దీపావళి పండుగకి కొడుకులకి కొత్త బట్టలు తీసుకున్న రామరాజు.. బొమ్మరిల్లు ఇదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -299 లో.....వేదవతి రెడీ అయి హాల్లోకి వచ్చి పేరుకే ముగ్గురు కోడళ్ళు కానీ ఒక్కరు కూడ  పూజకి ఏర్పాట్లు చెయ్యడం లేదని వేదవతి అంటుంది. ప్రేమ రెడీ అయి వచ్చి శ్రీవల్లి అక్క అని పిలుస్తుంది. శ్రీవల్లి రాత్రి జరిగింది గుర్తుచేసుకొని ప్రేమ ని చూసి బయపడి టేబుల్ కింద దాక్కుంటుంది. ఏంటి అక్క అక్కడ ఉన్నావని ప్రేమ అడుగుతుంది. ఏం లేదని శ్రీవల్లి కవర్ చేస్తుంది. నాకు తలనొప్పిగా ఉంది నువ్వు టీ బాగా పెడుతావ్ కదా అందుకే పెట్టమని పిలిచానని ప్రేమ అనగానే అంటే నీకు రాత్రి జరిగింది గుర్తు లేదా అని శ్రీవల్లి అడుగుతుంది. లేదు ఏం జరిగిందని ప్రేమ అడుగుతుంది. దాంతో వెంటనే శ్రీవల్లి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నర్మద, వేదవతి ఇద్దరు వచ్చి రాత్రి ఏం చేసావో తెలుసా అని జరిగింది చెప్తారు. అయ్యో అలా చేసానా నేను కూల్ డ్రింక్ తాగాను అంతే అని ప్రేమ చేప్తుంది. తిరుపతి వచ్చి కూల్ డ్రింక్ లో మందు కలిపానని చెప్తాడు. దాంతో తిరుపతిని వేదవతి తిడుతుంది. మరొకవైపు సేనాపతి డల్ గా ఉంటాడు. రేవతి వచ్చి త్వరగా రెడీ అవ్వండి.. దీపావళి సెలెబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళాలనగానే సేనాపతి కోప్పడతాడు. నా చెల్లి, నా కూతురు ఈ ఇంటిని చీకటి చేశారని సేనాపతి ఆవేశపడుతుంటే.. విశ్వ వచ్చి నెక్స్ట్ దీపావళి వరకు ప్రేమ ఈ ఇంట్లో ఉంటుందని సేనాపతికి విశ్వ చెప్తాడు. విశ్వ పక్కకి రాగానే భద్రవతి వస్తుంది. ఇక లేట్ చేయను అత్త.. అనుకున్నది చేస్తానని భద్రవతితో చెప్తాడు. ఆ తర్వాత రామరాజు ముగ్గురు కొడుకులకి బట్టలు తీసుకొని వస్తాడు. ముగ్గురు కోడళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏం చూసారు ఇప్పుడు బొమ్మరిల్లు సీన్ నడుస్తుంది. ఆ బట్టలు వాళ్ళకి నచ్చవు అయినా మీదికి యాక్టింగ్ చేస్తారు. ఎప్పుడు అవే బట్టలని ముగ్గురు కొడుకులు అనుకుంటారు. కానీ పైకి మాత్రం బాగున్నాయ్ నాన్న అని చెప్తారు. అదంతా ముగ్గురు కోడళ్ళు చూసి నవ్వుకుంటారు. ముగ్గురు కొడుకు కోడళ్ళు వరుసగా వచ్చి రామరాజు, వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పూజ దగ్గర కూర్చొని ఉంటారు. ప్రేమ జాకెట్ కి ఉన్న స్టోన్ లో ధీరజ్ షర్ట్ ఇరుక్కుంటుంది. మీ బంధం అంత త్వరగా వదలదని నర్మద అంటుంది. తరువాయి భాగంలో  రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 రుద్రపై శకుంతల ఫైర్.. పెద్దసారు కూడా ఏం చేయలేకపోయాడుగా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -93 లో......మణి పైడిరాజు ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు . నేను మీ కూతురిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. నిద్రలో ఉంది కదా వెళ్లి తాళి కడతానని మణి చెప్పగానే పైడిరాజు సరే అంటాడు. ఆ తర్వాత గంగ నిద్రపోతుంటే మణి వచ్చి తాళి కట్టాలని అనుకుంటాడు. కానీ గంగని చూసి పెళ్లి తర్వాత మొదట శోభనం చేసుకుందామని తన దగ్గరికి వెళ్తాడు.  మరొకవైపు రుద్ర ఇంట్లో ఉన్న సూర్యని చంపడానికి సైదులు వెళ్తాడు. సూర్య అనుకోని రుద్ర దగ్గరికి వెళ్లి కత్తితో పొడవబోతుంటే రుద్ర ఆపుతాడు. సైదులు అక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. మరొక వైపు గంగ దగ్గరికి మణి వెళ్లి తనని ముట్టుకోబుతుంటే తన కడుపులో ఏదో ప్రాబ్లమ్ అయి ఆగిపోతాడు. ఆ తర్వాత సైదులు వెళ్లిపోతుంటే రుద్ర పట్టుకోవాలని ట్రై చేస్తాడు. ప్రీతి పీకపైన కత్తి పెట్టి దగ్గరికి వస్తే చంపేస్తానని ఇంట్లో అందరిని బెదిరిస్తాడు. రుద్ర బావ చెప్పింది నిజమే ఇతను ఆ సూర్యని చంపడానికే వచ్చాడని వీరు అంటాడు. దాంతో రుద్ర వంక శకుంతల కోపంగా చూస్తుంది. ఆ తర్వాత తనని వదిలిపెట్టమని సైదులుకి రుద్ర వార్నింగ్ ఇస్తాడు. వీరు వెళ్లినట్టు సైదులు దగ్గరికి వెళ్లినట్టు యాక్టింగ్ చేసి చేతికి గాయం చేసుకుంటాడు. సైదులు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎవరికోసమే వీళ్ళ ప్రాణాలు తీస్తావా అని రుద్రపై శకుంతల కోప్పడుతుంది. ఇప్పుడే అతన్ని ఇక్కడ నుండి పంపించాలని శకుంతల కోప్పడుతుంది. పెద్దసారు కూడా శకుంతలకి సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బిగ్ బాస్ సీజన్-9 లో ఇక ఆ ట్రిక్ ఉండదు.. అదేంటంటే!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం పూర్తయింది. ‌ఇక ఈ ఏడో వారంలో హౌస్ లో ఎవరేం తప్పులు చేశారో చెప్తూ వారిని నాగార్జున తిడుతుంటాడు.  కంటెస్టెంట్స్ కి హోస్ట్ కి మధ్య యుద్ధం.. ఇది చూడటానికి మేమంతా సిద్ధం అన్నట్టుగా ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. అయితే నాగార్జున మంచి సాంగ్ కి డ్యాన్స్ చేసి వచ్చేశాడు. అయితే ఈ వారం ఎవరిపై అంత సీరియస్ అవ్వలేదు నాగార్జున. ఎందుకంటే అంతగా పొరపాట్లు ఏం చేయలేదు కంటెస్టెంట్స్. ఇక ప్రతీ శనివారం, ఆదివారం నాగార్జునతో పాటుగా కొంతమంది ఆడియన్స్ వస్తారు. అయితే ఈ సీజన్-9 లో ఏం జరిగిందంటే.. మొదటి వారం ఓ ఆడియన్ అమెరికా నుండి వచ్చినట్టు చెప్పగా, రెండో వారం ఆడియన్ ఒకరు లండన్ నుండి వచ్చానని చెప్పింది. అయితే తను కరెక్ట్ గా లండన్ నుండే వచ్చింది. ఎందుకంటే తనకి ఓ‌ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. లండన్ కి తను వెళ్తున్న వీడియోస్, అక్కడ తను చేసిన వ్లాగ్స్ కూడా ఉన్నాయి. తన మీద మొదట ట్రోల్స్ వచ్చినా అందరు నిజం తెలుసుకొని వదిలేశారు. అయితే గత వారం ఓ ఆడియన్ తను దుబాయ్ నుండి వచ్చానని చెప్పింది. అయితే తను ఇన్ స్టాగ్రామ్ లో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతు రీల్స్ చేస్తుంటుంది. ఇక తను బిగ్ బాస్ షోకి వచ్చింది. అందులో ఆడియన్ గా వచ్చి .. దుబాయ్ నుండి వచ్చానని చెప్పటంతో .. బిగ్ బాస్ మావపై ఫుల్ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఈ ట్రోల్స్ బిగ్ బాస్ దాకా చేరినట్టుగా ఉన్నాయి అందుకే నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో లండన్,అమెరికా, దుబాయ్,  ఆస్ట్రేలియా లాంటి  పేర్లేమీ వినబడలేదు. మరి బిగ్ బాస్ వాడిన ఈ ట్రిక్ ని మానేశాడని మీకు అర్థం అయ్యిందా.. అయితే ఏం అబ్జర్వ్ చేసారో కామెంట్ చేయండి.

రాము మనిషిలా కనపడట్లేదా.. తనూజకి నాగార్జున వార్నింగ్!

తనూజకి వార్నింగ్.. రీతూకి చివాట్లు.. సంజనకి పెద్ద క్లాస్.. ఇమ్మాన్యుయల్ ఇన్ కన్ఫ్యూషియస్.. ఇదంతా చేసింది మన నాగార్జున. అదే బిగ్ బాస్ సీజన్-9 హోస్ట్ నాగార్జున. అయితే ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంది. అయితే వాటిల్లో ప్రతీ నామినేషన్లో ఉండే తనూజ నిజస్వరూపాన్ని ఆడియన్స్ కి వీడియో వేసి మరీ చూపించాడు నాగార్జున. నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో.. తనూజని లేపి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటమ్మా అంటూ నాగార్జున అడిగాడు. దాంతో తను షాక్ అయింది. రాము రాథోడ్ నీకు మనిషిలా కనిపించడం లేదా.. మెతకగా ఉన్నాడని చులకనా అంటూ తను రాముని అవమానించిన వీడియోని ప్లే చేసి మరీ చూపించాడు నాగ్ మామ.  నిన్నటి వరకు జరుగిన దొంగల టాస్క్ లో జరిగిన ఈ ఇష్యూని పెద్ద ఇష్యూగా చూపించాడు నాగ్ మామ. అసలేం జరిగిందంటే.. వాంటెడ్ పేట టాస్క్ లో తనూజ, సాయి, రీతూ మాట్లాడుకుంటుండగా.. రాము రాథోడ్ మధ్యలో వెళ్లి కూర్చుంటాడు. తనూజ అసహనంతో అక్కడి నుంచి రీతూ, సాయిని తీసుకుని వెళ్లి రాముని అవమానపరుస్తుంది. ఇది కరెక్ట్ కాదని, మనుషులకు వాల్యూ ఇవ్వాలంటూ తనూజకి నాగార్జున చీవాట్లు పెట్టాడు.  ఆ తర్వాత తనూజ, రీతు చౌదరి ఇద్దరి అసలేం జరిగిందో నాగార్జునకి తెలియజేశారు.

హౌస్ లో‌ ఎవరికి ఏం ట్యాగ్ వచ్చిందంటే!

బిగ్‌బాస్ సీజన్-9 లో ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ క్రేజీగా సాగింది. ఇందులో నాగార్జున ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ గట్టిగా కోటింగ్ ఇచ్చేశాడు. అయితే వారి తప్పులని చెప్పేముందు హౌస్ మేట్స్ చేత ట్యాగ్‌లు వేపించాడు. ఎవరేంటో.. ఎందుకో కారణం చెప్తూ ప్రతీ కంటెస్టెంట్ ఈ ట్యాగ్ లని వేయాలంటూ కొన్ని ట్యాగ్ లు తీసుకొచ్చాడు నాగార్జున. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. ముందుగా కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కు కంగ్రాట్స్ చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత బ్యాండ్ లు ఇవ్వమన్నాడు నాగార్జున. మొదటగా రమ్య లేచి మాధురికి ఫేక్ బాండ్స్ అనే ట్యాగ్ ఇచ్చింది. తను హౌస్ లోకి వచ్చినప్పుడు బాండ్స్ వద్దు అన్నది. ఇప్పుడు తనూజాతో అవే బాండ్స్ పెట్టుకుంటోంది. అది కూడా ఫేక్ అని నాకు అనిపిస్తోందంటూ రమ్య చెప్పింది. బాండ్స్ వద్దు అనుకుంటున్న ఆమె నాతో ఎందుకు బాండ్స్ ఎందుకు కోరుకుంటోందని మాధురి ప్రశ్నించగా.. తనూజను ఇదే బాండ్ రీజన్ తో నామినేట్ చేశావు. బాండ్ అనుకుని గేమ్ లో వెనకబడుతున్నావని నాగార్జున అన్నాడు. తనూజా నీది మాధురిది ఫేక్ బాండా..  నాన్నను రాజుతో రీప్లేస్ చేశావా అని తనూజని నాగార్జున అడుగగా.. నాన్న బాండ్ అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు దగ్గర అవుతున్నారు. ఇది నా గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పాను. ఆమె లేదు నేను జెన్యూన్. నీతోనే ఉంటానని అన్నారని తనూజకి మాధురి చెప్పిందని ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత రమ్యకు తనూజా మానిప్యులేట్ ట్యాగ్ ఇచ్చింది. సాయి - రమ్య - మాధురి గొడవ మిస్ కమ్యూనికేషన్ అంటూ నాగ్ క్లియర్ చేశాడు. ఆ తర్వాత ఏం ఆడావ్ పవన్  అంటూ డీమాన్ పై ప్రశంసలు కురిపించాడు నాగార్జున. మేము చేస్తే బ్యాక్ స్టాబింగ్, మీరు చేస్తే ఆటనా అంటూ కళ్యాణ్ కి ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ ను ఇచ్చాడు డీమాన్ పవన్‌.  ఫౌల్ మౌత్డ్ ట్యాగ్ ను మధురికి ఇచ్చింది రీతు. కెప్టెన్సీ టాస్క్ లో రీతూ చేసింది వెన్నుపోటు అంటూ రీతూ మొహం మీదే చెప్పేశాడు నాగార్జున. మాధురి బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి. బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇలాంటి కఠినమైన పదాలు వాడొద్దంటూ మాధురికి నాగార్జున వార్నింగ్ ఇవ్వగా తను సారీ చెప్పింది. ఆ తర్వాత ఇన్ సెక్యూర్ ట్యాగ్ ను మాధురికి ఇచ్చింది సంజన. 

 సేఫ్ గేమ్ ఆడొద్దంటూ ఇమ్మాన్యుయల్ ని నెగెటివ్ చేసిన హోస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం ఆసక్తికరంగా సాగింది. అందులో కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తనూజల మధ్య నామినేషన్  లో జరిగిన ఇష్యూ గురించి నాగార్జున మాట్లాడాడు. మొదటగా నువ్వు మాట్లాడినప్పుడు నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని ఇమ్మాన్యుయల్ తో చెప్పావని కళ్యాణ్ ని నాగార్జున అడిగాడు. తనూజ సర్ అని కళ్యాణ్ చెప్పాడు. మరెందుకు చేయలేదని నాగార్జున అడుగగా.. అంటే అప్పటికే తనూజని రమ్య నేను అనుకున్న పాయింట్స్ తో నామినేట్ చేసింది.. అందుకే చేయలేదు .. అందులో నాదే తప్పు సర్.. నేను చెప్పిన పేరు నామినేట్ చేయలేదని కళ్యాణ్ ఒప్పుకున్నాడు. నువ్వు స్లిప్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మాట స్లిప్ అయ్యాడని ఫీలయ్యావా అని ఇమ్మాన్యుయల్ నాగార్జున అడిగాడు. అవును సర్.. అంటే అప్పటికప్పుడు పేరు ఎందుకు మార్చుకున్నాడు.. అవతలి వ్యక్తికి తను నామినేట్ చేద్దామనుకున్న విషయం తెలియకూడదని అలా చేశాడా.. అనేది నాకు అర్థం కాలేదు సర్.. అందుకే కళ్యాణ్.. తనని నామినేట్ చేద్దామనుకున్న పాయింట్ తనూజకి తెలియాలనే అక్కడ ఆపి మరీ చెప్పాను సర్.. అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. అతను చెప్పినట్లు తనూజని నామినేట్ చేయలేదని నీకు కోపం వచ్చిందా లేక సంజనని చేశాడని నీకు కోపం వచ్చిందా అని ఇమ్మాన్యుయల్ ని నాగార్జున అడిగాడు. సంజన గారిని చేశాడని నాకు కోపమేమి రాలేదు సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు.  స్లిప్ కోసం నిన్ను మోసం చేశాడు అంతేనా.. నువ్వు కళ్యాణ్‌ని సేఫ్ అంటున్నావ్.. మరి నీ దగ్గరున్న స్లిప్ కళ్యాణ్‌కి ఇచ్చే బదులు అది నీ దగ్గరే ఉంచుకొని నువ్వే నామినేట్ చేయొచ్చు కదా.. సేఫ్ ఆడావా.. అని నాగార్జున అడుగగా.. లేదు సర్ తనూజని నామినేట్ చేయాలన్నది నా లక్ష్యం కాదు సర్.. ఒకవేళ తనూజని నేను నామినేట్ చేయాలంటే నాకు సింగిల్ పాయింట్ మాత్రమే ఉంది.. అది కూడా పాయింటా లేక నేను అపార్థం చేసుకున్నానా అన్నది నాకు అర్థం కాలేదు.. అందుకే ఆ ఒక్క పాయింట్ మీద తనని నామినేట్ చేయాలని నేను అనుకోలేదు.. అందుకే తనకి ఇచ్చేశానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. అంటే నీకు నామినేట్ చేయాలని అనిపించలేదు కానీ కళ్యాణ్‌తో నామినేట్ చేయించాలని అనిపించింది అంతేనా అని నాగార్జున అడుగగా.. కళ్యాణ్‌తో నామినేట్ చేయించాలని అనుకోలేదు సర్.. ఎందుకంటే అలా అయితే రమ్య ఆల్రెడీ తనూజని నామినేట్ చేస్తానని చెప్పింది.. అందుకే వాళ్లు వాళ్లు చూసుకుంటారని వాళ్లిద్దరికి ఇచ్చేశా.. కళ్యాణ్ అనే వ్యక్తి తనూజ పేరు చెప్పగానే నేను షాకయ్యాను.. తన చుట్టూనే ఉంటాడు కదా అలాంటి వ్యక్తి ఏం చెప్తాడా అని నేను చూశాను.. అంతేకానీ తను నామినేట్ అవ్వాలి తను ఎలిమినేట్ అవ్వాలనేది నా మైండ్‌లో లేదు సర్.. అని ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ కళ్యాణ్ నీ దగ్గర స్లిప్ తీసుకునే టైమ్‌లో సంజనని నామినేట్ చేస్తానని చెప్తే ఇచ్చేవాడివా అని నాగార్జున అడిగితే.. ఇవ్వను సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. తనూజనే కాదు ఎవరిని నామినేట్ చేస్తానన్నా కళ్యాణ్‌కి స్లిప్ ఇస్తానని ఇప్పుడే చెప్పావ్ కదా అని నాగార్జున అన్నాడు. లేదు సర్ సంజన గారిని నామినేట్ చేస్తానంటే ఆలోచించేవాడ్ని అన్నాను సర్ అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఇమ్మాన్యుయల్ మాటలు విన్న తర్వాత నాగార్జున వీడియో ప్లే చేశాడు. ఇందులో కళ్యాణ్‌తో ఇమ్మాన్యుయల్ చాలా క్లియర్‌గా తనూజని నామినేట్ చేయడం గురించి మాట్లాడాడు. నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్లయిందంటూ కళ్యాణ్ తో ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఈ వీడియో చూసి తనూజ షాకైంది. ఇప్పుడు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినదానికి అక్కడ వీడియోలో ఉన్నదానికి ఏమైనా సంబంధం ఉందా ఇమ్మాన్యుయల్ అని నాగార్జున అడుగగా.. సర్ అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత వాడొచ్చి సారీ చెప్తుంటే నేను అది చెప్పాను సర్.. ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది.. సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది అన్నట్లు చెప్పాను సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. నీళ్లు పోసి పెంచడం అన్న పాయింట్ అవసరమా అని నాగార్జున అన్నాడు. అది పర్సన్ గురించి చెప్పలేదు సర్.. అన్నా నాకు నమ్మకం పోతుందని వీడు చెప్పాడు.. నా వల్ల కావట్లేదని చెప్పుకుంటూ వచ్చాడు.. నీకు నమ్మకం పోయినప్పుడు నువ్వు ఉన్నదాని మీదే ఉండాలి కదా.. ఆల్రెడీ పోయినదాన్ని నువ్వు నీళ్లు పోసుకొని పెంచుకుంటున్నావ్.. ఒకసారి నువ్వు చూడు ఈరోజు కూడా గమనించు అని చెప్పా సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. వెంటనే చచ్పిపోయిన మొక్క ఒకసారి లే అమ్మా అంటూ తనూజని పిలిచాడు నాగార్జున. ఆ వీడియో మీద నీ అభిప్రాయం ఏంటని అడిగితే.. నేను షాకవుతున్నా సర్.. నిజానికి మీరు అడిగిన ప్రశ్నే నేను ఇమ్మాన్యుయల్ ని అడిగా.. ఒకవేళ నీకు నామినేట్ చేయాలంటే నువ్వే చేయొచ్చు కదా అని అన్నా.. ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని అడిగా.. కానీ ఇంత జరిగిందని నాకు తెలీదు సర్ అని తనూజ చెప్పింది. ఇమ్మాన్యుయల్ నువ్వు గ్యారెంటీగా సేఫ్ ఆడావ్ ఇక్కడ.. నీ దగ్గరున్న పాయింట్ చిన్నదా పెద్దదా అన్న విషయం పక్కన పెట్టు.. నువ్వు స్లిప్ ఇచ్చి తనూజని నామినేట్ చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశావ్.. నువ్వు అనుకున్నది జరగకపోయేసరికి చిన్న కోపం వచ్చింది.. దీనికి తోడు సంజనని నామినేట్ చేసేసరికి బాధ వచ్చేసింది.. నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఒక్కటే.. మనం అందరినీ మెప్పించలేం.. అందరి దృష్టిలో మంచిగా ఉండలేం.. సేఫ్ మాత్రం ఆడొద్దు.. నీకు పాయింట్ ఉంటే నువ్వే చెప్పు.. వేరే వాళ్లని అస్త్రాలు చేయాల్సిన పని లేదు.. నీ దగ్గరే పవరాస్త్ర ఉందంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి తనూజ దృష్టిలో ఇమ్మాన్యుయల్ ని సేఫ్ గేమర్ ని చేశాడు నాగార్జున. ఈ ఇష్యూలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu Voting: డేంజర్ జోన్ లో రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి.. బిగ్ షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం దొంగల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో సంజన వర్సెస్ మాధురి ఆడారు. ఈ  టాస్క్ లో సుమన్ శెట్టి, తనూజ, రీతూ, దివ్య నిఖిత బాగా ఆడారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఎలిమినేషన్ ఫిక్స్. ఎందుకంటే లీస్ట్ లో వాళ్ళిద్దరే ఉన్నారు.  రీతూ చౌదరి, సాయి, రాము రాథోడ్, తనూజ, రమ్య మోక్ష, కళ్యాణ్ పడాల, సంజన, దివ్య నిఖిత ఈ ఏడుగురు ఏడవ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో డేంజర్ కంటెస్టెంట్‌గా ఉన్న రమ్య మోక్షని ఇంటికి పంపేందుకు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకే తమకి అన్ అఫీషియల్ పోలింగ్ లో ఎందులో చూసినా లీస్ట్ ఓటింగ్‌ పడుతోంది. అయితే తనూజ మాత్రం ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్‌ తో నెంబర్ వన్ లో కొనసాగుతుంది. తనూజ తర్వాత స్థానంలో కళ్యాణ్ పడాల ఇరవై శాతం ఓటింగ్ తో ఉన్నాడు. ఇక దివ్య నిఖిత పదకొండు శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంది. దివ్య హౌస్ లో పర్ ఫెక్ట్ గెస్ చేస్తోంది. వ్యాలిడ్ రీజన్లు చెప్తూ నిజాలు మాట్లాడుతూ ఫెయిర్ గా ఆడుతున్న దివ్యకి ఓటింగ్ గట్టిగానే ఉంది. ఈ వారంలో దివ్య టాప్-3లోకి వచ్చేసింది. శ్రీనివాస్ సాయికి పెద్దగా ఓటింగ్ లేదు.. అతని కంటెంట్ ఏం లేదు.. ఇంతవరకు ఏ టాస్క్ లో అతను కనపడలేదు. ఏదో నామమాత్రం హౌస్ లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఎలాగైనా రమ్య మోక్షని హౌస్ నుంచి బయటకు పంపాలనే ఉద్దేశంతో ఎవరు ఓటింగ్ వేయడం లేదు. అంటే ఈ రమ్య మోక్ష హౌస్ లో ఉండటం కంటే బయటకి పంపించాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 

