అన్నమయ్య జిల్లాలో వర్ష బీభత్సం.. రాయచోటిలో నలుగురు మృతి

అన్నమయ్య జిల్లా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా రాయచోటిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. రాయచోటీలో భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువలో ఓ తల్లి, కుమారుడు కొట్టుకుపోయారు. వారికి కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇక రాయచోటిలోనే మరో ఘటనలో యామిని అనే చిన్నారి గల్లంతైంది. ఈ ఘటనలతో రాయచోటిలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల కథనం ప్రకారం షేక్ మున్నీతన కుమారుడితో పాటు  ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ సమీపంలో నడుస్తూ వెడుతుండగా కాలువపై రాతిపలక విరిగిపోవడంతో కాలువలో పడిపోయారు.  వారిని కాపాడేందుకు ప్రయత్నించిన గణేష్ కూడా ప్రవాహంలో కొట్టుకుపోయారు.  ఈ ముగ్గురి మృతదేహాలూ లభ్యమయ్యాయి. ఇక కే. రామాపురం పరిధిలోనొ ఓ కాల్వలో యామిని అనే ఏడేళ్ల చిన్నారి గల్లంతైంది. ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu