వాళ్ళ ఆయన కోసం వంట నేర్చుకుంటున్న నేహా!

నేహా చౌదరి.. బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితమే. స్పోర్ట్స్ రిప్రజెంటర్ గా కొంతమందికి తెలిసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా అందరికి తెలిసిపోయింది. బిగ్ బాస్ లో నేహా ఉంది కొన్ని రోజులే అయినా బాగా ఎంటర్టైన్ చేసింది. దాంతో అభిమానులు తనకి సపోర్ట్ చేసారు.  నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రిప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది. అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది. పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్ళిన నేహా చౌదరి.. అక్కడ సర్ ప్రైజ్ అంటూ తన భర్తని కలవడానికి వెళ్ళింది. అదంతా కలిపి ఒక వ్లాగ్  అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. బర్త్ డే సర్ ప్రైజ్ వ్లాగ్, ఔటింగ్ అంటూ ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి.  అయితే తాజాగా 'మా ఆయన కోసం వంట మొదలు పెట్టా'  అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది నేహా. ఇందులో తన భర్త కోసం కొత్తగా ఏదైనా చేద్దామని అనుకుందంట. వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి ఏ వంట చేయాలి? ఆ వంటకి  ఏమేం కావాలో తెలుసుకొని లేనివాటిని బయటకెళ్ళి తీసుకొచ్చింది‌‌. ఆ తర్వాత వంట చేసింది నేహా. ఒకసారి తను ఉప్మా చేసిందంట. అది కాస్త ఫెయిల్ అయిందని.. ఉప్మా కాస్త ఉప్మా దోశ అయిందని నవ్వతూ చెప్పింది. కాగా కొత్త కొత్త వ్లాగ్స్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది నేహా చౌదరి.

నాకు కాన్సర్ లేకపోయినా ఉన్నట్టు రాస్తున్నారు.. అని ఫీలైన రాంప్రసాద్

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఆగస్టు 15 ని పురస్కరించుకుని మంచి స్కిట్స్ తో సాంగ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈ షో స్టార్టింగ్ లో ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్, మానస్ డాన్స్ చేస్తూ వచ్చారు. రాంప్రసాద్ వస్తూనే యూట్యూబర్స్ మీద కామెంట్స్ చేసాడు. రీసెంట్ గా "భోళా శంకర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది యూట్యూబర్స్ అంతా కష్టపడాలని ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేయొద్దని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాంప్రసాద్ ఆదిని ఫాలో ఐనట్టు కనిపిస్తోంది.  "అరేయ్ నరేష్ నాకు చాలా బాధగా ఉంది" అని రాంప్రసాద్ అనేసరికి "ఎందుకన్నా" అని అడిగాడు నరేష్. "ఈ యూట్యూబ్ వాళ్ళు నాకు కాన్సర్ లేకపోయినా కాన్సర్ ఉందని రాస్తున్నారు" అనేసరికి మానస్ ఎంట్రీ ఇచ్చి "అవును భయ్యా..నాకు 100 కోట్లు లేకపోయినా ఉన్నట్టుగా  రాస్తున్నారు" అని చెప్పాడు. "ఈ యూట్యూబ్ వాళ్ళు లేనిది ఉన్నట్టు రాస్తున్నార్రా" అని రాంప్రసాద్ యూట్యూబర్స్  మీద కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాటీ నరేష్ మాత్రం హ్యాపీ ఫేస్ తో  "వాళ్ళ నంబర్ నాకు ఇవ్వన్నా..కొద్దిగా నాకు  అవసరాలు ఉన్నాయి.. నేను లేనిది ఉన్నట్టుగా వేయించుకోవాలి" అని చెప్పి అక్కడ ఫన్ క్రియేట్ చేసి అందరినీ నవ్వించాడు.

33 ఏళ్ళు అవుతున్నా నాకేం కావాలో ఆయనకు తెలీదు!

"నీతోనే డాన్స్" షో ఈవారం సెమీఫైనల్స్ కి వచ్చేసింది. ఇక ఈ వారం రెండు టీమ్ లు వచ్చి మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేశాయి. ఆట సందీప్-జ్యోతి డాన్స్ చూసి ఫుల్ ఫిదా ఐపోయిన రాధను శ్రీముఖి తన పెళ్లి గురించి అడిగేసరికి ఆమె ఎన్నో విషయాలను చెప్పారు.  "సెప్టెంబర్ 9 వస్తే మా పెళ్ళై 33 ఏళ్ళు. పెళ్లి గురించి మ్యారేజ్ లైఫ్ గురించి నాకు ఎక్కువ అవగాహన ఉంది. నా ఫామిలీతో నాకు చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఈ ఫోటో చాలా ఓల్డ్ ది.. దీని వెనక చాలా మెమోరీస్ ఉన్నాయి. ఐ లవ్ ఫొటోస్. కొన్ని సందర్భాల్లో మెమోరీస్ అన్నీ కూడా గుర్తుండవు కదా. అందుకే నేను ఎక్కువగా ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆ ఫోటో చూస్తే ఆ మెమరీ గుర్తొస్తుంది. కానీ నేను ఫోటో తీసుకోవాలని అనుకున్నప్పుడు కార్తీక నా మీద అరుస్తుంది. అమ్మా ఎంజాయ్ ది మూమెంట్ అంటుంది... ఒకే మా నేను మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ నాకు ఈ మెమరీ గుర్తురావడం కోసం ఫొటోస్ తీసుకుంటున్నా అని చెప్తుంటాను నేను మళ్ళీమళ్ళీ ఆ మొమెంట్ ని ఎంజాయ్ చేయాలంటే ఫోటో అనేది ఇంపార్టెంట్. ఇంకో విషయం చెప్పాలంటే నా టార్గెట్ 5 కిడ్స్. ఇంకో ట్విన్స్ కోసం అలా ప్రార్ధించాను. ఒకసారి ఓనం సెలెబ్రేషన్స్ టైంలో ఇల్లంతా పిల్లలతో కళకళలాడిపోతోంది. అప్పుడు మా అత్తమ్మ చెప్పింది నీకు మినిమం ఐదుగురు పిల్లల్ని కనాలని చెప్పింది. కుదిరితే 8 మంది పిల్లలుంటే బాగుండు అనుకున్నా అందులో అందరూ ట్విన్స్ ఉండాలి. ఐ లవ్ కిడ్స్ అని కాదు కానీ ఇప్పుడు నా పిల్లల్ని చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలందరినీ చూసుకున్నప్పుడు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మా ఆయన ఇప్పటికీ  ఒకటి అడుగుతారు..ఎం కావాలే నీకు అని అడుగుతారు, ఏంటి నీ ప్రాబ్లమ్ అంటారు.. నేను చెప్పను అంటాను... 33 ఇయర్స్ ఐపోతోంది ఇంకా నీకు ఏమీ తెలీదంటే గో టు హెల్ అని అంటుంటాను" అని తన పెళ్లి గురించి ఎన్నో మెమోరీస్ ని నీతోనే డాన్స్ షోలో జడ్జి రాధ షేర్ చేసుకున్నారు.

కుమారిగా ఉంటేనే లైఫ్ ప్రశాంతం.. లేదంటే డైపర్లు పట్టుకుని తిరగాలి!

శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ శుక్రవారాలు, మహాలక్ష్మి వ్రతాలు ఇళ్లన్నీ పండగ వాతావరణంతో సందడి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో బుల్లితెర మీద ఈవెంట్లు, షోలు ఎక్కువగానే రెడీ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మాలో "మా వరలక్ష్మి వ్రతం" త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ కి ఉదయభాను హోస్ట్ గా వస్తోంది. ఇందులో "కుమారీలు వెర్సెస్ శ్రీమతులు" అనే థీమ్ తో పెళ్లి కానీ వాళ్ళను పెళ్ళైన వాళ్ళను తీసుకొచ్చి గేమ్స్ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్ మధ్య రచ్చ కూడా మాములుగా లేదు. జ్యోతక్క అలియాస్ శివజ్యోతికి కోపం వచ్చేసింది " మీరు కేవలం కుమారీలు మాత్రమే.. అంత బిల్డప్ అవసరం లేదు" అని కుమారీలను ఉద్దేశించి అనేసరికి " మీరంతా శ్రీమతులే..శ్రీమంతుడు మూవీలో శృతిహాసన్ కాదు" అంటూ కుమారీల టీమ్ నుంచి ప్రేరణ శ్రీమతులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. దానికి అవినాష్ షాకయ్యాడు.  ఇక ఈ షోకి "బేబీ" ఫేమ్ వచ్చేసింది. మస్త్ డాన్స్ చేసి ఎంజాయ్ చేసింది. "కుమారీలుగా ఉంటేనే లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది" కదా అని ఉదయభాను అడిగేసరికి "లేదంటే సంకలో పిల్లల్నెత్తుకుని మరో చేతిలో డైపర్లు పెట్టుకుని వెళ్తూ ఉండాలి" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఈ షోలో బుల్లితెర జోడీస్ డాన్సస్ చేసేశాయి.  ఇక ఈ వరలక్ష్మి వ్రతం ఈవెంట్ లో అవినాష్ వైఫ్ అనుజకి సీమంతం వేడుకను నిర్వహించారు. ఈసారి "మాటీవీ వరలక్ష్మి వ్రతం ఎంటెర్టైన్మెంటే మొత్తం" అని చెప్పింది ఉదయభాను.

 ఏరా.. బిజినెస్ డీల్ క్లోజ్ చేద్దామా.. ఆ ఐదెకరాల మామిడి తోట మాత్రం నాకు

సుమ ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ కి  కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. అలాంటి సుమ హోస్టింగ్ లోనే కాదు..బిజినెస్ డీల్స్ క్లోజ్ చేయడంలో కూడా దిట్టగా మారిపోయింది. తన ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూస్తే ఎవ్వరికైనా నవ్వు రాక మానదు. ఒక చిన్న బాబుని ఎత్తుకుని వాడితో మాట్లాడింది. వాడు మాత్రం అమాయకంగా సుమ ముఖాన్నే చూస్తూ పెదాలు చప్పరిస్తూ, నవ్వుకున్నాడు.  "బిజినెస్ డీల్ క్లోజ్ చేసుకుందామా...ఆ నాలుగు పట్టు చీరలు నీకు, కావాలంటే ఆరు పంచెలు నాకు..10 ఎకరాల కొబ్బరి తోట నీకు..ఏం మూడ్ మారింది..హలో..అలా నవ్వేసి పక్కకు వెళదామని అనుకోకు..ఇక్కడ విను..ఐదెకరాల మామిడి తోట మాత్రం నాకు..నువ్వు నీ ఫేస్ ని అలా పెట్టకూడదు..ఎందుకలా పెదాలు చప్పరిస్తున్నావ్..హలో క్లోజ్ చేద్దామా డీల్" అంటూ ఆ పిల్లాడిని చూస్తూ నవ్వేసింది సుమ.  సుమ ఏది చేసినా వెరైటీగా ఉంటుంది. రీసెంట్ గా నిద్ర పోతున్న ఒకతన్ని లేపి మరీ తన శాడిస్ట్ బుద్ది చూపించింది. ఇక ఇప్పుడు చిన్నపిల్లాడిని ఎత్తుకుని వాడితో బిజినెస్ వ్యవహారాలూ మాట్లాడేసింది. సుమ ఇటు టీవీ ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమా ఫంక్షన్లకు హోస్టింగ్ చేస్తూ ఉంటుంది.  ఐతే ఈ మధ్య ఎక్కువగా సినిమా రిలీజ్ లకు ముందు  మూవీ టీమ్స్ తో  ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. ఎక్కడైనా సరే  తన మాటలతో  అందరినీ కట్టిపడేస్తుంది సుమ. తెలుగు కూడా అంతే చక్కగా మాట్లాడుతుంది. చిన్నపిల్లలతో కలిసి స్ట్రెస్ బస్టర్స్ అనే సీజన్ చేస్తోంది. అందులో పిల్లలతో మాట్లాడుతూ సుమ తన స్ట్రెస్ ని తగ్గించుకుంటూనే ఆడియన్స్ స్ట్రెస్ ని కూడా తగ్గించేస్తోంది.

బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్.. వద్దని కొందరు.. కావాలని కొందరు

సెప్టెంబర్ 3న బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారం కావడానికి రెడీ ఐపోతోంది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే విషయాలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ వస్తోంది. మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, అలాగే కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభా శెట్టి, జబర్దస్త్ నుంచి బులెట్ భాస్కర్, బుట్ట బొమ్మ, ఇంటింటి రామాయణం సినిమాల్లో నటించి మెప్పించిన నవ్యస్వామి, ఇంకా  క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి.. ఆమె కూతురు సుప్రియతో కలిసి వెళుతోందని టాక్ వినిపిస్తోంది. బుల్లెట్టు బండి సాంగ్ తో మస్త్ ఫేమస్ అయిన ఫోక్ సింగర్ మోహన భోగరాజు, ఋతురాగాలు సీరియల్ నటుడు ప్రభాకర్, యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ దుర్గారావు కపుల్ ఈసారి బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నారనే విషయం తెలుస్తోంది.  ఇకపోతే బిగ్ బాస్ బజ్ కోసం ఈసారి గీతూ రాయల్ ఉండబోతోందట. దానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. గీతూ రాయల్ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా గట్టి పోటీ ఇచ్చింది. ఎలాగైనా టైటిల్ గెలుచుకుని రావాలనుకుంది. కానీ గెలుచుకోలేకపోయింది. హౌస్ లోంచి తనను పంపించొద్దంటూ ఏడ్చేసింది కూడా. అలాంటి గీతూ బిగ్ బాస్ బజ్ కి వస్తుందంటూ న్యూస్ వచ్చేసరికి నెటిజన్స్ మాములుగా కామెంట్ చేయడం లేదు. కొంతమంది "మా గీతూ అక్క బజ్ కి యాంకర్ అయింది కంగ్రాట్స్...గీతూ ఉంటే ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే" అని చెప్తుంటే కొంతమంది మాత్రం "బాబోయ్ గీతూ వద్దు" అంటున్నారు. "శివ బాగా చేస్తాడు కదా..అతనికే ఇవ్వండి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నా పుట్టింటికి ఇక సెలవు.. ఎమోషనల్ ఐన శ్రద్ధా

ముంబైలోని తన పుట్టింటి నుంచి హైదరాబాద్ లోని అత్తింటికి బయల్దేరి వెళ్ళింది విశ్వా అండ్ ఫామిలీ. సెకండ్ డెలివరీ కోసం శ్రద్దా తన పుట్టింటికి వచ్చి నాలుగు నెలలైపోయింది. ఇక ఇప్పుడు పిల్లాడికి రెండు నెలలు వచ్చేసరికి తన పుట్టింటికి వెళ్ళడానికి అందరి లగేజెస్ ని సర్దేసింది. హైదరాబాద్ నుంచి ముంబైకి తన భర్త విశ్వాని వదిలి పెట్టి వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యింది. ఇక ఇప్పుడు తన అమ్మానాన్నను వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంది శ్రద్దా. ఇక పెద్ద కొడుకు ర్యాన్ కూడా స్కూల్ కి వెళ్లడం మానేసాడు. దాంతో టీచర్స్ శ్రద్దాకి వాట్సాప్ లో నోట్స్ పెట్టడం వంటివి చేసేసరికి ఇంట్లోనే వర్క్ చేయించిందట శ్రద్దా. ఇక ఫస్ట్ టైం కంప్లీట్ ఫామిలీ ఫ్లయిట్లో వెళ్తున్నట్టు చెప్పాడు విశ్వా. అలాగే ఫామిలీని వదిలి వెళ్ళేటప్పుడు ఆ బాండింగ్ ని అలాగే ఫ్లయిట్ లో వెళ్ళేటప్పుడు మూమెంట్స్ ని అన్ని కాప్చర్ చేస్తాను అని చెప్పాడు.  ఇక శ్రద్దా తన తల్లిని వదిలి వెళ్ళేటప్పుడు తనను బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు తుడుస్తూ శ్రద్దా వాళ్ళ అమ్మ కూడా కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇక శ్రద్దా తన తల్లి కాళ్లకు దణ్ణం పెడదామనుకుంది కానీ పెట్టనివ్వలేదు. అమ్మా, నాన్న కాళ్ళు స్వర్గానికి ద్వారాలు అంటారు...పర్లేదు మీ కాళ్ళకు దణ్ణం పెట్టుకోనివ్వండి అని శ్రద్దా చెప్పగా.. నో అని చెప్పేసింది శ్రద్దా వాళ్ళ అమ్మ. తర్వాత వాళ్ళ నాన్నను హగ్ చేసుకుని ఏడ్చేసింది శ్రద్దా. అలా చివరికి ఫామిలీతో పాటు చుట్టాలు, ఫ్రెండ్స్ అంతా వచ్చి ఎయిర్ పోర్ట్ లో దింపారు శ్రద్దగా ఫామిలీని. అలా శ్రద్దా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేసింది. ఇక ఈమె తన ఛానల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

దుగ్గిరాల కుటుంబ పరువు కోసం కావ్యకి అపర్ణ వేసిన శిక్షేంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌లో కావ్య వాళ్ళ అమ్మనాన్న(కనకం, కృష్ణమూర్తి) ల దగ్గరికి అపర్ణ వస్తుంది. కావ్య ప్రెస్ మీట్ గురించి మాట్లాడుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మీరే ఆపాలి లేదంటే మీ కూతురిని మీ ఇంటికి తెచ్చి పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటివి జరిగితే నేను అస్సలు సహించను. ఇది బ్లాంక్ చెక్.. మీకు నచ్చినంత రాసుకోండి. కానీ కావ్య మాత్రం డబ్బు సమస్య అంటూ మళ్ళీ మీ ఇంటి గడప తొక్కకూడదని అపర్ణ చెక్ ఇచ్చేసి వెళ్తుంటే.. కనకం తనని ఆపుతుంది. మాకు కూటికి గతి లేకపోయినా పరాయి సొమ్ము గురించి ఆశపడం, కావ్య మీ ఇష్టంతోనే చేసిందని చెప్పడం వల్లే ఇక్కడికి రానిచ్చామని చెప్తుంది కనకం. ఇకపై మీ పరువు తీసే పని ఏదీ కావ్య చేయదని అపర్ణతో కనకం చెప్తుంది. అపర్ణ వెళ్ళిన తర్వాత కనకం, కృష్ణమూర్తి బాధపడతారు. మరొకవైపు రాహుల్, రుద్రాణి కలిసి రాజ్, కావ్య, అపర్ణల మధ్య చిచ్చు పెట్టినట్టుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తిల దగ్గరికి కావ్య పని చేయడానికి వస్తుంది. నువ్వు ఈ పని ఆపేసి మీ ఇంటికి వెళ్ళిపోమని, రేపటి నుంచి రావొద్దని కృష్ణమూర్తి అంటాడు. నేను ఇక్కడికి రావడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుందని కావ్య అడుగగా.. మీ అత్తగారి కుటుంబానికి పరువు నష్టం జరుగుతుందని కృష్ణమూర్తి అంటాడు. నేను మీడియా వాళ్ళని పిలిచి నిజమేంటని చెప్పేశాను, వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అని కావ్య అనగా.. అర్థం చేసుకోలేదు అపార్థం చేసుకున్నారని కనకం అంటుంది. అసలేం జరిగిందని కావ్య అడుగగా.. అపర్ణ వచ్చిందని, నువ్వు ఇక్కడ పనిచేయడం వల్ల వాళ్ళకి పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయని చెప్పిందని, చెక్ ఇచ్చిందని కావ్యతో కనకం చెప్తుంది. అప్పుడే కాంట్రాక్ట్ ఇచ్చిన అతను వచ్చి.. మీరు ఆ పనిని ఆపేయాలని ఆ కాంట్రాక్టర్ చెప్తాడు. మరి అడ్వాన్స్ అని కనకం అడుగగా.. అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని అతను అంటాడు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమని మీకు ఎవరు చెప్పారని కావ్య అడుగగా.. మీ ఆయన రాజే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడని అతను అంటాడు. ఆ తర్వాత కావ్య వాళ్ళింటి నుండి అత్తారింటికి వెళ్తుంది. మరొకవైపు తన అభిమాన పాఠకురాలి కోసం కళ్యాణ్ వెతుకుంటాడు. అప్పుడే అప్పుకి అనామిక కాల్ చేస్తుంది. హలో బ్రో.. నువ్వు పక్కనుండి కూడా ఇంత కష్టపడాలా అని అనామిక అనగా‌..  నేను కనుక్కుంటానని అప్పు అంటుంది. మరొకవైపు కావ్య కోసం దుగ్గిరాల ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూస్తారు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యని అపర్ణ  ఆపుతుంది. ఇదేనా సరిదిద్దుకోవడం అని అపర్ణ అడుగుతుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మాకొక విషయం చెప్పాలి కదా అని సుభాష్ అంటాడు. అంత భాద్యతగా ఆలోచించే మనిషే అయితే పుట్టింటికి వెళ్ళి మన పరువు ఎందుకు తీస్తుందని అపర్ణ అనగానే.‌. అందుకేనా మీరు మా ఇంటికి వెళ్ళి మా అమ్మవాళ్ళని బెదిరించారని, నన్ను అక్కడికి వెళ్ళవద్దని వాళ్ళని అవమానించారని కావ్య అంటుంది. మా పరువుతీసావ్ నాకెంత కోపం రావాలని అపర్ణ అంటుంది. ఈ ఇంటి కోడలిగా ఉండాలంటే ఇక్కడ ఉన్న అందరికి నచ్చినట్టే ఉండి తీరాలని అపర్ణ అంటుంది. నేను నా నిర్ణయాన్ని మార్చుకోనని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శైలేంద్ర కన్నింగ్ ప్లాన్ ని వాళ్ళిద్దరూ పసిగట్టగలరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' . ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-840 లో.. రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒకసారి మహేంద్ర సర్ తో మాట్లాడండి సర్.. ఆయన సంతోషిస్తారని వసుధార అనగానే.. నేనెప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మేడమ్ అని వసుధారతో రిషి అంటాడు. మీకు తెలియదని చెప్పట్లేదు సర్.‌. గుర్తుచేస్తున్నానంతే అని వసుధార అంటుంది. ఒక్కో సిచువేషన్ లో ఎలా ఉండాలో మీ దగ్గరి నుండే నేను నేర్చుకున్నాని వసుధార అనగా.. ఇంక ఆపుతారా మేడమ్ అని రిషి అంటాడు. లేదు సర్ నేను ఆపను.. ఎందుకంటే ఆ రోజు నావల్లే మీరు బాధని భరించారు. కాబట్టే మీరు నన్ను పరాయిమనిషిలా చూస్తున్నా సహిస్తున్నానని వసుధార అంటుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అలా చేశాను సర్. కానీ అది తప్పు కాదు సర్.‌ నా వల్ల మీరు బాధపడుతున్నారని మీకోసం నేను బాధపడుతున్నానని వసుధార అంటుంది. మీరు మీ అమ్మనాన్నలతో సంతోషంగా ఉన్నారని వసుధారతో రిషి అంటాడు‌. లేదు.. మీ చుట్టూ ఉన్నవాటిని నమ్మకండి. ఒకసారి మా వైపు నుండి కూడా ఆలోచించండని రిషితో  వసుధార చెప్పి వెళ్ళిపోతుంది. తప్పని పరిస్థితులలో చేసినా తప్పు తప్పే.. మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని రిషి తన మనసులో అనుకుంటాడు.  మరొకవైపు కాలేజ్ కి వచ్చిన శైలేంద్ర.. కాలేజీ గురించి అన్ని వివరాలని ఒక సర్ దగ్గర తీసుకుంటాడు. దాంతో జగతి మహేంద్రలను ఆడుకోవాలని అనుకుంటాడు శైలేంద్ర. మరొకవైపు జగతి, మహేంద్ర కాలేజ్ కి వెళ్తూ మాట్లాడుకుంటారు. శైలేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడని, మనం జాగ్రత్తగా ఉండాలని జగతి అనగా..  అన్నయ్య మొహం చూసి వాడిని వదిలేస్తున్నాని మహేంద్ర అంటాడు.  మరొకవైపు శైలేంద్ర మాస్టర్ ప్లాన్ వేస్తాడు. జగతి, మహేంద్రల గురించి నెగెటివ్ న్యూస్ రాపించమని ఒక అతనికి అప్పగించగా.. అతను అలానే రాస్తాడు. దాంతో అతనికి కొంత డబ్బులు ఇస్తాడు శైలేంద్ర. ఇంట్లో ఉన్న జగతి, మహేంద్ర మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. రిషి మళ్ళీ బాధ్యతలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మహేంద్రతో జగతి అంటుంది. మనం ఆ ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు రిషి మొదట వద్దన్నాడు. కానీ లోలోపల ఎంత బాధపడ్డాడో నాకు తెలుసని ఆ తర్వాత అన్నీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నాడని మహేంద్ర అంటాడు. మళ్ళీ రిషి ఎప్పుడు కలుస్తాడో.. నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడో.. కొడుకు చేత అమ్మ అని పిలిపించుకోలేని బహుశా నేను ఒక్కదాన్నే ఉన్నానేమోనని జగతి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ కాల్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పగా.‌. అతను చైర్మెన్‌ విశ్వనాథ్ గారికి ఆరోగ్యం బాగోలేదని చెప్తాడు. దాంతో జగతి, మహేంద్ర కంగారు పడతారు. ఇప్పుడెలా ఉందని ప్రిన్సిపల్ ని అడుగగా‌‌ బాగానే ఉన్నాడని చెప్తాడు‌. ఒకసారి విశ్వనాథ్ గారితో కాల్ మాట్లాడి అడిగి తెలుసుకుందామని జగతి, మహేంద్ర అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మురారి ప్రేమిస్తున్న విషయం కృష్ణకి నందు చెప్పగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -234లో.. కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ని తనకిచ్చేసి వెళ్ళిపోతాడు మురారి. దాంతో కృష్ణ ఎమోషనల్ అవుతుంది. గతాన్ని తల్చుకుంటూ ఏడుస్తుంటుంది కృష్ణ. మరొకవైపు ముకుంద తన గదిలో ఒంటరిగా ఉంటుంది. కృష్ణ వెళ్లిపోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో మురారి నా సొంతం అవుతాడని, దేవుడికి థాంక్స్ చెప్పుకుంటుంది ముకుంద.  ఆ తర్వాత ముకుంద దగ్గరికి అలేఖ్య వస్తుంది. రా అలేఖ్య.. నువ్వు వస్తావని నాకు తెలుసని ముకుంద అనగానే.. నీకెలా తెలుసని అలేఖ్య అంటుంది. ఈ ఇంట్లో ఏది జరిగినా ముందు నీకే కదా తెలిసేదని ముకుంద అంటుంది. ఇప్పుడేం జరిగిందని అలేఖ్య అడిగేసరికి.. నా లవ్ సక్సెస్ కాదన్నావ్ కదా? నీకన్నీ తెలుసంటావ్ కానీ సగం సగమే తెలుసని ముకుంద అనగానే.‌. హా ఇప్పుడేం జరిగిందో తొందరగా చెప్పు అసలే సస్పెన్స్ నేను భరించలేనని అలేఖ్య అంటుంది. కృష్ణ క్యాంప్ కి వెళ్తుంది మళ్ళీ తిరిగి రాదని ముకుంద అనగానే.. హా అర్థమైంది క్యాంప్ నుండి ఇంటికి రాకుండా అటునుండి అటే వాళ్ళింటికి వెళ్ళేలా భలే ప్లాన్ చేశావ్ ముకుంద అని అలేఖ్య అనగానే.. నేను ప్లాన్ చేయడమేంటి? నా ప్రేమని దక్కించుకోవాలనుకుంటాను కానీ కృష్ణని బయటకు పంపించాలని నా ఉద్దేశం కాదని ముకుంద అనగానే.. హా తెలుసులే ఇదే విషయం చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా అని అలేఖ్య మనసులో అనుకొని.. నీ ప్రేమ గొప్పది ముకుంద.. నువ్వు అనుకున్నది సాధిస్తావని ముకుందతో అలేఖ్య అంటుంది. మరొకవైపు మురారి, కృష్ణల గురించి నందు ఆలోచిస్తుంటుంది. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావని గౌతమ్ అడుగగా.. కొన్నరోజుల్లో మురారి, కృష్ణ శాశ్వతంగా విడిపోతున్నారని నందు చెప్తుంది. అసలు భార్యాభర్తలు విడిపోవడమేంటని గౌతమ్ అడుగగా.. వాళ్ళు నిజమైన భార్యాభర్తలు కాదని, వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని జరిగిందంతా గౌతమ్ కి చెప్తుంది నందు. ఆ తర్వాత నా ప్లేస్ లో నువ్వుంటే ఏం చేసేవాడివని గౌతమ్ ని నందు అడుగగా.. ఇద్దరిని కలపడానికి మురారికి నువ్వు ఇచ్చిన ఒట్టుని తీసి గట్టుమీద పెట్టేయమని అంటాడు. ఇద్దరిని కలపడానికి ఒట్టు తీస్తే ప్రాబ్లమ్ లేదని గౌతమ్ చెప్తాడు. కృష్ణ క్యాంప్ కి వెళ్ళేలోపు కృష్ణని మురారి ప్రేమిస్తున్నాడనే నిజం తనకి తెలియాలని గౌతమ్ తో నందు అంటుంది. మరొకవైపు కృష్ణ గురించి మురారి ఆలోచిస్తుంటాడు. అప్పుడే గదిలోకి కృష్ణ వస్తుంది. హాయ్ కృష్ణ అని మురారి అనగానే.. మీరు హాయ్ చెప్తుంటే శాశ్వతంగా నాకు బై చెప్తున్నట్టుగా అనిపిస్తుందని కృష్ణ అంటుంది. అదేం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత చీర మార్చుకోవాలని చెప్పి మురారిని బయటకు వెళ్ళమని కృష్ణ చెప్తుంది. అలా చెప్పిన తర్వాత కృష్ణ తను తీసుకున్న ఫ్లూట్ ని గిఫ్ట్ గా చేసి కబోడ్ లో మురారి కోసం దాస్తుంది. కాసేపటికి లోపలికి వచ్చిన మురారి.. ఏంటి కృష్ణ చీర మార్చుకుంటానని అంది. మార్చుకోలేదని అనుకుంటాడు. ఎక్కువగా ఆలోచించకండి ఏసీపీ సర్ తర్వాత అన్నీ అర్థమవుతాయని కృష్ణ చెప్తుంది. మరుసటి రోజు కృష్ణ తన బ్యాగ్ సర్దుకుంటూ బాధపడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కట్ చేయకు.. ఓపెన్ చేయి అన్న ధన్ రాజ్...ఫ్లూట్ జింక ముందు ఊదు అన్న ఆలీ

"ఆలీతో అల్ ఇన్ వన్" ప్రొగ్రాం ప్రతీ వారంలాగే ఆడియన్స్ అలరించడానికి ఈ వారం కూడా రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే అన్నట్టుంది.  ఈ వారం షో గెస్ట్ లు ఎవరు అంటే...ధనాధన్  ధనరాజ్ , భాను శ్రీ , బలగం మూవీ డైరెక్టర్ వేణు వచ్చారు. మొదట ఎంట్రీ ఇచ్చిన గెస్ట్ ధనరాజ్.. ఆలీ  కలిసి డాన్స్ చేసి  ఒక ఊపు ఊపేసారు. "ధనరాజ్ ని ఏంటి ..చేతులు కట్టుకున్నావ్ బుద్ధిమంతుడిలాగ " అని అలీ అడిగేసరికి " మిమల్ని చూసి పెద్దల దగ్గర ఎలా ఉండాలో నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళం మేం కాబట్టి" అని అన్నాడు ధన్ రాజ్. ఆ మాటకు ఆలీ బాగా నవ్వేసాడు. నెక్స్ట్ గెస్ట్ గా భానుశ్రీ వచ్చింది. ఎంట్రీలోనే డాన్స్ అదరకొట్టేసింది. "ఇది కదా అమ్మాయి" అని అలీ అనేసరికి "ధన్ రాజ్ నా గురించి ఏమన్నా అన్నారేమిటి వచ్చేముందు" అని అడిగింది భానుశ్రీ దానికి ధన్ రాజ్  " కాసేపు మాట్లాడాక మీకు అర్ధమవుతుంది" అన్నాడు. ఆ తరువాత వేణు మంచి జోష్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఇప్పటికి 107 అవార్డ్స్  ఇక ఎన్ని కొట్టుకుంటావ్ అయ్యా" అని నవ్వుతూ ఆలి అడిగాడు. దానికి వేణు " తెలియడం లేదన్న అలా వెళ్ళిపోతా ఉంది"  అని నవ్వుతూ చెప్పాడు.  ఆ మాటకి అందరూ నవ్వేశారు. తర్వాత ఆలీ "ఒక మంచి కథ నాకు 2 నిముషాల్లో చెప్పాలి" అనేసరికి "వాడు బాగా చెప్తాడు..వాడు వాళ్ళ ఆవిడకి రోజు 12 కథలు చెప్తాడు సర్ " అని ధన్ రాజ్ వైపు చెయ్యి చూపించాడు వేణు. ఆ మాటకు ధన్ రాజ్ రెస్పాండ్ అయ్యాడు. " బలగం డైరెక్టర్ ధనరాజ్ కి ఒక కథ చెప్పాడు.. వాడు దాని రిజెక్ట్ చేసాడు" అని అన్నాడు. ఇక  భానుశ్రీ దసరా మూవీలో ఒక మంచి మాస్ సాంగ్ కి స్టెప్పులేసి  ఆడియెన్సు ని ఎంటర్టైన్ చేసింది. భానుశ్రీ ఒక స్టోరీ చెప్తూ "సర్ కట్ చేస్తే" అని అనేసరికి ధన్ రాజ్ ఎంట్రీ ఇచ్చి " కట్ చేయకు.. ఓపెన్ చేయి" అని కౌంటర్ వేసాడు. ఆలీ వచ్చిన గెస్టులతో గేమ్స్ ఆడించాడు. "మ్యూజిక్ అంటే ఇష్టమా" అని ఆలీ వేణుని  అడగడంతో "ఫ్లూట్ అంటే ఇష్టం" అన్నాడు "ఫ్లూట్ జింక ముందు ఊదు" అంటూ ఆలీ  బాలకృష్ణ రేంజ్ లో డైలాగ్ చెప్పాడు. ఇక ప్రోమో చివర్లో "మేమే ఇండియన్స్" అనే సాంగ్ కి  డాన్స్ చేసి అందరిని బాగా అలరించారు. ప్రోమోనే ఇంత అదిరిపోతే ఎపిసోడ్ మొత్తం దద్దరిలిపోతుంది.

నా మొదటి మెమోరెబుల్ ట్రిప్ టూ ఇటలీ!

దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.  అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. తాజాగా వచ్చిన  'భోలా శంకర్' మూవీలో నటించింది.. ఈ సొట్ట బుగ్గల సుందరి. అయితే దివి కొంతకాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో  హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తోంది. అలా తను ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది  ఇటీవల జీ-5లో విడుదలైన 'ఏటీఎమ్' వెబ్ సిరీస్ లో నటించింది దివి. అందాల ఆరబోతలో దివి తర్వాతే మరొకరని చెప్పొచ్చు.‌ ఎందుకంటే ఎప్పుడు చూసినా బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ అమ్మడు. దివి తాజాగా ఇటలీ వెళ్లిందట.. అది తన మెమోరెబుల్ మూమెంట్ అంట. దివి విదేశాలకి వెళ్ళటం కొత్తేమీ కాదు.. ఎప్పుడు ఏదో ఒక టూర్ అంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. ' నా మొదటి మొమొరెబుల్ ట్రిప్ టూ ఇటలీ' అని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దివి. కాగా ఇప్పుడు ఈ వీడియోకి అటు పాజిటివ్ కామెంట్స్, ఇటు నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో దివి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.

తన భార్య సీమంతాన్ని గ్రాంఢ్ గా చేసిన ముక్కు అవినాష్!

  జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు‌. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.‌. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. 'మా కొత్త ఇల్లు', 'అమెరికాలో మా అల్లరి', 'ఈసారి భోనాలకి అనూజ రాలేదు ఎందుకంటే', 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అనే వ్లాగ్స్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందాయి.  ముక్కు అవినాష్ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. దాంతో అతనికి మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. దాంతో అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ముక్కు అవినాష్, అతని భార్య కలిసి 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అని చేసిన వ్లాగ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.  ఈ మధ్య అవినాష్ కొత్త కార్ కొన్న విషయం తెలిసిందే. అయితే అవినాష్ తండ్రి కాబోతున్న విషయాన్ని తన ఫ్యాన్స్ కి షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం 'ప్రెగ్నెన్సి టైమ్ లో ఎలాంటి ఫుడ్ తినాలి' అంటూ ఒక వ్లాగ్ ని తన ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా ' సీమంతం వేడుక షురూ' అంటూ మరొక వీడియోని తన ఛానెల్ లో అప్లోడ్ చేశాడు అవినాష్. తన భార్యకి సీమంతం చేస్తునట్లు చెప్తూ.. ఇంట్లో అందరితో కలిసి ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు అవినాష్. నిజామాబాద్ నుండి  బ్యూటిషియన్ వచ్చి తన భార్య అనూజకి మేకప్ వేసారని, తన మ్యారేజ్ కి తీసిన ఫోటోగ్రాఫర్స్ ని పిలిపించి ఫోటోగ్రఫీ చేపించాడు అవినాష్. ఇలా అన్నింటిని చాలా గ్రాండ్ గా చేసిన అవినాష్.. అందరికి థాంక్స్ చెప్పాడు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

మురారి తన గిఫ్ట్ తనకిచ్చేయడంతో ఎమోషనల్ అయిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -233 లో.. రేవతి డల్ గా కూర్చొని కృష్ణ, మురారిల గురించి ఆలోచిస్తుంటుంది. నేను కూడా అక్కకి అగ్రిమెంట్ విషయం చెప్పకుండా మోసం చేస్తున్నానా అని రేవతి అనుకుంటుంది. అప్పుడే భవాని రేవతిని పిలుస్తుంది. ఏంటి అలా ఉన్నావని భవాని అడుగుతుంది. మనం కూడా ఇవన్ని దాటుకొని వచ్చిన వాళ్ళమే కదా.. అయిన వాళ్ళకి ఈ సమస్యలు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పుకోవడానికి మంచి జ్ఞాపకాలుగా ఉంటాయని భవాని అంటుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి కృష్ణ వచ్చి.. తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ ని భవానికి చూపిస్తుంది. ఏం చూపిస్తుందని రేవతి టెన్షన్ పడుతుంది. నీకు అవార్డు రావడం సంతోషంగా అనిపించింది కానీ ఇంత త్వరగా నువ్వు నీ జాబ్ గురించి బయటకు వెళ్తావా?నీకు ఇష్టం అయితేనే వెళ్ళమని భవాని అంటుంది. ఏమైందని రేవతి అడుగుతుంది. మన దగ్గర విలేజ్ లో విషజ్వరాలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయంట.. అందుకే కృష్ణ వాళ్ళంతా వెళ్ళి అక్కడి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు. నీకు ఇష్టమైతే వెళ్ళమని భవాని అనగానే.. ఇది మళ్ళీ తిరిగి రాదేమో అని రేవతి అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ వెళ్తుంటే, ముకుంద ఆపుతుంది. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది కృష్ణ అని ముకుంద అంటుంది. ముకుంద నీకు ఒకటి చెప్పాలని కృష్ణ అంటుంది. ఏంటని ముకుంద అడుగుతుంది. గతంలో నీ లవ్ స్టోరీ ఎంత గొప్పదైన సరే, దాన్ని మర్చిపో ఎందుకంటే నీకు పెళ్లి అయింది నీకొక భర్త ఉన్నాడు. ఇప్పుడు అదంతా ఆలోచించడం కరెక్ట్ కాదని కృష్ణ అంటుంది. నీకొకటి చెప్పాలి ముకుంద.. నేను ఈ ఇంటి నుండి వెళ్లిపోతున్ననని కృష్ణ అనగానే.. నువ్వు వెళ్ళేది క్యాంపు కే కదా మళ్ళీ రానట్లు చెప్తున్నావని ముకుంద అంటుంది. అది నీకు తర్వాత అర్థమవుతుందని కృష్ణ అంటుంది. నీ ప్రేమని మర్చిపోమని ఎందుకు అన్నానంటే.. ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వు.. అత్తయ్య గారు నాకు అప్పజెప్పిన బాధ్యతలు నీకు అప్పగిస్తున్నానని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ముకుంద మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ.. కృష్ణని హగ్ చేసుకుంటుంది. మరొకవైపు కృష్ణ వెళ్లి బ్యాగ్ సర్దుతుంటుంది. బ్యాగ్ జిప్ పెట్టడం కృష్ణకి కష్టంగా ఉంటుంది. హెల్ప్ చెయ్యాలని అనిపించలేదా అని కృష్ణ అంటుంది. చెయ్యమని నీకు అడగాలని అనిపించలేదా అని మురారి అంటాడు. కృష్ణ ఫొటోస్ అన్ని తీసుకొని బ్యాగ్ లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ని మురారి తీసుకొని వచ్చి కృష్ణకి ఇస్తాడు. అది చూసిన కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

విశ్వనాథ్ కి అలా జరిగిందని ఏంజిల్ కి తోడుగా వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -839 లో.. విశ్వనాథ్ గురించి ఏంజిల్ చెప్తూ ఎమోషనల్ అవుతుంది. నువ్వు బాధపడుతుంటే సర్ కూడా భాధపడతారని ఏంజిల్ కి ధైర్యం చెప్తాడు రిషి. అప్పుడే ఏంజిల్ కి వసుధార ఫోన్ చేస్తుంది. నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడు, నేను తాతయ్యకి జ్యూస్ ఇచ్చి వస్తానని రిషికి చెప్పేసి ఏంజిల్ వెళ్తుంది. వసుధార ఫోన్ చూసి రిషి లిఫ్ట్ చేయడు. మరొక వైపు వసుధార క్లాస్ చెప్తూ.. రిషి సర్ ఈ రోజు ఎందుకు రాలేదు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా? ఏంజెల్ కూడా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదంటూ ఆలోచిస్తు బయటకు వస్తుంది. అప్పుడే రిషి ఎదురుగా వస్తాడు. ఎందుకు లేట్ అయిందని వసుధార అడిగితే చెప్పడని వసుధార అనుకుంటుంది. విశ్వనాథ్ సర్ కి అలా జరిగిందని చెప్పాలా, వసుధారా మేడమ్ నీ ఏంజిల్ కి తోడుగా ఉండమని చెప్పాలా అని రిషి అనుకుంటాడు. కానీ రిషి అవేం అనకుండా సెమిస్టర్ పేపర్ రెడీ చెయ్యండని చెప్పి వెళ్ళిపోతాడు. మరొక వైపు వసుధారకి ఏంజిల్ ఫోన్  చేస్తుంది. నువ్వు చేసావ్ కానీ లిఫ్ట్ చెయ్యలేదు. తాతయ్యకి ఇలా జరిగిందని చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారని వసుధార అడుగుతుంది. నేను వస్తానని వసుధార అనగా..  ఇప్పుడు వద్దు తాతయ్య బానే ఉన్నాడు. రిషి తో రా అని ఏంజిల్ చెప్తుంది..ఆ తర్వాత రిషి సర్ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని వసుధార అనుకుంటుంది. వసుధార చక్రపాణికి ఫోన్ చేసి విశ్వనాథ్ కి అలా జరిగిన విషయం చెప్పి, సాయంత్రం నేను ఒకసారి వెళ్లి చూసి వస్తానని వసుధార చెప్తుంది. ఆ తర్వాత రిషికి ఏంజిల్ కాల్ చేసి.. తాతయ్యని చూడడానికి వసుధార వస్తుంది.. నువ్వు వచ్చేటప్పుడు తనని తీసుకొని రమ్మని ఏంజెల్ చెప్తుంది. ఆ తర్వాత రిషి బయలుదేరి వసుధార దగ్గర కార్ ఆపుతాడు. సర్ ఎక్కమని అనకుండా, ఎక్కనని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత వసుధారని రిషి కార్ ఎక్కమని అనగా.. సరేనని వసుధార కార్ ఎక్కుతుంది. ఆ తర్వాత కార్ లో ఇద్దరు వెళ్తుంటే.. మీరు ఏంజిల్ కి కొంచెం దైర్యం చెప్పండి, బయపడుతుందని రిషి చెప్తాడు. మీరు ఇన్‌స్పెక్టర్ కి కాల్ చేశారా? రౌడీల గురించి ఏమైనా తెలిసిందా అని వసుధార అడుగుతుంది. చేశాననని రిషి చెప్తాడు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు ఇంటికి వెళ్తారు. విశ్వనాథ్ దగ్గరికి వెళ్లి ఆరోగ్యం ఎలా ఉందోనని కనుక్కుంటుంది. ఏంజిల్ ఎమోషనల్ అవుతు.. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండమని వసుధారతో ఏంజిల్ అంటుంది. సరే అని వసుధార అంటుంది.  ఈ కాఫీ తీసుకొని వెళ్లి రిషికి ఇవ్వమని ఏంజిల్ అంటుంది. వసుధార ఇబ్బందిగానే కాఫీ తీసుకొని రిషి దగ్గరికి వెళ్తుంది. మీరు ఎందుకు వచ్చారు.. కాఫీ ఇచ్చారు కదా వెళ్ళండని వసుధారతో రిషి అంటాడు. మీరు ఒకసారి మహేంద్ర సర్ కి కాల్ చెయ్యండని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కావ్య పెట్టిన ప్రెస్ మీట్ తో రచ్చ.. మళ్ళీ మొదలైంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -172 లో.... కావ్య వాళ్ళింటికి వెళ్లి పనిచెయ్యడం వల్ల మీడియా లో వచ్చి దుగ్గిరాల ఇంటి పరువుపోయిందని కావ్యని అందరు అవమానించడంతో.. పోయిన పరువు తిరిగి తెస్తానని కావ్య మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతుంది. మీడియా వాళ్ళందరికి కావ్య ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో అర్థం కాదు. ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చొని ఉండగా.. కళ్యాణ్ వచ్చి కావ్య ప్రెస్ మీట్ లో లైవ్ లో మాట్లాడేది పెడతాడు.  కావ్య ప్రెస్ వాళ్ళతో మీకు నిజానిజాలు తెలియకుండా మా ఇంటి పరువు తీసేలా రాసే అధికారం మీకు ఎవరిచ్చారని కావ్య మీడియా వాళ్ళని అడుగుతుంది. అంటే మీరు చేసింది నిజం కాదంటారా అని ప్రెస్ వాళ్ళు అడుగుతారు. నేను చేసింది నిజమే కానీ అది నా పుట్టింటి వాళ్ళ కోసం చేసింది. నాకేదో కష్టం వచ్చి నా కోసం అయితే కాదు. మీరు రాసినట్టు నన్ను నా అత్తింటి వాళ్ళు బాగా చూసుకోవడం లేదు అని రాసారు కదా అది అబద్ధం.. నన్ను దుగ్గిరాల కుటుంబం బాగా చూసుకుంటుంది. నన్ను ఎవరో బలవంతం చేస్తే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం లేదని కావ్య ప్రెస్ వాళ్ళతో చెప్పి వెళ్ళిపోతుంది..ఆ తర్వాత కావ్య ప్రెస్ వాళ్లతో మాట్లాడిన తర్వాత రుద్రాణి కావాలనే అపర్ణ దృష్టిలో కావ్యని చెడు చెయ్యాలని చూస్తుంది. వాళ్ళ పుట్టింటికి వెళ్లి పని చేస్తున్న విషయం ఒక్క మనకే తెలుసు ఇప్పుడు దీంతో అందరికి తెలిసిపోతుందటూ రుద్రాణి మాట్లాడుతుంది. కావ్య కరెక్ట్ చేసింది. పరువు పోయిందని అన్నారు కాబట్టి మీడియా వాళ్లని పిలిచి మాట్లాడి పోయిన పరువు తీసుకొచ్చిందని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా మనకు తెలియకుండా పిచ్చి పని చేస్తుంది అనుకోలేదని సుభాష్ అంటాడు. కావ్య ఆత్మగౌరవం అంటూ మన మాట వినేలా లేదు. వెళ్లి వాళ్ళ అమ్మనాన్నలతో ఈ పని చెయ్యకని చెప్పించాలని, అప్పుడే ఈ సమస్యకి పరిష్కారమని ఇందిరాదేవి అంటుంది. మరొక వైపు రాజ్ కి  కావ్య పెట్టిన ప్రెస్ మీట్ గురించి తెలుస్తుంది. కోపంగా మీటింగ్ నుండి బయటకు వస్తాడు రాజ్. అప్పుడే రాహుల్ వచ్చి రాజ్ నీ రెచ్చగొడతాడు.  ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే ఎలాగైనా తనకి నువ్వు జాబ్ ఇవ్వాలనుకుంటున్నావ్ కదా అంటూ కావ్యపై కోపం వచ్చేలా రాహుల్ మాట్లాడతాడు. మరొక వైపు కనకం ఇంటికి అపర్ణ వెళ్లి.. కావ్య మీ ఇంటికి వచ్చి పని చెయ్యడానికి మీరెలా ఒప్పుకున్నారని కనకం, కృష్ణమూర్తి లపై అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బ్రహ్మముడి సెట్ లో మానస్ బర్త్ డే సెలబ్రేషన్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్  ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉందో అందరికి తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్ ఒక్కోలా ఉంటూ ప్రతీరోజు సరికొత్తగా అందిస్తుంది ఈ సీరియల్. ఇందులో చేస్తున్న రాజ్(మానస్) బర్త్ డే జరిగింది. దాంతో 'బ్రహ్మముడి' సెట్ లో అతని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఈ విషయాన్ని కావ్య(దీపిక రంగరాజు) తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఒక వ్లాగ్ లో చెప్పింది. బ్రహ్మముడి సీరియల్ లో కావ్యని రాజ్ తన ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకుంటాడు‌. దాంతో ఇంట్లోకి వచ్చాక రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ ఇంట్లో ఒక పనిచేసే వాళ్ళలాగా ఒక స్టోర్ రూమ్ లో కొన్నిరోజులు ఉంచుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అపర్ణని రిక్వెస్ట్ చేయగా రాజ్ గదిలో పడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. దాంతో కావ్య సంతోషపడుతుంది. అయితే కావ్య తన పుట్టింటికి సాయం చేయాలనుకుంటుంది‌‌. దాంతో తనే సొంతంగా డిజైన్స్ చేసి రాజ్ కి పంపించగా అవి రాజ్ కి నచ్చుతాయి. దాంతో తనకి కొంత డబ్బులు ఇస్తాడు రాజ్. ఆ డబ్బులని కావ్య తన పుట్టింటికి తీసుకొస్తుంది. అయితే కావ్యని ఎలాగైనా ఇరికించాలని భావించిన స్వప్న అపర్ణకి వినపడేలా.. కావ్య డబ్బులు తీసుకొని పుట్టింటికి వెళ్ళిందని చెప్తుంది. అలా చెప్పడంతో కావ్యపై అపర్ణ ఫుల్ ఫైర్ అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు పోయిందని ఇంట్లో వాళ్ళంతా కావ్యని తిడుతుంటారు. దాంతో అందరికి పరువు మళ్ళీ కాపడతానని చెప్తుంది కావ్య. మరి కావ్య ఏం చేసింది. దుగ్గిరాల ఇంటి పరువు మళ్ళీ కాపాడిందా అనేది ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లలో కొనసాగుతుంది. కాగా బ్రహ్మముడి సెట్ లో మానస్ పుట్టిన రోజు వేడుకలని ఈ సీరియల్ యూనిట్ అంతా కలిసి సెలబ్రేట్ చేశారు. అయితే రాజ్(మానస్) కోసం కావ్య స్పెషల్ వంటలు చేపించినట్లు చెప్పింది. చికెన్ ఫ్రై, ఎగ్ పులుసు, పప్పు అంటూ వివరించింది. అయితే రాజ్ కోసం స్పెషల్ గా తన చేతితో చపాతి చేస్తున్నట్టు చేసి చూపించింది. ఆ తర్వాత ఒక కేక్ ని తెప్పించి, రాజ్ తో కట్ చేపించి అందరికి షేర్ చేసింది దీపిక. అలా సరదాగా గడిపిన రాజ్ పుట్టిన రోజు వేడుకని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది దీపిక రంగరాజు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

మ్యూజిక్ కచేరి... దీపికాని రూమ్‌కి రామన్న హైపర్ ఆది!

"ఢీ ప్రీమియర్ లీగ్ " ఈటీవీలో మంచి జోష్ తో దూసుకెళుతున్న డాన్స్ షో. ప్రతి బుధవారం రాత్రి 9:30 కు ప్రసారమవుతోంది. టీవీ షోస్ లోనే  నెంబర్ వన్ షోగా తెలుగు ఆడియన్స్ ని   అలరిస్తుంది. ఇక  ఇప్పుడు నెక్స్ట్ వీక్  "ఢీ ప్రీమియర్ లీగ్ " ప్రోమో రిలీజ్ అయింది. హోస్ట్ ప్రదీప్ తో పాటు శేఖర్ మాష్టర్  ,దీపికా పిల్లి , జడ్జి పూర్ణ ఎంట్రీ ఇచ్చి "నర్సాపెల్లె" సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేశారు. అలాగే "బోలా శంకర్" మూవీ డైరెక్టర్  మెహర్ రమేష్ కూడా  వచ్చారు.  హైపర్ ఆది ఎంట్రీ అంటే మాములుగా ఉండదుగా రచ్చ.  ఆది  పక్కన వున్న అతని "అరేయ్ రికార్డు చేయి"  అని అన్నాడు . అప్పుడు హైపర్ ఆది ,ప్రదీప్ నటించిన  "30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే మూవీలోని "నీలి నీలి ఆకాశం" అనే పాటను పాడాడు.. "ఎలా వచ్చిందిరా అని పక్కన కమెడియన్ ని అడిగేసరికి అలాగే వచ్చిందని చెప్పిన ఆన్సర్ తో అందరూ నవ్వేశారు. తర్వాత " కింగ్ " మూవీలో బ్రహ్మానందం చేసిన  కామెడీ బిట్ ని ఇక్కడ స్పూఫ్ గా చేసి చూపించారు  హైపర్ ఆది, దీపికా పిల్లి.  దీపికా పిల్లి ఒక సాంగ్ పాడేసరికి హైపర్ ఆది "స్టాప్ ఇట్" అని లేచి "నువ్వు ఎంచుకున్నరాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి" అనేసరికి అందరూ నవ్వేశారు. ఈ కామెడీ సీన్ అయ్యాక  కింగ్స్ ఆఫ్ కరీంనగర్ డాన్స్  చూసిన మెహెర్ రమేష్ "నేను చుసిన బెస్ట్ వైబ్రేటింగ్ పెర్ఫార్మెన్స్" అని కామెంట్ చేశారు. తరువాత హైపర్ ఆది ఒక మ్యూజిక్ కచేరి పెట్టి  కామెడీ చేసాడు. అందులో పాడిన పాట ఎలా ఉంది అని మెహర్ రమేష్ ని అడిగేసరికి "ఒరిజినల్ లానే ఉంది" అని ఆన్సర్ ఇచ్చారు మెహర్ రమేష్. ఆ మాటకు ఆది ముఖం వాడిపోయింది.  తర్వాత  వాల్తేరు వారియర్స్ వర్సెస్ హైదరాబాద్ ఉస్తాద్స్ మధ్య పోటీ గట్టిగానే జరిగింది. వాళ్ళ పెర్ఫార్మన్స్ కి అందరూ  ఫిదా అయ్యారు. ఇక హైదరాబాద్ ఉస్తాద్స్ డాన్స్ ని చూసి అక్కడున్న వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా  ఎమోషనల్ అయిపోయారు. ఇలా ఈ ప్రోమోని ఎండ్ చేశారు. మరి మెహర్ రమేష్ ఈ ఎపిసోడ్ వచ్చారు కాబట్టి ఎలాంటి కామెంట్స్ చేశారు ఆది ఎలా నవ్వించాడో తెలియాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే.

పచ్చబొట్టు వేయించుకున్న రాకేష్...ఏడ్చేసిన సుజాత

"శ్రావణ సంతోషాలు" పేరుతో ఈటీవీలో ఒక కొత్త ఈవెంట్ ఈ నెల 20 న ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన కొత్త ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్స్ గా  శ్యామల, సింగర్ సాకేత్ కొమాండూరి వ్యవహరించారు. పాత, కొత్త కలయికతో నటీనటులంతా కూడా మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో వచ్చేసారు. "మర్యాదగా చెప్తున్నా ఇక్కడ సీనియర్ దంపతులు ఉన్నారు. మా ఆవిడని చాలా జాగ్రత్తగా, అపురూపంగా చూసుకోవాలి" అని రాకింగ్ రాకేష్ అనేసరికి "అక్కడ చూడండి వాళ్ళ ఆవిడని ఎలా పట్టించుకుంటున్నాడో..మీరు కూడా పట్టించుకోండి" అని ప్రీతినిగమ్ తన భర్త నగేష్ కి చెప్పేసరికి "వాళ్ళ ఆవిడను నేను పట్టించుకుంటే బాగుండదు ప్రీతి" అని అమాయకపు ముఖంతో కౌంటర్ వేసాడు నగేష్. ఇక ఈ షోలో శ్రావణ లక్ష్మి పూజలు, ఆటలు, పాటలు, కామెడీ స్కిట్లు అదరగొట్టాయి. అలాగే ఈ షోలో జబర్దస్త్ కమెడియన్ అప్పి తన భార్యతో కలిసి వచ్చాడు.  తన భార్య ఒకప్పుడు తనను అప్పి వదిలేసి ఇండస్ట్రీకి రావడం గురించి  చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ షోలో వాళ్ళ వాళ్ళ భార్యల కాళ్లకు గోరింటాకు పెట్టారు భర్తలు. ఈ ఈవెంట్ లో  ఏక్ నాధ్, హరిణి జోడి వచ్చారు. ఏక్ నాధ్ కోసం "జలజలపాతం నీవు" సాంగ్ పాడి వినిపించింది. ఇక లాస్ట్ లో రాకేష్ తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. "జీవితంలో మంచి చెప్పేవాళ్ళు, బ్యాక్ బోన్ గా ఉంటారు కొంతమంది. అలా నా జీవితంలో సుజాత ఉంది " అని చెప్పాడు. ఇక ఆ పచ్చబొట్టు వేయించుకున్నంత సేపు ఆ బాధను భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు రాకేష్. అది  చూసి స్టేజి మీదకు వచ్చిన జోర్దార్ సుజాత ఏడ్చేసింది. "జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ వేయించుకోవడానికి అల్లకల్లోలమైపోతాడు...ఆయన నొప్పిని నేను భరించలేను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా శ్రావణ మాసం సందర్భంగా ఒక మంచి డివోషనల్, కామెడీ, ఫన్నీ ఈవెంట్ త్వరలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది.