Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జేఎన్యూ వద్ద ఉద్రిక్తత... మళ్లీ మొదలు!
posted on: Feb 22, 2016 10:15AM
.jpg)
ఈ నెల 9వ తేదీన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన వివాదాస్పద సమావేశానికి సంబంధించి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదంలో పోలీసులు ఇప్పటికే కన్నయా కుమార్ అనే విద్యార్థి నాయకుడిని అరెస్టు చేయగా ఉమర్ ఖాలిద్ వంటి మరికొందరు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసులు వారికోసం లుక్అవుట్ నోటీసులను సైతం జారీ చేయడం జరిగింది. అయితే ఈ అయిదుగురూ కూడా నిన్న రాత్రి విశ్వవిద్యాలయం క్యాంపస్లో ప్రత్యక్షం కావడం పోలీసులను సైతం కంగుతినిపించింది.
దేశంలో ఎక్కడ దాక్కున్నా పోలీసులు తమను అరెస్టు చేసే ప్రమాదం ఉంది కాబట్టి విశ్వవిద్యాలయమే తమకు అసలైన రక్షణ అని ఆ అయిదుగురు విద్యార్థులూ భావించినట్లు కనిపిస్తోంది. తాము కనుక విశ్వవిద్యాలయంలో అడుగుపెడితే.... దానిని సదరు నిందితులు వివాదాస్పదంగా మార్చే అవకాశం ఉంది కాబట్టి, పోలీసులు క్యాంపస్ వెలుపలే ఉండిపోయారు. ఈ సందర్భంలో క్యాంపస్లో మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటోంది. నిన్న రాత్రి కూడా వీరు అయిదుగురూ కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం గురించి ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసినట్లు తెలుస్తోంది.


.jpg)
.jpg)


