పట్టుకుంటే గిఫ్ట్ అంటున్న సుమ!

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ కనకాల. దాదాపుగా ప్రతి ఈవెంట్ లో, ఆడియో ఫంక్షన్ లో సుమ యాంకరింగ్ చేయాల్సిందే. ఎంత మందిలో ఉన్న తడబడకుండా సునాయాసంగా మాట్లాడుతూ మంచి కామెడి టైమింగ్ తో సుమ నవ్వులు పూయిస్తుంది. క్షణం తీరిక లేని బిజీ లైఫ్ సుమది. పుట్టింది కేరళ అయిన తెలుగు బడిలో ఓనమాలు దిద్ధినట్లుగా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది సుమ. తనకున్న బిజీ లైఫ్ లో కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తోంది. తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా ఉమెన్స్ కి సర్ ప్రైజ్ ఉందంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో లైవ్ ఉంటుందని తెలిపింది.  'పట్టుకుంటే గిఫ్ట్ 'అంటూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు లైవ్ లోకి వచ్చేస్తోంది సుమ. ఎప్పుడు ఉమెన్స్ కి సపోర్ట్ ఇస్తూ తన కెరీర్ లో ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చేసింది. ప్రతి మహిళ సుమని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. తాజాగా సుమ.. 'యూట్యూబ్ లైవ్.. పట్టుకుంటే గిఫ్ట్' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేయగా.. అది చూసిన తన ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. మహిళలు కూడా హ్యఫీగా ఫీల్ అవుతున్నారు.   ఇప్పుడు సెలబ్రిటీలందరు తాము చేసే పనులు ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సుమ కూడా అదేబాటలోకి చేరింది. అయితే ఎప్పుడు బిజీగా ఉండే సుమ ఇటీవల తను చిన్నతనంలో చదువుకున్న స్కూల్ కి వెళ్ళి బాల్యంలో గడిపిన జ్ఞాపకాలన్నింటిని గుర్తు చేసుకుంటూ.. ఒక వీడియో చేసింది. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయగా.‌. దానికి విశేష స్పందన లభించింది. ఆ తర్వాత వీడియో వైరల్ గా మారింది. మహిళా దినోత్సవం రోజు సుమ ప్లాన్ చేసిన ఈ యూట్యూబ్ లైవ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. మహిళలకు ఏమైనా టిప్స్ ఇస్తుందో? లేక తన బిజినెస్ ఆలోచనలను ఏమైనా షేర్ చేసుకుంటుందో చూడాలి మరి.

నాతో మొక్కలు మాట్లాడతాయి.. డల్ ఐపోతాయి...

జబర్దస్త్ కమెడియన్ రఘు గురించి అందరికీ తెలుసు...అటు సిల్వర్ స్క్రీన్ మీద, ఇటు స్మాల్ స్క్రీన్ మీద కూడా మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రఘు వన్స్ షూటింగ్ పూర్తయ్యాక స్ట్రెయిట్ గా ఇంటికి వచ్చేసి ఇంట్లో తాను పెంచుకునే పెరటిని చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఇల్లు చూస్తే నందనవంలా ఉంటుంది. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. మొక్కలతో, ఆర్గానిక్ పంటలతో కళకళ లాడుతూ ఉంటుంది. బయటి నుంచి కూరగాయలు అస్సలు తెచ్చుకోరట. "షూటింగ్ లేకపోతే గనక ఈ ప్రకృతే నా ప్రపంచం...నా ఇంట్లో అన్ని పండుతాయి. 365 డేస్ అన్నీ ప్రొడక్ట్స్ వస్తాయి. వంకాయ, బెండకాయ, దొండకాయ, క్యాబేజి, కాలిఫ్లవర్, టమాటో, మిర్చి, డ్రాగన్ ఫ్రూట్, రామాఫలం, లక్ష్మణ ఫలం, బోన్సాయ్ మామిడి ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. పసుపు కొమ్ములు, ఎండుమిరపకాయలు అన్నీ ఇంట్లోనే పండించుకుంటాను. ఒకవేళ నేను లేనప్పుడు  మా డ్రైవర్ నారాయణ.. మా అత్తయ్య, బామ్మర్ది, నా భార్య వీటిని చూసుకుంటారు. నాతో కొన్ని మొక్కలు మాట్లాడుతూ ఉంటాయి.  రెండు రోజుల పాటు పలకరించకపోతే  డల్ అవుతాయి. ఏమిటి ఇలా ఇపోయారు. నేను రాలేదనా..అని ఒక గ్లాస్ నీళ్లు పోయగానే పావుగంటలో నిగ నిగలాడుతూ ఉంటాయి. మొక్కలైనా, జంతువులైనా మనం ఇంటరాక్ట్ ఐతే అవి కూడా స్పందిస్తాయి, మాట్లాడతాయి...దానికి మించిన లైఫ్ లేదు. నేను సోలోగా  కారు డ్రైవ్ చేసుకుని అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటా. క్యాంపింగ్ చేసుకుని అక్కడే తినేసి మళ్ళీ ఇంటికి వస్తా..ఎన్నో స్టేట్స్ తిరిగాను. మా ఇంట్లో అన్ని మట్టి కుండల్లోనే వండుకుంటాం..అదే ఇష్టం నాకు." అని చెప్పాడు రఘు.

నిజంగా నువ్వు కుక్కవే... కన్నీళ్లు పెట్టుకున్న శ్రీసత్య

బిగ్ బాస్ లో ఉన్నంతకాలం అర్జున్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్. కానీ బీబీ జాడీలో  మాత్రం తన మీద ఉన్న ఎన్నో నెగటివ్ కామెంట్స్ కి తెర దించేలా చేసాడు తన వెరైటీ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో. తన జోడి వాసంతి కృష్ణన్ తో కలిసి వేరే లెవెల్ డాన్స్ చేస్తూ తన గ్రాఫ్ ని పెంచుకుంటున్నాడు. ఇక బీబీ జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అర్జున్ కళ్యాణ్ డాన్స్ కానీ ఎమోషన్స్ కానీ పీక్స్ అని చెప్పొచ్చు. కేరాఫ్ కంచరపాలెం మూవీలోని  "ఆశాపాశం" సాంగ్ ని ఎంచుకుంది ఈ జోడి. ఈ సాంగ్ లో భాగంగా కుక్కగా నటించాడు అర్జున్ కళ్యాణ్. "ఈ పెర్ఫామెన్స్‌లో నేను నమ్మాను.. నిజంగా మీరు ఒక కుక్క అని" అంటూ సదా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది. అర్జున్ కళ్యాణ్  కుక్కలా నటిస్తూ.. కుక్క ఎలాగైతే కాళ్లు నాకుతుందో అలా.. ‘వాసంతి కాళ్లు నాకుతూ’ అచ్చంగా  కుక్క పాత్రలో జీవించేశాడు అర్జున్ కళ్యాణ్. ఆ టైములో శ్రీసత్య తెగ ఏడ్చేసింది. "ఒక మనిషి కుక్కపై ఎంత ప్రేమ చూపిస్తుందో అలా నువ్వు చేసి చూపించేశావ్ రా" అంటూ జడ్జి రాధ కూడా చెబుతూ ఏడ్చేసింది. " నా లైఫ్ లో ఎన్నో సాంగ్స్ కి జడ్జిగా చేసాను కానీ ఇటువంటి సాంగ్ నేను ఇంతవరకు చూడలేదు" అని ఎమోషనల్ అయ్యారు తరుణ్ మాస్టర్. ఇంతలో "కాంపిటీషన్ చూడాలా ఎమోషన్స్ చూడాలా..నాకర్థం కాలేదు" అంటూ ఆరియానా డైలాగ్స్ తో రెచ్చిపోయింది.  "డాగ్ ఏమీ చెప్పుకోలేదు" కదా అని వాసంతి చెప్పే ప్రయత్నం చేసేలోపే  "వాసంతి నువ్వు మాట్లాడుతున్నది చాలా తప్పు" అని అవినాష్ కూడా రెచ్చిపోయాడు.

కావ్యను పెళ్ళి చేసుకోనని రాజ్ చెప్పడంతో కుప్పకూలిన కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -36 లో.. పెళ్ళిపీటల మీద కావ్యని చూసిన రాజ్ కోపంతో.. "ఎందుకు ఇలా మోసం చేసావ్? నా మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా చేసావా? ఇప్పుడు మీడియా ముందు మా పరువు పోయేలా చేసావ్" అంటూ కావ్యని తిడతాడు. "కావ్య తప్పేం లేదు బాబు.. స్వప్నకి నువ్వంటే ఇష్టం అనుకున్నాను కానీ అది పెళ్ళి టైంకి పారిపోయింది. మీ పరువుపోతుందని కావ్యకి ఇష్టం లేకున్నా నా కోసం కూర్చుంది" అని కనకం చెప్తుంది. కనకం ఏం చెప్పినా రాజ్ ఫ్యామిలీ వినిపించుకోరు.  రాజ్ ఫ్యామిలీ అందరు కలిసి ఏదో ఒక ప్రశ్న కనకంని అడుగుతూనే ఉంటారు. మిగతా ఇద్దరు కూతుళ్ళు విదేశాల్లో ఉంటారని చెప్పావ్.. ఇంత మోసం చేస్తావా అంటూ రాజ్ ఫ్యామిలీ వాళ్ళు నిందింస్తుంటారు. మరోవైపు రాహుల్ తో స్వప్న హ్యాపీగా ఉంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు ఇప్పుడు మొత్తం పోతుందని రాహుల్ భావిస్తాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి తన భార్య కనకం ఆడిన అబద్ధాలన్నీ రాజ్ ఫ్యామిలీకి చెప్తాడు. "మాకు ముగ్గురు కూతుళ్ళు.. మేము ధనవంతులం కాదు. పెద్దకూతురు స్వప్న ఎవరితోనో వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నది మా రెండో కూతురు కావ్య. తను మా మూడో కూతురు అప్పు" అని కృష్ణమూర్తి మొత్తం చెప్తాడు. అది విన్న రాజ్ ఫ్యామిలీ ఇంత మోసం చేస్తారా అని కోపంగా ఉంటారు. సగం పెళ్ళి అయింది. నా కూతురికి అన్యాయం చెయ్యకండి.. కావ్యని పెళ్లి చేసుకోండని రాజ్ ని, వాళ్ళ ఫ్యామిలీని బ్రతిమిలాడుకుంటుంది కనకం. ఈ మోసగత్తెని నేను పెళ్లి చేసుకోనని రాజ్ వెళ్లిపోతుంటాడు. కనకం రాజ్ ఫ్యామిలీలోని అందరిని బ్రతిమాలినా కూడా ఎవరు వినకుండా వెళ్ళిపోతారు. దాంతో కనకం ఒక్కసారిగా కింద పడిపోతుంది.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణపై మురారి కేరింగ్.. అసూయతో రగిలిపోతున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -97 లో.. కృష్ణని తక్కువ చేసి ముకుంద మాట్లాడుతుందని మురారి వార్నింగ్ ఇచ్చాడు. కృష్ణ కాలేజికి వెళ్ళిరావడానికి.. కార్ తీసుకొని ఒక డ్రైవర్ ని పెడతానని కృష్ణకి సపోర్ట్ గా మురారి మాట్లాడతాడు. ఇక ఎక్కవ సేపు వాదిస్తే తన మీద ఉన్న కాస్త ప్రేమ కూడా పోతుందని భావించిన ముకుంద సైలెంట్ గా ఉంటుంది. కృష్ణని ఒక్క మాట కూడా అనడానికి వీలు లేదని మురారి చెప్పేసి వెళ్ళిపోతాడు. మురారి తన గదిలోకి వెళ్ళేసరికి కృష్ణ పడుకొని ఉండడంతో.. జ్వరం వచ్చిందా అని చెయ్యి పట్టుకొని చూస్తాడు. జ్వరం ఏమి రాలేదు కదా ఎందుకు పడుకుందని కృష్ణని నిద్ర నుండి లేపుతాడు. భోజనం చేద్దాం పదా అని కృష్ణ తో అనేసరికి... "లేదు సర్.. నేను రాలేను. నీరసంగా ఉంది. ఈ ఇంట్లో ఇక్కడ మీతో ఉంటేనే నాకు నిశ్చింతగా ఉంటుంది. ఇంకెవరిని చూసినా భయంగా ఉంది. మీరు వెళ్ళి భోజనం చెయ్యండి" అని కృష్ణ అంటుంది. అలా కృష్ణ అనడంతో మురారి కిందకి వెళ్ళి కృష్ణ కోసం చపాతి తీసుకొని వస్తుంటాడు. అది చూసిన ముకుంద.. ఏంటి మురారి నీ భార్య కోసం భోజనం తీసుకెళ్తున్నావా? నిన్న జరిగిన దానికి కిందకి వచ్చి అందరికి తన మొహం చూపించలేకపోతుందా అని అంటుంది. "కృష్ణకి నీరసంగా ఉంది. అందుకే నేను తీసుకెళ్తున్నా" అని మురారి అంటాడు. అప్పుడే రేవతి వచ్చి.. "నేను భవాని అక్కకి చెప్తాను.. నువ్వు వెళ్ళి కృష్ణకి భోజనం ఇవ్వు" అని మురారి తో అంటుంది. మురారి భోజనం తీసుకెళ్ళేసరికి కృష్ణ పడుకుంటుంది. "కృష్ణా.. మీ గౌతమ్ సార్ వచ్చాడు" అని మురారి అనగానే టక్కున లేచి కూర్చుంటుంది. చపాతి తిను కృష్ణ అని మురారి అనగా కృష్ణ వద్దంటుంది. ఆ తర్వాత మురారీనే ప్రేమగా తినిపిస్తాడు. నువ్వు నీ లక్ష్యం చేరుకోవడానికి ఇలాంటి కఠిన పరీక్షలు ఎదుర్కొనవలసి ఉంటుందని మురారి అంటాడు. ఆ తర్వాత కాసేపటికి ఇక నందు టాబ్లెట్లు వేసుకోనని మారం చేస్తూ కృష్ణా అని పిలవడంతో.. కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు నందుకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ టాబ్లెట్ ఎందుకు నందుకి వేస్తున్నారు డాక్టర్ వద్దని చెప్పాడు కదా అని కృష్ణ అంటుంది. "నువ్వు జూనియర్ డాక్టర్ వి మాత్రమే.. ఏదో కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ లాగా చెప్పకు" అని ముకుంద అనడంతో... నీకు తెలిసి తెలియక ఏం మాట్లాడకు ముకుంద అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే  తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వసుధారని కౌగిలించుకొని మన మధ్య బంధం.. దూరం‌.. ఇదేనని చెప్పిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -703 లో.. రిషి దగ్గరకి జగతి వెళ్ళి వసుధార గురించి మాట్లాడుతుంది. వసుధారకి ఇవ్వమని తాళిని నీతో నేనే పంపించాను. ఆ విషయం నీకు తెలియదు. ఆ తాళిని నువ్వు కట్టినట్టుగా భావించి తన మెడలో వేసుకుంది. వసుధారని అర్థం చేసుకోమని రిషీతో అంటుంది జగతి. నీ పర్మిషన్ లేకుండా మీడియా ముందు అలా చెప్పానని జగతి అనగానే.. "ఏం పర్లేదు మేడం. మీరు చేసింది తప్పని నేను అనట్లేదుగా" అని రిషి అంటాడు. నేను చెప్పింది తప్పు కానప్పుడు వసుధార చేసింది కూడా తప్పు కాదు కదా రిషి అని జగతి ప్రశ్నించగా.. కొన్ని తప్పులని క్షమించలేము అని రిషి సమాధానమిస్తాడు. అలా అనగానే కొన్ని  బాధలని అందరూ భరించలేరు.. దయచేసి నా పరిస్థితి  వసుధారకి రానివ్వకు రిషి అని జగతి అంటుంది. ఆ తర్వాత రిషి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వసుధార రిషి ఆలోచనలో ఉండిపోతుంది. రిషికి కాల్ చెయ్యాలా? లేదా? అని అనుకుంటూ వాళ్ళ ఇంటి డోర్ వేస్తుండగా అక్కడ గుమ్మం బయట రిషి ఉంటాడు. లోపలికి వచ్చిన రిషి.. నాకు తలనొప్పిగా ఉంది వసుధార.. నీ చేతి కాఫీ తాగుదామని వచ్చాను అనగా.. సరే అని వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది వసుధార. "నాకు పొగరు.. ఇగో ఉన్నాయని అనుకుంటున్నారా సర్.. అవును ఉన్నాయి నిజమే కాని.. అవి మీ ముందు కాదు.. మనిద్దరం ఒకటే సర్" అని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషి కాఫీ తాగి వెళ్తుండగా.. సర్ ఏదో మాట్లాడాలని వచ్చి వెళ్లిపోతున్నారని వసుధార అంటుంది. అప్పుడే జగతి మాటలను రిషి గుర్తు చేసుకొని వసుధారని ఒక్కసారిగా హత్తుకుంటాడు. ఇక రిషి వెళ్ళిపోతూ.. "ఇదే మన బంధం.. ఇదే మన దూరం"అని వెళ్ళిపోతాడు. మరోవైపు కాలేజీకి వెళ్ళిన రిషికి విషెస్ చెప్పడానికి స్టూడెంట్స్ అందరూ ఎదురుచూస్తుంటారు. మహేంద్ర, జగతి, రిషి కాలేజీకి వెళ్ళగానే.. కంగ్రాట్స్ సర్.. వసుధార మేడం రాలేదా? అని స్టూడెంట్స్ అడగగా.. వాళ్ళకి సమాధానం చెప్పకుండానే రిషి వెళ్ళిపోతాడు. రిషి తన క్యాబిన్ లో కూర్చొని.. వసుధార ఇంకా కాలేజీకి రాలేదా అని ఆలోచిస్తుంటాడు. రిషి, వసుధారలకు మినిస్టర్ గారు కాల్ చేసి వాళ్ళింటికి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కౌశల్ పై కోప్పడిన రాధ..‌ అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  బిబి జోడికి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు బిబి జోడి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ప్రతి వారం డిఫరెంట్ థీమ్ తో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్న బిబి జోడి.. ఈ వారం రెట్రో స్పెషల్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. ప్రతి జోడి నువ్వా, నేనా అన్నట్టుగా పోటీపడుతూ డ్యాన్స్ చేసారు. శనివారం జరిగిన ఎపిసోడ్ నుండి ఒక జోడి, ఆదివారం జరిగిన ఎపిసోడ్ నుండి మరొక జోడి లీస్ట్ లో ఉన్నారు. మెహబూబ్ -శ్రీ సత్య జోడి, కౌశల్ -అభినయశ్రీ జోడి లీస్ట్ లో ఉన్నారు. ప్రతీవారం ఇలా లీస్ట్ లో ఉన్న జోడిలకి.. వన్ మినిట్ టైం ఇచ్చి డ్యాన్స్ చేయమని చెప్తారు. ఆ రెండూ జోడీలు చేసాక అందులో నుండి బాగా చేయనివాళ్ళని ఎలిమినేటెడ్ జోడిగా , బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన వారు సేఫ్ జోడి గా జడ్జెస్ డిసైడ్ చేసేవారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ అలా కాకుండా కౌశల్-అభినయశ్రీని డైరెక్ట్ ఎలిమినేషన్ చేసారు. వాళ్ళిద్దరు స్టేజి మీదకి వస్తున్నప్పుడు.. కౌశల్ ని పట్టుకొని అభినయశ్రీ రావడం చూసిన జడ్జెస్ ఏమైందని అడుగుతారు. "ప్రాక్టీస్ లో అభినయశ్రీ కాలుకి గాయం అయింది.. అయినా కూడా తను నొప్పి భరిస్తూ చేస్తానని చెప్పింది" అని కౌశల్ చెప్పాడు. అలా నొప్పితో డాన్స్ చెయ్యడం వద్దు అని రాధ అంటుంది. మెహబూబ్ కూడా సోలోగా రెండు వారాలు చేసాడు కదా మేడమ్.. నేను కూడా అలాగే చేస్తానని కౌశల్ అనగా.. ఇది బిబి జోడి.. జోడిగానే డాన్స్ చెయ్యాలని జడ్జెస్ చెప్తారు.‌ దానికి ఇద్దరు సరే అంటారు. అభినయశ్రీ- కౌశల్ షో నుండి ఎలిమినేట్ అని అనగానే.. "లేదు మేము వాకౌట్" అని కౌశల్ అంటాడు. అది విని రాధ కోప్పడుతుంది. "ఏ విషయాన్నయినా స్పోర్టివ్ గా తీసుకోవాలి" అని కౌశల్ ని ఉద్దేశించి రాధ అంటుంది. పక్కనే ఉన్న అభినయశ్రీ.. "మీ డెసిషన్ ని ఏకీభవిస్తున్నాం మేడమ్" అని చెప్తుంది. దీంతో అభినయశ్రీ-కౌశల్ జోడి పోటీ నుండి తప్పుకున్నారు. ఇక ఎలిమినేట్ అయి బయటికొచ్చిన కౌశల్.. "జడ్జెస్ స్ట్రాటజీస్ వాడుతున్నారు.. అందుకే రవికిరణ్ -భాను ఎలిమినేట్ అయ్యారు.‌ లేదంటే వాళ్ళు టాప్-2 లో ఉండేవాళ్ళు" అని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

