర్వే నివేదిక సూచించిన చాలా అంశాలు ఇప్పటికే అమలు దశలో ఉన్నాయన్నారు. మహిళల భద్రత, గౌరవం పెంపునకు ఆర్టీసీ కట్టుబడి ఉన్నదనీ,  బస్సుల సంఖ్య పెంపు, సిబ్బంది శిక్షణ, హెల్ప్‌లైన్‌లు, సీసీటీవీలు, ట్రాకింగ్‌ యాప్‌లు, షీటీమ్స్‌ సహకారం వంటివి ఉన్నాయన్నారు. 

అదలా ఉంటే, నిత్యం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులు బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచవలసిన అవసరం ఉందనీ..  అదే సమయంలో ఉచితానికి కూడా హద్దులు ఉండాలని సూచిస్తున్నారు. ఆర్థిక స్తోమతను కూడా పరిగణననలోకి తీసుకోవాలని.. అలాగే, మహిళల కోసం ప్రత్యేక ఉచిత బస్సులు నడిపితే..  టికెట్ చార్జీ చెల్లించేందుకు సిద్దమైన మహిళలకు కూడా సౌకర్యంగా ఉంటుందని, సాధారణ ప్రయాణీకులు సూచిస్తున్నారు.

By
en-us Political News

  
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.