తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి ఫైర్...

 

బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ దక్షిణాది వారి రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇప్పటికే పలువురు విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అసెంబ్లీలో కూడా దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా జాతి వివక్ష వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెల్లగా ఉన్నవారు మంచివారు, దార్శనికులు... నల్లగా ఉన్నవారు మంచివారు కాదనుకుంటే ఎలాగని.. ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిత్వాన్నైనా రంగుతో నిర్ణయించడం మంచిది కాదని అన్నారు. హిందీ ప్రజలు, హిందీయేతర ప్రజలు అనే వివక్ష కచ్చితంగా ఉందని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu