ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు.  ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు.  అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత  బలం చేకూర్చింది.  అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో  అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి  ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు  టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.  అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్‌పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.   ఆరు రోజుల అమెరికా పర్యటనలో  లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణే. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు. రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.   అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.  
రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ
ALSO ON TELUGUONE N E W S
  పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో 'బ్రో' మూవీ వచ్చింది. పవన్ నటించిన 'హరి హర వీరమల్లు' విడుదల సమయంలో ఇబ్బందులు తలెత్తగా.. పీపుల్ మీడియా తన వంతు సహాయ సహకారాలు అందించింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. పీపుల్ మీడియాతో పవన్ చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది.   పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హీరోగా సినిమాలు తగ్గించారు. త్వరలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పలకరించనున్నారు. దీని తర్వాత హీరోగా పెద్దగా సినిమాలు చేసే అవకాశంలేదు. పవన్ సైతం ఇటీవల ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. హీరోగా సినిమాలు చేయకపోవడం కుదరకపోవచ్చని, సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టబోతున్నట్లు సమాచారం.   పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో గతంలో పవన్ ఒక బ్యానర్ స్థాపించారు. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి తన బ్యానర్ లో రెగ్యులర్ గా సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ఈ కొలాబరేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది అంటున్నారు.  
  ఇటీవ‌లికాలంలో సోష‌ల్ మీడియాలో సెలబ్రిటీస్‌కి సంబంధించిన ఫోటోల‌తో ర‌క‌ర‌కాల వీడియోలు చేస్తున్న విష‌యం తెలిసిందే. వాటిలో కొన్ని పాజిటివ్‌గా ఉంటే, మ‌రికొన్ని వారి ఇమేజ్‌ని దెబ్బ‌తీసే విధంగా ఉంటున్నాయి. వాటి వ‌ల్ల వారు చాలా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. త‌మ అనుమతి లేకుండా ఇలా ఫోటోలు వాడ‌టం అనేది క‌రెక్ట్ కాద‌ని, దాన్ని నివారించాలంటూ సెలబ్రిటీలు కోరుతున్నారు.   గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విష‌య‌మై ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. అనుమ‌తి లేకుండా ఫోటోలు వాడ‌కూడ‌దు అంటూ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు చిరు. ఇప్పుడు అదే ప‌ద్ధ‌తిలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఫిర్యాదు చేశారు. త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించి ఇక‌పై త‌న ఫోటోలు, పేరు వాడుకోకుండా ఆదేశాలు జారీ చెయ్యాలంటూ పిటిష‌న్ వేశారు. ఫిర్యాదును స్వీక‌రించిన కోర్టు.. ఈకామ‌ర్స్‌, సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. దీనిపై త‌దుప‌రి విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 22కి వాయిదా వేసింది.  
  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమాను పూర్తి చేయ‌డం ఒక ఎత్త‌యితే దాన్ని రిలీజ్ చెయ్య‌డం మ‌రో ఎత్తుగా మారింది. ఎందుకంటే ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్‌కి ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వ‌క‌పోవ‌డం మ‌నం చూస్తున్నాం. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ప‌దే ప‌దే వాయిదా ప‌డుతున్నాయి. అలా వాయిదా ప‌డ‌డం వ‌ల్ల అంత‌కుముందే రిలీజ్‌ని ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇబ్బందుల్లో ప‌డుతున్నాయి.   ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్(Pawan Kalyan) సినిమా వ‌ల్ల ఎదురు కాబోతోంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది మార్చిలో రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసి ఉన్నాయి. ఆ సినిమాల మ‌ధ్య‌లోకి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా వ‌చ్చి చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో  ప‌వ‌న్ చేస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ అదే నెల‌లో రిలీజ్ చెయ్య‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.   ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ ఏడాది హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజి సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ప‌వ‌న్ వ‌చ్చే ఏడాది మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ మూవీ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే మార్చిలో నాని హీరోగా న‌టిస్తున్న ప్యార‌డైజ్ మార్చి 26,  రామ్‌చ‌ర‌ణ్ హీరోగా చేస్తున్న పెద్ది మార్చి 27న రిలీజ్ కాబోతున్నాయి. అయితే ప‌వ‌న్ సినిమా కూడా మార్చి 27కే రాబోతోంద‌నే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా సోష‌ల్ మీడియాలో దీనికి సంబంధించిన చ‌ర్చ మాత్రం జోరుగా సాగుతోంది.    ఇదిలా ఉంటే.. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ చిత్రాన్ని ఆ డేట్‌కి రిలీజ్ చేసే ఆలోచ‌న యూనిట్‌కి లేద‌నే వార్త కూడా మ‌రో ప‌క్క చ‌క్క‌ర్లు కొడుతోంది. అదే నెల‌లో సినిమాను రిలీజ్ చేసే ప‌క్షంలో రెండు వారాల ముందుగానే సినిమాని థియేల‌ర్ల‌లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాను మార్చిలోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.  
      -ఎవరు ఆ హీరో  -ఫ్యాన్స్ ఏమంటారో -సాయి పల్లవి ఛరిష్మానే వేరు      పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై 'సాయిపల్లవి'(Sai Pallavi)చరిష్మాకి ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకం. చాలా కాలం తర్వాత హీరోయిన్ ని చూసి సినిమాకి వెళ్లే రేంజ్ ని సంపాదించి హీరోయిన్ కట్ అవుట్ కి గుర్తింపుని తీసుకొచ్చింది. అందుకే అనతికాలంలోనే ప్రపంచ సినీ విశ్లేషకులు ఔరా అనుకునే రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రామాయణ'(Ramayana)లో సీతమ్మ తల్లి  క్యారక్టర్ ని పోషిస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్స్ లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.     లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam)'థగ్ లైఫ్' తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని 'విజయ్ సేతుపతి'(Vijay Sethupathi)తో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సదరు చిత్రం గురించి అధికార ప్రకటన రానుంది. విజయ్ సేతుపతి సరసన 'సాయి పల్లవి'ని మేకర్స్ హీరోయిన్ గా ఎంపిక చేశారనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గాని సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ న్యూస్ పై అభిమానులు  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు విజయ్ సేతుపతి వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన కట్ అవుట్ అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. దీంతో విజయ్ సేతుపతి సరసన సాయి పల్లవి సెట్ అవుతుందా కూతురిగా ఉంటుందనే  కామెంట్స్ ని కొందరు చేస్తున్నారు.      also read:  సంక్రాంతి విన్నర్ ఎవరు.. మీకు తెలుసా!      మరికొంత మంది మాత్రం ఈ విషయంపై స్పందిస్తు విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబో కొత్తగా ఉంటుందని, ఇద్దరి ఏజ్ గ్యాప్ విషయంలో తేడా ఉన్నా, సినిమా అనే అద్భుతమైన దృశ్య కావ్యం ఆ ఛాయలు కనపడకుండా చేస్తుందని అంటున్నారు.పైగా  సాయి పల్లవి, మణిరత్నం కూడా తమ ప్రతిభతో మెస్మరైజ్ చెయ్యడంలో దిట్ట అనే అభిప్రాయాన్ని కూడా  వ్యక్తం చేస్తున్నారు. ఒక అందమైన ప్రేమకథగా మణిరత్నం తెరకెక్కిస్తుండటం మరో స్పెషల్. విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరిజగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు.      
  వరుస ఫ్లాప్స్ లో నితిన్ ఇంతవరకు కొత్త సినిమాపై క్లారిటీ లేదు ఆ డైరెక్టర్ తో లవ్ స్టోరీ నిజమేనా..?   2020లో వచ్చిన 'భీష్మ' తరువాత హీరో నితిన్ హిట్ చూడలేదు. ఈ ఐదేళ్ళలో వరుసగా ఆరు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూశాడు. దీంతో నితిన్ నెక్స్ట్ ఎవరి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు? దాంతోనైనా కమ్ బ్యాక్ ఇస్తాడా? అనే ఆసక్తి నెలకొంది.   నితిన్ తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. వేణు యెల్దండి దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే సినిమా చేయాల్సి ఉండగా.. ఎందుకో దాని నుండి అవుట్ అయ్యాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తలపెట్టిన సినిమా కూడా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ప్రచారానికే పరిమితమైంది. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ సాయి మార్తాండ్ దర్శకత్వంలో సినిమా అంటూ ఇటీవల న్యూస్ వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.   ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన.. ఈ ఏడాది 'తెలుసు కదా' సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.    నిజానికి 'తెలుసు కదా' కథ మొదట నితిన్ దగ్గరికే వెళ్ళింది. కానీ, ఏవో కారణాల వల్ల చేయలేదు. అయితే ఇప్పుడు దర్శకురాలిగా నీరజ కోన చేయనున్న రెండో సినిమాకి మాత్రం నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదొక లవ్ స్టోరీ అని సమాచారం.    లవ్ స్టోరీలు నితిన్ కి బాగా కలిసి వస్తాయి. గతంలో వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్.. 'ఇష్క్' అనే లవ్ స్టోరీ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.  
      -ఎవరు విజేత  -మొత్తం ఎన్ని సినిమాలో తెలుసా! -అభిమానులు ఏమంటున్నారు -సంక్రాంతి ఎప్పుడు మొదలు     సంవత్సరం పొడవున సినిమాల మధ్య పోటీ అనేది వస్తూనే ఉంటుంది. కాని సంక్రాంతికి ఏర్పడే పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులు, మూవీ లవర్స్ కి కూడా సదరు పోటీ మంచి కిక్ ని ఇస్తుంది. సంక్రాంతి హుంగామాకి ముహూర్తం దగ్గర పడుతుండటంతో సదరు కిక్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో కొత్త సినిమాలు పందెం కోళ్ల లాగా ముస్తాబవుతున్నాయి. దీంతో  సంక్రాంతి విజేతగా ఏ మూవీ నిలుస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి ఏ ఏ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయో చూద్దాం.       ముందుగా పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)జనవరి 9 న 'రాజాసాబ్'(The Rajasaab)తో సంక్రాంతి పందానికి అంకురార్పణ చేయనున్నాడు. చాలా కాలం తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపిస్తుండటంతో పాటు, ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ థ్రిల్లర్ చేస్తుండటంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో రాజా సాబ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టే ఉండటంతో రిజల్ట్ పై అందరిలో ఆసక్తి  ఏర్పడింది. ఇక ఇదే రోజు మరో పాన్ ఇండియా స్టార్' ఇళయ దళపతి విజయ్'(VIjay)వన్ మాన్ షో  'జననాయగాన్'(Jananayagan)వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.       పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కగా విజయ్ ఆఖరి చిత్రంగా ప్రచారం జరుగుతుంది. దీంతో జననాయగాన్ ని ఏ రేంజ్ లో తెరకెక్కించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో జననాయకుడు అనే టైటిల్ తో విడుదల కానుండగా అభిమానులు , ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad garu)తో సంక్రాంతి సందర్భంగానే  ల్యాండ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.     అధికారకంగా డేట్ ని ప్రకటించకపోయినా సంక్రాంతికి రెండు రోజుల ముందే రానుందనేది టాక్ . చాలా కాలం గ్యాప్ తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో పాటు సాంగ్స్, ప్రచార చిత్రాలతో మంచి బజ్ ని ఏర్పాటు చేసుకుంది. పైగా వరుసహిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకుడు. దీంతో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.   ఇక మాస్ మహారాజ రవితేజ(Ravi teja)కూడా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో సంక్రాంతి కుర్చీ పై కన్నేశాడు. రవితేజ స్టైల్లో నే మాస్ అంశాలుతో పాటు ఈ సారి ఫ్యామిలీ అంశాలు కూడా ఒక రేంజ్ లోనే ఉండనున్నాయి. దీంతో సంక్రాంతికి అందరు సందడి చేసే ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా సినీ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఇక సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అన్నట్టుగా శర్వానంద్(sharwanand)మరో ఫ్యామిలీ మూవీ 'నారి నారి నడుమ మురారి'తో  అడుగుపెట్టనున్నాడు. గతంలో సంక్రాంతి సమయంలో పెద్ద హీరోలతో పోటీపడి శర్వానంద్ రెండు సార్లు విజయాన్ని అందుకోవడంతో 'నారినారినడుమమురారి' పై ఆసక్తి నెలకొని ఉంది.   also read:   ప్రేమలో పడిన అమీర్ ఖాన్.. వయసు 60 ఏళ్ళు     ఇక పండగరోజైన 14  న 'పరాశక్తి' తో శివ కార్తికేయన్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడు. విభిన్న చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన  నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' తో సందడి చేయనున్నాడు. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో సంక్రాంతి సినిమాల ఫలితంపై అభిమానుల్లోఆసక్తి నెలకొని ఉంది. మూవీ లవర్స్ మాత్రం అన్నిచిత్రాలు తమని అలరించాలని కోరుకుంటున్నారు.    
  ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..?   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) 2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్'(The Raja Saab)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న 'స్పిరిట్' కూడా ఇటీవల మొదలైంది. ఇదిలా ఉంటే ప్రభాస్ చేతిలో ఉన్న ఒక క్రేజీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.   'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్'తో పాటు.. ప్రభాస్ చేతిలో 'సలార్-2', 'కల్కి-2' వంటి సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో 'సలార్-2'పై కొంతకాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయినట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. (Salaar 2)   Also Read: ఒక్క ఫొటోతో ట్రోల్స్ కి చెక్ పెట్టిన ఎన్టీఆర్!   ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'. 2023 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి మంచి విజయం సాధించింది. అయితే వెయ్యి కోట్లు రాబట్టగల సత్తా ఉన్న ఈ మూవీ.. 600 కోట్లకు పరిమితమవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్ ని కాస్త నిరాశపరిచింది. అయినప్పటికీ 'సలార్-2'తో అన్ని లెక్కలు సరి అవుతాయని వారు బలంగా నమ్మారు.   కానీ, 'సలార్' తర్వాత 'సలార్-2' చేయకుండా.. ఎన్టీఆర్ 'డ్రాగన్' ప్రాజెక్ట్ తో బిజీ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ఆ సమయంలోనే అసలు 'సలార్-2' ఉంటుందా లేదా? అనే డౌట్స్ వచ్చాయి. మేకర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెబుతూ వచ్చారు. దీంతో 'డ్రాగన్' తర్వాత 'సలార్-2' ఉండొచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అసలు ఎప్పటికీ ఉండకపోవచ్చని, డ్రాగన్ తర్వాత నీల్ మరో హీరో ప్రాజెక్ట్ తో బిజీ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.  
  ఎనిమిదేళ్ల క్రితం మలయాళ నటిపై లైంగిక దాడి కేసు కేరళలో సంచలనం సృష్టించింది. 2017 లో ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసికుంది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది.    సౌత్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఓ ప్రముఖ నటి.. 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌ కి గురైంది. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు.. తర్వాత అక్కడినుంచి పారిపోయారు.    నటి కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో పది మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో దిలీప్ కూడా ఒకరు. 2017 జులైలో అరెస్టయిన దిలీప్‌.. నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.    ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ మొదటినుంచి వాదిస్తున్నాడు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా.. సీబీఐ దర్యాప్తుకి కూడా దిలీప్‌ డిమాండ్ చేశాడు. అయితే ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురైంది.   అయితే ఇన్నేళ్ళకు ఈ కేసులో దిలీప్‌ ను ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. తాజా కోర్టు తీర్పుపై దిలీప్ స్పందించాడు. ఇది తనపై జరిగిన కుట్ర అని, ఇన్నేళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.   
‘సలార్‌’, ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ది రాజా సాబ్‌’. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్‌ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. మారుతి కాంబినేషన్‌లో తొలిసారి నటిస్తున్న ప్రభాస్‌కి హారర్‌ కామెడీ జోనర్‌లో సినిమా చేయడం కూడా మొదటి సారే.  తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, రెబల్‌సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌కి నెలరోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. జనవరి 8న ఓవర్సీస్‌లో ‘రాజాసాబ్‌’ ప్రీమియర్స్‌ పడబోతున్నాయి. ప్రభాస్‌ సినిమాల కలెక్షన్స్‌లో ఓవర్సీస్‌ పార్ట్‌ చాలా ఉంటోంది. గతంలో ఓవర్సీస్‌ మార్కెట్‌పై హీరోలు దృష్టి పెట్టినా ఆశించిన స్థాయిలో వచ్చేవి కాదు. బాహుబలి తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోయాయి.  ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాలకు సంబంధించి ఓవర్సీస్‌ కలెక్షన్స్‌ కీలకంగా మారాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన సలార్‌, కల్కి కూడా అక్కడ మంచి కలెక్షన్స్‌ రాబట్టాయి. దీంతో రాజాసాబ్‌ ఓవర్సీస్‌ కలెక్షన్లపై భారీ హోప్స్‌ పెట్టుకున్నారు. కానీ, ఈసారి ప్రభాస్‌ సినిమా ఓవర్సీస్‌ కలెక్షన్లు తారుమారయ్యేలా కనిపిస్తోంది. రాజాసాబ్‌ సినిమా హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాను ఐమాక్స్‌ ఫార్మాట్‌లో చూస్తే ఆ థ్రిల్‌ వేరేలా ఉంటుంది.  ప్రభాస్‌ చేసిన ప్రతి సినిమా ఓవర్సీస్‌లో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో రిలీజ్‌ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఐమాక్స్‌ థియేటర్లలో ప్రభాస్‌ సినిమా రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. దీంతో ఐమాక్స్‌ ద్వారా వచ్చే కలెక్షన్లకు గండిపడే అవకాశం ఉంది. డిసెంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతున్న ‘అవతార్‌3’ దానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అవతార్‌, అవతార్‌2 చిత్రాలు విజువల్‌గా ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఐమాక్స్‌లో మాత్రమే ఎక్స్‌పీరియన్స్‌ చెయ్యాలని ప్రతి ఆడియన్‌ అనుకుంటాడు. దానికి తగ్గట్టుగానే అవతార్‌3 చిత్రాన్ని నాలుగు వారాలపాటు ఐమాక్స్‌ థియేటర్లలో ప్రదర్శించేందుకు ఒప్పందం జరిగింది.  ఆ కారణంగా ‘రాజాసాబ్‌’ చిత్రాన్ని ఈసారి ఓవర్సీస్‌లో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించడం లేదు. మరి దీని తాలూకు ఎఫెక్ట్‌ కలెక్షన్లపై ఏమేరకు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఐమాక్స్‌ ఫార్మాట్‌ అందుబాటులో లేకపోయినా ప్రీమియర్‌ లార్జ్‌ ఫార్మాట్‌తోపాటు ఇతర ఫార్మాట్లలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. అక్కడ కూడా కొన్ని థియేటర్లు అవతార్‌3కి వెళ్లిపోయాయి. అయితే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో స్పెషల్‌ ఫార్మాట్‌లో సినిమాను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. 
  The upcoming horror thriller Isha features Thrigun and Hebah Patel in lead roles with Akhil Raj, Siri Hanmanth and Prithveeraj also playing significant roles. The team has just released a chilling new trailer that instantly grabs attention. It opens with four friends who set out to uncover the truth behind fraudulent spiritual gurus.   However, Babloo Prithveeraj steps in, determined to prove the existence of ghosts, pulling them and the audience - into a dark, unsettling realm filled with terrifying moments. The friends soon find themselves overwhelmed by fear. As the trailer unfolds, it reveals a creepy, deserted house inhabited by hidden spirits, with the four friends trapped inside.    Their struggle for survival becomes the central focus, leaving viewers curious about their fate. What happened to them inside that haunted structure? What is the dark history of the abandoned building? These glimpses raise numerous compelling questions. Did the friends make it out alive? What secrets do the ghosts hold?   The trailer successfully builds suspense and intrigue, and the creators promise a gripping, edge-of-the-seat horror experience for audiences. RR Dhruvan’s background score heightens the tension, and the visuals along with the production quality stand out impressively. Backed by Pothula Hema Venkateswara Rao under HVR Productions, the movie brings together a skilled technical team including Santosh Sanamoni for cinematography, RR Dhruvan for music and Vinai handling the editing.   Following their impressive success with Little Hearts and Raju Weds Rambai, producers Bunny Vas and Vamsi Nandipati are now gearing up to deliver another gripping project. Known for their strong judgment in selecting content-driven stories, the duo is presenting Isha under their respective banners. Their association has significantly boosted the buzz around the film, raising expectations for another compelling cinematic experience.   https://x.com/Theteluguone/status/1997919793417171399?s=20  
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి. అయితే గొడవలు కూడా ఆరోగ్యంగా  ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ నేటి కాలంలో చాలా వరకు భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేసే విదంగా గొడవలు జరగడం చూస్తుంటాం.  అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? తెలుసుకుంటే.. భార్యాభర్తల మధ్య వాదనలు, గొడవలు జరుగుతూ ఉంటాయి.  అవన్నీ నిజంగా బంధాన్ని బలపరుస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా అది ఆరోగ్యకరంగా ఉండాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ అబిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకోవాలి.  అది వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా కాకుండా సమస్యపై దృష్టి పెట్టేలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బంధం విచ్చిన్నం కాకుండా బంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ వాదించుకున్న తర్వాత జరిగిన విషయం గురించి ఇద్దరూ లోతుగా  ఆలోచించాలి.  ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి గొడవ తర్వాత భార్యాభర్తలు తమ భాగస్వాములను మరింత అర్థం చేసుకోగలిగితే,  సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ బంధం ఆరోగ్యకరంగా ఉంటుంది. భార్యాభర్తల మద్య గొడవ ఏదైనా అనుమానం, హింస,  కోపం, నియంత్రించడం,  భయపెట్టడం వంటి విషయాల ద్వారా చోటు చేసుకుంటే అది బార్యాభర్తల మద్య బంధాన్ని నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య  ఎన్ని గొడవలు జరిగినా అది చివరికి పరిష్కారం అవ్వాలి.  అలా ఉన్నప్పుడే ఆ బందం అందంగా, ఆనందంగా ఉంటుంది.  భార్యాభర్తలు కూడా ఇలాంటి గొడవల వల్ల దూరం కాకుండా ఉంటారు.  కానీ గొడవలు నిరంతరం జరుగుతూ పరిష్కారం మాత్రం జరగకపోతే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవవు.                                  *రూపశ్రీ.
  అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది.  దీనికి కారణం కేవలం బయట సమాజంలో కాదు.. ఇద్దరు వ్యక్తుల మద్య అభద్రతాభావం.  తమ స్థానం ఎక్కడ బలహీనం అవుతుందో అని అత్తగారు,  తనకు తన మాటకు ఎక్కడ విలువ లేకుండా పోతుందో అని కోడలు ఇద్దరూ తమ తమ పంతాలకు పోవడం వల్ల అత్తాకోడళ్ల మధ్య విభేదాలు వస్తుంటాయి. అయితే కొన్ని మ్యాజిక్ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల అత్తాకోడళ్ల బంధం ఎంతో పదిలంగా,  బలంగా,  సంతోషంగా ఉంటుంది.  ఆ  మ్యాజిక్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. నేటి కోడలే రేపటి అత్తగారు, ఇప్పటి అత్తగారు ఒకప్పుడు కోడలు  అనే మాట వినే ఉంటారు. అత్తగారి జీవితంలో అంచనాలు ఉంటాయి,  అనుభవాలు ఉంటాయి. కానీ కోడలి జీవితంలో ఆధునికత,  కలలు,  భవిష్యత్తు గురించి ఆశలు ఉంటాయి.  ఇవి రెండూ విరుద్దంగా అనిపిస్తాయి. అందుకే అత్తాకోడళ్ల మధ్య వ్యతిరేకత తలెత్తుతూ ఉంటుంది. అంచనాల గురించి ఓపెన్ గా.. కోడలి మీద అత్తకు, అత్త గురించి కోడలికి కొన్ని అంచనాలు ఉంటాయి.  అయితే విషయాన్ని మనసులో పెట్టుకుని ఎదుటి వారు,  వారికి వారే అర్థం చేసుకుని తమకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం పిచ్చితనం. ఇంటి బాధ్యతలు కోడలితో ఏవి పంచుకోవాలని అనుకుంటారో అత్తగారు ఓపెన్ గా చెప్పాలి. అలాగే కోడలు కూడా తన కెరీర్,  ప్రాధాన్యాల గురించి ఓపెన్ గా తన అత్తగారితో చెప్పాలి.  ఎందుకంటే అంచనాలు నెరవేరకపోతే అత్తాకోడళ్ల బంధం దెబ్బతింటుంది. అందుకే ముందే ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచిది. ప్రేమతోనే సరిహద్దులు.. అత్తాకోడళ్లు ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల చాలా గొడవలు జరుగుతుంటాయి.  చాలా సార్లు అత్తలు తమ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ అత్తాకోడళ్లు ప్రేమగానే మాట్లాడుకుని తమ సరిహద్దులు విధించుకుంటే చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి. కానీ ఇద్దరూ ఒకరి విషయాలలో మరొకరు ఎక్కువ జోక్యం చేసుకుంటే పెద్ద గొడవలు జరుగుతాయి. గతం, అనుభవాలు... అత్త జీవితంలో అనుభవాలు చాలా ఉంటాయి. అలాగే కోడలి జీవితంలో అనుభవాలు ఉంటాయి. అత్తగారు తాను జీవితంలో ఎదుర్కున్న సమస్యలు, కుటుంబ పరంగా ఎదుర్కున్న కష్టాలు, చేసిన పోరాటాలు కోడలితో చెప్పుకుంటూ ఉండాలి, కోడలు తన చిన్నతనం తను పెరిగిన విధానం,  తన కష్టం,  భవిష్యత్తు గురించి తన ఆశలు చెప్పుకోవాలి. ఇవి ఇద్దరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. అంతేకాదు.. అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉంటారు.  ఆ ఇల్లు సంతోషంగా, ఎంతో బాగా అబివృద్ది చెందాలంటే అత్తాకోడళ్లు ఇద్దరూ అవగాహనతో ఉండటం ముఖ్యం.   నిర్ణయాలు.. అత్తాకోఢల్లు ఇద్దరూ ఒక్కమాట మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది.  అందుకే ఏ విషయం గురించి అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.  కోడలు ఇలాగే ఉండాలనే నియమాలు విధించడం అత్తగారి గొప్పతనం అనిపించుకోదు, అత్తగారు చెప్పే ఏ విషయం గురించైనా ఆలోచించకుండా వ్యతిరేకత చూపడం కోడలి తెలివి అనిపించుకోదు. అత్తాకోడళ్లు ఇద్దరూ మాట్లాడుకుని వారి ఇగో సాటిసిపై అయ్యే దిశగా కాకుండా జీవితం గురించి, ఇంచి అబివృద్ది గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొగడ్తలు.. గొప్ప మెడిసిన్.. బంధం ఆరోగ్యంగా ఉండటంలో పొగడ్తలు చాలా గొప్పగా పనిచేస్తాయి.   అత్తగారు ఏదైనా బాగా చేసినప్పుడు కోడలు,  కోడలు ఏదైనా పనిని బాగా చేసినప్పుడు అత్తగారు.. ఒకరిని ఒకరు మెచ్చుకోవడం చేయాలి.  ఇలా మెచ్చుకోవడం ఇద్దరి మద్య బందాన్ని బలంగా మార్చుతుంది. అంతేకాదు.. ఒకరి మంచి అలవాట్లను మరొకరు మెచ్చుకోవడం, ఒకరికి ఒకరు మంచి స్నేహితురాలిగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల బందం పదిలంగా ఉంటుంది.                              *రూపశ్రీ.
జ్ఞాపకం అంటే జరిగిపోయిన ఒక సంఘటన తాలుకూ సందర్భాలు, మాటలు,  మనుషులు గుర్తుండిపోవడం.   ఇవి సంతోషం కలిగించేవి అయితే గుర్తు వచ్చిన ప్రతిసారీ సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ.. అవి బాధపెట్టే విషయాలు అయితే మాత్రం వాటి ప్రభావం మామూలుగా ఉండదు. కొన్నిసార్లు గత సంఘటనలు,  జ్ఞాపకాలు హృదయంలో లోతైన గాయాన్ని మిగిల్చుతాయి. అలాంటి సమయాల్లో లోలోపలే నలిగిపోతాడు.  చాలా నరకం అనుభవిస్తాడు.  ఒంటరితనం ఫీలవుతాడు. కానీ  ఒంటరిగా అనిపించడం అంటే జీవితంలో చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది.  దీన్నుండి బయటకు రావడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. అంగీకారం.. బాధాకరమైన జ్ఞాపకాల నుండి బయటపడటానికి వాటిని అణచివేయడం కంటే అంగీకరించడం చాలా ముఖ్యం. సత్యాన్ని అంగీకరించడం ముందుకు సాగడానికి మొదటి అడుగు. కాబట్టి జరిగినవి ఏవైనా సరే.. వాటిని అంగీకరించాలి.  ఒకరు మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా,  నష్టం కలిగినా.. ఇలా ఏదైనా సరే..  దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి.  ఇలా చేస్తే జ్ఞాపకాలు బాధపెట్టవు. షేరింగ్.. జ్ఞాపకాలు బాధపెట్టినప్పుడు బాధను అందరితో పంచుకోవడం తప్పు. కుటుంబ సభ్యులు,  అర్థం చేసుకునే స్నేహితులు, లేదా కౌన్సిలర్ లతో జరిగింది చెప్పుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను విశ్లేషణ చేసుకుని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అదే ఇలా అర్థం చేసుకోగలిగే వారు ఉంటే .. జరిగిన విషయం గురించి మంచి వివరణ, సలహా, ఊరట కలిగే విధంగా మాట్లాడటం వంటివి చేయగలుగుతారు. వ్యక్తీకరణ.. బాధను వ్యక్తీకరించడం కూడా ఒక కళే.. డైరీ రాయడం లేదా కళ-సృజనాత్మకత ద్వారా  భావాలను వ్యక్తపరచడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మంచి చికిత్స. అంతే కాదు.. బాధ నుండి బయటకు రావడానికి ఆ అక్షరాలే సహాయం చేస్తాయి. ధ్యానం, యోగ.. ధ్యానం,  యోగా సహాయం తీసుకోవడం కూడా జ్ఞాపకాల మిగుల్చే బాధ నుండి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడమే కాకుండా వర్తమానంలో జీవించడం కూడా నేర్పుతుంది. బాధకు సమయం ఇవ్వవద్దు.. బిజీగా ఉండటం,  కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం,  ఏదో ఒక కొత్త పనిని చేయడం లేదా నేర్చుకోవడం  వలన జ్ఞాపకాల నుండి దూరం కావడానికి సహాయపడుతుంది.  కొత్త వాటిలో మునిగిపోయినప్పుడు బాధాకరమైన విషయాలు మసకబారుతాయి. అసలు వాటి గురించి ఆలోచించే అంత సమయం ఉండకుండా చూసుకోవాలి. జీవనశైలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగా తినడం, తగినంత నిద్రపోవడం,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల  మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు.                                      *రూపశ్రీ.  
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే.. చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది. ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  చాలా రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం కూడా లవంగాలను వాడుతుంటారు. చాలామంది రోజూ ఒక లవంగం తినడం లేదా లవంగాలు ఉడికించిన నీటిని తాగడం చేస్తుంటారు. ఇదంతా శరీరం డిటాక్స్ కావాలని, శరీరంలో ఉండే చెడు పదార్థాలు,  మలినాలు తొలగిపోవాలని, రోగనిరోధక శక్తి బలంగా మారాలని చేస్తుంటారు. అయితే మంచి లవంగాలకు బదులు నకిలీ లవంగాలను వాడితే మాత్రం ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కల్తీ లవంగాలను ఎలా కనిపెట్టాలి? కల్తీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. కల్తీ లేదా నకిలీ లవంగాలు.. మార్కెట్లో లభించేవన్నీ మంచి లవంగాలు అనుకుంటే పొరపాటు.  చాలా వరకు లవంగాలలో నూనెను సేకరించి, వాటిలో వాసన, సారం అనేవి అన్నీ కోల్పోయాక వాటిని అమ్ముతుంటారు. కొందరేమో వాసన, సారం, నూనె కోల్పోయిన లవంగాలకు రసాయనాలు జోడించి వాటిని అమ్ముతుంటారు. ఇవ్నీ కల్తీ లేదా నకిలీ లవంగాలు అని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ లవంగాలు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.  ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కల్తీ లవంగాలు జీర్ణం కావడం కష్టం,  గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లతత్వం,  వికారం వంటి సమస్యలకు ఇవి కారణం అవుతాయి. కల్తీ లేదా నకిలీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలు.. పుఢ్ పాయిజన్.. సరిగ్గా తయారు చేయని లేదా రసాయనాలతో కల్తీ  చేయబడిన లవంగాలు ఫుడ్ పాయిజన్ కు  కారణమవుతాయి. దీని వలన వాంతులు, విరేచనాలు, బలహీనత,  తీవ్రమైన కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో వాపు, తలనొప్పి.. నిజమైన లవంగాలు మంటను తగ్గిస్తాయి. కానీ నకిలీ లేదా కల్తీ  లవంగాలు ఈ లక్షణాలను కలిగి ఉండవు. బదులుగా అవి శరీరంలో మంటను పెంచుతాయి. కల్తీ లవంగాలకు రంగు,  సువాసన కోసం రసాయనాలను కలిపి ఉంటారు. ఇవి తలనొప్పి,  తలతిరుగుటకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తి మటాష్.. నిజమైన లవంగాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ నకిలీ లవంగాలు శరీరానికి ఎటువంటి ప్రయోజనాలను అందించవు. ఎక్కువ కాలం నకిలీ లేదా కల్తీ లవంగాలను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. లివర్ నాశనమే.. చవకగా లభించే లవంగాలు,  రసాయనాలతో కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలు  కాలేయానికి క్రమంగా హాని కలిగిస్తాయి. ఇవి వెంటనే వాటి దుష్ప్రభావాలు బయటకి కనిపించేలా చేయకపోయినా వీటి నష్టం క్రమంగా బయటపడుతూ ఉంటుంది. నకిలీ లేదా కల్తీ లవంగాలు గుర్తించడం ఎలా.. ఒక గ్లాసు నీరు తీసుకొని కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు కల్తీ కాకపోతే అవి  మునిగిపోతాయి, కానీ అవి కల్తీ అయితే తేలుతాయి. అంతేకాదు.. లవంగాల నుండి నకిలీ రంగులు,  రసాయనాలు విడుదల కావడం కూడా కనిపిస్తుంది. నిజమైన లవంగాలు మంచి సువాసన, ఎక్కువకాలం కలిగి ఉంటాయి.  అదే నకిలీ లవంగాలు వాసన ఉండవు,  రంగు కూడా నిజమైన వాటితో పోలిస్తే వేరుగా ఉంటాయి. నకిలీ లవంగాలు నల్లగా,  పొడిగా,  బరువు లేకుండా తేలికగా,  చాలా సులభంగా విరిగిపోయేలా ఉంటాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. ఉసిరికాయ ఉడికించి.. ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు. ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు.. రోగనిరోధక వ్యవస్థ.. ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ.. ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.  చర్మం,  జుట్టు.. ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది. గుండె జబ్బులు.. ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కంటి చూపు.. విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా తినాలంటే.. ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...