రాజధాని అభివృద్ధి మండలి-ఏడు చేపల కధ

Publish Date:Dec 24, 2014

Advertisement

 

ఇంతవరకు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలే కాక చుట్టుపక్కల గల గన్నవరం, మైలవరం, నందిగామ తదితర ప్రాంతాలు ఇంకా చుట్టుపక్కల అనేక గ్రామాలు అన్నీ కూడా వి.జి.టి.యం.పరిధిలోనే ఉండేవి. ఆ ప్రాంతాలలో ఎక్కడ ఇళ్ళు, అపార్టుమెంటులు కట్టుకోవాలన్నా, లే అవుట్లు వేయాలన్నా ఇంతవరకు వి.జి.టి.యం. బోర్డే అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉండేది. దాదాపు 7,060 చ.కిమీ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్న ఆ ప్రాంతాలలో జరిగే రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ వి.జి.టి.యం. కనుసన్నలలోనే జరిగేవి.

 

ఇప్పుడు దాని స్థానంలో రాజధాని అభివృద్ధి మండలి రావడంతో ఇప్పుడు ఆ బాధ్యతలు, హక్కులు, అధికారాలు అన్నీదానికే దఖలు పడ్డాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇల్లలకగానే పండగ కాదన్నట్లు రాజధాని అభివృద్ధి మండలి బిల్లును శాసనసభ ఆమోదించినంత మాత్రాన్న సమస్యలన్నీ మటుమాయం అయిపోలేదు. పైగా ఇప్పుడు కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి.

 

గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో నెలకి రూ.100కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతుంటాయి. వాటిలో భాగంగా నెలకి కనీసం 10, 000 ఇళ్లు డజన్ల కొద్దీ కొత్త లే అవుట్లు వెలుస్తుంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్న వి.జి.టి.యం.ను రద్దయిపోయింది. కానీ దాని స్థానంలోకి వచ్చిన రాజధాని అభివృద్ధి మండలి ఇప్పుడప్పుడే పని మొదలుపెట్టే పరిస్థితిలో లేదు.

 

ఎందుకంటే మాస్టర్ ప్లాన్ తయారవలేదు. రాజధాని నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని అనుకొని ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా తదనుగుణంగానే అభివృద్ధి చెందాలని అనుకొంటున్నారు. కనుక రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో అడ్డ దిడ్డంగా నిర్మాణాలు జరగకూడదనే ఆలోచనతో ఆ ప్రాంతలన్నిటినీ కూడా రాజధాని అభివృద్ధి మండలి పరిధిలోకి తీసుకు వచ్చేరు. ఆ ప్రాంతాలన్నీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక క్రమ పద్దతిలో అభివృద్ధి చెందితే మున్ముందు సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన ఉద్దేశ్యం. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్దం అయితే తప్ప, దాని పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఎక్కడా కూడా కొత్తగా ఎటువంటి కట్టడాలకు అనుమతులు మంజూరు చేయడానికి వీలు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరికి ఎవరయినా తమ ఇంటికి మార్పులు చేర్పులు చేసుకొనేందుకు కూడా అనుమతి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

 

అయితే సింగపూరు సంస్థ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వడానికి మరో ఆరు నెలలు పడుతుందని స్వయంగా మంత్రులే చెపుతున్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే ముందుగా భూసేకరణ తంతు ఒకటి పూర్తి కావలసి ఉంది. కానీ రాయపూడి గ్రామా రైతులు అప్పుడే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు డిల్లీలో లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. పెనుమాక గ్రామ రైతులు ‘ల్యాండ్ పూలింగుకి ఒప్పుకోము’ అంటూ బోర్డులు పెట్టారంటూ వార్తలు వచ్చేయి.

 

రైతులు భూములు ఇస్తే సింగపూరోళ్ళు వచ్చి డ్రాయింగులు గీసి ఇస్తారు. వాళ్ళు డ్రాయింగులు ఇస్తే రాజధాని అభివృద్ధి మండలి తన పని మొదలుపెడుతుంది. అది పని మొదలెడితే గానీ ఇంటి మీద పెంకు వేసుకోవడానికి కూడా వీలుపడదు. ఇదంతా చూస్తుంటే ఏదో ఏడూ చేపల కధలా తయారయింది చివరికి. ఈ భూముల సేకరణ ఎప్పుడు జరిగేనో...ఆ సింగపూరోళ్ళు డ్రాయింగులు గీసెదెప్పుడో...రాజధాని అభివృద్ధి మండలి పని మొదలు పెట్టేదెప్పుడో...తము ఇళ్లు కట్టుకొనేదెప్పుడో...అంటూ అందరూ భారంగా నిటుర్పులు విడుస్తున్నారు.

 

ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు మధ్యతరగతి వాళ్ళు లక్షల్లో నష్టపోతుంటే బిల్డర్లు కొట్లలో నష్ట పోతున్నారు. మధ్యతరగతి జనాలు బ్యాంకుల నుండి వడ్డీలకి అప్పులు తెచ్చుకొని బిల్డర్ల చేతిలో డబ్బు పోస్తే, ఎలాగూ రాజధాని వచ్చేస్తోంది గనుక బిల్డర్లు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఎడాపెడా భూములు కొనేసి చకచకా ఇళ్లు, అపార్ట్ మెంటులు లేపేసి నాలుగు రాళ్ళూ పోగేసుకొందామని ఆశపడ్డారు. ఇప్పుడు వారందరూ లబోదిబోమని మొత్తుకొంటున్నారు. కనుక ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందేమో?

By
en-us Political News

  
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.