రూ. 6.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ఎర్రచందనం స్మగ్లింగ్ కు పుష్ప సినిమాలో చూపిన టెక్నిక్ లన్నీ దిగదుడుపే అన్న విధంగా గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు.  పోలీసులకు చుక్కలు చూపి స్తున్నారు.   పుష్ప సినిమా తరహాలో కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు పోలీసుల కళ్లు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం  తగ్గేదే అంటూ..  స్మగ్లర్ల దూకుడికి కళ్లెం వేసి అరెస్టులు చేస్తున్నారు. తాజాగా   ఓ నిందితుడు 6 కోట్ల పైచిలుకు విలువ గల గంజాయిని స్మగుల్ చేయడానికి ఉపయోగించిన విధానం పోలీసులనే విస్మయపరిచింది. 

వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్ లోని జోధ్ పూర్  జిల్లా  హానియా గ్రామానికి చెందిన విక్రమ్ విష్ణోయ్  అలియాస్ వికాస్ (22) అనే యువ కుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.   ఇతనికి దేవీలాల్ అలియాస్ కటు, ఆయుబ్ ఖాన్, రామ్ లాల్ అనే గంజాయి స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విక్రమ్ గురించి తెలుసుకున్న ఈ ముగ్గురూ గంజాయి స్మగ్లింగ్ చేస్తే లక్షల్లో డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి నుండి రాజస్థాన్ రాష్ట్రానికి గంజాయిని రవాణా చేయడానికి ప్రతి సరుకుకు ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని విక్రమ్ కు హామీ ఇచ్చారు. అందుకు  ఒప్పుకొన్న విక్రమ్ వారి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ రాజస్థాన్   జైపూర్ నుండి మహారాష్ట్ర   లోని నాందేడ్ కు ఇనుపలోడును రవాణా చేసి అక్కడ దించివేసి...తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు వెళ్లి సిమెంట్ సంచులను కొనుగోలు చేశాడు. వాటిని లారీలో ఎక్కించుకొని ఒడిస్సాలోని మల్కాన్గిరి కి వెళ్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి సుమారు 1210 కిలోల గంజాయిని కొనుగోలు చేసుకుని వాటిని సిమెంట్ సంచుల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలో దాచిపెట్టి.. పైనుండి టార్పాలిన్ తో లోడును కప్పాడు. అనంతరం హైదరా బాదు నుండి రాజ స్థాన్ వైపు ప్రయా ణం సాగించాడు.

అయితే..  మహే శ్వరం ఎస్ఓటి బృందానికి విశ్వ సనీయమైన సమా చారం రావడంతోమంగళవారం (సెప్టెంబర్ 30) అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిమెంట్ లోడుతో వస్తున్న లారీలో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తనిఖీలు చేసినా కూడా సిమెంటు సంచులు తప్ప మరేమీ కనిపించలేదు. అయితే పోలీసులు అనుమానంతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో.. లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలను గుర్తించారు. వాటిలోని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.   ఆరు కోట్ల పాతిక లక్షల రూపాయలు విలువ చేసే  1210 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. నిందితు డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu