విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రశక్తే లేదు.. కేంద్రం స్పష్టీకరణ

Publish Date:Mar 28, 2026

Advertisement

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదా ఇతర సంస్థల్లో విలీనం ప్రశక్తే లేదని కేంద్రం విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర   మంత్రి  భూపతిరాజు శ్రీనివాసవర్మ పార్లమెంటు వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ విషయాన్ని తెలిపారు. వైవీసుబ్బారెడ్డి.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే, లేదా సెయిల్ లో విలీనం చేసే ప్రతిపాదన  ఉందా అని ప్రశ్రించారు. అందుకు అటువంటి పరిస్థితులేవీ లేవనీ, ఉత్పన్నం కావనీ మంత్రి కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ రంగం సంస్థగానే విశాఖ స్టీల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.  

ప్లాంట్‌లోని కొన్ని విభాగాల్లో బయటి ఏజెన్సీల ప్రమేయంపై వస్తున్న వార్తలపై వివరణ ఇస్తూ..  పరిశ్రమలోని కొన్ని ప్రత్యేక కార్యకలాపాల కోసం అవుట్‌సోర్సింగ్ లేదా బయటి ఏజెన్సీల సాయం తీసుకోవడం అనేది ఉక్కు పరిశ్రమలో సాధారణ ప్రక్రియ అన్నారు. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థల్లోనూ ఇదే విధానం అమలవుతోందనీ, దీనిని ప్రైవేటీకరణ దిశగా అడుగులుగా భావించకూడదన్నారు.

ఏపీలో సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు అంశంపై కేంద్రం ఈ స్థాయిలో స్పష్టత ఇవ్వడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా కార్మికులు, రాజకీయ పార్టీలు ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రి ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

By
en-us Political News

  
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.