Bigg Boss 9 Telugu: ఏడో వారం కొత్త కెప్టెన్ గా ఇమ్మాన్యుయల్.. పోరాడి ఓడిన తనూజ!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం హౌస్ లో ట్విస్ట్ ల‌ మీద ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. దొంగల టాస్క్ ముగిసింది. ఇక రమ్య, రాములని డబ్బు లేని కారణంగా కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి తొలగించగా.. తనూజ, రీతూలని డైరెక్ట్ కంటెండర్స్ ని చేశారు అంబటి అర్జున్, అమర్ దీప్. నిన్నటి ఎపిసోడ్ లో అయేషాకి హెల్త్ ప్రాబ్లమ్ ఉందని మెడికల్ రూమ్ కి రమ్మన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత గేమ్ కంటిన్యూ చేశాడు బిగ్ బాస్. ఇక కెప్టెన్సీ టాస్క్ ముందు మరోసారి అయేషాని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. తనకి డెంగ్యూ ఫీవర్ అని తన ఆరోగ్యం దృష్ట్యా బయటకు రావాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అందరికి బై చెప్పేసి అయేషా బయటకి వెళ్లింది. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ రేస్ ని కొనసాగించాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఓ సర్కిల్ లో క్యాప్ ఉంచాడు బిగ్ బాస్. ఎవరైతే ఆ క్యాప్ ని దక్కించుకొని అక్కడ నిల్చున్న మిగతా కంటెస్టెంట్స్ ఆ క్యాప్ ని ధరించి వారు ఎవరిని ఎలిమినేషన్  చేయాలని అనుకుంటున్నారో వారి పేరు చెప్తారు. అలా గేమ్ రూల్స్ చెప్తాడు బిగ్ బాస్. ఇక ఫస్ట్ రౌండ్ లో నిఖిల్ క్యాప్ ని దక్కించుకున్నాడు.  అ క్యాప్ ని గౌరవ్ కి పెట్టగా తను కళ్యాణ్ ని టాస్క్ నుండి ఎలిమినేషన్ చేసాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కి క్యాప్ దక్కింది. ఆ క్యాప్ తీసుకెళ్ళి సంజనకి పెట్టగా తను దివ్య పేరు చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ ని ఇమ్మాన్యుయల్ దక్కించుకొని మాధురికి ఇవ్వగా తను నిఖిల్ పేరుని చెప్పింది.‌  ఇక చివరి రౌండ్ లో రీతూ, ఇమ్మాన్యుయల్, తనూజ ఉండగా క్యాప్ ని ఇమ్మాన్యుయల్ దక్కించుకున్నాడు. దానిని మధురికి ఇవ్వగా రీతూని ఎలిమినేషన్ చేసింది. ఇక చివరగా తనూజ, ఇమ్మాన్యుయల్ ఉండగా క్యాప్ ఇమ్మాన్యుయల్ కి దక్కింది. అది సంజనకి ఇవ్వగా తనూజని తను ఎలిమినేషన్ చేసింది. దాంతో ఇమ్మాన్యుయల్ కెప్టెన్ గా గెలిచాడు. ఇక గెలిచాక కెప్టెన్సీ బ్యాండ్ ని తనూజ చేత పెట్టించుకున్నాడు. ఇక హౌస్ అంతా ఫుల్ హ్యాపీగా ఉండగా.. తనూజ కుప్పకూలింది. డాక్టర్ డాక్టర్ అంటు తనూజ అనగా.. వెంటనే గౌరవ్, సాయి శ్రీనివాస్ తో పాటు మిగిలిన హౌస్ మేట్స్ తనని మెడికల్ రూమ్ కి తీసుకెళ్ళారు. దాంతో ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఏడ్చేశారు. కాసేపటికి తనూజ హౌస్ లోకి వచ్చేసింది.

Srija Dammu Re entry in Bigg Boss 9 Telugu: శ్రీజ దమ్ము రీఎంట్రీ.. మరో కామనర్ కూడా!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం మాములుగా లేదు.. హౌస్ లో దొంగలు పడ్డారు.. వారిలో నుండి కొంతమంది కెప్టెన్సీ కంటెండర్స్ రేసులో నిలిచారు. అయితే చివరకి ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. అయితే హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఉంటుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి‌. ఆ ఎక్స్ కంటెస్టెంట్ ఎవరో కాదు అయిదో వారం ఎలిమినేషన్ అయిన శ్రీజ. తనది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని బిబి ఆడియన్స్ రచ్చ రచ్చ చేశారు. దాంతో బిగ్ బాస్ సీజన్-9 తెలుగుపై ఓ బజ్ క్రియేట్ అయింది. సో ఆ బజ్ ని మళ్ళీ తీసుకురావడానికే శ్రీజని హౌస్ లోకి రీఎంట్రీ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీజ హౌస్ లో ఉన్నప్పుడు తన మాటలతో హౌస్ మేట్స్ ని భయపెట్టేది. గేమ్ కంటే ఎక్కువగా తన వాయిస్ వినపడేది. దాంతో ఆడియన్స్ కు తన వాయిస్ పై చిరాకేసింది. దాంతో ఆమె ఎలిమినేషన్ లో ఓట్లు తక్కువగా వేశారు. దాంతో తను లీస్ట్ లో ఉంది. కానీ ఆ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో మొదటగా ఫ్లోరా సైనీని బయటకి పంపగా.. డబుల్ ఎలిమినేషన్ గా శ్రీజని ఎలిమినేషన్ చేశారు. అయితే కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఒపీనియన్స్ తో శ్రీజని ఎలిమినేషన్ చేశారు బిగ్ బాస్. దాంతో అది కంప్లీట్ గా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అయింది. శ్రీజ హౌస్ నుంచి బయటకు వచ్చేసాక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తనది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని రీఎంట్రీగా తీసుకురావాలని బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసారు ఆడియన్స్. ఈ వీకెండ్ సండే ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీజ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.  శ్రీజతో పాటు మరో కామనర్ కూడా హౌస్ లోకి రానున్నాడని తెలుస్తోంది. అతను ఎవరో కాదు మాస్క్ మ్యాన్ హరీష్. కామనర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్. తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తన ముక్కుసూటి తనంతో హౌస్ లో ఎన్నో గొడవలు పడుతూ రచ్చ చేశాడు. ఇక ఇప్పుడు మాస్క్ మ్యాన్ మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. హరీష్ ఎంట్రీతో హౌస్ లో రచ్చ డబుల్ అవవడం ఖాయమని ఆడియన్స్ భావిస్తున్నారు. హరీష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

Jayam serial : సూర్యకి పొంచి ఉన్న ప్రమాదం.. గంగ ఏం చేయనుంది!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -92 లో.. పారు తనని ఎవరు ఇబ్బంది పెట్టారని సీసీటీవీలో చూస్తుంది. అందులో గంగ మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్లి బయటకు రావడం ఉంటుంది. మాస్క్ లేకుండా పారుకి వాటర్ ఇవ్వడం ఉంటుంది. అది ఎవరని తెలుసుకోడానికి స్నేహాని పిలుస్తుంది పారు. మీ అన్నయ్యని నేను ఇబ్బంది పెట్టానని ఏవతో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది.. అది ఎవరో చూడని పారు అడుగుతుంది. గంగని స్నేహ చూసి.. దీంతో పెట్టుకుంది ఏంటి గంగ గురించి చెప్పకూడదని అనుకొని.. నాకు ఆవిడా తెలియదని స్నేహ చెప్తుంది. మరొకవైపు గంగ టిఫిన్ సెంటర్ దగ్గర వర్క్ చేస్తుంటే సైదులు తనకి మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేయాలనుకుంటాడు కానీ అప్పుడే వీరు ఫోన్ చేసి నువ్వు ముందు చంపాల్సింది గంగని కాదు నా తమ్ముడు సూర్యని అని వీరు చెప్తాడు. సూర్య ఇప్పుడు రుద్ర దగ్గర అంటే మా ఇంట్లో ఉన్నాడు.. నా గురించి మొత్తం చెప్తాడు.. దాంతో నువ్వు వాడిని చంపేయ్ అని అంటాడు. మరొకవైపు ప్రీతి, ప్రమీల, స్నేహ ముగ్గురు కలిసి రుద్ర దగ్గరికి వెళ్తారు. ప్రీతీ ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తారు. దాంతో రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత గంగ ఇంటికి వచ్చేసరికి పైడిరాజు, మణి డ్రింక్ చేస్తుంటారు. ఇంత జరిగిన వాడితో కలిసి డ్రింక్ చేస్తున్నావని గంగ వాళ్ళ నాన్నపై కోప్పడి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రీతి, స్నేహ, ప్రమీల హాల్లో కి వచ్చి ఇంట్లో అందరికి ప్రీతి ప్రెగ్నెంట్ అని చెప్తారు. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వీరు మొహంలో ఎలాంటి సంతోషం కన్పించదు. మరోవైపు పైడిరాజు, మణి మందు తాగుతుంటారు. నీ కూతురు నా అప్పు తెర్చేలా ఉంది.. నేను పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని పైడిరాజుతో మణి అంటాడు. సరే నీ ఇష్టం అని పైడిరాజు అంటాడు. నీ కూతురు ఇప్పుడు నిద్రపోతది కదా.. అప్పుడు వెళ్లి నిద్రలో తాళి కడతానని మణి చెప్పగానే పైడిరాజు సరేనని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: ఆ విషయం గురించి ధీరజ్ ని అడగేసిన ప్రేమ!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -298 లో.. తిరుపతి కూల్ డ్రింక్ లో మందు కలుపుతాడు. అది తాగి ప్రేమ మత్తులో ఉంటుంది. ఇక శ్రీవల్లిపై ఉన్న రివేంజ్ ని తీర్చుకుంటుంది. శ్రీవల్లిని ప్రేమ పిల్వగానే భయంతో తన దగ్గర కి వెళ్తుంది. ఏంటి చెల్లి అని శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు మొన్న డాన్స్ చేసావ్ కదా.. ఇప్పుడు నేను చెప్పేది నవరసాల్లో చేసి చూపించమని చెప్తుంది. దాంతో శ్రీవల్లి భయపడుతూ ప్రేమ చెప్పినట్లు చేస్తుంది. శ్రీవల్లి నీరసంతో ఇక నా వల్ల కాదు చెల్లి అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రేమ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ధీరజ్ పడుకొని ఉంటాడు. ఎంత ముద్దుగా ఉన్నావ్ రా.. నువ్వు అంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు కానీ నువ్వు ఎప్పుడు అయితే నాకు సపోర్ట్ గా ఉన్నావో అప్పుడు బాగా నచ్చావని తన చెంపలని గిల్లుతుంది. ధీరజ్ లేచేసరికి పడుకొని ఉంటుంది. ఎవరు గిల్లారని చూసేసరికి ప్రేమ పడుకొని ఉంటుంది. మళ్ళీ ధీరజ్ పడుకుంటాడు. ప్రేమ లేచి మళ్ళీ అలాగే చేస్తుంటే.. దీరజ్ లేస్తాడు. ఒరేయ్ మొన్న నువ్వు నాకు పార్టీలో ముద్దు పెట్టావా లేదా అని అడుగుతుంది. దాంతో దీరజ్ బయటకు వెళ్తాడు. ధీరజ్ వెనకాలే ప్రేమ వెళ్తుంది. డాన్స్ చేస్తూ పాట పాడుతూ తన వెనకాలే తిరుగుతుంది. వేదవతి, నర్మద బయటకు వస్తారు. ప్రేమ చూస్తుంద.  చూసి మళ్ళీ లోపలికి వెళ్లి సాగర్ బయటకు రాకుండా నర్మద, రామరాజు బయటకు రాకుండా వేదవతి కవర్ చేస్తుంటారు. ముద్దు పెట్టావా లేదా అని ప్రేమ అడుగుతుంటే లేదని ధీరజ్ చెప్పడంతో ప్రేమ డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సుమిత్ర ఆచూకీ తెలుసుకున్న శివన్నారాయణ.. టెన్షన్ లో కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -497 లో.... కార్తీక్ దగ్గరికి శివన్నారాయణ వస్తాడు. తను సుమిత్రని చూడకుండా దీప కర్టైన్ వేస్తుంది. ఎందుకు కార్తీక్ టెన్షన్ పడుతున్నావ్. సుమిత్ర దొరుకుంతుందా అని శివన్నరాయణ అడుగుతాడు. దొరుకుతుందని కార్తీక్ అనగానే.. ఎలా దొరుకుతుంది మనసు ముక్కలు అయి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది. మనకి దగ్గరున్నా రాలేదని శివన్నారాయణ అంటుంటే కార్తీక్, దీప టెన్షన్ పడుతారు. నాన్న టిఫిన్ చెయ్యండి అని కాంచన అంటుంది. నేను చేసే వచ్చాను.. మీరు టెన్షన్ పడకండి నేను వచ్చిన పని అయింది.. వెళ్తున్నానని బయల్దేరతాడు. ఆ తర్వాత తాత ఎక్కడ కన్పించడం లేదు.. తాత కూడా ఇంట్లో నుండి వెళ్లిపోయాడా అని జ్యోత్స్న అనగానే ఏం మాట్లాడుతున్నావే అని పారిజాతం కోప్పడుతుంది. అసలు నిన్ను చిన్నప్పుడు మార్చి తప్పు చేసానని పారిజాతం అంటుంటే..ఇప్పుడు సరిదిద్దుకోలేవులే అని జ్యోత్స్న అంటుంది. మళ్ళీ మారుస్తానని అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నీకు అసలైన  వారసురాలు తెలుసా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదు వెతుకుతానని పారిజాతం అంటుంది. అటు పెంచిన తల్లిపై లేదు.. సొంత తమ్ముడికి కష్టం వస్తే పట్టించుకోవు.. ఒకవేళ రేపు నాకు ఏదైనా అయితే ఇలాగే ఉంటావని పారిజాతం కోప్పడుతుంది. మరొకవైపు ఏంటి తాత మాట్లాడాలన్నావవి కార్తీక్ బయటకు వస్తాడు. నిజంగా సుమిత్ర ఎక్కడ ఉందో తెలియదా అని శివన్నారాయణ అడుగుతాడు లేదని కార్తీక్ అంటాడు. అప్పుడే శౌర్య వస్తుంది. తనకి చాక్లెట్ ఇచ్చి సుమిత్ర అక్కడే ఉన్న విషయం శివన్నారాయణ తెలుసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీపలపై కోప్పడుతాడు. ఇంత నమ్మకద్రోహం చేస్తావా అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : హాస్పిటల్ లో కావ్య.. తనకి అబార్షన్ చేయమని చెప్పిన దుగ్గిరాల కుటుంబం!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -860 లో..... కావ్య ఇంట్లో అందరికి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. నీకేం బాధగా లేదా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఎందుకు బాధ, ఇన్నిరోజులు నా భర్త ఎందుకు అలా చేస్తున్నాడో అన్న దిగులు ఉండేది కానీ ఇప్పుడు తెలిసింది కదా అని కావ్య అంటుంది. ఇప్పుడు అబార్షన్ చేసుకోమని ఇందిరాదేవి చెప్తుంది. లేదు చేసుకోనని కావ్య చెప్తుంది. నా బిడ్డ బ్రతికితే చాలు అని కావ్య వెళ్ళిపోతుంది. విన్నారుగా అందుకే ఇన్నిరోజులు ఈ విషయం తనకి చెప్పలేదు. నా భార్య పూర్తి ఆయుష్ తో నాకు కావాలని రాజ్ అంటాడు. ఆ తర్వాత సీతారామయ్య దగ్గరికి కావ్య కాఫీ తీసుకొని వెళ్తుంది. అతను కూడా కావ్యకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ కావ్య అలాగే మూర్ఖంగా ఉంటుంది. మరొకవైపు రాహుల్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఏంటి మీ భార్యకి విడాకులు ఇస్తానన్నావ్ ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది. నీకు కావలసింది విడాకులే కదా తనకి విడాకులు ఇచ్చాకే నీ దగ్గరికి వస్తానని రాహుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి భర్త వచ్చి మనకి అప్పులు చాలా ఉన్నాయని అంటాడు. కొద్దీ రోజులు వాడిని నా ట్రాప్ లో పడేసి ఆస్తులన్నీ లాక్కుంటానని అమ్మాయి తన భర్తకి చెప్తుంది. మరొకవైపు ఇంట్లో వాళ్ళందరూ కావ్యని మార్చాలని తనతో ఎవరు మాట్లాడవద్దనుకుంటారు. అప్పుడే కావ్య ప్రసాదం తీసుకొని వస్తుంది. ఎవరు తీసుకోరు.. మాట్లాడరు. కావ్య వెళ్లిపోతుంటే కళ్ళు తిరిగిపడిపోతుంది. తరువాయి భాగంలో కావ్య ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. కావ్య స్పృహ లో లేదు కదా అబార్షన్ చెయ్యండి అని ఇంట్లో వాళ్ళు డాక్టర్ కి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

TSFTVSDC మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంకను కలిసిన తెలుగు టెలివిజన్ పరిశ్రమ ప్రముఖులు

తెలుగు టెలివిజన్ పరిశ్రమ కార్మికులు ఎదుర్కుంటున్నప్రదాన సమస్యలకు, పరిష్కార దిశగా టి వి పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, కార్మికులు  తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర టి వి నాటక రంగ అభివృద్ధి సంస్థ కు చెందినా సమాచార్ భవన్ లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక IAS గారితో ఈ రోజు సాయత్రం సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సంస్థ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ కిషోర్ బాబు గారు కూడా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ వర్కర్స్, టెక్నీషియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నాగబాల సురేష్ కుమార్ గారి సారధ్యం లో జరిగిన సమావేశానికి టి వి నటి నటులు, అశోక్ కుమార్, జి.యల్  శ్రీనివాస్, లహరి, మధు ప్రియ, మాణిక్, నటి సూర్యకళ,  దర్శకులు-రచయిత సంఘం అధ్యక్షులు శ్రీ ప్రేం రాజ్, నరేంద్ర, తెలుగు తెలంగాణా సినీ టివి నటి నటుల సంఘం అధ్యక్షులు రాజ్ శేఖర్, గోపాల కృష్ణ, యం.ఎస్. ప్రసాద్, చిత్తరంజన్ దాస్, సినీ.టి.వి గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు, సత్యం యాబి మాస్టారు, అక్కినేని శ్రీధర్  లక్ష్మి, డాక్టర్ శ్రీరాందత్తి, శ్రీరామోజు లక్ష్మి నారాయణ, భాస్కర్ల వాసు, నరేందర్ రెడ్డి, ఆర్ డి ఎస్ ప్రకాష్ తది తర షుమారు 60 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత దేశం లో ప్రస్తుతం తెలుగు టి వి రంగ పరిశ్రమ ఎంతో ఉన్నత స్తాయిలో వుంది దూర దర్శన్ లో అరగంట చిత్రలహరి కార్యక్రమంతో మొదలైన ప్రస్థానం నేడు 148 శాటిలైట్ చానల్స్, 82 యు ట్యూబ్ చానల్స్, 9 ఓటిటి ప్లాట్ ఫాం తో ప్రతి రోజు 180 షూటింగ్ లతో షుమారు ప్రత్యక్షంగా 20 వేల మంది పరోక్షంగా ఒక లక్షా 26 వేల మందికి  ఉపాది కల్పిస్తుంది. అంతే కాకుండా టెలివిజన్ పరిశ్రమ ప్రజలకు  వినోదాన్నిఅందిస్తూ,  వ్యాపార పరంగా వేల కోట్ల ఆదాయం పై వచ్చే టిడిఎస్, జిఎస్టీ, వంటి పన్నుల రూపంలో  వందల కొట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చుతుంది. కాని నేడు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి టెలివిజన్ పరిశ్రమ కు ఉపాధి కాని, ఆర్ధిక సహకారం వెసులుబాటు లేని పరిస్థితి వుంది.  తెలుగు టెలివిజన్ పరిశ్రమ కార్మికులకు, సాంకేతిక నిపుణులకు టి వి నగర్ తో పాటు, ఇల్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, జీవిత భీమా, ప్రమాద భీమ కల్పించాలని, 60 ఏళ్ళు నిండిన కార్మికులకు, సాంకేతిక నిపుణులకు నెలకు పది వేల రూపాయల పెన్షన్ అందించాలని, టి ఎల్ కాంత రావు, పైడి జై రాజ్ గార్ల పేరిట ప్రతి ఏడాది అవార్డులు ఇవ్వాలని, నైపుణ్యం పెంచడానికి సెమినార్ లు వర్క్ షాప్ లు నిర్వహించాలని,సంస్థ మనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక గారికి తెలుగు టెలివిజన్ పరిశ్రమ ప్రముఖులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  సంస్థ మనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక మాట్లాడుతూ : భారత దేశం లోనే కాక, ప్రపంచ స్తాయిలోనే  చలన చిత్ర, టి వి, ఓటిటి ల నిర్మాణం రికార్డు స్తాయిలో జరుగుతున్నాయని  గుర్తు చేస్తూ...  తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో అన్ని రంగాల మాదిరిగానే టి వి రంగాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తారని, త్వరలోనే ఈ విషయాన్నీ, ముఖ్య మంత్రి గారి దృష్టికి, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులకు, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర టి వి నాటక రంగ  అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు గారి దృష్టికి తీసుకు వెళతానని, టి వి నగర్, జీవిత భీమా, ప్రమాద భీమా, మరియు పెన్షన్ వంటి సదుపాయాలు అందించడానికి కృషి చేస్తానని, కొన్ని ఆర్ధిక సంబంధమైన విషయాలను ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకు వెళతానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ సంధర్భంగా దర్శక నిర్మాత లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ రచించిన తెలివిజన్ చరిత్ర పుస్తక ఆవిష్కరణ, మరియు బుస్సా బాలరాజు నిర్వహణలో త్వరలో జరుగనున్న ఫిలిం టెలివిజన్ అవార్డుల బ్రోచర్  ఆవిష్కరణ జరిగింది.

ఐటమ్స్ సాంగ్ తో రమ్య కృష్ణ ఎంట్రీ 

జయమ్ము నిశ్చయమ్మురా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి రమ్య కృష్ణ ఎంట్రీ ఇవ్వబోతోంది. హోస్ట్ జగ్గు భాయ్ ఇంటరెస్టింగ్ ప్రశ్న అడిగారు. "మళ్ళీ చేయాలి అనుకునే సినిమా ఏది" అనేసరికి " నేను చేసిన ఐటెం నంబర్స్ అన్నీ మళ్ళి చేయాలి" అని చెప్పింది. "చిన్నదమ్మే చీకులు కావా" అంటూ సాంగ్ కూడా పాడింది. "షాట్ ఎంత సేపైనా కానీ పొట్ట అలా లోపలకి పెట్టేయడం షాట్ కట్ అనగానే పొట్ట అలా బుస్స్" అంటూ కామెడీగా షూటింగ్ టైములో పొట్టను ఎలా మేనేజ్ చేయాల్సి వచ్చేదో చెప్పుకొచ్చింది. "బాహుబలిలో అవకాశం ఎలా వచ్చింది" అని అడిగేసరికి "శోభా గారు ఫోన్ చేసి 40 డేస్ అన్నారు. అయ్యో 40 డేస్ ఆ నా వల్ల కాదు శోభా గారు సారీ" అని చెప్పి ఫోన్ పెట్టేసాను. "బిగ్ బడ్జెట్ ఫిలిం అని అంతే తెలుసు.. బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకుని అలా కూర్చుంటే అసలు నాకే రాజమాత అనిపించింది.. ఇదే నా మాటా.. నా మాటే శాసనం" అంటూ బాహుబలి సిగ్నేచర్ డైలాగ్ ని రమ్య కృష్ణ మళ్ళీ ఈ అంత పవర్ ఫుల్ గా చెప్పేసరికి జగపతి బాబుతో పాటు ఆడియన్స్ అంతా కూడా ఫుల్ లేచి నిల్చుని మరీ చప్పట్లు కొడుతూ అరిచారు. బాహుబలి అంటే ప్రభాస్ అనుకుంటారంతా కానీ ప్రభాస్ ని మించి వన్ లేడీ షోలా ఉంటుంది ఈ సినిమా. సినిమా మొత్తం రాజమాత మాత్రమే కనిపిస్తుంది. ఆ మాటే వినిపిస్తుంది. ఈ మూవీతో రమ్యకృష్ణ  క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

అనంత శ్రీరామ్ లవ్‌ స్టోరీ...ఆ అమ్మాయి ఎవరో తెలుసా!

సరిగామప లిటిల్ చాంప్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వగానే "ఫేస్ బాగుండాలంటే గ్లో ఉండాలా, మేకప్ వేయాలా" అని సుధీర్ అడిగేసరికి "ఫేస్ ఉండాలి" అంటూ సింగర్ శైలజ ఫన్నీ కౌంటర్ వేశారు. తర్వాత అనంత శ్రీరామ్ వర్షిణితో డ్యూయెట్ స్టెప్స్ వేస్తూ వచ్చేడు. "మీరు మంచి లిరిక్ రైటర్ అనుకున్నాను..ఏంటి ఇవన్నీ" అని అడిగాడు సుధీర్. లిరిక్ రైటర్ కి ఫీలింగ్స్ ఉండవా, లిరిక్ రైటర్ కి ప్రేమలుండవా" అని అనంత శ్రీరామ్ రివర్స్ లో సెటైర్ వేసాడు. "గూగుల్ లో కొడతారు డాట్ కామ్. నాకు అందరి కంటే ఇష్టం అనంత శ్రీరామ్" అంటూ వర్షిణి చెప్పింది.   "ఇది టెలికాస్ట్ ఐన తర్వాత మీరు ఎక్కడ కనిపించిన కొడతారు" అంటూ సుధీర్ మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. ఇక ప్రోమో చివరిలో "నచ్చిన అమ్మయినల్లా ప్రేమించానండి కాలేజ్ లో. చెపుదామనుకునేలోపు ఆ అమ్మాయి ఎవరో ఒకరితో ప్రేమలో ఉండేదండి." అంటూ పాపం అనంత శ్రీరామ్ తన లవ్ స్టోరీ గురించి చెప్పేసరికి అనిల్ రావిపూడి వచ్చి హగ్ చేసుకుని మరీ ఓదార్చాడు. "ఇంత బాధ లోపల పెట్టుకుని మమ్మల్నందరినీ నవ్విస్తున్నావా" అంటూ ఫీలైపోయాడు. "మీ ఇద్దరూ వన్ సైడ్ లవ్ గురించి బాధపడుతున్నట్టు లేదు. పెళ్ళాం బాధితుల్లాగా నాకు అనిపిస్తోంది" అంటూ వీళ్ళను చూసి హోస్ట్ సుధీర్ సెటైర్ వేసాడు. తర్వాత ఇద్దరు పిల్లలు వచ్చి "కన్యాకుమారి కనపడదా దారి" అనే సాంగ్ పాడేసరికి అనిల్ రావిపూడి కవిత చెప్పాడు. "మబ్బులపైనుంచి మంచుకొండలు లోయలోకి ఇంద్రధనుస్సు వేసిన జారుడు బల్ల మీద ఇళయరాజా గారి సంగీతం వింటూ హాయిగా తలవాల్చినట్టు ఉంది.. మీరు సింగర్స్ కాదు. ఇప్పుడే పూల తేనెను పీల్చుకొచ్చిన సీతాకోక చిలుకలు " అని చెప్పేసరికి అనంత శ్రీరామ్ ఐతే "నాకు ఇంటరెస్ట్ పోయింది" అంటూ లేచి వెళ్ళిపోయాడు ఫన్నీగా.

90 స్ బెస్ట్.. విష్ణుప్రియను ఆంటీ అన్న పృథ్వి

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ ని 90 స్ స్టార్స్ వెర్సెస్ జెన్ జి స్టార్స్ అంటూ రాబోతోంది.. ఇక అవినాష్, హరి ఐతే జెన్ జి స్టార్స్ లా కొంచెం హైఫైలా ఉండడానికి ట్రై చేసి నవ్వించారు. 4 జి తర్వాత వస్తుంది 5 జి నేనొక జెన్ జి అంటూ హరి చెప్పేసరికి ఏంటి గంజా అంటూ అవినాష్ కౌంటర్ వేసాడు. ఇక పృథ్వితో పాటు ఇంకొంతమంది లేడీస్ కూడా వచ్చేసరికి శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. "నాకు జెన్ జి టీమ్ వచ్చినట్టు అనిపించలేదు పృద్వి ఏదో తన గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చినట్టు అనిపించింది..నువ్వు వస్తే ఎపిసోడ్ కి రావాలని విష్ణు ప్రియా వెయిట్ చేస్తూ ఉంటుంది" అనేసింది. "హే మేము ఆంటీలని" అని పృద్వి అనేసరికి శ్రీముఖి "ఆంటీ" అని గట్టిగా అరిచింది. ఇక తర్వాత విష్ణు ప్రియా స్టేజి మీదకు వచ్చేసరికి "ఆయన నిన్ను ఆంటీ అన్నాడే" అని చెప్పి పాపం శ్రీముఖి ఏడుపు ముఖం పెట్టేసరికి విష్ణుప్రియ బిత్తరపోయింది. "ఒక పక్కన నీ ఏజ్ తెలిసిపోయినా ఇంత ముసల్ది అంత చిన్నోడిని చేసుకుని అంటే నేను ముసల్దాన్నే " అంటూ శ్రీముఖి తెగ కవర్ చేసింది. ఇక తర్వాత డెబ్జానీ దగ్గరకు వెళ్ళింది. "90 స్ బెస్ట్ ఎందుకు" అని అడిగేసరికి "వాళ్ళల్లో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు ఫుల్ నిబ్బిలు " అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక మహేశ్వరీ ఐతే నేను 1999 లో పుట్టాను అంటూ ఇంగ్లీష్ లో చెప్పేసరికి శ్రీముఖి ఇది తెలుగు షో తెలుగులో మాట్లాడు అంది. "వెరీ క్రిన్జ్ యాంకర్" అంటూ మళ్ళీ ఇంగ్లీష్ లో మహేశ్వరీ తిట్టేసరికి "దీన్ని తీసేయండిరా షో నుంచి" అనేసింది శ్రీముఖి.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి పోలీసులు...అసలు ఏమి జరిగింది?

  బిగ్ బాస్ సీజన్-9 ఊహించని మలుపులతో ట్విస్ట్ లతో ముందుకు సాగుతోంది. హౌస్ ని వాంటెడ్ పేటగా మార్చిన బిగ్ బాస్.. అందులోని వారిని దొంగల్ని చేశాడు. ఇక గత వారం నుండి సాగుతోన్న ఈ టాస్క్ ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది. డీమాన్ పవన్, గౌరవ్ ల కండబలంతో మొదటి టాస్క్ లో బ్లూ టీమ్ గెలవగా హౌస్ మేట్స్ కి రెండవ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటివరకూ మీరు మీ చేతులకి కాళ్లకి ఉన్న దమ్మేంటో చూపించారు ఇప్పుడు మీ నోటికి ఉన్న దమ్మును కూడా చూపించే సమయం వచ్చింది.. అందుకు మీకు ఇస్తున్న ఛాలెంజ్ హ్యూమన్ ఫౌంటైన్.. ఈ టాస్కులో ప్రతీ గ్యాంగ్ నుంచి ఐదుగురు పాల్గొంటారు. బజర్ మోగినప్పుడల్లా ప్రతీ గ్యాంగ్ నుంచి ఒక్కో పోటుగాడు ముందుకొచ్చి తమ నోటిలో నీళ్లు నింపుకొని ఎదురుగా ఉన్న బకెట్స్‌లో నీటిని స్ప్రే చేయాలి.. ఎవరి స్ప్రే అయితే దూరంగా ఉన్న బకెట్లో పడుతుందో ఆ పోటుగాడు ఆ రౌండ్ విజేత అవుతాడు. ఇలా ఏ గ్యాంగ్ ఎక్కువ రౌండ్స్ గెలిస్తే ఆ గ్యాంగ్ విజేతగా నిలుస్తుంది.. మీ గ్యాంగ్ లీడర్‌కి వెయ్యి రూపాయల బీబీ క్యాష్ లభిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కులో కూడా సంజన బ్లూ టీమ్ గెలిచింది. విన్నింగ్ గ్యాంగ్ సెలబ్రేషన్స్ కోసం గెలిచిన గ్యాంగ్ లీడర్ ముందు ఓడిన గ్యాంగ్ వాళ్లందరూ మోకాళ్లపై ఉండి మీరు తోపు మేము తుప్పాస్ అని చెప్తూ సలామ్ కొట్టాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో సంజన ముందు మాధురి టీమ్ అంతా కూర్చొని చెప్పినట్లే చెప్పింది. కాసేపటికి ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉందో చెప్పాలని బిగ్‌బాస్ అడిగాడు. తనూజ దగ్గర అందరికంటే అత్యధికంగా ఏడు వేల బీబీ క్యాష్ ఉంది. ఇక రాము, రమ్యల దగ్గర జీరో ఉంది. దీంతో రాము-రమ్య దగ్గర ఉన్న డబ్బు సున్నా కనుక వారు కంటెండర్ రేసు నుంచి తప్పుకుంటారు. వాళ్ల ఫొటోలకి మాలలు వేయండి అని బిగ్‌బాస్ చెప్పాడు. ఆ తర్వాత హౌస్ దద్దరిల్లేలా భారీ సైరెన్లు వేసాడు బిగ్‌బాస్.‌ కాసేపటికి మాజీ కంటెస్టెంట్లు అమర్‌దీప్-అర్జున్ అంబటి పోలీస్ గెటప్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇద్దరు డాన్స్‌ని పట్టుకోవడానికి వచ్చాం.. సంజన సైలెన్సర్, మాస్ మాధురి.. ఎక్కడా అంటూ అర్జున్ అడిగాడు. వీళ్లు వస్తున్నారని బిగ్‌బాస్ ముందే చెప్పడంతో సంజన-మాధురి లోపల దాక్కున్నారు. ఇక వాళ్లిద్దరూ లేరు సర్ అంటూ హౌస్‌మేట్స్ అంతా వాళ్లని కాపడటానికి ట్రై చేశారు. ఇలా కాదని మొత్తం హౌస్ అంతా తిరుగుతూ అమర్-అర్జున్ సెర్చ్ చేశారు. తర్వాత ఎవరైనా ఏమైనా కొట్టేశారా.. అని అడిగితే మేము ఏం కొట్టేయలేదు సర్ అంటూ ఇమ్మూ అతి వినయంగా చెప్పాడు. దీంతో హౌస్‌లో ఏం కొట్టేశారో మాకు తెలుసు సర్.. అవి తీసుకొస్తే మీరు ఉంటారు సర్ లేకపోతే మాతో పాటే మెయిన్ డోర్ నుంచి బయటికి వస్తారు సర్ అంటూ అమర్ బెదిరించాడు. తర్వాత ఒక్కొక్కరి బెడ్ దగ్గరికెళ్లి హౌస్‌మేట్స్ దాచిన ఫుడ్ అన్నీ బయటికి తీశాడు అమర్. హౌస్ మేట్స్ వారి బెడ్ దగ్గర కబోడ్ లో దాచుకున్న ఎగ్స్, ఫ్రూట్స్ అన్నీ చూసి అమర్ దీప్ షాకయ్యాడు. కాసేపటికి మారువేషాలు వేసుకొని దాక్కున్న మాధురి, సంజనలు బయటకొచ్చేశారు. మరి అమర్ దీప్, అంబటి అర్జున్ కలిసి ఆ దొంగలని కనిపెడతారా లేదా తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. 

Bigg Boss 9 Telugu: మాధురి టీమ్ ని మట్టిలో పాతేసిన డీమాన్.. కండబలంతో బ్లూ టీమ్ విన్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం దొంగల టాస్క్ తో ముందుకు సాగుతోంది. మాధురి వర్సెస్ సంజనగా సాగుతున్న ఈ దొంగల టాస్క్ లో సుమన్ శెట్టి, తనూజ, దివ్య, మాధురి ఎక్కువ బిబి కాయిన్స్ సేకరించి లీడింగ్ లో ఉన్నారు.  ఇక నిన్నటి(గురువారం) ఎపిసోడ్‌ లో ఓ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఏ గ్యాంగ్‌స్టర్ అయిన తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఎక్కువ బలం ఉండటం చాలా ముఖ్యం.. ఆ బలంతోనే వారు వారి ప్రత్యర్థులను అణిచివేయగలుగుతారు..ఇప్పుడు ఆ బలాన్ని మీరు చూపించి డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న మూడవ అవకాశం 'జెండాలే మీ అజెండా'.. ఈ పోటీ కోసం గ్యాంగ్ లీడర్స్ మీ గ్యాంగ్‌లోని బలమైన మరియు దమ్మున్న ఇద్దరు పోటుగాళ్లని ఎంచుకొని వారిని ఈ పోటీలో దింపడానికి వారితో ఒప్పందాలు కుదుర్చుకోండి.. ప్రతీ గ్యాంగ్ నుంచి ఇద్దరు పోటుగాళ్లు వచ్చి తమకి ఇచ్చిన బెల్ట్‌ని ధరించి అక్కడున్న మడ్ పిట్‌లో నలుగురు పోటుగాళ్లు ప్రత్యర్థి గ్యాంగ్ ఫ్లాగ్స్ ఉన్న వైపు నిలబడాల్సి ఉంటుంది.. స్టార్ట్ బజర్ మోగగానే అందులో ఉన్న మీ టీమ్ కలర్ ఫ్లాగ్స్‌ని మరియు బోనస్ పాయింట్ల కోసం ఎల్లో కలర్ ఫ్లాగ్స్‌ని సంపాదించి మీ బాస్కెట్‌లో పెట్టాలి.. ఎండ్ బజర్ మోగేలోపు ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ ఫ్లాగ్స్ సేకరించి తమ బాస్కెట్లో పెట్టి ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది.. మరియు ఆ గ్యాంగ్ లీడర్‌కి ఐదు వేల బీబీ క్యాష్ వస్తుంది. మీ టీమ్ కలర్ ఫ్లాగ్ సేకరించడం ద్వారా ప్రతీ ఫ్లాగ్‌కి ఒక పాయింట్ లభిస్తుంది.. ఎల్లో ఫ్లాగ్ సేకరించడం ద్వారా ఐదు పాయింట్లు లభిస్తాయని బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఈ గేమ్‌కి సంజన టీమ్ తరఫున డీమాన్-గౌరవ్ పాల్లొనగా మాధురి గ్యాంగ్ తరపున ఇమ్మాన్యుయల్-కళ్యాణ్ బరిలోకి దిగారు. ఇక గేమ్ ఇలా మొదలైందో లేదో డీమాన్-గౌరవ్ ఇద్దరూ రెచ్చిపోయారు. కళ్యాణ్-ఇమ్మూలని తమ జెండాలవైపు బలంగా లాక్కొని వెళ్లిపోయారు. డీమాన్ అయితే ఇద్దరిని ఈడ్చుకుంటూ జెండాలని తమ బాస్కెట్లో వేస్తూ పోయాడు.ఈ దెబ్బతో రెడ్ టీమ్ కనీసం ఒక్క జెండా కూడా ముట్టుకోలేకపోయింది. అంతలా డామినేషన్ చూపించాడు డీమాన్. దీంతో ఈ గేమ్‌లో ఏకపక్షంగా డీమాన్-గౌరవ్ గెలిచేశారు. దీంతో సంజన టీమ్‌కి అయిదు వేల బీబీ క్యాష్ వచ్చింది. ఈ టాస్కులో ఓడిపోయినందుకు గాను మాధురి టీమ్ నుంచి ఇమ్మాన్యుయల్.. బిగ్‌బాస్ పేరు ఎత్తిన ప్రతీసారి కోడిలా సౌండ్ చేయాలంటూ బిగ్‌బాస్ ఫన్నీ పనిష్ మెంట్ ఇచ్చాడు. ఇది హిలేరియస్ గా అనిపించింది.  నిన్నటి ఎపిసోడ్ లో డీమాన్ పవన్ అండ్ గౌరవ్ తమ కండబలం చూపించగా బ్లూ టీమ్ గెలిచింది. అయితే ఎక్కువ గేమ్స్ రెడ్ టీమ్ గెలిచి లీడింగ్ లో ఉంది. మరి అత్యధిక బీబీ క్యాష్ ఎవరి దగ్గర ఎక్కువగా ఉన్నాయో కామెంట్ చేయండి.