మరో తుఫాన్ రాబోతోంది

 

ఈమధ్య తమిళనాడుతోపాటు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తుఫాను ప్రభావం తమిళనాడు మీద ఎక్కువగా పడింది. సరిహద్దులో వున్న ఏపీ జిల్లాల మీద కూడా ఆ ప్రభావం కొంత పడింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు - ముంబై రహదారికి ప్రజలు గండి కొట్టాల్సినంత స్థాయిలో వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే నెల్లూరు జిల్లా ప్రజలు వర్షం బారి నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మీద మరో తుఫాను ప్రభావం చూపించే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై వున్న ఈ తుఫాను ఈనెల 16వ తేదీ నాటికి తీరాన్ని తాకే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ తుఫాను విపత్తును ఎదుర్కోవడానికి అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu