Bigg Boss 9 Telugu 10th week:  పోరాడిన సుమన్ శెట్టి.. సంజన గెలుపు.. సంఛాలక్ గా కళ్యాణ్ ఫెయిల్!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం బీబీ రాజ్యం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం అంతా ఇదే సాగుతుంటుంది. అయితే నిన్న జరిగిన మొదటి టాస్క్ లో సంజన ఓడిపోతుంది దాంతో సుమన్ శెట్టి తో మరో గేమ్ ఆడాల్సి వస్తుంది. కమాండర్ ఎంచుకున్న సభ్యుడు కమాండర్ అవ్వడానికి బిగ్‌బాస్ పెట్టిన పోటీ 'బిల్డ్ ఇట్ టూ విన్ ఇట్'.. ఈ పోటీలో కమాండర్ సంజన విజయం సాధిస్తే తన స్థానాన్ని కాపాడుకోగలుగుతుంది. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు కొత్త కమాండర్ అవుతారన్నమాట.. ఈ పోటీలో గెలవడానికి పోటీదారులు బజర్ మోగగానే తమకి కేటాయించిన బాక్సులని ఒక్కొక్కటిగా తీసుకొని స్క్వేర్ లోపల ఒక బాక్సుపై మరో బాక్సు ఉండేలా ప్లేస్ చేసి టవర్‌ని నిర్మించాలి.. బజర్ మోగే సరికి ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్లు ఈ పోటీలో గెలిచి కమాండర్ అవుతారు.. ఈ టాస్కుకి కళ్యాణ్ సంఛాలక్ అని బిగ్‌బాస్ చెప్పాడు. సంజనకి సుమన్ శెట్టి ఫుల్ పోటీ ఇస్తూ బాక్సు మీదకి బాక్సు ఎగరేసి మరీ నిలబెట్టాడు. దీంతో సుమన్ ఆట చూసి అందరు క్లాప్స్ కొడుతూ సపోర్ట్ చేశారు. అలా చివరికి సంజన-సుమన్ ఇద్దరు ఒకే ఎత్తులో టవర్ కట్టేశారు. దీంతో కళ్యాణ్‌కి ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కానీ పరిస్థితి వచ్చింది. దీంతో టవర్ ఎప్పుడైనా స్ట్రయిట్‌గా ఉండాలనుకుంటాం.. అలానే సంజన గారు నిర్మించిన టవర్ స్ట్రయిట్‌గా స్ట్రాంగ్‌గా పర్ఫెక్ట్‌గా ఉంది కనుక అని కళ్యాణ్ తన డెసిషన్ చెప్పబోయాడు. ఇంతలో టవర్ ఏ పొజిషన్‌లో ఉన్నా ఫర్లేదు అన్నావ్ కదా అంటూ తనూజ అడిగింది. నేను వాళ్ల గేమ్‌లో స్పిరిట్ పెంచడానికి అలా చెప్పాను.. ఇస్తానా ఇవ్వనా అనేది నా డెసిషన్.. మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలానే చూస్తారు.. కానీ నేను ఇద్దరివీ చూడాలంటూ కళ్యాణ్ చెప్పాడు. అలా అయితే లాస్ట్ బాక్స్ ఆయనే ముందు పెట్టాడు కదా అప్పుడు ఆయనదే ఎక్కువసేపు స్టేబుల్‌గా ఉన్నట్లు కదా అంటూ దివ్య కూడా అడిగింది. అయినా కానీ ఇది నా డెసిషన్ అంటూ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు. ఇక కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనూజ గట్టిగా గొడవ చేసింది. కళ్యాణ్ నువ్వు ముందు చెప్పాల్సింది.. స్ట్రయిట్‌గా ఉండాలని. నీకు నచ్చినట్లు చెప్పేసి ఇప్పుడు మారుస్తానంటే ఎలా కుదురుతుందంటూ తనూజ అంది. దీంతో ఇదిగో నీకు సగం సగం అర్థమైందని అలా చెప్పకు.. నీకు ఇష్టమొచ్చినట్లు చెప్తే వినడానికి రెడీగా ఎవడూ లేడిక్కడ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నువ్వు చెప్పిన మాట మీద లేవు కళ్యాణ్.. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పిన పాయింట్ వేరు.. అయిపోయాక చెప్తున్న మాటలు వేరు అని తనూజ వాయిస్ రేజ్ చేసింది‌. నీకు అదే చెప్తున్నా తనూజ.. అదే వద్దు.. సంఛాలక్ గా నా డెసిషన్ ఫైనల్ అంటూ కళ్యాణ్ అన్నాడు. ఇక ఇద్దరి మధ్య చాలాసేపు గొడవ సాగింది. సరే అయితే కూర్చో.. నేను అది ఇవ్వను.. కూర్చో నేను ఇవ్వను తనూజ.. అంటూ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. దీంతో ఫెయిల్ సంఛాలక్.. అంటూ తనూజ అరిచింది. వెరీ గుడ్ నైస్ స్టేట్‌మెంట్ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. పెట్టుకో.. ఇచ్చుకో.. అంటూ తనూజ సెటైర్లు వేసింది. దీంతో సంజన గెలిచిందంటూ కళ్యాణ్ చెప్పేసి నిలబెట్టిన బాక్సుల్ని తనూజ మీద కోపంతా గట్టిగా గుద్దిపడగొట్టాడు.

Bigg Boss 9 Telugu 10th week: సంఛాలక్ గా రీతూ ఫెయిల్.. డీమాన్ కి ఫుల్ సపోర్ట్!

  బిగ్ బాస్ హౌస్ లో పదో వారం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో కంటెస్టెంట్స్ ని బీబీ రాజ్యంగా డిసైడ్ చేశారు. ఇందులో రాణి, రాజులు, ప్రజలుగా కంటెస్టెంట్స్ ని డివైడ్ చేసి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కమాండర్స్‌లో ఒకరు వాళ్ల స్థానాన్ని రిస్క్‌లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితోటి పోరాడాల్సి ఉంటుంది. ఈ పోటీలో వాళ్లు విజయం సాధిస్తే కమాండర్‌గా తమ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు వాళ్ల స్థానాన్ని తీసుకొని కొత్త కమాండర్ అవుతారు. ఇక కమాండర్స్ నలుగురిలో ఎవరు ప్రజలతో పోరాడతారో తెలుసుకోవడానికి ముందుగా ఒక పరీక్ష పెట్టాడు. అందులో ఓడిపోయినవారు ప్రజలతో పోటీపడాల్సి ఉంటుంది.. ఇందుకోసం కమాండర్స్‌కి 'విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్' అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్కులో భాగంగా బాస్కెట్లను కమాండర్స్ బ్యాగులో వెనకవైపు ధరించాలి.. బెల్ మోగగానే ట్రేలో ఉన్న బాల్స్‌ని తీసుకొని ఇతర కమాండర్ల బాస్కెట్లలోకి వేయాలి.. ప్రతీ రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయి తమ కమాండర్ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పుకుంటారు. చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్‌లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్లు తన స్థానాన్ని రిస్క్‌లో పెట్టి ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుంది.. గేమ్ మొత్తం బ్లూ లైన్‌కి లోపలే ఉండి ఆడాలంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. రీతూ ఈ గేమ్‌కి సంఛాలక్‌ గా ఉంది. అయితే ఫస్ట్ రౌండ్‌లోనే తనూజ మీదకి రావడంతో డీమాన్ అనుకోకుండా లైన్ దాటేశాడు. కానీ రీతూ నువ్వు నెట్టేశావంటూ తనూజపై ఫైర్ అయి డీమాన్‌ని ఆడించేసింది. సేమ్ అదే రౌండ్‌లో నిఖిల్ కూడా లైన్ క్రాస్ చేసినా రీతూ మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత డీమాన్ మళ్లీ ఔట్ అయ్యాడు. అయినా కానీ రీతూ వార్నింగ్ అంటూ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. ఇలా డీమాన్‌ని గెలిపించడానికే రీతూ సంఛాలక్ అయినట్లుగా అనిపించింది. అయితే ఫస్ట్ రౌండ్‌లో తక్కువ బాల్స్ ఉన్న నిఖిల్ సేఫ్ అంటూ రీతూ ఫస్ట్ అనౌన్స్ చేసింది. కానీ బిగ్‌బాస్ మళ్లీ అడగ్గానే నిఖిల్ ఈ రౌండ్‌లో బయటికెళ్లిపోయాడు కనుక తనూజ సేవ్ అయిందని చెప్పింది. ఆ తర్వాత రౌండ్‌లో డీమాన్ సేఫ్ కాగా, చివరి రౌండ్‌లో నిఖిల్ గెలిచాడు. ఇలా సంఛాలక్ రీతూ తీసుకున్న డెసిషన్స్ వల్ల సంజనతో పెద్ద గొడవ అయింది. మరి ఊ టాస్క్ లో రీతూ సంఛాలక్ గా ఫెయిలో కాదో కామెంట్ చేయండి.  

Bigg Boss 9 Telugu 10th week:  బీబీ రాజ్యంలో కంటెస్టెంట్స్.. రాజు, రాణులు, ప్రజలు ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ‌ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. ఈ వారం కంటెస్టెంట్స్ అందరిని డివైడ్ చేసి.. బిబి రాజ్యంగా చేశాడు బిగ్ బాస్. రీతూ, కళ్యాణ్, దివ్య ఈ వారానికి బీబీ రాజ్యానికి రాజు, రాణులు.. వీళ్లకి ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి.. వీరికి బెడ్‌రూమ్‌‌లో నివసించే హక్కు ఉంది.. అలాగే పూర్తి ఇంటికి యాక్సెస్ కూడా లభిస్తుందంటూ చాలానే వరాలు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్లకి ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అని వీళ్లు సేఫ్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్లని ఓడించి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతావారికి కూడా అవకాశం లభించనుంది.. ఇలా వారం ముగిసేసరికి అందరిలో ఒక్కరే ఇమ్యూనిటీ పొందుతారు.. ఆ ఒక్కరే ఈ ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక రాజు, రాణులు కలిసి ఇంటి సభ్యులందరిని నలుగురు కమాండర్స్‌గా అలానే నలుగురు ప్రజలుగా విభజించాలని బిగ్‌బాస్ చెప్పాడు. కమాండర్స్‌కి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వారికి కూడా ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. ఇక ప్రజలకి ఎలాంటి అవకాశం లేదు.. అలానే ఇంటి పని అంతా వాళ్లే చేయాల్సి ఉంటుంది. ఇక పవర్ రాగానే దివ్య-రీతూ మాములు ఎక్స్‌ట్రాలు చేయలేదు. ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసినట్లుగా కొశ్చన్స్ అడిగారు. చివరికి కమాండర్లుగా నిఖిల్, సంజన, తనూజ, డీమాన్‌లని సెలెక్ట్ చేశారు. దీంతో కమాండర్స్ ఇప్పటినుంచి రోజ్ రూమ్‌లో ఉంటారు.. ప్రజలు మాత్రం బయట డెన్‌లో ఉండాలని బిగ్‌బాస్ చెప్పాడు. అలానే రాజు, రాణులు, కమాండర్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. పూర్తి పనులన్నీ ప్రజలు అయిన భరణి , ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, గౌరవ్ మాత్రమే చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. కాసేపటి తర్వాత భరణిని పిలిపించుకొని హెడ్ మసాజ్ చేయించుకుంది దివ్య. నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది భరణి గారిని పిలిచి హెడ్ మసాజ్ చేయించండి అంటూ డీమాన్‌కి దివ్య ఆర్డర్ వేసింది. దీంతో భరణిని పిలిపించి హెడ్ మసాజ్ చేయించాడు డీమాన్. అక్కడ కాసేపు సరదాగా సాగింది. 

Bigg Boss 9 voting 10th week :  ఓటింగ్ లో పవన్ కళ్యాణ్  టాప్.. లీస్ట్ లో దివ్య, నిఖిల్!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం ఒక్క ఇమ్మాన్యుయల్ తప్ప హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా నామినేషన్లో ఉన్నారు. ఇక ఈ వారం కళ్యాణ్ పడాల ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు. లీస్ట్ లో నిఖిల్ ఉన్నాడు. ఎవరు ఏ స్థానాలలో ఉన్నారో ఓసారి చూసేద్దాం. సోమవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తనూజ స్పెషల్ కేటగిరీ కాబట్టి ట్రోఫీ కూడా ఫిక్స్ కాబట్టి ఆమె నామినేషన్స్‌లో ఉన్నా లేనట్టే. ఇక సుమన్ శెట్టి, కళ్యాణ్, రీతూ చౌదరిలు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. మిగిలిన వాళ్లలో భరణి, డీమాన్ పవన్‌, సంజనలకు ఓటింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. పైగా వీళ్లకంటే వీక్ కంటెస్టెంట్స్ ఈవారం ఓటింగ్‌లో ఉండటంతో వీళ్లకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎటొచ్చీ.. గౌరవ్, నిఖిల్, దివ్య నిఖిత ఈ ముగ్గురూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేషన్ కూడా ఈ ముగ్గురిలోనే ఉండబోతుంది. ప్రెజెంట్ ఓటింగ్ ప్రకారం చూస్తే లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నది మాత్రం డీమాన్ పవన్, నిఖిల్.. అయితే వీళ్ళిద్దరి కంటే గౌరవ్ కాస్త గట్టిగానే ఓట్లు పడుతున్నాయి.  ఓటింగ్ లో అత్యధికంగా కళ్యాణ్ కి  22 శాతం ఓట్లు పడ్డాయి. అంటే కళ్యాణ్ పై ఏ రేంజ్‌లో ఓటింగ్ పడుతుందో అర్థం చేసుకోవచ్చు. రేస్‌లో మొత్తం పది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. కళ్యాణ్ కి 22 శాతం ఓట్లు పడ్డాయి అంటే  అతనికి పీఆర్ టీమ్ ఏ రేంజ్ లో వర్క్ చేస్తుందో తెలుస్తోంది. ఇక ముద్ద మందారం తనూజ ఆడియన్స్ అందరి చెవుల్లో మందార పూలు పెడతూ సెకెండ్ స్థానంలో ఉంది. సుమన్ శెట్టి నాల్గవ స్థానంలో ఉండగా భరణి అయిదో స్థానంలో ఉన్నాడు.  రీతు చౌదరి ఆరో స్థానంలో ఉంది. సంజనా గల్రానీ ఏడో స్థానంలో ఉండగా దివ్య నిఖిత ఎనిమిదో స్థానంలో ఉంది. డీమాన్ పవన్ తొమ్మిది, నిఖిల్ పదో స్థానంలో ఉన్నారు. డీమాన్ పవన్ ని బిబి టీమ్ సేవ్ చేస్తారు. ‌అంటే ఈ వారం దివ్య, నిఖిల్ లో ఎవరో ఒకరు బయటకు వచ్చేస్తారన్న మాట. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉంటారో చూడాలి మరి.

Jayam serial : పారుకి చీర సెలెక్ట్ చేసిన రుద్ర.. గంగ ఏడపు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -110 లో......అందరు భోజనం చేస్తారు. నేను పారుని డిన్నర్ కి పిలిచానని శకుంతల చెప్తుంది. పారు, రుద్రలకి పెళ్లి అంటే ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. అందరు డల్ గా ఉంటారు. పారు మన ఇంటికి కోడలుగా వస్తే కుటుంబ గౌరవం పెరుగుతుందని శకుంతల అంటుంది. ఎలా అని పెద్దసారు అడుగుతాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇచ్చి ఎలా కుటుంబ గౌరవం పెరుగుతుంది అనేగా మీ డౌట్.. నేను నేషనల్ ఛాంపియన్ ని రుద్ర ఒక్కప్పుడు ఛాంపియన్.. ఇది చాలదా ఇద్దరు ఛాంపియన్ లు ఒకే కుటుంబంలో ఉంటే మీకే  కదా గౌరవం అని పెద్దసారుతో పారు అంటుంది. నువ్వు రుద్రకి కాబోయే భార్యవి కదా వెళ్లి నువ్వే రుద్రకి భోజనం వడ్డీంచని పారుతో శకుంతల అంటుంది. మరొకవైపు కోచ్ వచ్చి రుద్ర సర్ కి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఇక రాడు నన్నే  చూసుకోమ్మన్నాడు అని చెప్పగానే గంగ ఏడుస్తుంది. మరొకవైపు పెళ్లికి చీరలు సెలక్షన్ చేస్తారు. రుద్ర నాకు చీర సెలక్షన్ చెయ్యాలని పారు అంటుంది. దాంతో రుద్రకి ఇష్టం లేకున్నా సెలెక్ట్ చేస్తాడు. అప్పుడే గంగ ఫోన్ చేసి ప్రాక్టీస్ చెయ్యమన్నారు మీరు రావాలి కదా అని అడుగుతుంది. వస్తాను నువ్వు ప్రాక్టీస్ చేయమని రుద్ర చెప్తాడు. గంగతో రుద్ర మాట్లాడడం ఇషిక, వీరు వింటారు. వీళ్ళ మధ్యలో ఇంకా దూరం పెంచాలని ఇషిక అంటుంది. పారుకి సెలక్షన్ చేసిన చీర గంగ కట్టుకుంటే ఆ విషయం పారు, శకుంతల అత్తయ్యకి తెలిసేలా చెయ్యాలని ఇద్దరు ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో రుద్ర సర్ పంపారని గంగకి ఒకతను చీర తీసుకొని వచ్చి ఇస్తాడు. అది గంగ కట్టుకుంటుంది. ఆ విషయం శకుంతల వాళ్ళకి తెలుస్తుంది. గంగ దగ్గరికి రుద్ర వచ్చి చెంపచెల్లుమనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : సేనాపతిని పట్టించిన ఆ క్లూ.. నర్మద మాస్ వార్నింగ్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -313 లో..... నర్మద ఏ తప్పు చెయ్యలేదని అసలు నేరస్తులు వేరే ఉన్నారని.. వాళ్ళని కనిపెట్టే పనిలో అధికారులు ఉన్నారని న్యూస్ లో వస్తుంది. అది చూసి వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ఆ న్యూస్ చూసి భద్రవతి, సేనాపతి టెన్షన్ పడుతారు. ఆ కుట్ర వెనకాల మనం ఉన్నామని తెలిసి ఉంటుందా అని సేనాపతి భయపడుతాడు. కాసేపటికి  సేనాపతి దగ్గరికి పోలీసులు వస్తారు. అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే అప్పుడే నర్మద వస్తుంది. ఏంటి సర్ వీళ్ళకి మీరే కుట్ర చేసినట్లు ఎలా తెలిసిందని అనుకుంటున్నారా అని నర్మద అంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఒక క్లూ మాత్రం వదిలేసారు.. మీరు అతనికి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన స్టేట్ మెంట్ సంపాదించానని నర్మద అంటుంది. నా బ్యాంకు డీటెయిల్స్ ఎలా వచ్చాయని సేనాపతి అనగానే ప్రేమ మొన్న రాత్రి ధీరజ్ పై కోపంగా వెళ్లి వాళ్ళ నాన్న ఫోన్ నుండి డీటెయిల్స్ తీసుకుంటుంది.. అది విని సేనాపతి షాక్ అవుతాడు. ఏం బ్రతుకులురా మీవి తప్పు సరిదిద్దుకోవాలి గానీ ఇలా చేస్తారా.. అక్కడ ఉంది నా కోడలు అని సేనాపతిపై రామరాజు కోప్పడతాడు. నాన్న మంచి బహుమతి ఇచ్చావ్ అని ప్రేమతో సేనాపతి అంటాడు. ఆ తర్వాత సేనాపతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఏమో అన్నారు పిన్ని గారు అని భాగ్యం వాళ్ళకి నర్మద వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నర్మద జాబ్ పోగొట్టాలని నువ్వు వాళ్ళతో అన్నావ్.. ఆ విషయం గనుక తెలిస్తే మన పరిస్థితి ఏంటని వాళ్ళ అమ్మతో చెప్తూ శ్రీవల్లి భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : భర్త కోసం  సీఈఓ పదవిని వద్దనుకున్న దీప.. పారిజాతం షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -512 లో.. దీప సీఈఓ అన్న ఆలోచనని శివన్నారాయణకి కలిగేలా చేస్తుంది జ్యోత్స్న. నా భార్యని సీఈఓగా ప్రపోజ్ చేస్తున్నాను.. మీ ఒపీనియన్ చెప్పండి అని కార్తీక్ బోర్డు మెంబర్స్ తో చెప్తాడు. నేను సీఈఓ ఏంటని దీప అక్కడ నుండి బయటకు వెళ్తుంది. నా కోసం నువ్వు ఈ నిర్ణయం ఒప్పుకోవాల్సిందేనని అనడంతో దీప మళ్ళీ లోపలికి వస్తుంది. అసలు సీఈఓగా తనకి ఏం అర్హత ఉందని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు అర్హత ఉండి ఏం సాధించావని  జ్యోత్స్నని కార్తీక్ అడుగుతాడు. నా భార్య అర్హత గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు చెప్పి తీరాలని దీప గురించి కార్తీక్ చెప్తాడు. తను వాళ్ళ నాన్నకి వంటలో సహాయం చేసేది.. అప్పుడే మంచి వంటలు నేర్చుకుంది అంతే కాకుండా నేను సత్య రాజ్ రెస్టారెంట్ తీసుకున్నప్పుడు తనే ఆ సంస్థ ముందుకి రావడానికి హెల్ప్ చేసింది.. కొత్త వంటకాలు పరిచయం చేస్తూ సంస్థ అభివృద్ధిలో తను భాగం అయిందని దీప గురించి కార్తీక్ గొప్పగా చెప్తాడు. ఇప్పుడు ఓటింగ్ పెడుదాం.. ఎవరికి ఎక్కువ ఓట్స్ పడితే వాళ్లే సీఈఓ.. ఇందులో ఓన్లీ బోర్డు మెంబర్స్ మాత్రమే పాల్గొన్నాలని శివన్నారాయణ చెప్తాడు. అందరు దీపకి ఓట్లు వేస్తారు.. దాంతో కొత్త సీఈఓ దీప అని శివన్నారాయణ చెప్తాడు.  అందరికి థాంక్స్.. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు అని దీప చెప్తుంటే పారిజాతం లేచి దీపని కత్తితో  పొడవడానికి వెళ్తుంటే.. నాకు ఈ పదవి ఇష్టం లేదని దీప అంటుంది. దాంతో పారిజాతం ఆగిపోయి ఇదెక్కడి ట్విస్ట్ అని అనుకుటుంది. నాకు ఏం అర్హత ఉందని ఈ బాధ్యత ఇచ్చారు.. నా స్థానం అది అయితే నా భర్త స్థానం ఏంటని దీప అడుగుతుంది. ఇంకేంటి డ్రైవర్ అని జ్యోత్స్న అంటుంది. నాకన్నా తక్కువ స్థాయిలో నా భర్త ఉండడం నాకు ఇష్టం లేదు.. దయచేసి నన్ను క్షమించండి అని దీప అందరికి చెప్తుంది. మరి ఇప్పుడు కొత్త సీఈఓ ఎవరు అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే మెట్లు ఎక్కుతు ఎవరో ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ ఫేస్ రీవీల్ చెయ్యలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : స్వప్న ముందు యాక్ట్ చేసిన రాహుల్.. రుద్రాణి షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -875 లో...... రాహుల్ ఇంటికి వచ్చాక అందరు తిడుతారు. ఇప్పటికైనా మనిషి లాగా మారు అని అంటారు. నేను మారుతానని స్వప్నకి రాహుల్ మాటిస్తాడు. ఇంత పెద్ద కుటుంబంలో ఎవరు తప్పు చేసిన అది అందరికి శిక్షే. నువ్వు మారావు అని మాటలతో కాదు నిరూపించు అని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత రాహుల్ దగ్గరికి రుద్రాణి వెళ్లి.. ఏంట్రా అందరి ముందు తప్పు చేసినవాడిలా తలదించుకుంటున్నావ్.. ఆ తప్పు చేయడానికి ఇంట్లో వాళ్లే కారణం కదా. నువ్వు మారడం ఏం అవసరం లేదు.. నేనున్నా కదా.. నన్ను ఫాలో అవ్వు.. నేను చూసుకుంటానని రుద్రాణి అంటుంది. లేదు మమ్మీ నేను తప్పు చేసానంటే అందరు నమ్మారు రాజ్, కావ్య నమ్మలేదు.. నన్ను బయటకు తీసుకొని వచ్చారు. ఇకనైనా మారాలని రాహుల్ అంటాడు‌. అదంతా దూరం నుండి స్వప్న వింటుంది. రాహుల్ మారిపోయాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య తనకి ఇష్టమైనవి చేయాలని రాజ్ తో చెప్తుంది. ఇప్పుడు చికెన్ తినాలని ఉంది అంతే కదా సరే చేసి పెడతానని కిచెన్ లోకి వెళ్లి టార్చు ఆన్ చేసి వంట చేస్తాడు. లైట్ వేసుకోవచ్చు కదా అని కావ్య అంటుంది. లైట్ వేస్తే అందరికి తెలిసిపోతుంది. ఇంట్లో వాళ్ళు వచ్చి ఎగబడి తినేస్తారని రాజ్ అంటాడు కానీ అప్పటికే ఇంట్లో వాళ్ళు అందరు రాజ్ మాటలు విని కోపంగా ఉంటారు. వాళ్ళని రాజ్ చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో కంపెనీలో ఫ్రాడ్ చేస్తే డబ్బు ఇస్తానని ఒకతను రాహుల్ దగ్గరికి వచ్చి డబ్బు ఆఫర్ చేస్తే చెయ్యనని రాహుల్ అంటాడు. అది చూసి రాహుల్ మారిపోయాడని స్వప్న అనుకుంటుంది. ఎలా ఉంది మమ్మీ నా యాక్టింగ్ ఇదంతా నా భార్య దృష్టిలో నమ్మకం కలిగేలా చెయ్యడానికి అని రాహుల్ అనగానే రుద్రాణి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చైతన్య మాష్టర్ కి 5 లక్షలు ఇచ్చా సినిమా కార్డు కోసం....

ఢీ 10 రాజు అంటే ఢీ షోలో ఫుల్ ఫేమస్ అలాంటి రాజు ఈ సీజన్ లో పండు, అభి మాష్టర్స్ తో పోటాపోటీగా డాన్స్ చేస్తున్నాడు. ఐతే ఒక ఇంటర్వ్యూలో తన కష్టాలను ఇలా చెప్పుకొచ్చాడు. "చైతన్య మాష్టర్ కి 5 లక్షలు ఇచ్చాను. ఆయన యూనియన్ లో ఇంకో మాష్టర్ కి ఇచ్చారు. నాకు కార్డు కోసం అని. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలీదు. ఇచ్చి కూడా నాలుగేళ్లు ఐపోయింది. నాకు ఇంకా కార్డ్ కూడా రాలేదు. ఆయన డబ్బులు ఎవరికీ ఇచ్చారో తెలీదు. కార్డు లేకుండా కోరియోగ్రఫీ చేయలేను. చాలా మూవీ ఆఫర్స్ వచ్చి వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు మూవీ కార్డు తీసుకోవాలంటే 6 లక్షలు కట్టాలి. నాకు ఆస్తులేమీ లేవు. అప్పట్లో రెండు ఇల్లు, అమ్మ వాళ్ళ ఊరిలో తోటలు ఉన్నాయి. డాడీ మొత్తం అమ్మేశారు. నాకంటూ ఇప్పుడు ఏమీ లేదు. పేరు ఉంది కానీ డబ్బులు లేవు. ఫామిలీని నేనే చూసుకోవాలి కాబట్టి డబ్బులు ఎన్ని వచ్చినా ఐపోతున్నాయి. కార్డు వస్తుంది అని ఆశలు పెట్టుకున్నా. కానీ డబ్బుదేముంది ఇప్పుడు మనిషే పోయాడు కదా అని బాధగా ఉంది. అలాగే నా లైఫ్ లో ఇంకో కష్టం ఉంది. రెంట్ కోసం తిరుగుతున్నప్పుడు ఎక్కడికెళ్లినా డాన్సర్ అంటే రెంట్ కి ఇవ్వము అని చెప్పేవాళ్ళు. దాంతో నాకు కోపం వచ్చి డైరెక్ట్ విల్లా దగ్గరకు వెళ్లి రెంట్ అడిగితె నెలకు 60 వేలు అన్నారు. ఎం చేస్తావని అడిగితె డాన్సర్ అని చెప్పాను. ఐతే సాఫ్ట్ వేర్ వాళ్లకు తప్ప డాన్సర్స్ కి ఇవ్వము అని చెప్పారు. 70 వేలైనా రెంట్ ఇస్తాను అన్నాను. కానీ ఇవ్వము అని చెప్పారు. త్వరలో సొంత ఇల్లు ఎలాగైనా కొనుక్కోవాలి" అని చెప్పాడు ఢీ 10 రాజు.

Bigg Boss 9 Nominations Tenth Week : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. పదో వారం నామినేషన్లో ఉంది ఎవరంటే!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం నామినేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి అయింది.ఇమ్మాన్యుయల్, భరణి ని నామినెటే చేసాడు. దివ్యని రీతు నామినేట్ చేయగా నిఖిల్ ని కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత సంజన, దివ్యలని గౌరవ్ నామినేట్ చేసాడు. నిఖిల్ ని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. గౌరవ్ ని తనూజ నామినేట్ చేసింది.ఆ తర్వాత గౌరవ్ ని డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. దివ్యని భరణి నామినేట్ చేయగా, సంజన -గౌరవ్ ని, నిఖిల్ -రీతూ ని నామినేట్ చేసాడు. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసాక బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలో నామినేట్ అయినా వాళ్లంతా నామినేషన్ లో ఉంటారని అనుకుంటున్నారు కదా అలా ఏం కాదు.. హౌస్ మొత్తం ఈ వీక్ నామినేషన్ లో ఉంటారని బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయిన తనకి ఇమ్మ్యూనిటీ ఉండదు కానీ మీరందరు ఓటేసి చెప్పండి తనకి ఇమ్మ్యూనిటి కావాలో వద్దో అని బిగ్ బాస్ చెప్తాడు. హౌస్ లో ఉన్నావాళ్లంతా ఒక్కోక్కరిగా వెళ్లి ఇమ్మాన్యుయల్ కి ఓటు వేస్తారు.. ఒక్క భరణి తప్ప అందరు కూడా ఇమ్మాన్యుయల్ కి ఇమ్మ్యూనిటి కావాలని ఓటు వెయ్యడంతో ఇమ్మాన్యుయల్ కి ఇమ్మ్యూనిటీ వచ్చి ఈ వీక్ కూడా నామినేషన్ నుండి సేవ్ చేస్తారు. ఈ వీక్ లో ఒక్క ఇమ్మాన్యుయల్ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు.. ఇప్పుడు ఓటింగ్ ని బట్టి విన్నర్ ఎవరో కూడా ఈజీగా తెలిసిపోతుంది. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.

Bharani vs Divya : దివ్య వర్సెస్ భరణి.. మీ బాండింగ్ వల్లే బయటకు పోయాను!

  బిగ్ బాస్ సీజన్-9 మొత్తం బాండింగ్ చుట్టే తిరుగుతుంది. బాండింగ్ వాళ్ళ ఎలిమినేట్ అయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ బాండింగ్స్ తో ఉంటూ భరణి తన గేమ్ ని స్పాయిల్ చేసుకుంటున్నాడు. కానీ ప్రతీ సారి ప్రతీనోటా బాండింగ్ అనే పదం విని భరణికి కోపం వచ్చింది.. అందుకే ఆ కోపాన్ని మొత్తం నామినేషన్ లో పెట్టి తన విశ్వరూపం చూపించాడు భరణి. భరణి తన నామినేషన్ గా దివ్యని చేస్తాడు.. నన్ను ఇంట్లో నుండి పంపించడానికి మీరు ఏం కారణం చెప్తున్నారని భరణిని దివ్య అడుగుతుంది. నేను హౌస్ లో నుండి బయటకు వెళ్ళడానికి కారణం బాండింగ్ అన్నారు కానీ ఆ బాండింగ్ అనే ఆలోచన పోగొట్టే బాధ్యత నీది కూడా కానీ అది అలాగే కంటిన్యూ చేస్తూ అందరికి ఆ ఆలోచన ఉండిపోయిందని భరణి చెప్తాడు. బాండింగ్ అంటే నన్ను ఒక్కదాన్నే అన్లేదు కదా నన్ను మాత్రమే నామినేట్ చేసి ఎందుకు చెప్తున్నారని దివ్య కోపంగా మాట్లాడుతుంది. అందరికి టైమ్ వచ్చినప్పుడు చెప్తానంటూ భరణి వాయిస్ రేజ్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి మీరు నా వల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్ళారా అని దివ్య స్టైట్ గా అడుగుతుంది. నీ వల్ల అనట్లేదు.. బాండింగ్ వల్ల అని చెప్తున్నానని భరణి అంటాడు. ఈ రీజన్ తో నన్ను మొదటి వారం నామినేట్ చేశారు కానీ ఇంత వరకు ఎవరు చెయ్యలేదని దివ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఇక భరణి, దివ్య మధ్య ఎమోషనల్ బాండింగ్ కాదు అసలు బాండింగే లేదని భరణి నిరూపించుకోగలడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Bigg Boss 9 Telugu: చెత్త నామినేషన్ తో కంగుతున్న రీతూ.‌‌. వ్యాలిడ్ రీజన్ ఇచ్చిన దివ్య!

  బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారానికి గాను నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. మొదటగా భరణిని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేయగా, ఆ తర్వాత రీతూ తన నామినేషన్ గా దివ్య పేరు చెప్పింది. గత వారం కెప్టెన్సీ టాస్క్ లో నీ మైండ్ లో ఇమ్మాన్యుయల్ గెలిపించాలని  ఉన్నప్పుడు సపోర్ట్ చెయ్.. ఒకే కానీ ఒకరి దగ్గరికి వెళ్లి రీతూని తీసెయ్యాలి ఒకరి దగ్గరికి వెళ్లి తనూజ అన్నావ్ ఇలా అందరిని నీ గ్రిప్ లో ఉంచుకున్నావ్.. వారిని బాణాల్లా వదులుతున్నావని రీతూ అంది. అందరు నువ్వు చెప్తే వింటున్నారు.. నువ్వు అది చెయ్, ఇది చెయ్, ఇలా ఎవరికి ఏం చెప్పినా అది వాళ్ళు వింటున్నారని రీతూ చెప్తుంది. వాళ్లు వింటే నీకేం ప్రాబ్లమ్ అవుతుంది. నీకు భయం వేస్తుందా అని దివ్య అంటుంది. నాకు భయం కాదు.. అందరు నేను చెప్తే వింటున్నారు.. నాకే తెలుసు.. నాకు మాత్రమే తెలుసన్న భ్రమలో ఉంటావ్ కదా.. అది వదిలేయ్ అని రీతూ స్టేట్ గా చెప్తుంది. రీతూ, దివ్యకి గొడవ భారీ ఎత్తునే జరుగుతుంది. గతవారం ఓ చెత్త రీజన్ తో నామినేట్ చేసిన రీతూ.. ఈ వారం మరో వ్యాలిడ్ లేని క్వశ్చన్స్ అడిగింది. దివ్య గేమ్ అనేది తన పర్సనల్.. ‌కానీ రీతూ కంటే సేఫ్ ప్లే ఎప్పుడూ ఆడలేదు.. తనూజ, కళ్యాణ్ లని పాజిటివ్ చేయడానికి దివ్యని నెగెటివ్ చేస్తే దానిని నమ్మిన రీతూ రోత పాయింట్లతో చెత్త నామినేషన్ చేసింది. ఆ తర్వాత రీతూని నిఖిల్ నామినేట్ చేస్తాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చావ్.. నీకు గేమ్ ఆడే పోటెన్షియల్  లేదు.. వేస్ట్ అన్నావ్ అని నిఖిల్ చెప్తాడు. చాలా బ్యాడ్ అవుతావు నిఖిల్.. నేను బ్యాడ్ అనే వర్డ్ వాడలేదని రీతూ డిఫెన్స్ చేసుకుంటుంది. మరి వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ కామెంట్ చేయండి.

Bigg boss 9 Telugu : భరణికి ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటు.. ఇదయ్యా మీ అసలు రూపం!

  పైకి ఎంత మంచిగా కనపడినా నా సొంతం అని వచ్చేసరికి కాటేస్తారు.  ఫస్ట్ వీక్స్ లో భరణిని అన్నా.. అన్నా అంటూ ప్రేమగా పిలిచి నామినేట్ చేసి బయటకి పంపించాడు ఇమ్మాన్యుయల్.. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చాడు ఇమ్మాన్యుయల్. బిగ్ బాస్ సీజన్-9 పదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ హౌస్ లో మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో పదకొండు మంది ఉన్నారు. ఈ సారి నామినేషన్ ప్రక్రియ భిన్నంగా జరిగింది. నామినేట్ అయిన వారు గార్డెన్ ఏరియాలోని ఓ ప్లేస్ లో కుర్చీలో కూర్చుంటే పై నుండి బురద వచ్చి వారి మీద పడుతుంది. అయితే ఈ సారి నామినేషన్ కి టైమ్ ఒక అయిదు నిముషాలు మాత్రమే అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టైమ్ లోనే ఇద్దరు తమ పాయింట్స్ చెప్పుకోవాలి. మొదటగా ఇమ్మాన్యుయల్ భరణిని నామినేట్ చేసాడు. అన్న మీరు లాస్ట్ టైమ్ గేమ్  ఆడలేదు.. అందుకే హౌస్ నుండి వెళ్లిపోయావ్.. మళ్ళీ రీఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చాక.. ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తానంటే చాలా హ్యాపీగా అనిపించింది.. మీ కళ్ళలో కూడా ఆ కసి కన్పించింది కానీ  ఇప్పుడు మీలో ఎలాంటి మార్పు లేదు.. ఇప్పటికి కూడా మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవడం లేదని ఇమ్మాన్యుయల్ తన పాయింట్స్ చెప్తాడు. నేను బాగానే ఆడుతున్నానని భరణి తన పాయింట్స్ చెప్తాడు. భరణి ఫస్ట్ ఎలిమినేట్ అయినప్పుడు ఇమ్మాన్యుయల్ తన దగ్గరున్న పవరస్త్రని వాడితే భరణి సేవ్ అయ్యేవాడు  కానీ కానీ అలా చెయ్యకుండా భరణిని ఇమ్మాన్యుయల్ వెన్నుపోటు పొడిచాడు. అందుకే భరణి రీఎంట్రీ ఇచ్చాక.. కట్టప్ప మోసం చేసావ్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. అన్న అన్న అంటూనే భరణిని మళ్ళీ పంపించేందుకు నామినేట్ చేసాడు ఇమ్మాన్యుయల్.

Illu illalu pillalu : నర్మద కేసులో ట్విస్ట్.. సేనాపతి దొరికిపోయాడు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -312 లో.....ధీరజ్ ప్రేమపై కోప్పడతాడు. మా పుట్టింటికి వెళ్ళిపోతానని ప్రేమ అనగానే వెళ్ళు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ నిజంగానే వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. ఈ మెంటల్ ది నిజంగానే వెళ్ళింది.. ఇప్పుడు ఎంత గొడవ అవుతుందోనని ధీరజ్ బయపడి ప్రేమకి ఫోన్ చేస్తాడు. నువ్వు నాకు సారీ చెప్తేనే నేను వస్తానని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ సారీ చెప్తాడు. ప్రేమ బయటకు వస్తుంది. నువ్వు మళ్ళీ ఏమైనా అంటే మా ఇంటికి వెళ్తానని ప్రేమ బ్లాక్ మెయిల్ చేస్తుంది. టార్చర్ కి స్పెల్లింగ్ రాపిస్తున్నావు కదే అని ధీరజ్ అనుకుంటాడు. అదంతా భాగ్యం, ఆనందరావు చూసి వాళ్ళు దాగుడుమూతలు ఆడుకుంటున్నారు.. మనమే పిచ్చి వాళ్ళలాగా నిద్ర మానుకొని చూస్తున్నామని భాగ్యం అంటుంది. మరొకవైపు టీవీలో నర్మద లంచం తీసుకుందంటూ న్యూస్ వస్తుంది. అది చూస్తూ భద్రవతి, సేనాపతి హ్యాపీగా ఫీల్ అవుతుంటే.మ మరొకవైపు వేదవతి కుటుంబం డల్ గా ఉంటుంది. ఆ తర్వాత రామరాజు ఆస్తులు కొట్టెయ్యాలి.. అలా చెయ్యాలంటే ఆ నర్మద జైల్లో ఉండాలి.. మనం ఇక్కడే ఉండాలని భాగ్యం, ఆనందరావు ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత నర్మద లంచం తీసుకున్నట్లు అన్ని ఆధారాలపై అధికారులు నర్మద ముందు పెడుతారు . నేను తీసుకోలేదు అతనికి అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది.. అతని బ్యాంకు స్టేట్ మెంట్ చూడండి.. అందులో సేనాపతి అతనికి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఉందని నర్మద చూపిస్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చానని నన్ను కావాలనే ఈ కేసు లో ఇరికించారని నర్మద తగిన సాక్ష్యం చూపిస్తుంది. దాంతో అధికారులు నర్మద నిర్దోషి అని పంపిస్తారు. ఆ విషయం న్యూస్ లో రావడంతో భద్రవతి షాక్ అవుతుంది. ఇటు వేదవతి కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో సేనాపతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే.. నర్మద వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : నిజం తెలుసుకున్న ప్రీతీ.. ఆ పట్టీలు చూసి గంగ షాక్!

  ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -109 లో......రుద్ర, పారు పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసి.. గంగ షాక్ అవుతుంది. రుద్రతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకుంటుంది. మరొకవైపు మన ప్లాన్ సక్సెస్ అయిందని ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. అసలు ఈ ఐడియా శకుంతల అత్తయ్యకి ఇచ్చి మంచి పని చేసామని ఇషిక అంటుంది. వెనకాల నుండి ప్రీతి వచ్చి మీరు ఐడియా ఇచ్చారా ఎందుకు ఇలా చేశారని వాళ్ళపై కోప్పడుతుంది. అది కాదు ప్రీతీ అని ఇషిక చెప్పబోతుంటే వద్దు అని ప్రీతీ అంటుంది. అప్పుడే శకుంతల ఎంట్రీ ఇచ్చి ఎవరేం చెప్పలేదు.. ఇదంతా నా నిర్ణయమే.. అయినా రుద్ర ఒప్పుకున్నాక నీకెందుకు ప్రాబ్లమ్ అని ప్రీతిపై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత గంగ ప్రాక్టీస్ చేస్తుంటే పారు వస్తుంది. ఇవన్నీ నీకేందుకూ అని డిస్సపాయింట్ గా మాట్లాడుతుంది. దాంతో తనకి కౌంటర్ ఇచ్చేలా గంగ మాట్లాడుతుంది. గంగకి రుద్ర గిఫ్ట్ ఇచ్చిన పట్టీలు పారు పెట్టుకుంటుంది. అది చూసి గంగ షాక్ అవుతుంది. పట్టీలు బాగున్నాయా గంగా అని పారు అడుగుతుంది. అప్పుడే రుద్ర ఎంట్రీ ఇస్తాడు. ఏంటి గంగ ప్రాక్టీస్ చెయ్యడం లేదని అడుగుతాడు. నా పట్టీలు బాగున్నాయట చూస్తుందని పారు అంటుంది. ఆ  పట్టీలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావని రుద్ర అనగానే.. నీ వస్తువు అయితే నాదే కదా.. అయినా నా కోసమే కొని ఉంటావ్.. నువ్వు ఎవరి కోసమో అంటే నేను హర్ట్ అవుతానని రుద్ర చెయ్ పారు పట్టుకుంటుంది. ఇది అకాడమీ అని రుద్ర అంటాడు. గంగ కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. తన వెనకాలే రుద్ర వెళ్తాడు. నాకు గిఫ్ట్ ఇచ్చినవి తాను ఎందుకు తీసుకుందని గంగ అడుగుతుంది‌. నువ్వు వద్దని ఇచ్చావ్ కదా.. ఎవరు తీసుకుంటే ఏంటి.. నువ్వు గేమ్ పై పోకస్ పెట్టు  పోటీకి సంబందించిన డేట్ వచ్చింది. నిన్ను నమ్మాను.. నువ్వు ఆ నమ్మకం నిలబెట్టు అని గంగతో రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీపే సీఈఓ.. కార్తీక్ మాటతో పారిజాతం, జ్యోత్స్న షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -511 లో.....దీప ఆఫీస్ కి క్యారేజ్ తీసుకొని వెళ్తుంది. వెనకాలే పారిజాతం, సుమిత్ర వస్తారు. మీరెందుకు వచ్చారని శివన్నారాయణ అడుగుతాడు. రావాల్సి వచ్చిందని సుమిత్ర అంటుంది. మీతో మాట్లాడాలని శివన్నారాయణతో పారిజాతం అంటుంది. దాంతో శివన్నారాయణ పక్కకి వస్తాడు. సీఈఓగా ఎవరిని చేస్తున్నారని పారిజాతం అడుగుతుంది.. ఎవరు అయితే నీకెందుకని శివన్నారాయణ అంటాడు.‌ ఆ దీపనే కదా అని పారిజాతం అంటుంది. మనవరాలిని కాదని పని మనిషిని చేస్తున్నారని పారిజాతం అంటుంది. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇచ్చి దీప సీఈఓ ఏంటి.. ఎవరు చెప్పారని కార్తీక్ అంటాడు. నాకు దీప సీఈఓ అన్న ఆలోచన రాలేదు.. ఇప్పుడు నువ్వు చెప్పావ్ ఖచ్చితంగా దీపని సీఈఓ చేస్తానని శివన్నారాయణ అనగానే పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. శివన్నారాయణ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళపోతారు. పారిజాతం కత్తి చూపించి ఆ దీప సీఈఓగా ఒప్పుకోవాలి వెంటనే దీంతో పొడుస్తానని పారిజాతం అనగానే.. నిజంగానే చంపేస్తావా అని జ్యోత్స్న అంటుంది. అది సీఈఓ అయితే నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పారిజాతం అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వచ్చి ఇక్కడ అందరికి తోడున్నారు.. నీకు తప్ప.. నీకు ఒక జోడి కావాలి.. అదే నా కోరిక అని సుమిత్ర అంటుంది. నేను అనుకున్నది సాధించాలని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. సుమిత్ర మాట్లాడుతు.. మావయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదేనని అంటుంది.‌ ఇది కూడా హ్యాండ్ ఇచ్చిందని పారిజాతం అనుకుటుంది. కొత్త సీఈఓగా మా భార్యని సజెస్ట్ చేస్తున్నా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : భార్యకి నచ్చింది చేయడానికి సిద్దమైన భర్త.. రాహుల్ లో మార్పు వస్తుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -874 లో..... రుద్రాణి, స్వప్న కలిసి స్టేషన్ లో ఉన్న రాహుల్ దగ్గరికి వెళ్తారు. నేనేం తప్పు చెయ్యలేదు.. నన్ను విడిపించండి అని రాహుల్ రిక్వెస్ట్ చేస్తాడు.. నిన్ను ప్రతిసారీ నమ్ముతున్నా.. మోసపోతున్నా.. నువ్వు ఇలా చేస్తుంటే ఎవరు మాత్రం నీకు హెల్ప్ చేస్తారని స్వప్న అంటుంది. నువ్వు ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు రాహుల్.. నేను నిన్ను బయటకు తీసుకొని వస్తానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత స్వప్న, కావ్య కలిసి రంజిత్ ఇంటికి వస్తారు. అక్కడ పోలీసులు ఉండడంతో కిటికీ లోపల నుండి లోపలికి వెళ్తారు. వెళ్లి వాళ్ళు హాల్లో పెట్టిన కెమెరా తీసుకొని వెళ్తారు. కార్ లోకి వచ్చి అందులో రికార్డు అయింది చూసి షాక్ అవుతారు. వెంటనే ఇది పోలీసులకి చూపించాలని బయల్దేరతారు. మరొకవైపు పోలీస్ స్టేషన్ ముందు రంజిత్ వచ్చి రుద్రాణితో మాట్లాడుతుంటే అప్పుడే రాజ్, కావ్య వచ్చి.. అసలు నేరం చేసింది నువ్వు అని మాకు తెలుసురా అని స్టేషన్ లోపలికి తీసుకొని వెళ్తారు. ఆ వీడియో పోలీసులకి చూపిస్తారు. అందులో కోయిలిని రంజిత్ చంపినట్లు ఉంటుంది. దాంతో రాహుల్ ని వదిలేసి రంజిత్ ని సెల్ లో వేస్తారు పోలీసులు. ఆ తర్వాత రాహుల్ ని ఇంటికి తీసుకొని వస్తారు. అందరు రాహుల్ కి చివాట్లు పెడుతారు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యనని రాహుల్ చెప్తాడు. తరువాయి భాగంలో కావ్య తనకి ఇష్టమైనవన్నీ ఒక లిస్ట్ చేస్తుంది.. అందులో మొదటిది తనకి నచ్చింది వండి పెట్టడం అని ఉంటుంది. సరే నీకు నచ్చింది చేస్తానని రాజ్ కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తాడు. అప్పుడే ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నాకు బిడ్డ పుడితే చైతన్య మాష్టర్ పేరు పెట్టుకుంటా...

  బుల్లితెర మీద ఢీ డాన్స్ షోలో చైతన్య మాష్టర్ ఒక సంచలనం. ఆయన శిష్యుడే రాజు. అలాంటి చైతన్య మాష్టర్ గురించి రాజు ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు. "రాజు అసలు నువ్వు డాన్సర్ ఎలా అయ్యావు. ఢీ షోలో ఛాన్స్ ఎలా వచ్చింది" అని అడిగింది హోస్ట్. "నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. స్టేజి మీద వేయాలంటే భయం కానీ టెన్త్ క్లాస్ లో డేర్ చేసి స్టేజి మీద వేసాను. మా టీచర్స్ అంతా పొగిడారు. తిట్టేవాళ్ళు పొగిడేసరికి నేను అదే డాన్స్ ని వినాయక చవితిలో వేసాను. అప్పుడు చైతన్య మాష్టర్ చూసి బాగా వేస్తున్నావ్ అని తనతో పాటు సూర్యాపేట తీసుకెళ్లారు. ఆయనకు నేను ఎందుకు నచ్చాను అంటే నేను మినిమం 70 సాంగ్స్ నేర్చుకున్నా మూడు నెలల్లో అలాగే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేస్తూ మిగతా సాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. మాష్టర్ అది చూసి నన్ను ఢీ షోకి తీసుకెళ్లారు. ఐతే అప్పటికి నాకు 104 ఫీవర్ ఉంది. ఆ విషయం చెప్తే మాష్టర్ నన్ను పక్కన పెట్టేస్తాడేమో అని భయమేసింది. తర్వాత ఆయన నన్ను చూసి ఫీవర్ గా ఉంటె ఎందుకు చెప్పలేదు అన్నారు. మీరే తీసేస్తారేమో అని భయపడ్డా అని చెప్పాను. ఆ తర్వాత ఎగ్జామ్స్ అని చెప్పి మా ఇంటికి వెళ్లాను. ఆ తర్వాత చైతన్య మాష్టర్ ఫోన్ చేసి నేను చదివిస్తా నువ్వొచ్చాయి అని చెప్పాడు. ఆ తర్వాత రెండేళ్లు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేసాను కంటెస్టెంట్ అయ్యాను టైటిల్ కొట్టాను. చైతన్య మాష్టర్ చనిపోయారు అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఎందుకంటే రెండు నిమిషాల ముందు నాకే ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పారు. వాళ్లకు అప్పులు ఉన్నాయన్న విషయం నాకు ముందు నుంచి తెలుసు. అప్పులు నెమ్మదిగా తీరుద్దాం మీరు టెన్షన్ పడకుండా హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పా. అంతే వెంటనే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా చైతన్య మాష్టర్ ఇంట్లో ఉరేసుకున్నారని చెప్పాడు. నాకు షాక్. మా బాండింగ్ ఎలా ఉంటుంది అంటే నా పేరును ఆయన పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఏడాది పాటు నేను బయటకు రాలేకపోయాను. ఒక్కసారి చైతన్య మాష్టర్ కనిపిస్తే హగ్ చేసుకుని మిస్ యు మాష్టర్ అంటాను. లాస్ట్ లో ఒక్క మాట డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్ టైటిల్ కొట్టు అన్నారు కొట్టాను. నేను పెళ్లి చేసుకుంటే నాకు బిడ్డ పుడితే చైతన్య మాష్టర్ పేరు పెట్టుకుంటా" అని చెప్పాడు ఢీ 10 రాజు.  

దివ్య, కళ్యాణ్ ల మధ్య చిచ్చుపెట్టిన తనూజ

  బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు జరిగిన దాంట్లో లేడీ కంటెస్టెంట్స్ లో దివ్య టాప్. ఎందుకంటే తను స్ట్రాటజీలు వాడుతుంది.. గేమ్ ఆడుతుంది.. అందరితో బాగుంటుంది. కానీ మన బిగ్ బాస్ మామ తనూజనే విన్నర్ ని చేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకే తను ఎంత ఇరిటేట్ అయిన అవేం చూపించకుండా ఫేక్ ఓటింగ్ వేస్తూ తనూజ టాప్(Tanuja Fake) అన్నట్టుగా చూపిస్తున్నారు బిగ్ బాస్. ఒకవేళ మేల్ కంటెస్టెంట్స్ అయితే కళ్యాణ్ ని విజేత చెయ్యాలని గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకేనేమో స్ట్రాంగ్ అండ్ జెన్యున్ కంటెస్టెంట్ అయినటువంటి దివ్య, డీమాన్ పవన్ లాంటి కంటెస్టెంట్స్ ని ఛాన్స్ దొరికినప్పుడే బ్యాడ్ చేయాలని వీడియోలు ప్లే చేసి మరీ చూపిస్తున్నారు.  నిన్నటి ఎపిసోడ్ లో దివ్యని కార్నర్ చేస్తూ వీడియోలు వేసి చూపించి కళ్యాణ్, తనూజ దృష్టిలో దివ్యని బ్యాడ్ చేశాడు బిగ్ బాస్ మామ. దివ్య ట్రైన్ టాస్క్ లో భరణికి సపోర్ట్ చేస్తూ తనూజని తీసేయ్యమని గౌరవ్ తో చెప్తుంది. అది వీడియో చూపించాడు నాగ్‌. దాంతో తనూజ దివ్యపై ఓ అభిప్రాయం ఏర్పర్చుకుంది. దివ్య ఎవరిని గెలిపించాలనేది తన ఆట.. తన ఆట గురించి ఎవరికీ ఏ అభ్యంతరం ఉండకూడదు.. కానీ నీ బాధ ఏంటంటే మాట ఇచ్చి మాట తప్పింది అని అంతేకదా అని కళ్యాణ్ ని నాగార్జున అడుగగా‌.. కొంచెం సర్ అని కళ్యాణ్ అన్నాడు. ఎవరికి వాళ్ల ఫేవరెట్స్ ఉంటారు కదా.. డీమాన్‌కి రీతూ కావాలని ఉంటుంది.. ఇంకెవరికో ఇమ్మాన్యుయల్ కావాలని ఉంటుంది.. నీకు తనూజ కావాలని ఉంది.. అది వాళ్ల ఛాయిస్‌ల బట్టి ఉంటుంది.. ఎవరిని గెలిపించాలనేది వాళ్ల ఇండివిజల్ ఛాయిస్ అని నాగార్జున అన్నాడు. అంటే దివ్య అలా మాట ఇచ్చి తప్పే రకం కాదు.. కానీ ఆ టైమ్‌లో తను ఇమ్మూ-తనూజ మధ్య ఓటింగ్ పడుతుందేమో అనుకొని అలా చేసి ఉండొచ్చని కళ్యాణ్ చెప్పాడు.  నేను చూపించిన వీడియో టాస్క్ స్టార్ట్ కాక ముందు.. ఒకరికి గెలిపించడానికి మనం సపోర్ట్ చేయడం, టాస్కులో ప్రాణం పెట్టడమనేది కరెక్ట్.. ఖచ్చితంగా అది చేయాలి.. కానీ ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరి ఓటమి కోసం ఉండకూడదంటూ సోది చెప్పాడు నాగ్ మామ.  హౌస్ లో ఓ గేమ్ జరిగితే ఒకరు ఓడిపోతేనే ఇంకొకరు గెలుస్తారు.. అది బేసిక్ కదా.. ఇదంతా ఎందుకు.. తనూజ‌ని దివ్య తీసేసింది కాబట్టి తనూజ, దివ్య, కళ్యాణ్ ల మధ్య చిచ్చుపెట్టి దివ్యకి సపోర్ట్ లేకుండా చేసి తనని పంపించేద్దామని ప్లాన్ చేశామని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా బిగ్ బాస్ మామ.. దివ్య ఆడిన ఆటతీరు కరెక్ట్ కానీ దానిని బిగ్ బాస్ మామ చూపించిన తీరు రాంగ్ అని మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి.