పరాజయాన్ని మూటగట్టుకున్న ఆప్..

 

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హస్తినలోని రాజౌరి గార్డెన్‌ కు జరిగిన ఉపఎన్నికలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ పోరులో బీజేపీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఆప్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరిగింది. బీజేపీ అభ్యర్థి మన్‌జిందర్‌ సింగ్‌ సిస్రా భారీ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.కాగా పంజాబ్‌ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌పై పోటీచేసేందుకు రాజౌరి గార్డెన్‌ ఆప్‌ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu