నాగార్జునతో రొమాంటిక్ సీన్ లో కస్తూరి శంకర్ 

కస్తూరి శంకర్ అనగానే గుర్తొచ్చే సినిమా అన్నమ్మయ్య మూవీలో హీరో నాగార్జున హీరోయిన్ గా చేసిన రోల్. అలాగే కమల్ హాసన్ తో భారతీయుడు మూవీలో కూడా ఆమె నటించారు. ఇక తెలుగు బుల్లితెర మీద "గృహలక్ష్మి" అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు మంచి పేరు తెచ్చుకున్నారు ఆడియన్స్ నుంచి. ఆమె రీసెంట్ గా తన హీరో నాగార్జున గురించి ఒక ఇంటర్వ్యూలో చాల విషయాలు చెప్పారు. "నాగార్జున గారి గురించి ఎం చెప్తారు" అని హోస్ట్ అడిగేసరికి "నాగార్జున గారి గురించి చెప్పాలంటే పెద్ద హిస్టరీ ఉంది. నేను మొదట్లో యాంకర్ గా పని చేసేదాన్ని. కార్పొరేట్ ఈవెంట్స్ అన్ని ఎంసి చేసే అడ్వర్టైజింగ్ వరల్డ్ లో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాగార్జున గారు వచ్చారు. ఆయన్ని నాకు పరిచయం చేస్తున్నారు.అప్పుడు ఆయన నాకు హ్యాండ్ షాక్ ఇచ్చారు. నిజం చెప్తున్నాను ఆ చేతిని కడక్కుండా రెండు రోజు తిరిగాను. అందరికీ చెప్పాను. ఐతే అందరికీ ఈర్ష్య పుట్టింది. ఎందుకంటే అందరూ నా క్లాస్ మేట్స్ కదా. ఆ టీనేజ్ హప్పినెస్స్ నాకు ఇప్పటి వరకు గుర్తు ఉంది. ఆ విషయాన్నీ నేను అన్నమయ్య సెట్స్ లో కలిసినప్పుడు చెప్పాను. నా కల అలా నెరవేరింది. ఈ మధ్య కాలంలో ఆయన్ని కలవలేదు. ఇప్పుడు కలవాలి. నెక్స్ట్ మూవీ ఎం చేస్తున్నారో అడగాలి. ఇప్పుడు ఆయన విలన్ గా బాడ్ గైగ మళ్ళీ క్రేజ్ ఇపోయారు. మా జెనెరేషన్ లో హీరోగా క్రష్ అయ్యారు. ఇప్పుడు జెన్ జికి క్రష్ అయ్యారు. రొమాంటిక్ సీన్ కావొచ్చు ఇంకా ఛాలెంజింగ్ సీన్ ఐనా కానీ కంఫర్ట్ ఫాక్టర్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఆయన చాలా ప్రొఫెషనల్." అని చెప్పుకొచ్చింది కస్తూరి శంకర్.

లవ్ మీద ‎ఇంట్రెస్ట్ ‎లేదు ‎అంటున్న ఢీ డాన్సర్ రాజు

ఢీ 10 రాజు అంటే బుల్లితెర మీద తెలియని వాళ్ళు లేరు. ఏ సీజన్ టైటిల్ గెలుచుకున్నాడో ఆ సీజన్ తన ఇంటి పేరుగా మారిపోయింది. అలాంటి రాజు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు. "రాజుకి రాణి ఎక్కడ ఉంది. నువ్వు లవ్ లో ఉన్నావని విన్నాను" అని హోస్ట్ అడిగేసరికి. "లేదసలు రాణి వద్దు. రాణీలే వద్దు. ఒక త్రి ఇయర్స్ బ్యాక్. బ్రేకప్ అయ్యింది. అప్పటికి ఇద్దరిదీ అన్ మెచ్యూర్డ్ మైండ్. ఇక తను లేకపోతే నేను బతకలేను అన్నంత దూరం వెళ్ళిపోయాను. అంత లవ్ చేసాను. తాను పక్కన లేకపోతే నాకు ఊపిరాడనంతలా ఉండేవాడిని. మాక్సిమం తాగిన ప్రతీ ఒక్క అబ్బాయి తన అమ్మాయిని గుర్తు చేసుకునే ఉంటాడు. ఆ అమ్మాయిని గుర్తు చేసుకుని ఏడుస్తాడు పక్కా. ఐనా ఇప్పుడు ఒక్కటే డైలాగ్. మనకెందుకు లవ్వు. ముందు ఫోకస్ ఆన్ గోల్స్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాల్సిందే. నాతో వచ్చి మంచిగా మాట్లాడితే నేను వాళ్ళతో మంచిగా మాట్లాడతా. అది నేను చేసిన తప్పు. నా వలెనే వాళ్ళు బాధపడతారు. మనం ఒక మనిషిని బాధపెడితే వాళ్లకు కచ్చితంగా కర్మ రిటర్న్స్ అనేది ఉంటుంది. నేను బాధపెట్టాను సో నాకు తగిలింది. నేను ఢీ 10 విన్ అయ్యాక రూమ్ రెంట్ కోసం చాలా తిరిగాను. కానీ ఎక్కడికి వెళ్లినా ఎం చేస్తారు అని అడిగేవాళ్ళు..డాన్సర్ ని అని చెప్పగానే ఇల్లు అద్దెకివ్వం అనేవాళ్ళు. దాంతో నాకు కోపం వచ్చి విల్లా దగ్గరకు వెళ్లి రెంట్ ఎంతా అని అడిగా. 60 వేలు అన్నాడు. ఐనా కడతాను అన్నా. వాళ్ళు అడిగారు వీళ్ళు అదే క్వశ్చన్ వేస్తున్నారు అని అనుకున్న డాన్సర్ ని అని చెప్పా. సారీ మేము డాన్సర్స్ కి ఇవ్వము అని చెప్పారు. అంటే బయటవాళ్ళకు డాన్సర్స్ అంటే అంత చీపా" అంటూ రాజు తాను ఎదుర్కున్న కష్టాలను చెప్పుకొచ్చాడు.

Bigg Boss 9 Telugu: తనూజ విన్.. ఆడపులి కాదు ఆడపిల్లిలా రీతూ!

  బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి, దివ్య రెబల్స్ గా తమకు ఇచ్చిన రెండు టాస్క్ లు పూర్తి చేసి కళ్యాణ్, నిఖిల్ లని కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ నుండి తొలగించారు. ఇక ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్లు లేవని రీతూ తెలుసుకోగా.. దివ్య షాక్ అయింది.‌ ఇక తను అందరిని అడిగింది. రీతూ వాటర్ బాటిల్స్ చెక్ చేసింది. అదే సమయంలో దివ్య తెలివిగా రీతూని డైవర్ట్ చేయడానికి గౌరవ్ తో గొడవపెట్టుకుంది. దాంతో రీతూ, గౌరవ్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అదే 'టచ్ ఇట్ స్మెల్ ఇట్ గెస్ ఇట్'. దీనికి సంజన సంచాలకులు. దీని కోసం యాక్టివిటీ ఏరియాలో ఘోస్ట్ రూమ్‌ టైప్‌లో చీకటి గదిని ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. దీనిప్రకారం ఆ గదిలో ఐదు ఐటెమ్స్ ఉంటాయి. చీకటిలో వాటిని టచ్ చేసి, స్మెల్ చేసి, గెస్ చేసి అవేంటో కరెక్ట్‌గా చెప్పాలి. ఎవరు ఎక్కువ కరెక్ట్ చెబితే ఆ టీమ్ విన్ అవుతుంది. ఇక ఏం పెట్టారో చెక్ చేద్దామని వచ్చిన సంజన.. అక్కడున్న దెయ్యం వేషాలు చూసి బొమ్మలనుకుంది. కానీ వాళ్లు కదిలేసరికి సంజన కూడా ఉలిక్కిపడింది. ఇక ముందుగా ఆరెంజ్ టీమ్ నుంచి తనూజ ఆడటానికి వచ్చింది. రూమ్‌లోకి ఎంటర్ కాగానే తనూజ ఏడుపు మొదలెట్టింది. నాకు చీకటంటే భయం ప్లీజ్ అంటూ ముందుకెళ్లింది. టీవీలో చూస్తున్న సంజనని.. పాత పగలన్నీ తీర్చుకుంటున్నారా ఏంటి.. ఎక్కడ ఏం ఉన్నాయో తెలీడం లేదంటూ తనూజ భయపడింది. ఇక సంజన తనకి క్లూ ఇచ్చింది. అందులో అయిదు వస్తువుల్లో నాలుగింటికి కరెక్ట్ గెస్ చేసింది తనూజ. ఇక ఆరెంజ్ టీమ్ నుండి దివ్య ఆడటానికి వచ్చింది. తను మూడు వస్తువులు కరెక్ట్ గా గెస్ చేసింది. కాసేపటికి బ్లూ టీమ్ నుండి రీతూ వెళ్ళింది. అయితే వెళ్లేముందు సంజనతో అటిట్యూడ్ చూపించింది. పులి ఆడపులీ అంటూ జుట్టుని ఎగరేస్తూ వెళ్ళింది రీతూ. డెవిల్ హౌస్‌లోకి వెళ్లిన తరువాత.. రీతూ చౌదరితో దెయ్యాలు కాసేపు ఆడుకున్నాయి. ఆడపులి కాస్తా పిల్లి అయిపోయింది. నేను బయటకు పోతా ఇట్లా చేయకండి ప్లీజ్ అంటూ రీతు రిక్వెస్ట్ చేసింది.  ఆ తర్వాత తను కూడా అయిదు వస్తువుల్లో మూడు వస్తువులని కరెక్ట్ గా గెస్ చేసింది. ఇక ఆ రౌండ్ లో తనూజ ఎక్కువ వస్తువులు గెస్ చేయడంతో తనూజ టీమ్ విన్ అయ్యింది. ఇక వారికి రెబల్స్ తీసే ఎలిమినేషన్ నుండి సేవింగ్ పొందుతారు. ఎవరికి ఆ సేవింగ్ కార్డ్ లభిస్తుందో చూడాలి మరి. నిన్నటి గోస్ట్ టాస్క్ లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారో కామెంట్ చేయండి.  

Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ రేస్ నుండి నిఖిల్, డీమాన్ పవన్ అవుట్!

  బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం క్రేజిగా సాగుతోంది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మంగళవారం నుండి కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ కి సంబంధించిన టాస్క్ లు ఇవ్వడం మొదలెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఓ ఫోన్ ని గార్డెన్ ఏరియాలో ఉంచి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ వారికి సీక్రెట్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి, దివ్య ఇద్దరు రెబల్స్ అవ్వడంతో తమకి వచ్చిన రెండో సీక్రెట్ టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో దివ్యకి బిగ్ బాస్ కాల్ చేశాడు. హౌస్ లో ఎవరిని కెప్టెన్సీ రేస్ నుండి తీద్దామని అనుకుంటారంటూ అడిగాడు. ఎవరిని ఆయితే తీసేద్దామనుకుంటున్నారో జైలు దగ్గరున్న కెమెరాకి చెప్పండి అని బిగ్ బాస్ అనగా.. నిఖిల్ పేరుని చెప్పారు సుమన్ శెట్టి, దివ్య. ఆ తర్వాత అదే విషయం లేఖ ద్వారా పంపించాడు బిగ్ బాస్. ఇక కాసేపటికి కంటెస్టెంట్స్ అందరిని సోఫాలో కూర్చోమన్నాడు బిగ్ బాస్ చెప్పగా.. మరో లేఖ వచ్చింది. అందులో ఏం ఉందంటే..  ఇప్పటివరకూ జరిగిన ఆటని మీరు గమనించి ఉంటారు.. గనుక మీ దృష్టిలో ఎవరు రెబల్ అనేది మీరు ఒక్కొక్కరూ చెప్పాలి.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పుకుంటారు అని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఎక్కువమంది డీమాన్ రెబల్ అని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత సాయి పేరు చెప్పారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా దివ్య, సుమన్ పేరు చెప్పలేదు. దీంతో మీరందరూ అనుకున్నట్లు పవన్ రెబల్ కాదు. మీరు తప్పుగా అనుకున్నారు.. అయినా ఎక్కువమంది పవన్ పేరు చెప్పడంతో తను రేసు నుంచి తప్పుకున్నాడని బిగ్‌బాస్ చెప్పాడు.

Bigg Boss 9 Ninth week Voting : సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ కన్ఫమ్.. తనూజని నామినేట్ చెయ్యడమే కారణమా!

బిగ్ బాస్ సీజన్-9 తొమ్మిదో వారం కంటెస్టెంట్స్ మధ్య కెప్టెన్సీ రేస్ కోసం టాస్క్ జరుగుతున్నాయి. ఇక తొమ్మిదోవారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, భరణి, రాము, సాయి శ్రీనివాస్ ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం. తనూజ ఎప్పటిలాగే మొదటి స్థానంలో ఉంది. ముప్పై రెండు శాతంతో మొదటి స్థానంలో ఉండగా, కళ్యాణ్ పడాల ఇరవై ఒక్క శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. సుమన్ శెట్టి పద్నాలుగు శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి పదకొండు శాతం ఓటింగ్ తో నాలుగో స్థానంలో ఉన్నాడు. సంజన గల్రానీ పది శాతం ఓటింగ్ తో అయిదో స్థానం లో ఉంది. రాము రాథోడ్ ఎనిమిది శాతం ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా నాలుగు శాతం ఓటింగ్ తో సాయి శ్రీనివాస్ చివరి స్థానంలో ఉన్నాడు. ‌దీన్ని బట్టి చూస్తే సాయి శ్రీనివాస్ ఈ వారం ఎలిమినేషన్ ఫిక్స్. ఎందుకంటే అసలు అతనికి ఓటింగ్ పడటం లేదు. సాయి శ్రీనివాస్‌ ఎలిమినేషన్‌కి మెయిన్ రీజన్ అంటే.. అతను తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పీఆర్ నెట్ వర్క్ లేదు. గత వారమే నామినేషన్‌లోకి రావాల్సి ఉండగా.. తన దగ్గర ఉన్న స్పెషల్ పవర్‌తో సేవ్ అయ్యాడు. ప్రత్యేకించి.. ఇతనిపై పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. ఉన్నంతవరకూ ఫెయిర్‌గానే ఉన్నాడు. తొండి ఆటలు ఆడలేదు. అడ్డమైన వాదనకి దిగలేదు. ఫుటేజ్ ఇవ్వడం కోసం కక్కుర్తి పడలేదు. బయట పీఆర్ టీం స్ట్రాటజీలు చేయలేదు. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. బయట ఐదు వారాలు ఆట చూసి.. ఎవరి స్ట్రాంగో అని తెలిసి కూడా.. వాళ్లతో బాడింగ్‌లు పెట్టుకుని అడ్డదారిలో హౌస్‌లో ఉండే కక్కుర్తి పనులు చేయలేదు.  దానితో పాటుగా తనూజని నామినేట్ చేశాడు.‌ బిగ్ బాస్ తన దత్తపుత్రికగా భావించే తనూజని నామినేట్ చేస్తే చూస్తూ ఊరుకుంటాడా ఎలిమినేషన్ చేస్తాడుగా.. ఇంకా దీనికి తోడు ఆడియన్స్ ఓటింగ్ వేయడం లేదు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది సాయి శ్రీనివాస్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu: రెబల్స్ గా సుమన్ శెట్టి, దివ్య ప్రభంజనం.. హౌస్ మేట్స్ ని పిచ్చోళ్ళు చేశారుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో సుమన్ శెట్టి, దివ్యల ప్రభంజనం సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో వీళ్ళ ఆటతీరుకి జనాలంతా పిచ్చోళ్ళు అయిపోయారు. అసలు ఏం అయిందో  ఓ సారి చూసేద్దాం. బిగ్‌బాస్ హౌస్‌ మొత్తానికి టీ లేకుండా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశాడు రెబల్ సుమన్ శెట్టి. అర్ధరాత్రి చేసిన ఈ దొంగతనంతో తెల్లారేసరికి ఎవరికీ టీ చుక్క కూడా లేకుండా పోయింది. అయితే ఉదయం కాగానే రేషన్ మేనేజర్ అయిన రీతూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి పాల ప్యాకెట్లు కనిపించలేదు. దీంతో రీతూ చౌదరి రేయ్ పాలు ఎవరో కొట్టేశారంటూ హడావిడి చేసింది. మిగిలిన హౌస్‌మేట్స్ అంతా ముందు సంజనని అనుమానించారు కానీ చివరికి కాదని తెలుసుకున్నారు. అయితే రాత్రి పాలు కొట్టేసిన సుమన్ , దివ్య మాత్రం మాములు యాక్టింగ్ చేయలేదు. పాలు ఎవరు కొట్టేసినా ప్లీజ్ ఇచ్చేయండి అంటూ దివ్య మహానటిలా యాక్ట్ చేసింది. సుమన్ శెట్టి అయితే అమాయకుడిలా ఫేస్ పెట్టి అందరిని బోల్తా కొట్టించేశాడు. ఇక రేషన్ మేనేజర్ అయిన రీతూ మీద కూడా కొంతమందికి డౌట్ వచ్చింది. కానీ ఎవరూ అసలు రెబల్ ఎవరనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే రెండో టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసు నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబల్స్ అయిన దివ్య, సుమన్ శెట్టికి దక్కింది.  పాల ప్యాకెట్లు లేకపోయేసరికి ఎవరికీ బుర్ర పని చేయలేదు. రేషన్ మేనేజర్ అయిన రీతూయే రెబల్ అయి ఉండొచ్చని తనూజ అనుకుంది. అయితే దివ్య ఓవరాక్షన్ చూసి నువ్వే రెబల్ ఎందుకు కాకూడదంటూ రాము కామెడీగా గెస్ చేశాడు. కానీ నిఖిల్ మాత్రం దివ్యనే రెబల్ అని కరెక్ట్‌గా గెస్ చేశాడు. రాత్రి నేను అప్పుడప్పుడూ లేచాను ఆ సమయంలో దివ్య పడుకోలేదు.. బయట తిరగడం చూశాను ఆమె రెబల్ అయి ఉంటుందని నిఖిల్ అన్నాడు. అదే టాకు.. క్యూట్ ఫేస్ పెట్టుకొని ఆడుతుందని భరణి కూడా అన్నాడు. ఇక పాలు ఖచ్చితంగా ఎవరు తాగినా బాటిల్‌లో పోసుకొనే తాగుంటారని రీతూ అనుకుంది. వెంటనే అందరి బాటిల్స్ తీసుకొచ్చి స్మెల్ చూడటం స్టార్ట్ చేసింది. అయితే ఎక్కడ దొరికిపోతుందోనని భావించిన దివ్య.. అప్పటికప్పుడు మాస్టర్ ప్లాన్ వేసింది. మద్యాహ్న భోజనానికి వెజిటబుల్స్ కట్ చేయమని గౌరవ్ కు దివ్య చెప్పగా.. రీతూ రేషన్ మేనేజర్ గా ఆర్డర్ వేసింది‌‌. ఇక ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ‌

Jayam serial : రుద్రని ఎమోషనల్ గా లాక్ చేసిన శకుంతల.. పెద్దసారు ఏం చేయనున్నాడు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -104 లో......రుద్ర ఎక్కడ గంగని పెళ్లి చేసుకుంటాడోనని శకుంతల ప్లాన్ ప్రకారం పారు దగ్గరికి వెళ్లి రుద్రని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దానికి తను నో అంటి అని అంటుంది. నేను ఛాంపియన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న కానీ ఇలా ఎక్స్ ఛాంపియన్ కాదని పారు అంటుంది. ఇప్పుడు తన ఏదో సాధించాలని అకాడమీ మొదలు పెట్టాడు.. ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు.. తన గెలుపు నీ వల్లే అయిందని రుద్ర అనుకోవాలి.. అందుకే నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నానని పారుతో శకుంతల అంటుంది. సరే అంటి మీరు నాకు నచ్చింది చేస్తానని మాటివ్వండి అని పారు అనగానే అంత నీ ఇష్టప్రకారమే జరుగుతుందని శకుంతల మాటిస్తుంది. ఆ తర్వాత గంగ ఇంటికి వస్తుంది. నీ కాళ్లకి పట్టీలు ఏం అయ్యాయని లక్ష్మి అడుగుతుంది. రుద్ర సర్ కి ఇచ్చేసాను.. నువ్వు కదా మన హద్దులో మనం ఉండాలన్నావ్.. అందుకే ఇచ్చేసానని గంగ చెప్తుంది. మరోకవైపు రుద్ర నిశ్చితార్థం కి ఏ చీర కట్టుకోవాలని శకుంతల అన్ని చీరలు చూస్తుంది. అప్పుడే పెద్దసారు వస్తాడు. నువ్వు ఎందుకు రుద్రని అడగకుండా వెళ్లి పెళ్లి ఫిక్స్ చేసావని అడుగుతాడు. అంటే ముందు రుద్ర దగ్గరికి వెళ్లి కనుక్కోవాల్సింది అంటున్నారా అని శకుంతల అంటుంది. ఇప్పుడు నువ్వు పెళ్లి ఫిక్స్ చేస్తే రుద్ర చేసుకుంటాడనుకుంటున్నావా అని పెద్దసారు అంటాడు. చేసుకుంటానని చెప్తూ రుద్ర ఎంట్రీ ఇస్తాడు. అది ఎవరైనా సరే పెద్దమ్మ ఫిక్స్ చేస్తే చేసుకుంటాను.. నేను పెరిగింది తన చేతుల్లోనే.. నా చేతికి గ్లౌస్ లు తొడిగింది తనే అని రుద్ర అంటాడు. శకుంతల రుద్రని ఎమోషనల్ గా లాక్ చేస్తుంది. ఆ తర్వాత రుద్ర వెళ్ళిపోయాక.. నువ్వు రుద్రపై చూపించే ప్రేమ నిజమేనా లేక ఎమోషనల్ గా లాక్ చేస్తున్నావా అని శకుంతలని పెద్దసారు అడుగుతాడు. ఏదో ఒకటి చెప్పి శకుంతల కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో బాక్సింగ్ పోటీకి నేను సిద్ధం అని పారుతో గంగ ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : నర్మదపై భద్రవతి ఫైర్.. వార్నింగ్ ఇచ్చి పంపించిందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -308 లో.....భద్రవతి అక్రమంగా భూమిని కబ్జా చేసిందని తన ల్యాండ్ ని నర్మద సీజ్ చేయిస్తుంది. అది తెలిసి భద్రవతి, సేనాపతి అక్కడికి వచ్చి నర్మదతో గొడవ పెట్టుకుంటారు. మరొకవైపు శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్తుంది. మీరు అన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేశారు.. ఇప్పుడు ఆ విశ్వగాడు ప్రతీదానికి అమూల్యని అక్కడికి తీసుకొనిరా.. ఇక్కడికి తీసుకొనిరా అంటున్నాడు. వాడు అమూల్యకి ప్రపోజ్ చేసాడు. ఇప్పుడు ఆ అమూల్య వాళ్ళ నాన్న కి చెప్తానని వెళ్తే అడ్డుపడ్డాను.. ఒకవేళ మావయ్య గారికి చెప్తే దీని వెనకాల నేనే ఉన్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని తన భయం గురించి తన వాళ్ళకి శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత తన భూమిని సీజ్ చేసారని సేనాపతి తాగేసి వచ్చి.. రామరాజు ఇంటిమీదకి గొడవకి దిగుతాడు. దాంతో సాగర్, చందు, ధీరజ్ ముగ్గురు వాళ్ళపైకి గొడవకి వెళ్తారు. రామరాజు గాడు మమ్మల్ని ఎదుర్కునే ధైర్యం లేక కోడలిని ఉసిగొలిపాడని తిడతాడు. దాంతో సేనాపతి దగ్గరికి నర్మద వెళ్లి మీరు అక్రమంగా ల్యాండ్ కబ్జా చేశారు సీజ్ చేసాం.. అక్కడ మ్యాటర్ ఏదైనా ఉంటే ఆఫీస్ కి రండి.. ఇలా ఇంటికి వచ్చి గొడవపడకండి అని నర్మద చెప్తుంది. ఆ తర్వాత సేనాపతి అన్నమాటలు ధీరజ్ గుర్తుచేసుకొని ఈ మనిషి.. మీ నాన్న అంటూ ప్రేమ ముందు సేనాపతిని తిడతాడు. ఒరేయ్ ఆపురా అని ప్రేమ అంటున్నా కూడా ధీరజ్ వినకుండా తిడతాడు. దాంతో తన చెయ్ గట్టిగా కొరుకుతుంది. వామ్మో దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు వేదవతి డల్ గా కూర్చొని ఉంటుంది. అప్పుడే నర్మద వస్తుంది. నీతో కాస్త మాట్లాడాలని నర్మదతో వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : సుమిత్రకి నిజం చెప్పనున్న కార్తీక్.. దీప హ్యాపీ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -507 లో..... దీప వంట చేస్తుంది. అక్కడికి సుమిత్ర వెళ్లి నువ్వు ఏ పని చేసినా నిజాయితీగా చేస్తున్నావనిపిస్తుంది.. యాక్టింగ్ ఎక్కడ అనిపించడం లేదు.. నా వాళ్లే నేను వెళ్తుంటే చూసి చూడనట్లున్నారు.. అలాంటిది నా కోసం వెతికావు.. ఇంటికి తీసుకొని వెళ్ళావ్.. సేవ చేసావ్.. ఎందుకు ఇదంతా అని సుమిత్ర అడుగుతుంది. నువ్వు నా కన్నతల్లివి అని ఎలా చెప్పాలని దీప అనుకుంటుంది. నువ్వు అన్నింట్లో నిజాయితీగా ఉన్నావా అని సుమిత్ర అడుగుతుంది. ఎందులో లేను అమ్మ.. నేను ఎప్పుడు నిజాయితీగా ఉన్నానని దీప అంటుంది. ఎందుకని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ కోసమా అని సుమిత్ర అంటుంది. తను ముందు నుండి ఒకేలా ఉంది అత్త.. నీకు త్వరలో ఒక సర్ ప్రైజ్ ఉంది.. అది మేనల్లుడి గిఫ్ట్ అని కార్తీక్ అంటాడు. సుమిత్ర అక్కడ నుండి వెళ్లిపోయాక.. ఏంటి బావ అది అని దీప అడుగుతుంది. నువ్వే తన కూతురని చెప్పేస్తానని కార్తీక్ అంటాడు. దాంతో దీప హ్యాపీగా ఫీల్ అయి కార్తీక్ ని హగ్ చేసుకుంటుంది. మరదలా కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అందరం హ్యాపీగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని కార్తీక్ వాళ్ళతో కాంచన అంటుంది. మరొకవైపు నువ్వు మీ అమ్మనాన్నలని కలుపుతానని అన్నావ్ కానీ ఆ కార్తీక్ గాడు కలిపాడని జ్యోత్స్నతో పారిజాతం డిస్సపాయింట్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత అందరం హ్యాపీగా ఉన్నాం.. ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఉండొచ్చా అని కాంచనతో శ్రీధర్ అడుగుతాడు. అది ఎప్పటికి జరగదు. ఇది మీ ఇల్లే ఎప్పుడైనా రావచ్చు కానీ కార్తీక్ తండ్రిగా మాత్రమేనని శ్రీధర్ తో కాంచన కఠినంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేయడానికి కోయిలి ప్లాన్.. ఒకే చెప్పిన రంజిత్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 870 లో..క్లయింట్ కి  ఇవ్వాల్సిన కొటేషన్ సిస్టమ్ లో లేదని సుభాష్ కి శృతి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో సుభాష్ టెన్షన్ పడతాడు. ఒకవేళ క్లయింట్ వెళ్ళిపోతే యాభై కోట్ల లాస్ వస్తుందని రాజ్ కి సుభాష్ కాల్ చేసి చెప్తాడు. వెంటనే అక్కడ నుండి బయల్దేరండి అని సుభాష్ చెప్తాడు. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యకి విషయం చెప్పి మనం ఇప్పుడు బయల్దేరాలని చెప్తాడు. అవసరం లేదు ఆ కొటేషన్ నా సిస్టమ్ లో సేవ్ చేసి పెట్టానని కావ్య చెప్తుంది. దాంతో రాజ్ రిలాక్స్ అవుతాడు. ఆ తర్వాత ప్రకాష్ కి కావ్య ఫోన్ చేసి కొటేషన్ తన సిస్టమ్ లో ఉన్న విషయం చెప్తుంది. దాంతో అందరు రిలాక్స్ అవుతారు. రుద్రాణి మాత్రం ప్లాన్ ఫెయిల్ అయిందని డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు గోల్డ్ బాబూ దగ్గరికి కొయిలి వస్తుంది. ఈ టైమ్ కి పార్టీలో ఉండి ఎంజాయ్ చేసేవాడిని అని గోల్డ్ బాబూ అంటాడు. మీరెందుకు టెన్షన్ పడుతారు. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు పార్టీ అరెంజ్ చేస్తానని కోయిలి చెప్తుంది. రంజిత్ దగ్గరికి వెళ్లి అర్జెంట్ గా ఒక లక్ష కావాలి గోల్డ్ బాబుకి పార్టీ కావాలట అని చెప్తుంది. ఇప్పటికే అప్పు చాలా చేసామని రంజిత్ అంటాడు. ఆ గోల్డ్ బాబుని ఇంప్రెస్ చేసి వాడి బంగారం మొత్తం లాగేసుకుందామని కోయిలి అనగానే రంజిత్ సరే అంటాడు. ఆ తర్వాత రాజ్, కావ్యకి ఇందిరాదేవి, అపర్ణ వీడియో కాల్ చేస్తారు. వాళ్ళ గెటప్ చూసి ఇందిరాదేవి వాళ్ళు నవ్వుకుంటారు.  ఎలాగైనా రాహుల్ కి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొని వస్తామని స్వప్నకి కావ్య ధైర్యం చెప్తుంది. మరొకవైపు పార్టీకి అన్నీ రెడీ చేసి కోయిలి ఫ్యాషన్ డ్రెస్ లో వస్తుంది. తనని చూసి రాహుల్ షాక్ అవుతాడు. ఇలాంటి బట్టలు ఎందుకు వేసావని అడుగుతాడు. నీకు ఇలాగే ఇష్టం కదా అని కోయిలి అంటుంది. నేను ఒక్కడే ఉన్నప్పుడు వేసుకోవాలి.. ఇలా అందరున్నప్పుడు కాదని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu: సుమన్ శెట్టి రెబల్.. ఇరగదీశాడుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో‌ సుమన్ శెట్టి ఆటతీరు రోజు రోజుకి పెరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో మొత్తం సుమన్ శెట్టినే కంటెంట్ ఇచ్చాడు. అతని ఆటకి దివ్య తోడైంది. ఇద్దరు కలిసి టాస్క్ ని పూర్తి చేశారు. నిన్నటి ఎపిసోడ్‌లో అందరూ గార్డెన్ ఏరియాలో ఉండగా ఒక మూల టెలిఫోన్ చూసి హౌస్‌మేట్స్ అవాక్కయ్యారు. వెంటనే తనూజ వెళ్లి ఇంట్లో నుంచి మనకి ఫోన్స్ వస్తాయేమోనంటూ గెంతులేసింది. ఇక ఫోన్ రింగ్ అవ్వగానే తనూజనే లిఫ్ట్ చేసింది. అయితే తీరా అది బిగ్‌బాస్ మాట్లాడటానికే పెట్టాడు. తనూజ.. మీ చుట్టూ ఉన్న వాళ్లందరూ మన మాటలు వింటున్నారు.. వాళ్లందరినీ దూరంగా వెళ్లమనండి.. నేను మీకు ఫోన్ ఎందుకు చేశానని మీరు అనుకుంటున్నారని బిగ్‌బాస్ అడిగాడు. బిగ్‌బాస్ మీరు అడిగారు కదా మీ విషెస్ ఏమైనా ఉంటే పేపర్లో రాసి పెట్టమని దాని గురించి అయి ఉంటుందని అనుకుంటున్నానని తనూజ చెప్పింది. లేదు మీరు తప్పు గెస్ చేశారు.. ఇప్పటినుంచి కంటెండర్‌షిప్ టాస్క్ మొదలైంది.. ఈ విషయాన్ని అందరికి చెప్పండని బిగ్‌బాస్ అన్నాడు. ఈ విషయం తర్వాత హౌస్‌మేట్స్‌ కి చెప్పినా వాళ్లు పెద్దగా నమ్మలేదు. ఇదేదో సీక్రెట్ టాస్క్ అనుకున్నారు. కాసేపటి తర్వాత రీతూతో కూడా ఫోన్‌లో మాట్లాడాడు బిగ్‌బాస్. నెక్స్ట్ రూల్స్ చెప్పాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హౌస్‌ మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరం. కానీ హౌస్ మేట్స్ అందరి మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు.. వారు మిమ్మల్ని ఈ పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు.. వారి నుంచి తప్పించుకొని ఆటలో కొనసాగడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను సమయానుసారం మీకు కొన్ని ఛాలెంజస్ ఇస్తాను.. మీరు ఆ ఛాలెంజస్‌లో గెలిస్తే ఒక సేఫ్టీ కార్డ్ పొందుతారు.. ఏ టీమ్ అయితే ఆ సేఫ్టీ కార్డ్ గెలుస్తుందో ఆ టీమ్ తమ సభ్యుల్లో ఒకరిని రెబల్ చేసి ఎలిమినేషన్ నుంచి రక్షించగలుగుతారు.. కానీ ఈ ఇమ్యూనిటీ తదుపరి ఛాలెంజ్ వరకూ మాత్రమే ఉంటుంది.. ఆ తరువాత నేను తదుపరి ఛాలెంజస్‌లో గెలిచే టీమ్‌కి ఆ సేఫ్టీ కార్డ్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ బదిలీ అవుతుంటుంది.. మీ మధ్య ఉన్న రెబల్‌ని గుర్తించి కేవలం నేను మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే రెబల్ ఎవరనేది చెప్పాలి.. అప్పటివరకూ అప్రమత్తంగా ఉండండి అంటూ అందరికి బిగ్‍‌బాస్ చెప్పాడు. ఒక్కొక్కరితో ఫోన్‌లో మాట్లాడాడు బిగ్ బాస్. ఆ తర్వాత సుమన్ శెట్టి రాగానే రెబల్ మీరే సుమన్.. చిట్స్ ద్వారా మీకు కొన్ని సీక్రెట్ టాస్కులు ఇస్తాను.. వాటిలో ఎక్కువ టాస్కులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తే మీరు కంటెండర్ అవుతారు.. అలానే మీరు సీక్రెట్ టాస్క్ పూర్తి చేసిన ప్రతిసారీ ఒకరిని మీరు ఈ కంటెండర్ రేసు నుంచి ఎలిమినేటర్ చేసే పవర్ లభిస్తుంది.. ఒకవేళ మీరు పట్టుబడితే కంటెండర్ షిప్ రేసు నుంచి మీరు తొలగిపోతారు.. మొదటి సీక్రెట్ టాస్క్ చిట్ బాత్రూంలోని వాష్ బేసిన్ కింద కేబినెట్‌లో అతికించి ఉంది.. ఆ స్లిప్ ఎవరు చూడనప్పుడు తీసుకొని టాస్క్‌ని విజయంవంతంగా పూర్తి చేయండి.. అని సుమన్ చెప్పాడు. దీంతో వాష్‌రూమ్ ఏరియా దగ్గరికెళ్లి ఆ స్లిప్‌ని సంపాదించాడు సుమన్. ఆ తర్వాత దివ్యకి రెండో రెబల్ అని, సుమన్ శెట్టి టాస్క్ ని ఇద్దరు ఫినిష్ చేయాలని చెప్పగా ఇద్దరు ఫినిష్ చేశారు.

Bigg Boss 9 Telugu:ఇమ్మాన్యుయేల్ కు సేఫ్టీ కార్డు.. రీతూపై దివ్య ఫైర్!

  బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్‌. ఇందులో భాగంగా హౌస్ లో ఓ టెలిఫోన్ పెట్టి హౌస్ లోని వాళ్ళకి సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు. ఇందులో భాగంగా సుమన్ శెట్టి, దివ్య రెబల్స్ గా ఉండి వారి టాస్క్ పూర్తి చేశారు. ఆ తర్వాత హౌస్ ని బ్లూ టీమ్, పింక్ టీమ్, ఆరెంజ్ టీమ్ అని మూడు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్. మూడు టీమ్ లకి తర్వాత బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా సీసాని మోకాలితో బ్యాలెన్స్ చేస్తూ డంబుల్స్‌తో అవతలి సైడ టవర్ ఏర్పాటు చేయాలి. అలా ఎవరు ముందు పూర్తి చేస్తారో వాళ్లు విన్. ఈ టాస్కు ఆడేందుకు ఆరెంజ్ టీమ్ నుంచి రాము రాథోడ్, ఇమ్నాన్యుయల్ వచ్చారు. బ్లూ నుంచి డీమాన్ పవన్, నిఖిల్ వచ్చారు. పింక్ టీమ్ నుండి దివ్య, సాయి శ్రీనివాస్ ఆడటానికి వచ్చారు. ఈ టాస్కులో రాము,ఇమ్మాన్యుయేల్ గెలిచారు. దీంతో ఈ టీమ్‌కి సేఫ్టీ కార్డ్ పంపించాడు బిగ్‌బాస్. ఆరెంజ్ టీమ్ అంతా ఆలోచించి చివరికి ఆ సేఫ్టీ కార్డుని ఇమ్మాన్యుయల్ కి ఇచ్చారు. ఆ తర్వాత అందరు భోజనానికి వెళ్ళారు. డీమాన్ భోజనం తింటుంటే రీతూ వచ్చి కూర్చుంది. దీంతో డీమాన్ ఒక ముద్ద తినిపించాడు. ఇది చూసి ఏయ్..నీకేమైందిరా తినడానికి అని దివ్య అంది. చెయ్యి మంటెక్కుతుందంటూ డీమాన్ సరదాగా అన్నాడు. ఎక్కడా ఎలా చూపించమని దివ్య అడిగింది. దీంతో బాబూ ఇయ్ చేయమని చెప్పలేదు.. ఓన్లీ మాట్లాడకుండా చూడమన్నారని డీమాన్ ఫైర్ అయ్యాడు. ఎందుకింత దగ్గరగా ఉండడం.. ఈ కంటెంట్ కూడా ఇస్తారా.. వీకెండ్‌లో నాకు ఈ క్లిప్ చూపించి దివ్య ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్పాలి నేను అంటూ దివ్య అరిచింది. ఒక్క నిమిషం నాకు అర్థం కావడం లేదు దివ్య.. మాట్లాడుకోవద్దని చెప్పారని రీతూ అంది. సరే రీతూ చేసుకోండని దివ్య అంది. తినేటప్పుడు ప్లీజ్ గొడవద్దు.. ఇప్పుడు తినిపిస్తే ప్రాబ్లమ్ ఏంటి అంటూ రీతూ అంది. మాట్లాడుకోవద్దంటే ఇవన్నీ కూడా చేయొద్దనే.. ఒకరి దగ్గర ఒకరు ఉండొద్దనే.. కుకింగ్ విషయం తప్ప.. అది సింపుల్ లాజిక్ పవన్.. దీంట్లో కూడా లూప్ హోల్స్ వెత్తుకుంటానంటే నేనేం చేయలేనంటూ దివ్య సీరియస్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి బ్రతిమిలాడితే తనతో కూడా గొడవ పెట్టుకుంది రీతూ. 

Suman Shetty: సుమన్ శెట్టి ప్రభంజనం.. కళ్యాణ్ కి షాకిచ్చిన రెబల్స్!

  బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం ఆటస్వభావమే మారిపోయింది. కథలో ట్విస్ట్ లు అన్నట్టు.. హౌస్ లో సీక్రెట్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి, దివ్య రెబల్స్ గా ఉండి తమ ఆటతీరుని కనబరిచారు. అద్భుతంగా ఆడి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో గెలిచారు.  హౌస్ మేట్స్ మూడు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్. తనూజ, ఇమ్మూ, గౌరవ్, రాము.. ఆరెంజ్ టీమ్, రీతూ, భరణి, నిఖిల్, డీమాన్..బ్లూ టీమ్, దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్ శెట్టిలని పింక్ టీమ్ సభ్యులుగా విభిజించాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అందరికి కాల్స్ వచ్చాయి. అయితే సుమన్ శెట్టి మొదటి రెబల్ అన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత దివ్యకి ఫోన్ వచ్చింది. రెబల్ సుమన్.. రెండవ రెబల్ కూడా ఉన్నారు అది మీరే.. సుమన్ దగ్గర రెబల్‌గా తను చేయాల్సిన సీక్రెట్ టాస్క్‌కి సంబంధించిన చిట్టి ఉంది.. ఆ టాస్క్ ఏంటంటే ఎవరైనా ముగ్గురు సభ్యులని వాళ్లు కూర్చున్న స్థానంలో నుంచి లేపి మీరు ఆ స్థానంలో కూర్చోవాలి.. ఎక్కువ టాస్కులు విజయవంతంగా పూర్తి చేస్తే మీ ఇద్దరికీ కంటెండర్ అయ్యే ఛాన్స్ లభిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు.  టాస్కు ప్రకారం ఏం చేయాలంటే హౌస్‌లో ఎవరైనా ముగ్గురినీ వాళ్లు కూర్చున్న ప్లేస్ నుంచి లేచేలా చేసి ఆ ప్లేస్‌లో వీళ్లు కూర్చోవాలి. ఈ టాస్కుని చాలా సింపుల్‌గా చేసేసింది దివ్య. భరణి, కళ్యాణ్, గౌరవ్, రీతూల మీద ఈ టాస్క్ కంప్లీట్ చేసింది. దీంతో టాస్క్ పూర్తి అయింది. ఇక తర్వాత నలుగురిలో కళ్యాణ్‌ని తీసేద్దామని దివ్య సుమన్‌కి సలహా ఇచ్చింది. ఎందుకంటే మిగిలిన దాంట్లో ఎవరిని తీసినా అందరికి డౌట్ వస్తుందని దివ్య చెప్పింది. దీంతో సైలెంట్‌గా కెమెరా దగ్గరికెళ్లి కళ్యాణ్‌ని తప్పిస్తున్నట్లుగా రెబల్స్ దివ్య-సుమన్ చెప్పేశారు. ఇక కాసేపటికి బిగ్‌బాస్ ఫోన్ చేసి ఇదే కళ్యాణ్‌.‌‌. మిమ్మల్ని రెబల్స్ తొలగించారు. మీ టీషర్ట్ స్టోర్ రూమ్ లో పెట్టమని, ఇదే విషయం అందరికి  చెప్పమన్నాడు. ఈ విదంగా సుమన్ శెట్టి, దివ్య కలిసి టాస్క్ పూర్తి చేశారు.

Tanuja Elimination: తనూజ ఎలిమినేషన్ ఫిక్స్.. ఫేక్ ఓటింగ్ ని గుర్తించిన ఆడియన్స్!

బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజ ఎలిమినేషన్ కన్ఫమ్.. ఎస్ నిజమే.. ఇది వందకి వంద శాతం నిజం.. ఎందుకంటే ఇది ఆడియన్స్ మాట.. అదే ఆడియన్స్ ఓటింగ్.. అదేంటది.. అన్ని పోల్స్ లో తనూజ టాప్ ఉందని అంటున్నారు కదా అని కొంతమంది అనుకోవచ్చు కానీ అసలు నిజమేంటో ఓసారి చూసేద్దాం. తనూజకి ప్రతీ నామినేషన్లో యాభై నుండి అరవై శాతం ఓటింగ్ పడుతోంది. అంటే ఒక పదివేల ఓట్లు మొత్తంగా పడితే వాటిల్లో ఆరువేల ఓట్లు తనూజకే పడుతున్నాయి. ఇదంతా బిగ్ బాస్ చేస్తున్న ఫేక్ ఓటింగ్ అని , పీఆర్ లు చేసే డూప్లికేట్ ఓట్లని తెలుస్తోంది. అందుకే ప్రతీ రివ్యూయర్ చాలా స్ట్రాంగ్ గా తనూజకి బిగ్ బాస్ విన్నర్ చేయాలని చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇది నిజమేనా అంటే నిజమే.. ఎందుకంటే తనూజ ఎంట్రీ రోజే.. తను అన్నపూర్ణ స్టూడియోస్ దత్తపుత్రిక అని నాగార్జున స్టేజ్ మీద చెప్పేశాడు. ఇక తను ఏం చేసినా పాజిటివ్ గా చూపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఫైనల్ ఓటింగ్ లో కూడా తనే టాప్ లో ఉంటుంది . దీనివల్ల జెన్యున్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. నామినేషన్స్ లో ఉన్నావారిలో తనూజ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానంలో పవన్ కల్యాణ్ పడాల, మూడో స్థానంలో సుమన్ శెట్టి ఉన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లో సంజనా, భరణి కొనసాగుతున్నారు. ఇక ఆరు, ఏడు స్థానాల్లో సాయి శ్రీనివాస్, రాము రాథోడ్ ఉన్నారు. అంటే ప్రస్తుతం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇలోపు ఓటింగ్ లో మార్పులు రావచ్చు. ఒకవేళ ఇదే ఓటింగ్ పడితే రాము రాథోడ్ కానీ సాయి శ్రీనివాస్ గానీ ఎలిమినేట్ అవ్వక తప్పదు.

Jayam serial : బాక్సింగ్ కావాలన్న రుద్ర గోల్ ని గంగ నిలబెడుతుందా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -103 లో.....పైడిరాజు తాగి ఇంటికి వస్తాడు. మీ అమ్మ హాస్పిటల్ కి పెట్టే ఖర్చు బదులు.. నాకు డబ్బు ఇవ్వు.. సారా దుకాణం పెట్టుకుంటానని పైడిరాజు అంటాడు. దాంతో వాళ్ళ నాన్నపై గంగ కోప్పడుతుంది. నువ్వు నా కన్నకూతురువి కాదని పైడిరాజు చెప్పబోతుంటే లక్ష్మీ ఆపుతుంది. మరొకవైపు శకుంతల ఇంట్లో నుండి బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి అని పెద్దసారు అంటాడు. రుద్రకి అమ్మాయిని చూడడానికి అని శకుంతల చెప్తుంది. ఏంటి ఈ మార్పు అని పెద్దసారు అడుగుతాడు. ఎన్ని కోపాలున్నా అది కొన్ని రోజులే.. అది దానివరకే మాత్రమే పరిమితమని శకుంతల చెప్తుంది. మరొకవైపు గంగ వాటర్ క్యాన్ వెయ్యడానికి రాలేదని రుద్రకి శ్రీను చెప్తాడు. దాంతో గంగని వెతుక్కుంటూ రుద్ర వెళ్తాడు. ఎందుకు అకాడమీకి రాలేదని రుద్ర అడుగుతాడు. మా అమ్మా గొప్పింటి వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పింది అందుకే అని గంగ చెప్తుంది. మరొక వైపు ఇషిక, శకుంతల, వీరు కలిసి పారు దగ్గర కి వెళ్తారు. అంటి మీకు నాకు కొన్ని సిమిలర్ క్వాలిటీ ఉంది.. ఇద్దరం ఒక్కప్పుడు రుద్రని ప్రాణంగా ప్రేమించాం.. ఒకే కారణం వల్ల దూరం చేశామని పారు అంటుంది. నువ్వు ఇప్పుడు రుద్రని పెళ్లి చేసుకోవాలి.. నీలాంటి గొప్పింటి అమ్మాయి కోడలుగా వస్తే గౌరవం గా ఉంటుందని శకుంతల అనగానే పారు షాక్ అయినట్లు యాక్టింగ్ చేస్తుంది. అదంతా ఇషిక, వీరు, పారు కలిసి ప్లానింగ్ చేసిందే. మరొకవైపు రుద్ర ఇచ్చిన పట్టీలు తిరిగి ఇస్తుంది. అందరు మనం ప్రేమించుకుంటున్నామని అనుకుంటున్నారంటూ గంగ చెప్తుంది. సమాజం గురించి పట్టించుకోవద్దని రుద్ర చెప్తాడు. ఇప్పుడు నా కుటుంబం ముఖ్యం అప్పు తీర్చాలని గంగ అంటుంది. నీ అప్పు తీరి.. మీ అమ్మకి వైద్యం చేయించాలంటే ఒక్కటే మార్గం నువు బాక్సింగ్ లో పోటీపడాలి.. ఛాంపియన్ కావాలి.. నీకు ట్రైనింగ్ నేను ఇస్తానని రుద్ర హామీ ఇస్తాడు. మరొకవైపు రుద్రని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావని.. నీకు ఈ పెళ్లి చేయడం లేదని శకుంతల అనగానే ముగ్గురు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : భద్రవతి కబ్జా చేసిన భూమిని సీజ్ చేసిన నర్మద.. రచ్చ రచ్చ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -307 లో..... అమూల్యకి విశ్వ ప్రపోజ్ చేస్తాడు. దాంతో ఒరేయ్ ఎంత ధైర్యంరా నీకు.. ఇప్పుడే వెళ్లి ఈ విషయాన్ని మా నాన్నతో చెప్తానని అమూల్య కోపంగా అక్కడ నుండి వెళ్తుంది. అదంతా చుసి విశ్వ దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. బండోడా ఎంత పని చేసావ్ రా అని అడుగుతుంది.. నేనేం చేశాను ప్రపోజ్ చేసానని విశ్వ అంటాడు. ఆ తర్వాత పని మీద రామరాజు రెండు రోజులు పక్క ఊరుకి వెళ్తాడు. దాంతో వేదవతి ఏడుస్తుంది. ఏంటి అక్కా.. బావ వెళ్ళేది పక్క ఊరుకి అది రెండు రోజులే.. ఆ మాత్రానికి నువ్వు ఇంతలా చెయ్యాలా అని తిరుపతి అంటాడు. మరొకవైపు ప్రేమ, ధీరజ్ ఇద్దరు గ్రౌండ్ కి వచ్చి రన్నింగ్ లో పోటీపడతారు. అందులో ప్రేమ గెలుస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటావా పోలీస్ డిపార్ట్ మెంట్ కి పర్ఫెక్ట్ అని ప్రేమ అంటుంది.. మరి ట్రై చేయ్యొచ్చు కదా అని ధీరజ్ అంటాడు. డ్యాన్స్ క్లాస్ చెప్తానంటేనే మావయ్య ఒప్పుకోలేదు.. అలాంటిది దీనికి ఒప్పుకుంటాడా వదిలేయ్ అని ప్రేమ అనగానే నీ కల నేను నెరవేరుస్తానని ధీరజ్ అనుకుంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మరొకవైపు అమూల్య వాళ్ళ నాన్నకి చెప్పడానికి ఇంటికి వస్తుంది. శ్రీవల్లి ఆపి ఈ రెండు కుటుంబాల్లో గొడవలు జరగడం ఎందుకని అమూల్యని డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత భద్రవతి అక్రమంగా భూమి కబ్జా చేసిన వాటిని నర్మద సీజ్ చేస్తుంది. ఆ విషయం తెలియడంతో భద్రవతి, సేనాపతి వచ్చి ఇద్దరు నర్మదతో గొడవపెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీపని సొంతకూతూరిలా చూసుకుంటున్న దశరథ్, సుమిత్ర.. హర్ట్ అయిన జ్యోత్స్న!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -506 లో..... సుమిత్ర వచ్చి జ్యోత్స్నతో మాట్లాడుతుంది. సుమిత్ర మాటలు జ్యోత్స్నకి చెంపపెట్టులాగా అనిపిస్తాయి. ఇప్పటివరకు మీ అమ్మ మాట్లాడిన విధానం చూస్తుంటే త్వరలోనే అసలైన వారసురాలు ఎవరో తెలుసుకొని నిన్ను ఇంట్లో నుండి గెంటెస్తారనిపిస్తుందని జ్యోత్స్నతో పారిజాతం అనగానే  జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇంకా బయపెట్టకు గ్రానీ అని తనపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఇక ఆ తర్వాత అందరు భోజనానికి కూర్చొని ఉంటారు. పారిజాతం వచ్చి శివన్నారాయణ పక్కన కూర్చోబోతుంటే.. వద్దు అటువైపు కూర్చొ అంటాడు. దీప, కార్తీక్ మీరు కూడా కూర్చోండి. ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరే అని శివన్నారాయణ అంటాడు. నాదొక రిక్వెస్ట్ సుమిత్ర.. మన మధ్యలో దీప కూర్చుంటుందని సుమిత్ర, దశరథ్ ఇద్దరి మధ్యలో దీపని కూర్చొబెట్టుకొని భోజనం వడ్డీస్తారు. దశరథ్.. నీ కూతురు జ్యోత్స్నని మర్చిపోయారా అని పారిజాతం అంటుంది. దీప ఎందుకు కాకూడదని దశరథ్ అనగానే జ్యోత్స్నకి మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రేమ పంచడానికి ఎవరైతే ఏంటని దశరథ్ అంటాడు. దీపని చూసి కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరు జంటలుగా ఉన్నారు ఒక్క జ్యోత్స్న నే సింగల్ గా ఉంది.. దానికి మంచి సంబంధం చూడండి అని శివన్నారాయణతో పారిజాతం అనగానే నువ్వు నాకు చెప్పనవసరం లేదు.. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందామని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత అందరు భోజనం చేసాక శివన్నారాయణ తన కూతురు అల్లుడికి బట్టలు ఇస్తాడు. ఇంకా దీప, కార్తీక్ లకి కూడా ఇస్తాడు. త్వరలోనే ఇంట్లో పెద్ద పార్టీ ఇవ్వబోతున్న దానికి అందరు రావాలి.. శ్రీధర్ చిన్న కుటుంబాన్ని కూడ తీసుకొని రా అని శివన్నారాయణ చెప్తాడు. దాస్ కుటుంబాన్ని కూడానా అని పారిజాతం అనగానే.. అవును., స్వప్న, కాశీ, దాస్ అందరు రావాలని శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : ఒకే బెడ్ పై కోయిలి, గోల్డ్ బాబు.. ముక్కలైన రాహుల్ మనసు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -869 లో.... కోయిలికి కావ్య చుక్కలు చూపిస్తుంది. కోయిలి ఫుడ్ బయట నుండి తెస్తే ఎందుకు తీసుకొని వచ్చావని తిడుతుంది కావ్య. నువ్వు ఇంట్లో వంట చెయ్ అని కావ్య అంటుంది. ఇంట్లో వంట చెయ్యడానికి కోయిలి నానాతంటాలు పడుతుంది. కావ్య దగ్గరుండి మరి కోయిలి చేత పని చేయిస్తుంది. మరొకవైపు రాహుల్ తో రాజ్ మాట్లాడుతాడు. కాసేపట్లో గోల్డ్ బాబూ రాబోతున్నాడని రాహుల్ తో రాజ్ చెప్తాడు. కోయిలి పనులు చేసి నీరసంగా రాహుల్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఈ అవతారం చూడలేకపోతున్నానని రాహుల్ అనగానే దాని ఒరిజినల్ అదే అని కావ్య అంటుంది. లేదు స్నానం చేసే వస్తే అందంగా ఉంటానని కోయిలి అంటుంది. అప్పుడే గోల్డ్ బాబు ఎంట్రీ ఇస్తాడు. తన మెడలో బంగారం చూసి కోయిలి టెంప్ట్ అవుతుంది. ఇక గోల్డ్ బాబు నాకు దుబాయ్ లో బోలెడన్ని బిజినెస్ లున్నాయని.. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చానని అంటాడు. నా కంపెనీ లో పెట్టండి అని కోయిలి అంటుంది. ఆ తర్వాత గోల్డ్ బాబుకి కోయిలి గది చూపిస్తుంది. గోల్డ్ బాబూ సూట్ కేసు లో గోల్డ్ బిస్కెట్ లు చూసి కోయిలి ఫ్లాట్ అవుతుంది. మరొకవైపు రాహుల్ కి రుద్రాణి ఫోన్ చెసి కావ్య, రాజ్ అక్కడికి వచ్చారట ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసాను.. నువ్వేం టెన్షన్ పడకని చెప్తుంది. రాజ్ సిస్టమ్ లో క్లయింట్ కి ఇవ్వాలసిన కొటేషన్ ని రుద్రాణి డిలీట్ చేపిస్తుంది. ఆ తర్వాత శృతి చూసేసరికి ఆ కొటేషన్ ఉండదు. వెంటనే రాజ్ కి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. దాంతో సుభాష్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. తరువాయి భాగం లో కోయిలి, గోల్డ్ బాబు ఒకే గదిలో బెడ్ పై ఉండడం రాహుల్ చూసి షాక్ అవుతాడు. కోయిలి కేర్ అఫ్ ఫ్లాట్ ఫామ్ అని రాహుల్ కి అసలు విషయాలన్నీ రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చేయి కోసుకున్న బిగ్ బాస్ మాధురి.. సంచలన వివరాలు ఇవే

  -మాధురి సంచలన వ్యాఖ్యలు  -బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది! -మొత్తం చెప్పేసింది -భరణి, డీమన్ పవన్, రీతూ చౌదరి పై కీలక వ్యాఖ్యలు    ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకునే ప్రేక్షకులు అత్యంత అమితంగా ఇష్టపడే రియాలిటీ షో బిగ్ బాస్ షో(Bigg Boss).కింగ్ నాగార్జున(Nagarjuna)హోస్ట్ గా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 'స్టార్ మా' వేదికగా ప్రసారం అవుతుంది. ఈ షో ద్వారా హౌస్ లోని కంటెంట్స్ తమకంటు ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. అలాంటి వాళ్ళల్లో 'దువ్వాడ మాధురి' ఒకరు. ఇరవై రెండు రోజుల క్రితం హౌస్ లోకి ప్రవేశించిన మాధురి ఎలిమినెట్ అవ్వడంతో బయటకి వచ్చింది.  రీసెంట్ గా మాధురి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని హౌస్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలని వెల్లడి చేసింది.   మాధురి మాట్లాడుతు నాకు ఓటింగ్ తగ్గిందంటే నేను నమ్మను. హౌస్ లో తమకి నచ్చిన వాళ్ళని ఉంచుతారు. నచ్చని వాళ్ళని బయటకి పంపిచేస్తారు. ఓటింగ్ విషయంలో గ్యాంబ్లింగ్ జరగవచ్చని నా నమ్మకం. హౌస్ లోకి వెళ్లిన రోజు నుంచే మా ఆయన గుర్తుకొచ్చి బయటకి వద్దామని అనుకున్నాను. పబ్లిక్ ఓట్ తో ఎలిమినేట్ అయిన భరణి మళ్ళీ పబ్లిక్ వోట్ తో ఎలా హౌస్ లోకి  వస్తాడు. ఆయన గురువు గారు నాగబాబు(Nagababu)గారి వల్లనే హౌస్ లోకి వచ్చాడు.   భరణి తో నేను డాన్స్ చెయ్యడంలో కొంత మంది అశ్లీలత చూస్తున్నారు. ఇద్దరం చాలా దూరంగా డాన్స్ చేసాం. ఈ విషయంలో నన్ను ట్రోల్ చేసే వాళ్ళు అమ్మకి పుట్టలేదు   బిగ్ బాస్ ఫస్ట్ టైం ఆఫర్ వచ్చినా వదులుకున్నాను. నేను చేయి కోసుకుని శ్రీనివాస్ గారిని ఒప్పించాననే వార్తలు కూడా అబద్దం. స్కిప్టెడ్ షో కాదు. రీతూ, డీమాన్ పవన్ ల లవ్ మాత్రం ఫేక్. ఓటింగ్ కోసం ఆలా క్యూట్ గా లవ్ లీగా మాట్లాడుకుంటు ఉంటారు.   Also read :  అగ్ర హీరోపై 100 కోడిగుడ్లతో అమ్మాయిల దాడి   నాకు అది నచ్చలేదు. అందుకే ఆ ఇద్దరిది 'అన్ హెల్త్ రిలేషన్' అని వాదన చేశాను. నేను నా మొగుడు కోసం ఏమైనా త్యాగం చేస్తాను. హౌస్ లో నుంచి బయటకి కూడా అందుకే వచ్చాను. కానీ ఆ ఇద్దరు త్యాగాలు చేసుకోలేరు. అందుకే అది అన్ హెల్త్ రిలేషన్. మాది 'ఫెయిర్ రిలేషన్'. మా అమ్మాయి డీమాన్ తో మాట్లాడకుండా చూడమని రీతూ పేరెంట్స్ కూడా నాతో చెప్పారు.  భరణి, దివ్య కూడా నచ్చలేదు.  కళ్యాణ్ ఆర్మీ వృత్తిని నేను విమర్శించలేదు.   మా శ్రీకాకుళం జిల్లావాడిగా బాగుండాలని అనుకున్నాను. తనూజ వెనక కళ్యాణ్ పడుతున్నాడు. తనూజ ఏమో అతన్ని వాడుకుంటుంది. ఈ విషయం బయట అందరికి కూడా అర్ధమయ్యింది.పైగా  కళ్యాణ్ అమ్మాయి పిచ్చోడు. ఆడవాళ్ళ పై చేయి వేస్తాడు. బిగ్ బాస్ కోసం ఆర్మీ ని వదిలేసాడని మాట్లాడుకుంటుంటే  జాగ్రత్తలు చెప్పాను. హౌస్ లో నేను ఉన్నన్ని రోజులు ఫేమ్ కోసం  తనూజ వెనక నేనేమి పడలేదని మాధురి చెప్పుకొచ్చింది.