Publish Date:Mar 18, 2026
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు మరో మూడు నెలల పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందించింది. ఈ పొడిగింపుతో పరిపాలనలో కొనసాగింపు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి, గతేడాది ఆగస్టు 31న రామకృష్ణారావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సేవలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం ఇప్పటికే ఆయనకు ఏడు నెలల పొడిగింపు మంజూరు చేసింది.క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో రామకృష్ణారావు కీలక పాత్ర పోషించారు.
యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమన్వయం కల్పించడం, గత ప్రభుత్వ రుణాల షెడ్యూలింగ్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.ఇక మార్చి 31తో ప్రస్తుత పొడిగింపు గడువు ముగియనున్న నేపథ్యంలో, మరోసారి ఎక్స్టెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాయగా, కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో రామకృష్ణారావు మరో మూడు నెలల పాటు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-cs-ramakrishna-raos-term-extended-36-215741.html
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్మ్యాప్ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.