Jayam serial : రుద్రని సూర్య కలుస్తాడా..అకాడమీలో పారుని చూసి అతను షాక్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -89 లో......రుద్ర ఎలక్షన్ లో పోటీ చెయ్యడం నాకు ఇష్టం లేదు.. మన కుటుంబం తరుపున వీరు ఎన్నికల్లో పోటీ చేస్తాడు.. ఆ విషయం పార్టీకి చెప్పండని శకుంతల అదేశిస్తుంది. తనకి ఇష్టం లేదన్నట్లు వీరు యాక్టింగ్ చేస్తాడు. మీరు అయిన అత్తయ్యకి చెప్పండి అని వీరు అంటాడు. ఇప్పుడు రుద్రకి లేని టెన్షన్ వద్దు.. ఎవరైతే ఏంటి మన కుటుంబం తరుపున ప్రజలకి మంచి జరిగితే చాలు అని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు  బాక్సింగ్ అకాడమీలో కొంతమందికి ట్రైనింగ్ ఇస్తుంది. అక్కడ ఒకతను జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తాడు. మీరు మీ అకాడమీ కోసం నన్ను పిలిచారు కానీ నాకు నా రేంజ్ కి తగ్గ ఫెసిలిటీ ఇక్కడ లేదని అక్కడి వాళ్ళపై కోప్పడుతుంది. ఆ తర్వాత గంగ రాత్రంతా నిద్ర లేచి తెల్లవారి లేచి పనిచేస్తూ కళ్ళు తిరిగినట్లు అయి కూర్చుంటుంది. అప్పుడే మక్కం ముసలివాడి వేషంలో వచ్చి గంగ మొహంపై నీళ్లు కొడతాడు. ఎవరు మీరని గంగ అడుగుతుంది. వీధిలోకి కొత్తగా వచ్చాను. ఆ తులసి చెట్టుకి రోజు నీళ్లు పోయండి.. మీ కష్టం తీరుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. గంగ తులసి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ డబ్బు ఉండటం చూసి అది తీసుకుంటుంది. హమ్మయ్య సర్ ఇచ్చిన డబ్బు గంగకు అందాయని మక్కం దూరం నుండి చూసి అనుకుంటాడు. మరొకవైపు స్నేహ రెడీ అయి రుద్ర వెళ్తుంటే తన దగ్గరికి వచ్చి నన్ను దార్లో ఉన్న అకాడమీ దగ్గర డ్రాప్ చెయ్యమని చెప్తుంది. అది వీరు విని తన మనుషులకి ఫోన్ చేసి రుద్రని ఫాలో అవ్వండి. ఒకవేళ సూర్య ని కలిస్తే సూర్య నిజం చెప్పే సిచువేషన్ ఉంటే అతన్ని చంపెయ్యాండి అని చెప్తాడు. నాకు ఫేవర్ గా ఉన్నంతవరకే ఏదైనా అని వీరు అంటాడు. తరువాయి భాగంలో స్నేహ వెళ్లే అకాడమీలో పారుని రుద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : శోభకి పొంచి ఉన్న ప్రమాదం.. ధీరజ్ కనిపెడతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -295 లో......ధీరజ్ మొదటి రోజు క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్నానని ప్రేమకి చెప్తాడు. ఈ రోజు ఎందుకో నా కన్ను అదురుతుంది. ప్లీజ్ ఈ రోజు వద్దని ప్రేమ ఆపుతుంది. అయిన వినకుండా బయల్దేరతాడు. దాంతో ప్రేమతో పాటు ఈ ఇంట్లో అందరు ఆపుతారు. అప్పుడే రామరాజు ఎంట్రీ ఇస్తాడు. ఏమైందని అడుగుతాడు. నాన్న డబ్బు సరిపోవడం లేదని క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయ్యానని చెప్తాడు. ఏ రాయి అయితే ఏంటి కొట్టుకోవడానికి నేను చెప్పినట్టు విని మిల్ కి వస్తే బాగు పెడతావని రామరాజు అనగానే ధీరజ్ వెళ్ళిపోతాడు. ఏంటి అండి ఆ మాటలు అని వేదవతి అంటుంది. వాడు బాధ్యతతో ఉంటే నాకు గర్వంగా ఉంది కానీ అలా నేను కఠినంగా లేకపోతే అలుసు అవుద్ది అందుకే ఇలా అని రామరాజు అంటాడు. ఆ తర్వాత శ్రీవల్లిని విశ్వ పిలిచి అమూల్యని బయటకు పంపించు అంటాడు. అమూల్య దగ్గరికి శ్రీవల్లి వెళ్లి.. నాకు కడుపులో మంటగా ఉంది కూల్ డ్రింక్ తీసుకొనిరా అని చెప్తుంది. దాంతో అమూల్య వెళ్తుంటే ప్రేమ ఎదురుపడుతుంది. శ్రీవల్లి వదినకి కూల్ డ్రింక్ అంట అని అమూల్య చెప్తుంది. ఏంటి అలా చూస్తున్నావ్ వదినకి ఆమాత్రం తీసుకొని రావద్దా ప్రేమ ఉంటే తీసుకొని వస్తుంది లేదంటే లేదని శ్రీవల్లి అక్కడ నుండి వెళ్తుంది. ప్రేమని చూసి విశ్వ లోపలికి వెళ్తాడు. అసలు మొన్న ధీరజ్ మా అన్నయ్యని కొట్టడానికి కారణం ఏంటని ప్రేమ అడుగుతుంది. ఈ మధ్య నాతో మాట్లడడానికి ట్రై చేస్తున్నాడని అమూల్య చెప్తుంది. మరొకవైపు క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయి క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. ఒకమ్మాయిని తన ఫ్రెండ్స్ తో వాళ్ళ నాన్న బయటకు పంపిస్తాడు. నా కూతురుని ఎప్పుడు ఎక్కడికి పంపలేదని ధీరజ్ గురించి తెలుసుకొని తనని ఫోటో దింపుకుంటాడు. ముందు జాగ్రత్త బాబు అని చెప్తాడు. ఆ తర్వాత అమ్మాయి పేరు శోభ.. తన ఫ్రెండ్స్ ఇద్దరు బాయ్స్ కొంచెం దూరం వెళ్ళాక ఎక్కుతారు. వాళ్ళు శోభ గురించి ఏదో సైగ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సుమిత్రని చూడలేక వెళ్ళిపోయిన జ్యోత్స్న.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -494 లో..... సుమిత్రకి దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. నేను తిననని అంటుంది. ఆ టిఫిన్ దీప చెయ్యలేదు నేనే చేసాననని కాంచన అంటుంది.ఆ తర్వాత సుమిత్రకి దీప టిఫిన్ తినిపిస్తుంది. దీప చాలా మురిసిపోతుంది. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. అవును అమ్మ వెళ్లడం నేను చూసానని జ్యోత్స్న చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. అమ్మ బావకి దొరికింది అందుకే అంత కూల్ గా ఉన్నాడు.. మమ్మీ కన్పించకపోతే దీప ఎలా వెతికేది.. అలాంటిది వంట చేస్తూ ఇక్కడికి క్యారియర్ పంపిస్తుందంటే అర్థం చేసుకో.. నేను ఇప్పుడు బావ ఇంటికి వెళ్తున్నానని జ్యోత్స్న వెళ్తుంది. అసలు ఇది ఏం చేస్తుందని పారిజాతం అనుకుటుంది. ఆ తర్వాత దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. మా అమ్మ ఇక్కడ ఉందని అంటుంది. లేదని దీప చెప్తుంది. అక్కడే ఉన్న శౌర్యని అడుగగా.. అమ్మమ్మ ఉందని చెప్తుంది. నాకు చూపించు అనగానే శౌర్య తనని తీసుకొని వెళ్లి అంబుజవల్లి ఫోటో దగ్గరికి వెళ్లి ఆవిడే మా అమ్మమ్మ అని చూపిస్తుంది. శౌర్య నిజం చెప్పలేదని దీప, కాంచన హ్యాపీగా ఉంటారు. జ్యోత్స్న తిరిగి వెళ్తుంటే గదిలో నుండి దగ్గినట్లు సౌండ్ వస్తుంది. దాంతో జ్యోత్స్న గదిలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ ఎవరుండరు. దాంతో జ్యోత్స్న తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీప గదిలోకి వెళ్లేసరికి సుమిత్ర కింద పడిపోయి ఉంటుంది పైకి లేపి పైన పడుకోబెడుతుంది తనని ఆ సిచువేషన్ లో చూసి కాంచన బాధపడుతుంది. మరొకవైపు సుమిత్రని తల్చుకొని దశరథ్ బాధపడతాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ తెచ్చిన పటాసులు కాల్చిన కళ్యాణ్.. కళ్ళు తిరిగిపడిపోయిన అప్పు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -857 లో..... రాజ్ కి సపోర్ట్ చేస్తానని ఇందిరాదేవి చెప్తుంది. థాంక్స్ నానమ్మ నువ్వైనా సపోర్ట్ గా ఉన్నవని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి కలిసి టాక్సిక్ కెమికల్స్ తో ఉన్న టపాసులు రెడీ చేయించి తీసుకొని వస్తారు. అవి కాలిస్తే కావ్య బిడ్డకి ప్రాబ్లమ్ అయి అబార్షన్ అవుతుందని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత స్వరాజ్ ని పిలిచి ఆ టపాసులు ఇవ్వాలని ట్రై చేస్తారు కానీ స్వరాజ్ తీసుకోడు. మా మావయ్య కొనిస్తాడంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు రాజ్ కి కనకం వాళ్ళు బట్టలు తీసుకొని వస్తారు. కావ్యకి ఇచ్చి ఇవ్వమంటారు. నేను ఇస్తే అసలు తీసుకోడు మీరు ఈ బట్టలు ఇవ్వండి నేను పాత బట్టలు ఇస్తాను నాపై కోపంతో మీరు ఇచ్చిన బట్టలు వేసుకుంటారని కావ్య అనగానే ఇందిరాదేవి, కావ్య ఇద్దరు రాజ్ దగ్గరికి వెళ్తారు కానీ ఇందిరాదేవి తీసుకొని వెళ్లిన బట్టలు రాజ్ తీసుకుంటాడు. ఆ తర్వాత నేను చెప్పాను కదా అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి స్వరాజ్ వచ్చి టపాసులు కొనివ్వమని అడుగుతాడు . అందరు రెడీ అయి వచ్చి టపాసులు పేలుస్తారు. రుద్రాణి, రాహుల్ వచ్చి వాళ్ళు తీసుకొని వచ్చిన టపాసులు రాజ్ తీసుకొని వచ్చిన దాంట్లో కలుపుతారు. అప్పుడే అప్పు, కళ్యాణ్ బయటకి వచ్చి రాహుల్, రుద్రాణి వాళ్ళు తీసుకొని వచ్చినవి తీసుకుంటారు. అప్పు అవి పేల్చి కళ్ళు తిరిగిపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బుల్లితెర నటుడు కాళిదాసు మహేష్ బాబు - సాండ్రా పెళ్లి అక్టోబర్ 31 న

  బుల్లితెర నటుడు కాళిదాసు మహేష్ బాబు సాండ్రాతో తన పెళ్లి ముహుర్తాన్ని రివీల్ చేసాడు. సమ ప్రయాణం అనే యూట్యూబ్ ఛానెల్ లో వాళ్ళు ఈ గుడ్ న్యూస్ ని చెప్పారు.  "నిజానికి మా పెళ్లి ఈపాటికి ఐపోయి ఉండాలి. శ్రావణ మాసంలో చేసుకోవాల్సి ఉంది. ఐతే ఆగష్టు లో డేట్ సెట్ అయ్యింది. కానీ అప్పుడు షూటింగ్స్ ఉన్నాయి. అలాగే పెళ్లి అంటే చాలా చేయాలి. మినిమం ఒక పది రోజులు పడుతుంది. ఐతే సాండ్రాకి  కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకుంది. శ్రావణ మాసంలో మా ఇద్దరికీ సంబంధించిన ఏదో ఒక విషయం జరగాలని సాండ్రా కోరుకుంది. అందుకే శ్రావణ మాసంలో శ్రీశైలంలో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నాం చేసుకున్నాం. అలా ఒక శుభకార్యం జరిగింది. కాబట్టి కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలి అనుకుని ముహూర్తాలు చూడమని చెప్తే ఒకే ఒక్క డేట్ వచ్చింది. మా నక్షత్రాలు, జాతకాల ప్రకారం రెండు మూడు ముహూర్తాలు పెట్టమని అడిగాం. సీరియల్ షూటింగ్స్ అవీ జరుగుతూ ఉంటాయి కదా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి అని అడిగాం.  ఐతే ఒకే ఒక్క ముహూర్తం తప్ప ఇంకేమీ లేవు కావాలంటే పెట్టుడు ముహుర్తాలు ఉంటాయి అని చెప్పారు. "చి ల సౌ. సాండ్రా సుహాసిని జయచంద్రన్ ని చిరంజీవి కాళిదాసు మహేష్ బాబు గారికి కార్తీక మాసంలో ఒక శుభ నక్షత్రంలో శుభ ముహూర్తం ఐన అక్టోబర్ 31 న ఆ పార్వతి పరమేశ్వరులు నిర్ణయించారు". ఈ డేట్ ఎందుకు స్పెషల్ అంటే ఆ రోజు నా పుట్టినరోజు...దాంతో నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే నేను పుట్టింది తనను పెళ్లి చేసుకోవడానికే అని ఆ దేవుడు రాసిపెట్టేసాడు. ఒక పుణ్య క్షేత్రంలో మా పెళ్లి జరగబోతోంది"...అంటూ కాళిదాసు మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

నా వయసు 35  అంటున్న శరత్ కుమార్

  "డ్యూడ్" మూవీ ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. దాంతో హీరో ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్ ఇద్దరూ నెక్స్ట్ వీక్ జబర్దస్త్ షోకి గెస్టులుగా రాబోతున్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. వీళ్ళు స్టేజి మీదకు రాగానే రష్మీ అడిగింది. "ఈ అల్లుడు నుంచి ఎం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో " అంటూ ప్రదీప్ ని చూపించి శరత్ కుమార్ ని అడిగింది రష్మీ. "మంచి అల్లుడు అండి. నేను ఎం చెప్తానో అది చేస్తారు. ఇప్పుడు కాదండి పిక్చర్ లో చెప్తున్నాను " అంటూ చెప్పారు శరత్ కుమార్. ఇక ప్రోమో లాస్ట్ లో ఐతే రాంప్రసాద్ శరత్ కుమార్ తో ఇలా అన్నాడు. "శరత్ కుమార్ సర్ ఈ ఏజ్ లో కూడా మీ బాడీ ఫిట్నెస్ ఉంటుంది సర్ దానికి హ్యాట్సాఫ్ సర్" అన్నాడు. వెంటనే ఆయన థ్యాంక్యూ అని చెప్పారు. "మీరు ఇప్పుడు కూడా రఫ్ గా 40 , 41 అని మీ వయసు చెప్పుకోవచ్చు సర్" అని మళ్ళీ రాంప్రసాద్ అనేసరికి దానికి శరత్ కుమార్ "లేదు 35 " అని కౌంటర్ వేసేసరికి రాంప్రసాద్ తలబాదుకున్నాడు. ఇక హీరో ప్రదీప్ రంగనాథ్ బులెట్ భాస్కర్ స్కిట్ లో వర్షకి అన్న రోల్ లో నటించి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక నెటిజన్స్ ఐతే "శరత్ కుమార్ గారు పెద్ద యాక్టర్ జబర్దస్త్ కి రావడం గ్రేట్" అంటున్నారు. ఇంకొంతమంది నెటిజన్స్ ఐతే "ప్రదీప్ రంగనాథన్ బెస్ట్ రెస్పెక్ట్, ఆయన టైమింగ్ బాగుంది" అంటూ కామెంట్ చేస్తున్నారు. "డ్రాగన్" మూవీతో హీరో ప్రదీప్ మీద ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఇక ఇప్పుడు డ్యూడ్ తో తెలుగు ఆడియన్స్ ని పలకరించాడు. తమిళ్ లో కంటే ఈ మూవీకి తెలుగులోనే మంచి కలెక్షన్స్ ని అందుకుంటోంది.

నెలకు 2 లక్షలు సంపాదించాలి...కాబోయే భర్త క్వాలిటీస్ గురించి చెప్పిన శ్రీనిధి

  శ్రీనిధి శెట్టి రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ లోకి వచ్చిన హీరోయిన్. రీసెంట్ గా తెలుసు కదా అనే మూవీలో రాశిఖన్నాతో పాటు నటించింది. ఇక ఈమె ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి ఈ వీక్ వచ్చింది. అలాగే శ్రీనిధి తనకు కాబోయే ఫ్యూచర్ హజ్బెండ్ ఎలా ఉండాలో శ్రీముఖి ఇచ్చిన టాస్క్ లో చెప్పింది. "తెలుసుకోవాలి కదా" అనే గేమ్ లో అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది. అబ్బాయికి ఏజ్ వచ్చేసరికి మొదటి ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంది కానీ తర్వాత అసలు విషయం చెప్పింది. 30  - 40 మధ్యలో ఉండాలని చెప్పింది. అలాగే ఇక అబ్బాయి హైట్ 5 ' 8 కి మించి ఉండాలని చెప్పింది. ముద్దు పెట్టడానికి నుదురు అందేలా ఉంటే చాలు అని చెప్పింది. ఇక వెయిట్ వచ్చేసరికి 70 - 80 మధ్యన ఉండి ఫిట్ గా ఉండాలని అలాగే మంచి మనసు ఉండాలని చెప్పింది. ఆస్తులు తనకు ఉన్నాయి కాబట్టి వచ్చే అబ్బాయికి ఆస్తులు అవసరం లేదు కానీ మంచి మనసు ఉండాలని చెప్పింది. ఇక అతను ఏ రంగానికి చెందకుండా నాన్-ఫేమస్ పర్సన్ అయ్యి ఉండాలని చెప్పింది. నెలకు 2 లక్షల సంపాదన ఉండడంతో పాటు ట్రావెలింగ్ చేయాలి అలాగే ఏదైనా స్పోర్ట్ లో ఇంటరెస్ట్ ఉండాలి ఇంకా ఇంట్లో ఇంట్లో ఉండి ఫుల్ ఛిల్ల్ అయ్యే పర్సన్ కావాలని చెప్పింది. ఇక అబ్బాయికి లైట్ గా గడ్డం ఉండాలని, మంచి స్మైల్ తో పాటు అందమైన కళ్ళు ఉండాలని కూడా చెప్పింది శ్రీనిధి. ఈమె మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి కేజిఎఫ్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే హిట్ 3 లో కూడా మంచి నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఈమె 2015 లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ ని విన్ అయ్యింది. 2016 లో మిస్ సుప్రనేషనల్ టైటిల్ ని సొంతం చేసుకుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో శ్రీనిధి రాసిన ప్రతీ ఆన్సర్ కి ఎగబడి మరీ ఎక్కువ చేసిన అవినాష్ కి, హరికి మాత్రం ఫుల్ కౌంటర్లు ఇచ్చి కంట్రోల్ చేసింది.

యాక్టర్ ఐనా డాక్టర్ ఐనా పర్లేదు .. కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదించాలి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "తెలుసు కదా" మూవీ నుంచి రాశి ఖన్నా, శ్రీనిధి వచ్చారు. వీళ్ళు ఈ ఎపిసోడ్ కి అదనపు ఆకర్షణగా నిలిచారు. ఐతే వీళ్లకు ఫ్యూచర్ హజ్బెండ్స్ రావాలి అనే విషయం మీద శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ పేరు "తెలుసుకోవాలి కదా" అంది. అందులో రాశి ఖన్నా తన కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పిందిలా.  "35 - 38 మధ్య వయసు ఉండాలి, 5 '9 నుంచి 6 '3 మధ్య అబ్బాయి హైట్ ఉండాలి అలాగే 85 కిలోల లోపు ఉండాలి అలాగే బాడీ ఫిట్ గా ఉండాలి" అని చెప్పింది." ఇక ఆస్తులు తనకు ఉన్నాయి కాబట్టి వచ్చే అబ్బాయికి ఆస్తులు లేకపోయినా పర్లేదు అని చెప్పింది. అలాగే యాక్టర్ ఐనా డాక్టర్ ఐనా కానీ పర్లేదని కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదించాలని కండిషన్ పెట్టింది. ఇక హాబీస్ విషయానికి వస్తే ట్రావెలింగ్ అంటే తనకు ఇష్టం కాబట్టి ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి అలాగే ట్రావెలింగ్ చేయని టైములో రీడింగ్ కూడా హాబీగా ఉండాలని చెప్పింది. ఇక తనకు కాబోయే అబ్బాయి ఫేస్ ఫీచర్స్ స్మార్ట్ గా ఉనాడాలని కళ్ళు లోతుగా ఉండాలని షార్ప్ గా ఉండాలి అని చెప్పింది. ఆయన కళ్ళు చూస్తూ నేను అలా మైమరిచిపోవాలి అలాగే నాకు బ్యూటిఫుల్ బేబీస్ కావాలి అందుకే అని చెప్పింది రాశిఖన్నా.

Bigg Boss 9 Nominations: ఏడో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో కొన్ని ట్విస్ట్ లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటగా హౌస్ లో ఉన్న ఇద్దరు కెప్టెన్స్ కి ఓ పరీక్ష పెట్టాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో బ్లూ పిల్, రెడ్ పిల్ ఉంచారు. వారిలో ఎవరు ఏ పిల్ తీసుకుంటారో డిసైడ్ చేసుకోమన్నాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి రెడ్ పిల్, గౌరవ్ బ్లూ పిల్ తీసుకుంటాడు. అయితే బ్లూ పిల్ లో సేవ్ అదర్స్ , రెడ్ పిల్ లో సేవ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఇక సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయ్యాడు. గౌరవ్ తన పవర్ ని ఎవరికి వాడాడో చూసేద్దాం. మొదటగా రీతూని అయేషా డైరెక్ట్ నామినేషన్ చేసింది. ఆ తర్వాత అయేషా, శ్రీనివాస్ సాయిని దివ్య నిఖిత నామినేషన్ చేసింది. రీతూ చౌదరి రాముని కూడా నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య కూడా గొడవ పీక్స్ లో‌ జరిగింది. రాము హౌస్ లో అసలు కనిపించడం లేదు, అతడు ఫేక్ అంటూ రీతూ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత తనూజని రమ్య మోక్ష నామినేట్ చేసింది. తనూజ సొంతంగా గేమ్ ఆడలేదు. తనూజ ఫేక్, ఆమె నటిస్తోంది. ఆమె చేసేది మొత్తం నటనే అనగా ఎవరేంటో హోస్ట్ సర్ చూపించారు.. నీలా బ్యాక్ బిచ్చింగ్ నేను చేయనంటూ తనూజ ఫైర్ అయింది. వీరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత సంజనని కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ హర్ట్ అయ్యాడు. తనూజని నామినేట్ చేస్తానంటేనే నీకు చీటి ఇచ్చాను కళ్యాణ్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. కానీ తనపై నామినేషన్ అయిపోయిందని కళ్యాణ్ అన్నాడు. ఎవరో చెప్పడం వేరు.. కళ్యాణ్ అనేవాడు చెప్పడం వేరు.. నువ్వు తనని నామినేట్ చేస్తానంటేనే నీకు చీటి ఇచ్చాను.. ఐ డిడ్ ఏ మిస్టేక్.. రేపు సంజన ఎలిమినేషన్ అవుతే నా తప్పు అవుతుంది. నీకు ఇవ్వడం నేను చేసిన తప్పు అవుతదని ఇమ్మాన్యుయల్ ఫీల్ అయ్యాడు. ఇక నామినేషన్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేసే పవర్ గౌరవ్ కి ఇచ్చాడు బిగ్ బాస్. అయేషాని సేవ్ చేస్తున్నట్లు గౌరవ్ చెప్పాడు. రీతూ చౌదరి, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్ పడాల, సంజన గల్రానీ, దివ్య నిఖిత వెలమూరు ఈ వారం నామినేషన్లో ఉన్నారు.  

Jayam serial : వీరు ఆడిన అబద్ధం.. అతడికి బలంగా మారిందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -88 లో.....సూర్య తన అన్న వీరు గురించి నిజం చెప్పబోతుంటే అప్పుడే వీరు మనుషులు వస్తారు. వాళ్ళని చూసి సూర్య అక్కడ నుండి పారిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి టిఫిన్ సెంటర్ దగ్గరికి రుద్ర వస్తాడు. గంగ టవల్ తో తనని గుర్తు పట్టకుండా కవర్ చేస్తుంది. రుద్రకి టిఫిన్ సెంటర్ ఓనర్ సూర్య మాట్లాడిన వీడియో చూపిస్తాడు.  అందులో రుద్ర నేనొక విషయం చెప్పాలని మాత్రమే ఉంటుంది. దాంతో రుద్ర అక్కడి నుండి వెళ్తాడు. ఆ తర్వాత రుద్రని సూర్య చూసి వెళ్ళబోతుంటే.. వీరు మనుషులు అక్కడే ఉన్నారని ఆగిపోతాడు. సూర్య కోసం రుద్ర వెతుకుతుంటే అప్పుడే మక్కం కనిపిస్తాడు.. మీరేంటి ఇక్కడ అని రుద్ర అడుగుతాడు‌. గంగ ఆ టిఫిన్ సెంటర్ లో వర్క్ చేస్తుందని తన ఫ్లాష్ బ్యాక్ చెప్తారు‌. అలా చెప్పగానే రుద్ర తన వంక చూస్తాడు. సరే మీరు తనని ఫాలో అవ్వండి.‌. తన సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పి రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు వీరు మనుషులు వీరుకి ఫోన్ చేసి రుద్ర తప్పించుకున్నాడని చెప్తాడు. అంతేకాకుండా రుద్రని కలవడానికి సూర్య ట్రై చేస్తున్నాడని చెప్తారు. దాంతో నో రుద్రని వాడు కలవడానికి వీల్లేదని వీరు అంటాడు. అప్పుడే ఇంట్లో వాళ్లంతా వస్తారు. ఏంటి రుద్రని కలవకూడదంటున్నావని పెద్దసారు అడుగుతాడు. ఇప్పుడు పొలిటికల్ మూమెంట్ కదా పార్టీ తరుపున రుద్ర బావగారిని పోటీ చెయ్యమంటున్నారు.. ఎలాగా బాను బావ పాలిటిక్స్ ద్వారా ప్రజలకి సేవ చెయ్యాలని కోరిక కదా అని వీరు కవర్ చేస్తాడు. నా బాను కోరిక అదే అయితే పోటీ చేసేది రుద్ర కాదు వీరు అని శకుంతల అనగానే అందరు షాక్ అవుతారు. వీరు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సర్లే ఇప్పుడు రుద్రకి ఈ టెన్షన్ వద్దని పెద్ద సర్ లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ఆనందరావు మాటలకి కన్విన్స్ అయిన రామరాజు.. భాగ్యం కోపానికి బలి!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -294 లో.....మొన్న పార్టీలో ధీరజ్, ప్రేమ ముద్దు పెట్టుకున్నారని నర్మద చెప్పగానే ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే అని వేదవతి అంటుంది. శ్రీవల్లిని అక్కడ నుండి పంపిస్తుంది వేదవతి. ఏంటే ధీరజ్, ప్రేమ మధ్య ప్రేమ మొదలు అయిందా అని వేదవతి అడుగుతుంది. అయింది పార్టీలో ముద్దు పెట్టుకున్నారట.. వాళ్ళ ఇద్దరిని ఒకటే చేసే బాధ్యత నాది అని నర్మద అంటుంటే.. ఓసిని గవర్నమెంట్ కోడలో అని నర్మదకి ముద్దుపెడుతుంది వేదవతి. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ప్రేమ మాట్లాడకపోయేసరికి కావాలనే ఫోన్ లో మాట్లాడినట్లు నటిస్తాడు. చెప్పు బేబీ అంటూ మాట్లాడుతాడు. దాంతో ప్రేమ ఫోన్ లాక్కొని లాక్ చెప్పరా.. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. మీ అమ్మాయిలకి అందంతో పాటు అసూయ కూడా ఎక్కువేనని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు దగ్గరికి వస్తారు. ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారని రామరాజు అనగానే వాళ్ళు టెన్షన్ పడుతారు. మీరు బజ్జీలు చేసుకొని అమ్మాల్సిన అవసరమేంటి.. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయ్యొచ్చు కదా అని అంటాడు. చేస్తాం అండి నెల రోజుల్లో మంచి స్థాయికి వస్తామని ఆనందరావు అంటాడు. గుడ్ నేను ఇంకా పెట్టుబడికి డబ్బు ఇద్దామనుకున్న కానీ మీరు సొంతంగా ఎదగాలనుకుంటున్నారు కదా అని బుజ్జీమ్మ ఈ డబ్బు లోపల పెట్టు అనగానే ఆనందరావు వంక భాగ్యం కోపంగా చూస్తుంది. బయటకు వెళ్ళాక ఆనందరావు పని చెప్తుంది. ఆ తర్వాత ధీరజ్ రెడీ అయి.. ప్రేమ దగ్గరికి వస్తాడు. నేను మొదటి రోజు క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్నానని చెప్తాడు. వద్దని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : భార్య కోసం భర్త కలవరింత.. మాటిచ్చిన కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -493 లో...... సుమిత్ర స్పృహలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నానేంటని వెళ్లిపోతుంటే.. శౌర్య వచ్చి ఆపుతుంది. అమ్మమ్మ మీరు ఇక్కడే ఉండాలని అంటుంది. లేదు వెళ్ళాలని తను అంటుంది. అప్పుడే దీప వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండాలని దీప అంటుంది. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్లాలని దీప అంటుంది. అలా అయితే నా చావుతో సమానమని చెప్పాను.. అయిన సరే తీసుకొని వచ్చావ్ అంటే నీ ఉద్దేశ్యం ఏంటని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే కాంచన వస్తుంది. మీరు ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పలేదు అమ్మ అని దీప అంటుంది. నేను నమ్మనని సుమిత్ర అనగానే నిజం వదిన చెప్పలేదని కాంచన అంటుంది. నా కోసం నువ్వు ఎందుకు వెతకాలి అంటే ఒక మాట అన్నావ్ గుర్తు ఉందా అని సుమిత్ర అడుగుతుంది. అవును అన్నానని దీప అంటుంది. నువ్వు నా అమ్మవి అందుకే వెతుకుతున్నానని అంది. అలా ఎందుకు అన్నవని సుమిత్ర అడుగుతుంది. ఎందుకు అంటే మిమ్మల్ని నేను ఆలా ఫీల్ అవుతున్నానని దీప అంటుంది. మరొకవైపు సుమిత్ర గురించి దశరథ్ నిద్ర నుండి ఒక్కసారిగా ఉల్లిక్కిపడి లేస్తాడు. ఇంట్లో అందరు వస్తారు. మీరేం కంగారు పడకండి మావయ్య అత్త క్షేమంగా ఉందని కార్తీక్ చెప్తాడు. ఏ దైర్యం తో ఉండమంటావ్ రా అని శివన్నారాయణ అడుగుతాడు. నా మీద నమ్మకం ఉంచండి అని కార్తీక్ అంటాడు. మరొకవైపు సుమిత్ర కోసం దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. వద్దని అంటుంది. నేనే చేసాను వదిన అని కాంచన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi :  డాక్టర్ అలా చెప్పడంతో రాజ్ చొక్కాపట్టుకున్న కావ్య.. నిజం చెప్పేశాడుగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియస్ సోమవారం నాటి ఎపిసోడ్ -856 లో.... రాజ్ భోజనం చెయ్యకుండా నిరాహార దీక్ష చేస్తాడు. ఆయన అలా తినకుండా పడుకున్నాడు.. మీరు వెళ్ళి ఈ భోజనం ఆయనకి ఇవ్వండి అని కృష్ణమూర్తితో కావ్య అంటుంది. అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఈ గొడవలు అని కృష్ణముర్తి అడుగుతాడు. ఆ విషయం ఆయన దగ్గరికి వెళ్లి అడగండి అని కావ్య అంటుంది. రాజ్ కి కృష్ణమూర్తి భోజనం తీసుకొని వెళ్తాడు. ఎవరికి తెలియకుండా తీసుకొని వచ్చాను అల్లుడు పర్లేదు తిను అనగానే రాజ్ తింటాడు. నా కూతురు కోసం ఇంత చేస్తున్నావ్ అసలు నువు అబార్షన్ చేయించుకోమనడానికి కారణం చెప్పొచ్చు కదా అని కృష్ణమూర్తి అనగానే చెప్పలేను మావయ్య అని రాజ్ అంటాడు. రాజ్ ఆలా తనకోసం నిరాహార దీక్ష చేస్తుంటే కావ్య బాధబడుతుంది. భోజనం చేయకుండా ఉంటే కనకం వచ్చి భోజనం తినేలా చేస్తుంది. ఆ తర్వాత అపర్ణకి కనకం ఫోన్ చేసి అల్లుడు గారిని చూసి ఇది మనసు మార్చుకునేలా ఉందని కనకం చెప్పగానే అలా మారకుండా చూడమని అపర్ణ అంటుంది. రేపు దీపావళి కదా మీరు అందరు ఇక్కడికి వచ్చెయ్యండి అని కనకం అనగానే అపర్ణ సరే అంటుంది. అదంతా రుద్రాణి విని మనం కూడా వెళ్ళాలని రాహుల్ తో చెప్తుంది. మరుసటి రోజు రాజ్ లేచేసరికి దుగ్గిరాల కుటుంబం మొత్తం తన ముందు ఉంటుంది. స్వరాజ్ వెళ్లి రాజ్ తో మాట్లాడుతాడు. తరువాయి భాగంలో అప్పు స్పృహ తప్పి పడిపోతే డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది. ఎందుకు టాక్సిక్ గల క్రాకర్స్ కాల్చారని డాక్టర్ అంటుంది. రాజ్ నువ్వే కదా కావ్య కోసం అలా చేసావని రుద్రాణి అంటుంది. ఎందుకు నా బిడ్డని చంపాలనుకుంటున్నారని రాజ్ చొక్కా పట్టుకొని కావ్య నీలదీస్తుంటే ఎందుకు అంటే నువ్వు చస్తావ్ కాబట్టి అని రాజ్ నిజం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Nominations:  అయేషాని నామినేట్ చేసిన దివ్య.. రీతు రివేంజ్ నామినేషన్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ అవ్వగా ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ సారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని కూడా నామినేషన్లో ఉంచేలా బిగ్ బాస్ పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చేశారు. ఆ ఇద్దరు ఎవరో.. ఆ వివరాలేంటో ఓసారి చూసేద్దాం. బిగ్ బాస్ మొదటగా ఇమ్మాన్యుయల్, అయేషాలకు ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్ లో వందలకొద్దీ బెలూన్స్ ఉంచారు. వాటిని పగలగొడితే కొన్ని చీటీలు బయటపడతాయి. అవి నామినేషన్స్ కి సంబంధించిన చీటీలు. వాటిని ఇమ్మాన్యుయల్, అయేషా తము కోరుకున్న వారికి ఇవ్వొచ్చు. ఆ విధంగా చీటీలు పొందిన వారు వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అందులో ఒక డైరెక్ట్ నామినేషన్ ఉంటుంది.  అయేషా డైరెక్ట్ నామినేషన్ చీటీని తనవద్దే ఉంచుకుంది. దీనితో అయేషా ముందుగా రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది. దీనికి అయేషా చెప్పిన రీజన్ వ్యాలిడ్ అనిపించింది. రీతూ చేసే ఓవరాక్షన్ నాకు నచ్చట్లేదు.  రీతూ బిగ్ బాస్ కి వచ్చింది లవ్ ట్రాక్ నడపడానికి మాత్రమే. కెమెరాలో కనిపించడానికి అది చాలా సులభమైన మార్గం. ఎంతసేపు లవ్ ట్రాక్ లు నడుపుకుంటూ టైమ్ గడుపుతోంది. గేమ్ అసలు ఆడట్లేదంటూ అయేషా వ్యాలిడ్ రీజన్లు చెప్తూ నామినేషన్ చేయగా రీతూ కూడా చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంది.  కాసేపటికి రీతూ కూడా తిరిగి అయేషాని నామినేట్ చేసింది.  ఈసారి వీరిద్దరు నువ్వా నేనా అన్నట్టుగా గొడవపడ్డారు. మొత్తంగా రీతూ చౌదరి డైరెక్ట్ గా నామినేట్ అయింది. ఆ తర్వాత అయేషా, సాయి శ్రీనివాస్ లని దివ్య నామినేట్ చేసింది. ఎవరి బలమేంటో.. ఎవరి బలహీనత ఏంటో మీకు తెలియదు.. ఫస్ట్ అవతలి వారి గురించి తెలుసుకొని మీరు మాట్లాడండి.. హైపర్ అవుతున్నారు.. అది తగ్గించుకోండి అని అయేషాని దివ్య అనడంతో తను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత శ్రీనివాస్ సాయిని దివ్య నామినేట్ చేసి.. మీరు మానిప్యులేటర్.. మీ గేమ్ మీరు ఆడండి.. వాళ్ళవి వీళ్ళకి.. వీళ్ళవి వాళ్లకి చాడీలుగా చెప్పకండి అని శ్రీనివాస్ సాయిని దివ్య అనడంతో.. తనని తాను డిఫెండ్ చేసుకునే క్రమంలో ఈ హౌస్ లో ఫ్యామిలీని మెయిన్ టైన్ చేసింది నువ్వేనంటూ దివ్యని అన్నాడు. భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యాడంటూ శ్రీనివాస్ సాయి అనగానే దివ్య షాక్ అయింది. ఇక తనని తాను డిఫెండ్ చేసుకొని శ్రీనివాస్ సాయిని నామినేట్ చేసింది. అయితే వీరిద్దరిలో దివ్య వ్యాలిడ్ రీజన్లతో నామినేట్ చేసింది. 

 నామినేషన్ లో వైల్డ్ ఫైర్ చూపించిన అయేషా.. రీతుకి మైండ్ బ్లాక్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం భరణి ఎలిమినేట్ అయ్యాడు.‌ హౌస్ లో దివ్య, తనూజ అయితే ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళే అయిపోయాయి. ఇక హౌస్ లో ఏడో వారం నామినేషన్ లో ఎవరుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రతివారంలా కాకుండా.. ఈవారం నామినేషన్స్‌ హక్కుని పోరాడి గెలవాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో మొదటగా ఇమ్మాన్యుయల్, అయేషాలు ఈ నామినేషన్స్ హక్కుని పొందడం కోసం పోటీపడ్డారు. ఇందులో అయేషాకి డైరెక్ట్ నామినేషన్ కార్డ్ లభించింది. దాంతో తగిన కారణం చెప్పి.. వాళ్ల మొహంపై నురుగను పూసి నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో తన పవర్‌ని ఉపయోగించి రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది అయేషా. తను నామినేషన్‌కి రీజన్ చెప్తుంటే.. ఒక్కనిమిషం అని చెప్పి తన మొహంపై ఉన్న నురుగను తుడుచుకుంటుంది రీతు. తనని ఒక్క నిమిషం అని చెప్పడంతో.. నీకోసం అందరు వెయిట్ చేయాలా అని అయేషా అంది. మొహంపై ఉన్న నురుగను తీస్తేనే కదా మాట్లాడేదంటూ రీతు యాటిట్యూడ్‌తోనే సమాధానం చెప్పింది. నువ్వు నీ ఓవరాక్షన్ నాకు ఈ ఇంట్లో అస్సలు నచ్చలేదు.. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసమని అయేషా అంది. నీకు చెప్పానా.. నేను లవ్ చేస్తున్నానని.. లవ్ చేస్తూ తిరుగుతున్నానని నీకు చెప్పానా అంటూ రీతు అంది.  నేను డైరెక్ట్‌గా రీతూని నామినేట్ చేస్తున్నానంటూ అయేషా అంది. ఈ నామినేషన్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని రీతూని బిగ్ బాస్ అడుగగా.. నాకు ఆ అమ్మాయి ఏం చెప్పినా వినాలని లేదని, నాకు అనిపించింది నేను చెప్తా.. నాకు అనిపించింది నేను అనేస్తానని అయేషా అంది. నీకు అనిపిస్తే అనేస్తావ్.. అన్నంతమాత్రానా అదే కరెక్ట్ కాదని రీతూ అంటుంది. ఏయ్ ఎందుకే నీకు అంత యాటిట్యూడ్ అని అయేషా ఫైర్ అయ్యింది. నీకు ఎంత యాటిట్యూడ్ ఉంటే.. నాకు అంతే ఉంటుందంటూ రీతు ఫైర్ అయింది. నువ్వు నాకు నచ్చలేదు.. నీ గేమ్ స్ట్రాటజీ నచ్చలేదంటూ అయేషా ఫుల్ ఫైర్ అయింది.

బజ్ ఇంటర్వ్యూలో భరణి చెప్పిన నిజాలివే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరోవారం భరణి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకొచ్చేసిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో భరణి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఇక వచ్చీ రాగానే భరణి చేతిలో ఒక స్వీట్ పెట్టాడు శివాజీ. ఎలా ఉంది సర్ అని అడిగితే చాలా బావుందని భరణి చెప్పాడు. మీకే ఇస్తే సరిపోదు కాబట్టి ఇది మీ అమ్మాయికి అంటూ మరో స్వీట్ ఇచ్చాడు. అది కూడా నవ్వుతూనే తీసుకున్నాడు భరణి. కానీ శివాజీ అంతటితో ఆగకుండా ఇదెవరికి చెప్పండి అంటూ మరొకటి.. ఇదెవరికి అంటూ ఇంకో స్వీట్ ఇలా ఇస్తూ పోయాడు. ఇక సర్లే అని భరణి కూర్చున్న తర్వాత కుటుంబం అన్నగారి కుటుంబం.. అంటూ శివాజీ పాడాడు. దీనికి నాకు ఎక్కడా ఈ బాండ్స్ నా గేమ్ మీద ఎఫెక్ట్ పడిందని నేను అయితే అనుకోలేదని భరణి చెప్పాడు. మీరు గేమ్ ఆడానని అనుకుంటున్నారు కానీ మీరు గేమ్ ఆడలేదు.. బాండింగ్స్‌లో స్టక్ అయిపోయారు.. ఈ కలుపుకోవటాలు ఏంటి మనకి ఎందుకు అసలు అంటూ శివాజీ అడిగాడు. నేను కలుపుకోలేదు కదండి అని భరణి అన్నాడు. ఇమ్మాన్యుయల్ నీతో అంత బాగా ఉంటాడు కదా మరి.. ఎందుక‌ని పవరస్త్ర నీకు వాడలేదని శివాజీ అడుగగా.. అది అతడి స్ట్రాటజీ అని భరణి అన్నాడు. ఎక్కడ ఏం చేస్తే తనూజమ్మ ఫీలవుద్దో.. దివ్య ఫీలవుతుందోనని కంప్లీట్‌గా ఇలాగే ఉండిపోయారండి అని శివాజీ అనగానే.. పర్టికులర్‌గా వీళ్లిద్దరి దగ్గర అయితే నేను ఆగిపోలేదని భరణి అన్నాడు. ఆగిపోకపోతే ఇవాళ భరణి బయటికి రారు.. భరిణిని అన్ని మాటలంటే బయట ఊరుకుంటాడా అని శివాజీ ప్రశ్నించాడు. నిలబడాల్సిన చోట మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగానే మాట్లాడానండి అని భరణి తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు. సంజన నామినేషన్ వచ్చినప్పుడు మీరు చాలా గట్టిగట్టిగా నేను సాక్రిఫైజ్ చేస్తే నువ్వు ఇక్కడున్నావ్.. ఎందుకలా సడెన్‌గా రియల్ భరణి బయటికొచ్చాడని శివాజీ అన్నాడు. నేను మాములుగానే చాలా షార్ట్ టెంపర్డ్.. ఊరికే సమ్మని లెగుస్తుంది నాకు కానీ హౌస్ లో చాలా తగ్గి ఉన్నానని భరణి చెప్పుకొచ్చాడు.  ఆ తర్వాత సోషల్ మీడియలో పెట్టిన ఒక ట్వీట్ ని స్క్రీన్ మీద చూపించాడు శివాజీ. ఎందుకు అసలు అంత ఓవర్‌గా.. అంత బాండ్ ఉందా వీళ్ల మధ్య.. చాలా సెంటిమెంట్ ఉందిగా సింపథీ కోసమా అని ట్వీట్ ని చదివాడు భరణి. ఎవరన్నా వచ్చి నాకు బాధ చెప్పుకునేవారు తప్ప నేను బాధ చెప్పుకోవడానికి అక్కడ మనిషి ఎవరూ లేరు.. అని భరణి చెప్పాడు. ఈ హౌస్‌లో ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అంటాను.. అంటూ శివాజీ అన్నాడు. ఇక ఒక్కొక్కరికి ఒక్కో క్రాకర్ ని డెడికేట్ చేశాడు. భూచక్రం రీతూకి, డీమాన్ కు చిచ్చుబుడ్డి, కాకరపువ్వు సంజనకి, లక్ష్మీ బాంబు ప్రియకి ఇలా ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో క్రాకర్ డెడికేట్ చేశాడు భరణి.

భరణిని ఎలిమినేట్ చేయడానికి ఇమ్మాన్యుయల్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

బిగ్ బాస్ సీజన్-9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన భరణి నిన్న ఎలిమినేట్ అయ్యాడు. అయితే దీనికి ఆడియన్స్ ఓటింగ్ కారణమని నమ్మాలనిపచలేదు. ఎందుకంటే అతడికి సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు బాగానే పడ్డాయి. అయితే హౌస్ లో ఉన్న ఇమ్మాన్యుయల్ తన స్ట్రాటజీని వాడాడు అని తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ గేమ్స్ లో భరణితో ఆడాల్సి వస్తే తను కచ్చితంగా తప్పుకోవాల్సి వస్తుందని ఇమ్మాన్యుయల్ తన పవరస్త్రాని రాము కోసం వాడాడు. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. నిన్నటి ఎపిసోడ్‌లో సెలెబ్రిటీస్ తో మాటలు,  హైపర్ ఆది పంచ్ లు  , సింగర్ స్పూఫ్ పాటలు, అలాగేడ డ్యాన్స్ పర్ఫామెన్స్ లు జరిగాయి. వాటి తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ఇది మొదలయ్యే ముందు ఒక విషయం అడగాలని నాగార్జున అన్నాడు. ఈ హౌస్‌లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది. ఇమ్మాన్యుయల్ దగ్గర ఉన్న ఆ పవరస్త్రాకి మూడు పవర్స్ ఉన్నాయి. అది ఈ వీక్ యూజ్ చేయొచ్చు.. రెండోసారి మరికొన్ని వారాల తర్వాత వాడొచ్చు.. మూడోసారి.. ఇంకొన్ని వారాల తర్వాత వాడాలి.. ఇక ఈ వారం ఆ పవరాస్త్రకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్.. ఇప్పుడు సేవ్ చేస్తే మళ్లీ సేవ్ చేసే పవర్ ఇక ఉండదని నాగార్జున చెప్పాడు.  ఇమ్మాన్యుయల్ ఈ వారం ఆ పవర్‌ని ఎవరికైనా యూజ్ చేస్తావా అంటూ నాగార్జున అడుగగా.. నేను పవరస్త్ర వాడదామనుకుంటున్నా సర్ అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఈ ఆరు వారాల గేమ్స్ చూసుకుంటే రాము స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నాడు సర్.. కానీ ఫస్ట్ 2 వీక్స్ కనిపించిన భరణి అన్న మళ్లీ కనిపించలేదు.. ఎక్కడో బాండ్స్‌లో ఇరుక్కుపోయినట్లు అనిపించింది.. కనుక నేను రాము కోసం ఇది ఉపయోగిస్తున్నానని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. దీంతో ఇమ్మాన్యుయల్ అతని పవరస్త్ర ఉపయోగించాడు.. కానీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్ట్‌లో ఉన్నారో చూద్దాం.. ఇమ్మూ నీ పవరాస్త్ర తీసుకొని చేతిలో పట్టుకొని ఉండమని నాగార్జున చెప్పాడు. భరణి-రాము మీ ఎదురుగా ఉన్న క్రాకర్స్‌ని వెలిగించండి.. అది వెలిగి అందులో ఉన్న కలర్ మీరు ఎలిమినేటెడ్ ఆర్ సేఫ్ అని తెలుస్తుందంటూ నాగార్జున చెప్పారు. ఇక క్రాకర్ వెలిగించగానే రాము సైడ్ ఉన్న క్రాకర్ గ్రీన్ కలర్ రాగా భరణి వెలిగించింది రెడ్ కలర్ చూపించింది. దీంతో భరణి నువ్వు ఎలిమినేట్ అయ్యావ్.. స్టేజ్ మీదకి రా అంటూ నాగార్జున పిలిచాడు. ఇమ్మాన్యుయల్ నీ దగ్గరున్న పవర్ నువ్వు వాడావ్.. సేవింగ్ పవర్.. ఇంకా నీ పవరస్త్రాకి రెండు పవర్స్ ఉన్నాయి.. అవి ఎప్పుడు వాడాలనేది బిగ్‌బాస్ చెప్తారని నాగార్జున అన్నారు. కీలక టైమ్ లో ఓ స్ట్రాంగ్ ప్లేయర్ ని తీయడానికి ఇమ్మాన్యుయల్ తన స్ట్రాటజీని వాడాడని తెలుస్తుంది. ‌మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.

బిగ్ బాస్ సీజన్-9 లో టాప్ కంటెస్టెంట్ భరణి. ఆరో వారం ఎలిమినేషన్ అయి బయటకొచ్చేశాడు. 

భరణి ఎలిమినేషన్ అయి రావడానికి రెండు కారణాలున్నాయి..‌ ఒకటి అతనికి బాండింగ్స్ ఉన్నాయి.. రెండు ధర్మరాజు తప్పు చేయడు.. కానీ చేస్తే అది కురుక్షేత్రమే అన్నట్టుగా.. ఒక బెడ్ టాస్క్ లో అతని తప్పు ఉన్నా అది చెప్పకుండా గేమ్  లో నుండి తప్పుకోకుండా ఆడాడు.. దానివల్ల అతడికి ఆడియన్స్ లో నెగెటివ్ అయ్యాడు. అప్పటిదాకా జెన్యున్ గా ఆడిన భరణి ఆ ఒక్క టాస్క్ తర్వాత ఆడియన్స్ నమ్మడం మానేశారని తెలుస్తోంది. అందుకే ఓటింగ్ లో రాము ఉన్నా కూడా ఇతను ఎలిమినేషన్ అవ్వడమనేది నిజంగా అన్ ఫెయిర్. ఆరోవారం భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ అంతా ఓ పెద్ద దిక్కుని కోల్పోయిన వారిలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సీజన్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా భరణి నిలిచాడు. అతడు రోజుకి  యాభై వేలు తీసుకున్నాడని తెలుస్తోంది. అంటే ఒక్కో వారానికి మూడు లక్షల యాభై వేలు రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న మాట. ఈ లెక్క ప్రకారం ఆయన హౌస్ లో ఉన్న ఆరు వారాలకు గానూ ఇరవై ఒక్క లక్ష అందుకున్నట్టు తెలుస్తోంది.

భరణి ఎలిమినేషన్ కాకముందే వెక్కి వెక్కి ఏడ్చేసిన తనూజ !

నాన్న కూతురు బాండింగ్ ఎంత స్వచ్చమైనదో నిరూపిస్తు బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆటస్వభావమే మారిపోయింది. నిన్నటి సండే దీపావళి ఎపిసోడ్ లో భరణి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. దీపావళి ఎపిసోడ్ లో భాగంగా ఆటలు పాటలు డ్యాన్స్ లు అన్నీ చేయించాడు నాగార్జున. దానితో పాటుగా నామినేషన్లో ఉన్నావారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక అందరిని సేవ్ చేయగా చివరగా రాము రాథోడ్, భరణి ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు. దాంతో దివ్య, తనూజ ఇద్దరు ఏడపు మొహాలు పెట్టేసారు. ఓ వైపు ఎపిసోడ్ లో గేమ్ లు జరుగుతుంటే తనూజ ఏడ్చేసింది. దాంతో తనని కన్ఫెషన్ రూమ్ కు పిలిచాడు నాగార్జున. ఏం అయింది  ఎందుకు ఏడుస్తున్నావని నాగార్జున అడిగాడు. " నేను ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇప్పటి వరకూ జరగలేదు. హౌస్ లోకి రాగానే ఎక్కువగా కనెక్ట్ అయ్యింది భరణి గారితోనే. ఆయన ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా, నాన్న లాగా కనెక్ట్ అయ్యారు. అందరు ఆయన వల్ల గేమ్ పోతుంది, ఆ బాండింగ్ వల్ల వెనక్కి వెళ్తున్నావు, ఆయన వల్ల గెలుస్తున్నావని చెప్పడంతో ఎంత ఇష్టం ఉన్నా దూరంగా ఉంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం చుట్టూ అందరు ఉన్నా హెవీగా ఉంది" అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. బంధాలు బర్డెన్ కావొద్దు. ముందుకెళ్తావా అక్కడే ఉంటావా.. అన్నది నీ ఇష్టం .  నీ ఆటతో పాటు మాట బిహేవియర్ క్యారెక్టర్ నిన్ను గెలిపిస్తుందంటూ నాగార్జున మోటివేట్ చేశాడు. తనూజ-భరణిల బాండింగ్ నిజంగా  ప్యూర్ బాండింగ్. తన ఆటకోసం దూరంగా ఉన్న తనూజ.. భరణి ఎలిమినేషన్ కాకముందే.. ఎలిమినేషన్ రౌండ్ లో రాముతో ఉన్నప్పుడే ఏడ్చేసింది. అంటే గేమ్ కోసం, హౌస్ మేట్స్ కోసం దూరంగా ఉన్నా.. భరణి బయటకు వెళ్తాడా అనే ఆలోచన రాగానే తను ఏడ్చేసింది. దీన్ని బట్టి తెలుస్తుంది వారిద్దరిది ఎంత ప్యూర్ బాండింగో.. ఈ ఎపిసోడ్ చూసిన ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు అనేంతలా తనూజ ఏడ్చేసింది.