పవన్ ను కూల్ గా కన్విన్స్ చేసిన చంద్రబాబు

ఎవరినైనా కన్విన్స్ చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు తరువాతే అని అందరికి తెలిసిన విషయమే. తన రాజకీయానుభవంలో.. ఎక్కడ ఎలా మెలగాలో.. ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసిన రాజకీయ చాణక్యుడు చంద్రబాబు. అందుకే తనను ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను సైతం చాలా చక్కగా కన్విన్స్ చేసి పంపించగలిగారు. చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వీరిద్దరు.. రాజధాని భూములు, రైతుల సమస్యలపై చర్చించారు. అయితే పవన్ కళ్యాణ్ దేని మీద చర్చిస్తారో ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు.. రాజధాని భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన ముందుంచారు. అంతేకాదు రాజధానికి భూములు ఇవ్వని రైతలు ఎంతమంది.. భూములు ఇవ్వకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటీ అన్న విషయం పవన్ కు పూర్తిగా వివరించారట. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల గురించి పవన్ అడిగిన నేపథ్యంలో అది గతంలో వైఎస్స్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయమే అని.. కొత్తగా తమ ప్రభుత్వం తీసుకున్నది ఏం లేదని తెలిపారట. అంతేకాదు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన సాయంలో కూడా తోడుండాలని పవన్ ను చంద్రబాబు కోరారు. మొత్తానికి ప్రశ్నిద్దామని వెళ్లిన పవన్ ను కూల్ గా కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu