సూర్యవంశీ వైభవ్‌కు టాటా మోటార్స్ లగ్జరీ కారు గిఫ్ట్

Publish Date:Feb 24, 2026

Advertisement

 

భారత్ క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాడు. ఇటీవలే జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో సెంచరీతో సత్తా చాటాడు. ఐపీఎల్ 2025లో అతిపిన్న వయసులోనే క్రికెట్ అరంగేట్రం చేసి మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. తాజాగా వైభవ్ సూర్యవంశీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అండర్ 19 ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా పరుగులు సాధించినందుకు అతడికి ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు లభించింది. 

ఈ ఘనత సాధించినందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తమ లేటెస్ట్ మోడల్ ‘టాటా కర్వ్’ కారును బహుమతిగా అందజేసింది. టాటా కర్వ్ కారు ధర టాప్ వేరియంట్ రూ. 18.85 లక్షల వరకు ఉంది.బిహార్ రాజధాని పాట్నాలోని టాటా షోరూంలో వైభవ్ సూర్యవంశీ తన తండ్రి, తమ్ముడితో కలిసి ఈ కొత్త కారును డెలివరీ తీసుకున్నారు. ఈ సందర్భంగా షోరూం సిబ్బంది వైభవ్ కుటుంబానికి ఘనస్వాగతం పలికారు. కారు కీని అందుకుని కేక్ కట్ చేశారు. 

అయితే వైభవ్ సూర్యవంశీ వయస్సు ప్రస్తుతం 18 ఏళ్ల లూపే ఉండటంతో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీనివల్ల అతడు సొంతంగా కారును నడిపే అవకాశం లేదు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్.. ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదిన విషయం తెలిసిందే. భారత్‌కు రికార్డు స్థాయిలో ఆరో టైటిల్ రావడంలో కీలకపాత్ర పోషించాడు. కేవలం 55 బంతుల్లో శతకం పూర్తి చేసి టోర్నీలో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 

మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 439 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. టోర్నీలో అత్యధిక సిక్సర్లు (30) కొట్టిన ఆటగాడిగానూ నిలిచాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్.. గుజరాత్‌పై కేవలం 35 బంతుల్లో శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే 14 ఏళ్ల 32 రోజుల వయసులో శతకం బాదిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న ఫాగింగ్ కార్యక్రమంలో భారీ అవినీతి వ్యవహారం బట్టబయలు అయింది.
ర‌సాయ‌నం- ర‌సాయ‌నం- ర‌సాయ‌నం. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో ర‌సాయ‌నం. ఇప్పుడు రాజ‌మండ్రి పాల‌లో ర‌సాయ‌నం.
జ‌గ‌న్ ప‌త‌నం మొద‌లైందే వెంక‌న్న స్వామి కార‌ణంగా. ఈ విష‌యంలో ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు మ‌న‌కు ఒక ఉదాహ‌ర‌ణ‌.
నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజా ప్రతినిధులకు క్రీడలు ఒక ఆటవిడుపుగా ఉంటూ మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
అసెంబ్లీలో తిరుమ‌ల ల‌డ్డూ న‌కిలీ నెయ్యి వ్య‌వ‌హారంలో జ‌రిగిన ఒక చ‌ర్చ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విభిన్న‌మైన శైలిలో ప్ర‌సంగించారు.
ద‌శాబ్దాల త‌మ వాంఛ‌ను నెర‌వేర్చారంటూ ఉద్యోగ, పెన్ష‌న‌ర్‌ సంఘాల నేత‌లు సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
అమ్మ మాతృత్వానికే మచ్చ తీసుకొచ్చిన హృదయ విదారకమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్న నలుగురు కీలక నేతలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
2019-24 సంవత్సరంలో 2032 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేష్ అన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విస్తృత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.