Publish Date:Mar 18, 2026
హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న ఓ తమ్ముడికి అక్కంటే చాలా ఇష్టం... అక్క, బావ కలిసి మెలిసి ఉండడం చూసి సంతోష పడేవాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం బావ చనిపోయాడు. దీంతో అక్కలో మార్పు వచ్చింది. అది గమనించిన తమ్ముడు అక్కను పలుమార్లు మందలించాడు. అందుకు అక్క నిరాకరించింది. దీంతో తమ్ముడు అక్కను వదిలేసాడు..కొద్దిరోజుల తర్వాత అక్క కనిపించకుండా పోయింది. తన అక్క మరో వ్యక్తితో వెళ్లిపోయింది.. కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు... ఇక్కడి వరకు కథ బాగా నచ్చింది. అయితే పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేయడంతో విస్సుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తమ్ముణ్ణి అదుపు లోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్య చకితులయ్యారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్ ఓ మహిళ హత్య కేసును పోలీసులు చేదించారు... వివరాల్లోకి వెళితే...అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారంలో నీలా(40), తన తమ్ముడు పప్పుతో కలిసి నివాసం ఉంటుంది.. నీలా భర్త కొన్నాళ్ల క్రితమే చనిపో యాడు.. దీంతో నీలా ప్రవర్తనలో మార్పు వచ్చింది. బావ చనిపోయిన తర్వాత అక్క నీలా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉండేది. అది గమనించిన తమ్ముడు పప్పు పలుమార్లు అక్కను మందలించాడు.
అయినా కూడా అక్క నీలాలో మార్పు రాలేదు సరి కదా ఇంకా ఎక్కువగా చెడు తిరుగుళ్ళు తిరిగేది... దీంతో విసుకు చెందిన పప్పు ఎలాగైనా సరే అక్కను అంతం చేయాలనుకున్నాడు. దీంతో పప్పు గత నెల ఫిబ్రవరి 28వ తేదీన అక్క నీలాను చంపేశాడు. అనంతరం బాత్రూంలో అక్క మృత దేహాన్ని ముక్కలు ముక్క లుగా నరికి గోనె సంచిలో నింపి కారులో తీసుకెళ్లి మజీద్ పుర చెరువులో కొన్ని బాడీ పార్ట్స్ పడేశాడు. మరికొన్ని శరీర భాగాలను చెరువు పక్కన ఉన్న చిట్టడవిలో పడేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన అక్క లీల కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు... అంతేకాకుండా పోలీసుల దగ్గర అక్క మీద ప్రేమ ఉన్నట్లుగా తెగ నటించాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు కొనసాగించారు. అయితే పప్పు ఈనెల రెండవ తేదీన అక్క సెల్ ఫోన్ నుండి తనకు తాను మెసేజ్ పెట్టుకున్నాడు.. తన అక్క ఎవరితోనో వెళ్ళిపోయింది అంటూ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులకు పప్పు ప్రవర్తనపై అనుమానం వచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలోనే తమ్ముడు పప్పు కాల్ డేటా బయటికి తీసిన పోలీసులు అది చేసి ఒక్కసారిగా అవ్వాక్కయ్యారు. అనంతరం పోలీసులు పప్పును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.మజీద్పురా చెరువు పక్కన ఉన్న చిట్టడవిలో గుర్తించిన శరీర భాగాలతో కేసు ఛేదించారు. దీంతో పోలీసులు పప్పును అరెస్టు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-younger-brother-who-killed-his-older-sister-36-215738.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.