అహ్మదాబాద్ లో ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం (జూన్ 13) అహ్మదాబాద్ చేరుకున్నారు. గురువారం జరిగిన ఘోర విమన ప్రమాదం సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

కాగా విమాన ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.