బల్లులు నాకేనా అందంగా కనిపించేవి?

బిగ్ బాస్ అన్ని సీజన్స్ కంటే కూడా సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ వలన మస్త్ ఫేమస్ అయ్యింది. గీతూ ఎలిమినేట్ ఐనప్పుడు ఆ ఇంటిని విడిచి రాలేక భోరున ఏడ్చేసింది. గీతూ బిగ్ బాస్ కి వెళ్ళకముందు యూట్యూబ్ లో రివ్యూయర్ గా వీడియోస్ అప్ లోడ్ చేసి ఫేమస్ అయ్యింది.  అలా పాపులారిటీ తెచ్చుకున్న గీతు రాయల్ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో కూడా కనిపించి వావ్ అనిపించారు.  ఐతే మరీ అంత ఫేమస్ కాదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక మాత్రం పిచ్చ పాపులారిటీ సంపాదించేసుకుంది. చిత్తూర్ చిరుత అని అనిపించుకుంది...అలాగే ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఎంతో మంది అమ్మాయిలూ ఉన్నారు. గీతూ ఈ పని చేసినా ఏ విషయం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిజ జీవిత విషయాలను చెబుతూ మోటివేషనల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గీతూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వెరైటీ వీడియో పోస్ట్ చేసింది. ఒక బల్లి మనిషి వేలును పట్టుకుని కోరుకుతున్నట్టుగా ఉంటుంది. ఆ వీడియోకి "ఈ ప్రపంచంలో బల్లులు అందమైనవిగా కనిపించేది నాకు మాత్రమేనా...మీకు అలా ఎప్పుడైనా అందంగా కనిపించాయా ? " అని అడిగింది. దీన్ని బట్టి గీతూకి బల్లులంటే ఇష్టం అన్న విషయం అర్థమౌతోంది. ఇక  గీతూ వాళ్ళ నాన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోస్ అలాగే గీతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేసి తనను మోటివేట్ చేసిన వీడియో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.

 మా నానమ్మ ఎలా వంట చేస్తోందో చూడండి...

ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే ఆ ముచ్చటే వేరుంటది కదా. అంత వయసులోనూ మనవాళ్లకు, మనవరాళ్లకు వండి పెడితే వాళ్లకు ఆనందం వస్తుంది. వాళ్ళ చేతి వంట తిని మనకు ఆరోగ్యం కూడా వస్తుంది. ఐతే ఎవరింట్లో బామ్మలు ఇప్పటికీ పని చేస్తున్నారో లేదో తెలీదు కానీ విష్ణుప్రియ ఇంట్లో మాత్రం వాళ్ళ బామ్మ శ్రద్దగా వంట చేస్తూ కనిపించింది. ఆమె పనిలో మునిగిపోయేసరికి తెలియకుండా ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "మా నానమ్మ..వయసు 79 . నాకోసం ఎంతో శ్రద్దగా, ప్రేమతో  చాలా డెడికేటెడ్ గా వంట చేస్తోంది చూడండి" అని కాప్షన్ పెట్టింది. విష్ణుప్రియ  ఒక యూట్యూబర్‌గా తన కెరీర్‌ ని స్టార్ట్ చేసింది. "పోవే పోరా" షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన హంగామా ఆడియన్స్  ఎవరూ మర్చిపోలేరు. ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. రీసెంట్ గా రిలీజ్ ఐన "వాంటెడ్ పండుగాడు" మూవీలో   ఓ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఐతే ఆమె జీవితంలో రీసెంట్ గా ఒక విషాదం చోటుచేసుకుంది.  ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఆ విషయాన్ని విష్ణు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేసుకుని చాలా బాధపడింది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అప్పుడప్పుడు అందాల విందు చేస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

కవేళ అదే బతికి ఉంటే నేను దాన్నే నా పెట్ గా పెంచుకునేవాడిని

నిఖిల్ విజయేంద్ర సింహ యూట్యూబర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ గా బాగా  పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేసాడు. అలాగే చాలా ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. "హలో వరల్డ్" అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఓటిటి ప్లాటుఫారం జీ5లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించింది. ఈ వెబ్ సిరీస్ కు నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్... నిఖిల్, నిహారిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. ఐతే నిఖిల్ ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తూ, వెరైటీ క్వశ్చన్స్ అడుగుతూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. సురేఖావాణి కూతురు సుప్రీతతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటాడు. అలాంటి నిఖిల్ ఒక పెట్ ని పెంచుకోవాలనుకుంటున్నాడు. సాధారణంగా ఎవరైనా కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో, కుందేలు పిల్లనో, చిలకనో పెంచుకోవాలనుకుంటారు. కానీ నిఖిల్ మాత్రం కొంచెం డిఫరెంట్ యానిమల్ ని పెంచుకోవాలని ఆశ పడుతున్నాడు. కానీ ఆ జీవులు మాత్రం ఇప్పుడు భూమి మీద బతికిలేవు...అవి ఏంటి అంటే డైనోసార్స్..."ఒక వేళ భూమి మీద  ఈ జీవి బతికి ఉంటే దీన్నే నా పెట్ గా పెంచుకునేవాడిని" అని ఒక ఇమేజ్ ని ఈ కాప్షన్ కి పెట్టి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. ఇక నిఖిల్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేసరికి బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని అప్పట్లో ఒక టాపిక్  వైరల్ అయ్యింది. ఎందుకంటే బిగ్ బాస్ లోకి యూట్యూబర్స్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా షణ్ముఖ్ జశ్వంత్ , దీప్తి సునైనా, గీతూ రాయల్ కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే.

నేను ఫస్ట్ కిస్ ఇచ్చింది వాళ్ళకే...

పులి-మేక వెబ్ సిరీస్ ఓటిటిలో మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంటోంది. రకరకాల ట్విస్ట్స్ తో చక్కని స్క్రీన్ ప్లేతో  ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. ఇందులో సిరి హన్మంత్, ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి మెయిన్ రోల్స్. ఐతే రీసెంట్ గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆది, సిరి కనిపించారు. యాంకర్ అడిగిన రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి  జవాబులు కూడా చెప్పారు. "మీ ఫస్ట్ క్రష్ ఎవరు" అనేసరికి "ఏమో నాకు నిజంగా గుర్తులేదు" అని చెప్పింది సిరి. "ఫస్ట్ టైం బంక్ కొట్టింది ఎక్కడ స్కూలా, కాలేజా..?" "4th క్లాస్ చదివేటప్పుడు వాష్ రూమ్ అని చెప్పి గేట్ దూకేసి ఇంటికి వెళ్ళిపోయా" అని చెప్పింది. "మీరు ఫస్ట్ చేసిన జాబ్ ఏమిటి..శాలరీ ఎంత ?"  అని అడిగేసరికి "న్యూస్ రీడర్ గా చేశా 3 వేలు ఇచ్చారు" అని చెప్పింది. "మీరు ఫస్ట్ కొనుక్కున్నది కార్ ఆర్ బైక్ ?" "నా డబ్బులతో నేను మొదట కొనుక్కున్నది కార్" అని చెప్పింది. "ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు ఇచ్చారు" అని అడిగేసరికి "ఎప్పుడో ఇచ్చా ఏడేళ్లవుతోంది" అని చెప్పింది. "ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ గుర్తుందా ?" అనేసరికి "పక్కనే ఉన్న గోవా కూడా వెళ్ళలేదు..సినిమా షూటింగ్ కోసం ఊటీ వెళ్లాను..ఇప్పుడిప్పుడే వెళ్లాలనిపిస్తోంది ప్లేసెస్..వెళ్తాను ఇక. ట్రావెలింగ్ లో చాలా బాడ్ నేను...ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా ట్రావెలింగ్ " అని చెప్పింది. "మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు" అనేసరికి "ఫేవరేట్ హీరోస్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు. క్రష్ అంటే హీరోస్ చాలా మంది చేసిన ఫస్ట్ మూవీస్ లో చాల మంది క్రష్ ఉన్నారు. అష్టా చెమ్మలో నాని, ప్రేమ కావాలిలో ఆది గారు." అని చెప్పింది. " మీ ఫస్ట్ కిస్ " అని అడిగేసరికి "నాన్న, అమ్మ, తమ్ముడు, ఇంకెంతమంది కావాలి ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్" అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.

వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు!

కార్తీక దీపం సీరియల్ అంటే చాలు డాక్టర్ బాబు, వంటలక్క గుర్తొస్తారు. సీరియల్ ఐపోయినా ఈ క్యారెక్టర్స్ ని మాత్రం ఎవరూ మర్చిపోవడం అంత ఈజీ కాదు. వాళ్ళ అసలు పేర్ల కంటే కూడా సీరియల్ లో పేర్లతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. సీరియల్ ఐపోయాక వంటలక్క, డాక్టర్ బాబు ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు బిజీ ఐపోయారు. ఐతే ఇప్పుడు డాక్టర్ బాబు వంటలయ్య అవతారం ఎత్తాడు. ఇంట్లో తన సుపుత్రుడి కోసం మంచి టేస్టీ వంటకం చేసాడు.  మంజుల పరిటాల తన కొడుకు చదువుకుంటుండగా వెళ్లి ఏమన్నా తింటావా..ఏం చేసి పెట్టను అది అడిగింది. రెగ్యులర్ వి అస్సలు వద్దు...కొత్తగా..టేస్టీగా ఏమన్నా చెయ్యి అని అడిగాడు. ఇది ఇల్లు.. హోటల్ కానీ, బేకరీ కానీ కాదు కదా...అని సీరియస్ అయ్యింది. అలా ఐతే ఏం వద్దు అని మారాం చేస్తుండగా అక్కడికి డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల వచ్చి విషయం ఏమిటి అని అడిగాడు. ఇక మంజుల జరిగింది మొత్తం చెప్పేసరికి...సరే నీకు స్పెషల్ రెసిపీ చేస్తాను అని మంజులను వంటగదిలోకి తీసుకెళ్లి ఆనియన్స్, రెడ్, ఎల్లో, గ్రీన్ కాప్సికం ముక్కలుగా కట్ చేసి నాలుగు ఎగ్స్ తీసుకుని అన్ని మిక్స్ చేసాడు. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బోర్డర్స్ కట్ చేసి ఆ బోర్డర్స్ ని పాన్ లో పెట్టి కొంచెం నెయ్యి వేసి ప్రిపేర్ చేసుకున్న మిక్స్ ని అందులో పోసి దాని మీద చీజ్, కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ పెట్టి అటు ఇటు ఎర్రగా కాల్చి ఇచ్చాడు. ఇక వాళ్ళ అబ్బాయి అది తిని సూపర్ గా ఉంది అని లాగించేసాడు. దీన్నే ఎగ్ బ్రెడ్ చీజ్ టోస్ట్ అంటారు అని పేరు పెట్టాడు.  ఇక మంజుల ఎండింగ్ నోట్ ఇచ్చేసింది. మనం చేసుకుని మనమే తినాలంటే ఎక్కువ తినలేము కానీ వేరే వాళ్ళు చేసి పెడితే ఎంతైనా తినేస్తాం కదా.. మరి మీరేమంటారు అని తన ఫాన్స్ ని అడిగింది. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

బాత్ టబ్ లో హీరోయిన్ మెటీరియల్!

బుల్లితెర మీద శ్రీదివ్య అంటే ఎవరో తెలీదు కానీ కార్తీకదీపం ప్రియమణి అంటే చాలు పొడవాటి జడ, అందమైన స్ట్రక్చర్, మ్యాచింగ్ వస్తువులు టోటల్ గా క్లాసీ పనిమనిషి గుర్తొచ్చేస్తుంది కదా. కార్తీకదీపం సీరియల్ ఐపోయినా అందులో విలన్ మోనిత ఇంట్లో ఉండే పనిమనిషి ప్రియమణిని ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు ఈ అందమైన పనిమనిషి సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. సీరియల్ లో పేరుకే పని మనిషి రోల్ కానీ బయట చూస్తే ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 68 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో  గ్లామరస్ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫాన్స్ అటెన్షన్ ని తన వైపు తిప్పుకుంటోంది ఈ అమ్మడు.  ఇక శ్రీదివ్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటో ఒకటి రిలీజ్ చేసింది. బాత్ టబ్‌లో పడుకుని మంచి కిక్కిచ్చే ఫోటో అది. ఆ ఫొటో వైరల్ అవుతోంది అంతేకాదు కామెంట్ల కూడా బాగా పేలుతున్నాయి. "ఎప్పుడో చెప్పాం కదా.. నువ్వు హీరోయిన్ మెటీరియల్ అని.. చంపేశావ్ పిల్లా" అంటూ ఆమె ఫొటోకి తెగ లైక్‌లు ఇస్తూ మంచి హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. శ్రీదివ్య.. కార్తీకదీపం సీరియల్‌తో పాటు.. మహలక్ష్మి, పంచెవన్నెల చిలక లాంటి  సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. పుష్ప మూవీలో కూడా పని మనిషి పాత్రలో కనిపించింది శ్రీదివ్య. ఎన్ని సీరియల్స్ లో నటించినా కార్తీక దీపంలో వచ్చినంత పేరు ఎక్కడా రాలేదు. ఏ డైరెక్టర్ కంట్లో అన్నా పడకపోతానా మంచి మూవీ ఛాన్స్ ని అందుకోలేకపోతానా అంటూ శ్రీదివ్య మాత్రం తన రేంజ్ తాను దూసుకుపోతోంది.

ఇంటి ముందు అభిమానుల ధర్నా.. దెబ్బకి దిగొచ్చిన జ్యోతక్క!

తెలంగాణ యాసలో తీన్మార్ వార్తలు చదువుతూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు ఫుల్ బిజీ ఐపోయింది. బుల్లితెర ఈవెంట్స్ తో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. అప్పుడప్పుడు భర్తను కూడా తీసుకొచ్చి టీవీ షోస్ లో సందడి చేస్తూ కనిపిస్తోంది.  ఐతే ప్రస్తుతం ఆమె చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి..  లేటెస్ట్ గా  'జ్యోతక్క ముచ్చట్లు' అని కొత్త  యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ ఛానల్ లో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకుని జ్యోతక్క ఇంటి ముందుకు వచ్చి  "డౌన్ డౌన్ జ్యోతక్క" అంటూ నినాదాలు చేశారు. ఇదంతా విని అసలేమైందో తెలుసుకోవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చింది. " ఎందుకు  మా ఇంటి ముందుకొచ్చి లొల్లి పెడుతున్నారు" అని అడిగేసరికి " అబ్బా కమలహాసిని..ఏం తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నావక్కా...మీరు ఏది చేస్తే అది నడుస్తుందని...మా జనాలంటే అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా.. నువ్ చేసిన తప్పుకు సారీ చెప్పి నష్ట పరిహారం చెల్లించాలి...ఒక్క పూట అన్నం అన్నా తినను కానీ నీ వార్తలే చూస్తా... ప్రోగ్రాం స్టార్ట్ చేస్తావా చేయవా... ఏంటక్కా ఇలా చేసావ్.. నీ తెలంగాణ యాస వార్తలకు మా ఆంధ్రాలో చాలామంది ఫాన్స్ ఉన్నారు. మా అమ్మ సొంత బిడ్డలా చూసుకుంటుంది నిన్ను...." అంటూ గట్టి గట్టిగా అరిచేసరికి జ్యోతక్క అన్ని విని "ఇదంతా కాదు అత్తమ్మ ..నువ్వు చెప్పు ప్రోగ్రాం స్టార్ట్ చేయాలా వద్దా.." అని వాళ్ళ అత్తమ్మను అడిగింది. "చెయ్యి బిడ్డా..నువ్ వార్తలు చెప్తుంటే మంచిగుంటది" అని వాళ్ళ అత్తమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి "మీ అందరినీ చూస్తుంటే చాలా సంబరమైతాంది. అందుకే నేను మళ్ళీ తెలంగాణ యాసలో వార్తలు చెప్పడం షురూ చేస్తా త్వరలో" అని చెప్పింది జ్యోతక్క. ఇకపై తెలంగాణ యాసలో చెప్పే వార్తలన్నీ 'జ్యోతక్క ముచ్చట్లు' యూట్యూబ్ ఛానల్ లోనే అప్ లోడ్ చేయబోతోంది శివజ్యోతి.

ముసుగు తీసేసిన కావ్య.. దుగ్గిరాల ఫ్యామిలీకి నిజం తెలిసిపోయింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-35 లో.. స్వప్నని తీసుకొస్తుందని అప్పు కోసం కనకం ఎదురుచూస్తుంటుంది. మరోవైపు పెళ్ళితంతు జరుగుతుంది. తాళికట్టే సమయానికి స్వప్న వస్తుందో రాదో అన్న భయంతో కావ్య ఉంటుంది. మరోవైపు స్వప్న, రాహుల్ ఉన్న కార్ ని అప్పు వెంబడించడంతో.. తొందరగా వెళ్ళు అప్పు వస్తుందని రాహుల్ తో స్వప్న అంటుంది. ఇప్పుడు వాళ్ళు రాకుండా ఆపాలి అంతే కదా అని చెప్పి రాహుల్.. కార్ సడన్ బ్రేక్ వేసేసరికి వాళ్ళ వెనకాలే వస్తున్న అప్పు బండి కార్ కి తగిలి కిందపడిపోతుంది. దీంతో అప్పుకి దెబ్బలు తగులుతాయి. రాహుల్, స్వప్న లు ఒక హోటల్ కి వెళ్ళి రిలాక్స్ అవుతారు. "ఎక్కడ రాజ్ తో నా పెళ్ళి అవుతుందోనని బయపడిపోయాను. ఇలా మనిద్దరం ఒక గదిలో ఉంటే నాకు ధైర్యంగా ఉంది" అని స్వప్న అంటుంది. అదే సమయానికి రాహుల్ కి రాజ్ వాళ్ళ బాబాయ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి.."ఆఫీస్ లో ఫైర్ అయిందని వెళ్ళావ్ కదా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది" అని అడుగుతాడు. "మామయ్య ఆఫీస్ లో అంతా ఓకే నేను చూసుకుంటున్నా" అని అబద్దం చెప్తాడు రాహుల్. మరోవైపు దెబ్బలతో వచ్చిన అప్పుని చూసి కనకం ఏడుస్తుంది. "నా గుండెల మీద తన్ని వెళ్ళిన స్వప్న గురించి ఏడవాలా.. దెబ్బలతో వచ్చిన నిన్ను చూసి ఏడవాలా.. నా మాట కాదనకుండకుండా పీటల మీద కూర్చున్న కావ్య గురించి ఏడవాలా" అని అనుకుంటూ కనకం బోరున ఏడుస్తుంది.  ఆ తర్వాత కావ్య మెడలో తాళి కడుతుండగా.. రాజ్ చెయ్యి పట్టుకొని కావ్య ఆపి తన ముసుగు తీస్తుంది. స్వప్న కాకుండా కావ్య ఉండడంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ అని అనగానే "స్వప్న వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి కూడా నా కూతురే" అని కనకం అంటుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి.. "మమ్మల్ని ఇలా మోసం చేస్తావా" అంటూ కనకంపై విరుచుకుపడతారు. రాజ్, కావ్యని పెళ్ళి చేసుకుంటాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిషి ఇంకా దేవయాని గుప్పిట్లోనే ఉన్నాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-702 లో.. కాలేజీలో జరిగిన ప్రెస్ మీట్ లో అందరి ముందు వసుధార తన భార్య అని ఒప్పుకున్నాడని, ఇంటికి వచ్చాక రిషితో దేవయాని మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తనని చూసిన రిషి.. 'ఏంటి పెద్దమ్మ అలా వెళ్ళిపోతుంది' అని, తన వెనకాలే వెళ్లి 'నాతో మాట్లాడవా పెద్దమ్మ' అని అడుగుతాడు. "ఈ పెద్దమ్మతో నీకు పనేంటి? చిన్నప్పటి నుండి ఈ చేతులతో పెంచి గోరు ముద్దలు తినిపించాను. ఇప్పుడు ఈ పెద్దమ్మ ఎవరో అన్నట్లుగా.. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ వసుధారని అందరి ముందు.. నా భార్య అని చెప్పావు" అని దేవయాని అంటుంది. "లేదు పెద్దమ్మ నీకు అంతా వివరించే పరిస్థితిలో లేను నేను. మీరు కావాలంటే జగతి మేడంని అడగండి. నేను ఇప్పటికీ ఎప్పటికీ మీరు చెప్పిందే వింటాను. నేను మీ రిషినే" అని అనగానే.. "ఇంకా రిషి నా గుప్పెట్లోనే ఉన్నాడన్న మాట" అని హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవయాని. మరోవైపు రిషి అన్న మాటలు జగతితో చెప్తూ బాధ పడుతుంది వసుధార. "కాలేజీలో అందరి ముందు భార్యగా ఒప్పుకొని.. నాలుగు గోడల మధ్య నువ్వు నా భార్యవి కాదు.. నేను నీ భర్తని కాదని చెప్పి నా మనసు ముక్కలు చేసాడు" అంటూ వసుధార ఎమోషనల్ అవుతుంది. "రిషి త్వరలోనే అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకు" అని జగతి అంటుంది. అలా అనగానే.. "మీరు మీకు తెలియకుండానే మీ కొడుకుకి సపోర్ట్ చేస్తున్నారు మేడమ్" అని వసుధార అంటుంది. ఈ ప్రాబ్లమ్ ని నేనే సాల్వ్ చేస్తానని జగతి చెప్పేసి వెళ్తుంటుంది. అలా తను వెళ్ళిపోతుంటే "మేడం.. రిషి సర్ ని ఏం అడగకండి. నేను తన మీద మీకు చాడీలు చెప్పానని అనుకుంటాడు" అని వసుధార అంటుంది. "అబ్బో మీ MD సర్ ని ఒక్కమాట అననివ్వవు అన్నమాట.. అదే ప్రేమంటే" అని జగతి అంటుంది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది.  రిషి అన్న మాటలు వసుధార గుర్తు చేసుకుంటుంది. మరోవైపు రిషి కూడా వసుధార గురించే ఆలోచిస్తుంటాడు. నేను అందరి ముందు చెప్పింది.. నీకు చెప్పింది రెండు నిజమే కదా వసుధార అని రిషి తన మనసులో అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణని ప్రేమిస్తున్నానని మురారి చెప్పడంతో ముకుంద షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-96 లో... ఇంటికి లేట్ గా వచ్చిన కృష్ణని ఎందుకు ఇంత లేట్ అయిందని భవాని అడిగినప్పుడు అక్కడే ఉన్న ముకుంద మధ్యలో కలుగజేసుకొని.. "ఊరు నుండి వచ్చావ్.. ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు" అని వెటకారంగా మాట్లాడుతుంది. నేను ఊరు నుండి వచ్చిన గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్నానని కృష్ణ అంటుంది. "నేను కూడా డబుల్ M.A చేశానని ముకుంద అంటుంది. "నేనేదో నువ్వు సిటీకి కొత్త ఏం తెలియదని, ఆ రకంగా అంటుంటే నువ్వు ఇలా అర్థం చేసుకున్నావ్" అని ముకుంద మాట మర్చి ప్రేమగా మాట్లాడినట్టు యాక్ట్ చేస్తుంది. కృష్ణతో పాటు అందరు కూడా సైలెంట్ గా ఉంటారు. ఇంట్లో ఆదర్శ్ లేడు కాబట్టి నన్ను పీచుక పుల్లతో సమానంగా చూస్తున్నారని ముకుంద అంటుంది. కృష్ణని వెటకారంగా ఇండైరెక్ట్ గా ముకుంద మాటలు అంటుంది. దాంతో "ఇంట్లో నన్ను అందరు ఊరు నుండి వచ్చింది అనేవాళ్ళే" అని కృష్ణ ఏడుచుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. అలా కృష్ణ వెళ్ళేప్పుడు.. మురారి తనని చూసి ఏమైందని అడిగినా చెప్పకుండా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మురారి హాల్ లోకి వచ్చి.. "కృష్ణ ఎందుకు ఏడుస్తుంది" అని రేవతిని అడుగుతాడు. అప్పుడు రేవతి ఆ గొడవ అంతా ఎందుకు చెప్పాలని.. టీ తాగుతావా మురారి అని అడుగుతుంది. అక్కడే ఉన్న భవాని.. నీ భార్య కాలేజీకి వెళ్ళి రావడానికి ఏదైనా ఏర్పాటు చేయ్ మురారి. ఈ ఇంటి కోడలు కాలేజీ నుండి లేట్ గా వస్తూ ఇబ్బంది పడడం బాగోదని భవాని చెప్పగా.. సరే పెద్దమ్మ అని మురారి చెప్తాడు. ఆ తర్వాత గదిలో ఉన్న కృష్ణ దగ్గరికి మురారి వెళ్ళి.. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ కృష్ణా అని అడగుతాడు. ముకుంద చేసిన గొడవ అంతా చెప్తూ.. మీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందంటూ మురారితో అంటుంది. ఇక మురారి కోపంగా ముకుందని రమ్మని చెప్తాడు. "నువ్వు కృష్ణని ఏం అన్నావ్.. కృష్ణని తక్కువ చేసి మాట్లాడుతున్నావంట కదా.. కృష్ణతో పోల్చితే నీ స్టేటస్ తక్కువే.. కృష్ణకి ఊళ్ళో సొంత ఇల్లు, పొలం ఉంది.. ఇంకా తను కాబోయే డాక్టర్" అని మురారి అంటాడు. ఏంటి నువ్వు కృష్ణకి అంత సపోర్ట్ చేస్తున్నావ్? కృష్ణని ప్రేమిస్తున్నావా? అని ముకుంద అడుగుతుంది. "అవును ప్రేమిస్తున్నాను. ప్రేమించడం తప్పేమి కాదే.. ప్రేమేం ఉన్మాది కాదే.. ఎంత ప్రేమ పంచిన తప్పు లేదు" అని కృష్ణ మీద ప్రేమతో.. తనకి సపోర్ట్ గా మురారి మాట్లాడుతాడు. అలా మురారి అనడం భరించలేని ముకుంద కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇదే సరైన పని!

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ 4 రన్నరప్ గా నిలిచి జనాల్లో మంచి  క్రేజ్ సంపాదించాడు. మోనాల్‌తో లవ్‌ ట్రాక్‌, సోహైల్‌తో ఫ్రెండ్‌షిప్‌ అఖిల్ కి బాగా కలిసొచ్చింది. బయటకి వచ్చాక కూడా ఆ క్రేజ్ ని నిలబెట్టుకున్నాడు. బిగ్ బాస్ క్రేజ్ తో కొన్ని మూవీస్, వెబ్ సిరీస్ లాంటి కొన్ని ఆఫర్స్ ని కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు బీబీ జోడిలో తేజుకి జోడిగా డాన్స్ ఇరగదీస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చాలామంది ఫాలోవర్లు ని సంపాదించుకుంటున్నాడు. రీసెంట్ గా బీబీ జోడి డాన్స్ షోలో గాయాలై ఆస్పత్రి పాలైనట్టు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆ విషయంగా స్ట్రెస్ ఫీలవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి పెయింటింగ్ వైపు మనసు లగ్నం చేసాడు. కృష్ణుడి చిత్రాన్ని అద్భుతంగా గీసి రంగులు వేసి స్ట్రెస్ నుంచి కొంచెం బయటపడినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.  "స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం పెయింటింగ్, పరిస్థితుల్లో చాలా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. మనం బాలన్స్ గా ఉండాలి ఇదే ఇంపార్టెంట్ ...అప్పుడనిపించింది నాకు ఎంతో ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడిని పెయింటింగ్ చేయాలని. ఎందుకంటే ఆయనే నాకు అన్నీ..భోజనం కూడా చేయకుండా 7 గంటల సేపు ఈ పెయింటింగ్ వేస్తే చివరికి ఇంత అందంగా వచ్చింది..ఈ పెయింటింగ్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను..మీ ప్రేమను కామెంట్స్ రూపంలో చెప్పండి" అంటూ ఒక కాప్షన్ పెట్టాడు.  ఇక నెటిజన్స్ ఐతే కామెంట్స్ వరద కురిపిస్తున్నారు. "సూపర్బ్, అమేజింగ్, నీలో చాలా మంచి టాలెంట్ ఉంది..అసలే హెల్త్ బాలేదు కదా...టైంకి తిను.. కృష్ణుడి మీద నీకు ఎంత భక్తి ఉందో ఈ పెయింటింగ్ ద్వారా అర్ధమవుతోంది" అని రిప్లైస్ ఇచ్చారు.

ఇలా చేస్తే ప్రేమ పెరుగుతుంది.. ఐ ఆమ్ సో సారీ!

శ్రీ సత్య బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బాగా ఫేమస్ ఐన బుల్లితెర నటి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కంటే ముందు ఆమె సీరియల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ముద్దమందారం , త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు వంటి సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యింది. రీసెంట్ ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది. అందులో " అక్కా నువ్ మళ్ళీ త్రినయని సీరియల్ లోకి రావొచ్చుగా..నువ్ ఉంటేనే ఆ సీరియల్ బాగుంది" అని ఒక ఫ్యాన్ అడిగేసరికి "ఈ ప్రశ్న నన్ను చాల మంది అడుగుతున్నారు. మీరంతా మళ్ళీ నన్ను సుగుణగా చూడాలి అనుకుంటున్నారు. కానీ నాకు రావడానికి కుదరదు. ఐ ఆమ్ సో సారీ" అని రిప్లై ఇచ్చింది. "మన మీద మనకు ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి" అని ప్రశ్నకు " మీ దగ్గర ఉన్న ప్రేమనంతా మీకు నచ్చిన వాళ్ళ మీద చూపించండి. వాళ్ళు ఎలాగో అంత ప్రేమ చూపించరు. పోనీ చూపించినా ఎక్కువ రోజులు చూపించరు...అప్పుడు మీరు బాధపడతారు. ఆటోమేటిక్ గా మీ మీద మీకు ప్రేమ అనేది పెరుగుతుంది" అంటూ వేదాంతం చెప్పింది శ్రీసత్య. ఈమె హీరో రామ్‌కి వీరాభిమాని. ‘నేను శైలజ’ మూవీలో హీరో రామ్ మాజీ గర్ల్ ఫ్రెండ్‌గా నటించి.. తన అభిమాన హీరోతో నటించాలనే కోరికను నెరవేర్చుకుంది. యాక్టింగ్‌పై ఇంటరెస్ట్ తో మోడలింగ్ రంగంలోకి ఎంటరయ్యి మిస్ విజయవాడ, మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ గెలుచుకుంది. లవ్ స్కెచ్, తరుణం, ఏఎన్ఆర్ కన్ఫ్యూజ్ అయ్యాడు, అంతా భ్రాంతియేనా వంటి షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది.