Yawar Misbehaved with Tanuja: బిగ్ బాస్ హౌస్‌లో తనూజతో మిస్ బిహేవ్ చేసిన యావర్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం, వారితో హౌస్ లోని కంటెస్టెంట్స్ ని టాస్క్ లు ఆడుతుంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్, యావర్ ఎంట్రీ ఇచ్చారు. సీజన్-4 కంటెస్టెంట్ సోహెల్, సీజన్-7 కంటెస్టెంట్ యావర్. అయితే ఆ సీజన్ లో రతికరోజ్ తో యావర్ లవ్ ట్రాక్ నడపాలని చూశాడు కానీ అప్పటికే తను కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ తో లవ్ లో ఉండటంతో సైలైంట్ అయిపోయాడు.  ఇక నిన్నటి ఎపిసోడ్ లో యావర్ హౌస్ లోకి వచ్చీ రాగానే అందరిని నవ్వుతూ పలకరించాడు. హౌస్‌లో ఎవరూ చేయలేని పనిని యావర్ చేశాడు. అదేంటంటే తనూజతో పులిహోర. మామూలుగా కాదు.. తను చేసిన పనికి తనూజ అయితే ఇబ్బంది పడింది. హౌస్ లోకి రాగానే తనూజ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. తను లేడని చెప్పడంతో మనోడు చెలరేగిపోయాడు. మోకాళ్ళ మీద కూర్చొని మరీ ప్రపోజ్ చేయడంతో తనూజకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత తనని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. తనూజని యావర్ ఎత్తుకొని తిప్పుతున్నప్పుడు తను అన్ కంఫర్టెబుల్ గా ఫీల్ అయింది. అదంతా చూస్తూ కళ్యాణ్ మొహం మాడిపోయింది.ఇక ఆ తర్వాత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకురా మొత్తం ఊడిపోతుందని ఇమ్మాన్యుయల్ తో యావర్ అనగా.. స్ట్రెస్ గురించి నువ్వు చెప్తున్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్, యావర్  మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగింది. ఇందులో యావర్ పై ఇమ్మాన్యుయల్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిలిచాడు. 

Nagarjuna Warns Sanjana: నాగార్జున మాట లెక్కచెయ్యని సంజన.. ఈ వీకెండ్ వార్నింగ్ తప్పేలా లేదుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో సంజన కంటెంట్ క్రియేటర్ గా ముద్ర వేసుకుంది. హౌస్ లో ఇప్పటివరకు చేయని విధంగా దొంగగా ముద్ర తెచ్చుకున్న కంటెస్టెంట్ సంజన అనడంలో ఆశ్చర్యం లేదు. మొదటి వీక్ నే హౌస్ లో గుడ్లు దొంగతనం చేసి హౌస్ ఫోకస్ మొత్తం తనపై తిప్పుకుంది సంజన. చూసే ఆడియన్స్ కి సైతం గేమ్ చేంజర్ సంజన అనిపించింది. కానీ అలా ప్రతీసారీ దొంగతనాలు చేస్తూ ఉండడంతో హౌస్ మేట్స్ కి చిరాకు వచ్చింది. నాగార్జున మొదట్లో కామెడీగా తీసుకున్నా ఆ తర్వాత దొంగతనాలు చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చాడు. వినకపోయేసరికి  దొంగలున్నారు జాగ్రత్త అని రాసి ఉన్న బోర్డ్ సంజన మెడలో వేశారు. నువ్వు జోక్ అనుకుంటున్నది అన్నివేళలా అందరికి జోక్ కాకపోవచ్చని నాగార్జున ఒక వీకెండ్ లో చెప్పాడు. ఫ్యామిలీ వీక్ లో ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు మీరు దొంగతనం చేసినప్పుడు చాలా ఫన్ గా ఉండేదని చెప్పడంతో మళ్ళీ హౌస్ లో దొంగతనం మొదలుపెట్టింది సంజన. నిన్నటి ఎపిసోడ్ లో భరణికి సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ దాచేసింది.. ఎవరు తీశారని కెప్టెన్ అయిన రీతూ అందరిని అడుగుతుంది. ఎవరిని అడిగినా ఎవరు తియ్యలేదని అంటారు. సంజన గారు మీరు తీసేటప్పుడు తనూజ చూసిందంట ప్లీజ్ ఇవ్వండి అని రీతూ అనగానే నాకు తెలియదని సంజన అంటుంది. ఇక రాత్రి కాగానే భరణి దగ్గరికి సంజన వెళ్ళి మాట్లాడుతుంది. నేనే తీసాను టాబ్లెట్స్.. మీతో మాట్లాడాలని అని సంజన అనగానే.. రేపు మాట్లాడుదామని భరణి అంటాడు. మరుసటిరోజు భరణి దగ్గరికి సంజన వచ్చి.. నేను ఏదో ఫన్ క్రియేట్ చేయాలని చేసాను కానీ ఇమ్మాన్యుయల్, దివ్య మొత్తం స్పాయిల్ చేశారని సంజన అంటుంది. దివ్య వచ్చి ఏడ్చింది టాబ్లెట్స్ ఇవ్వండి అని అందుకే ఇచ్చేసానని సంజన చెప్తుంది. ఈ వీకెండ్ లో నాగార్జున సంజన విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ కంటెండర్స్ గా రీతూ, సంజన.. ‌సోహెల్ ని ఓడించారుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం ఫ్యామిలీ వీక్ సాగగా.. ఈ వారం కెప్టెన్సీ కోసం టాస్క్ లని భిన్నంగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. సీజన్-4 లో సోహెల్ అంటే తెలియని వాళ్ళుండరు.. పాతిలక్షల సూట్ కేస్ తీసుకొనివచ్చిన తొలి కంటెస్టెంట్ గా సోహెల్ రికార్డు సృష్టించారు.  డీజే టిల్లు సాంగ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోహెల్ ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ తో సరదాగా ఉన్నాడు.  ఏంటి మీకు ఆరు వారాలా దాకా చికెన్ పెట్టలేదంట.. నాన్ వెజ్ లేకుండా ఎలా ఉన్నారూ.. నాకు అర్థం కాదూ.. నేనైతే దూకి వెళ్లిపోయేవాడ్ని.. బిగ్ బాస్ మాట్లాడు బిగ్ బాస్.. మాట్లాడూ.. నా ఇజ్జత్ పోతుందని సొహెల్ అన్నాడు. అయినా బిగ్ బాస్ మాట్లాడలేదు.. కాసేపటికి సొహెల్ ఎలా ఉన్నావంటూ బిగ్ బాస్ అడుగగా.‌. హా సూపర్ బిగ్ బాస్ అని సోహెల్ అన్నాడు. సోహెల్ అంటే కథ వేరుంటందని అని అనగా.. అయితే రెండు పాల ప్యాకెట్లు, కాఫీ పౌడర్, రెండు కేజీల చికెన్ పంపించమని రీతూ, ఇమ్మాన్యుయల్ అడుగుతారు. ఇక కెమెరాల ముందుకి వెళ్ళి సోహెల్ రిక్వెస్ట్ చేశాడు. ఇది నా ఇజ్జత్‌కే సవాల్.. మీకు దండం పెడతాను.. వీళ్లకి రెండు పాల ప్యాకెట్లు.. చికెన్.. కాఫీ పౌడర్ పంపించండి అని మెల్లిగా రిక్వెస్ట్ చేశాడు. వాడి బాడీ లాంగ్వేజ్ ఒకటీ.. అడిగేది మరొకటి అని భరణి అన్నాడు. ఇక కాసేపటికి బిగ్ బాస్ చికెన్, కాఫీ పొడి, పాలప్యాకెట్ల బొమ్మల్ని పంపించాడు. అవి చూసి అందరు నవ్వుకున్నారు కాసేపటికి కాఫీ పౌడర్, పాల ప్యాకెట్లు, చికెన్ నిజంగానే బిగ్ బాస్ పంపించాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిల్చునేందుకు సోహెల్ తో సంజన, రీతు పోటీ పడ్డారు. ఇందులో సోహెల్ ఓడిపోయాడు. సంజన, రీతూ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఇంటి కెప్టెన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu Shobha shetty : హౌస్ లోకి శోభాశెట్టి.. కెప్టెన్సీ రేస్‌లో నిలిచిన కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడంతో ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా ఎక్స్ కంటెస్టెంట్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానితో పాటు కెప్టెన్సీ కోసం టాస్క్ లతో ప్రతీ ఎపిసోడ్ ఫుల్ ప్యాక్ అవుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ రాగా అతడితో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది. ఇక సోహెల్ తో రీతూ, సంజన పోటీపడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. ఇప్పటివరకు భరణి, తనూజ, సుమన్ శెట్టి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, రీతూ, సంజన కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. అయితే యావర్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ జరిగిన టాస్క్ హోరాహోరీగా సాగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ తో రీతూ చౌదరి, సంజన పోటీపడ్డారు. సోహెల్ ఓడిపోవడంతో రీతూ , సంజన కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు‌. ఇక తర్వాత శోభా శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాసేపు ఇమ్మాన్యుయల్ తో మాట్లాడింది. ఇక ఆ తర్వాత దివ్యతో కెప్టెన్సీ రేస్ లో పాల్గొంది శోభాశెట్టి. ఇందులో దివ్య ఈజీగా గెలిచింది.  ఇక ఇప్పటివరకు జరిగిన అన్ని టాస్క్ లలో అందరు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. ఇక వీరిలో సుమన్ శెట్టి, భరణి, తనూజ కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా.. దివ్య, సంజన, రీతూ, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, కళ్యాణ్ మొత్తం ఆరుగురు కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. మరి వీరిలో కెప్టెన్ అయ్యేదెవరు. 

Telugu Tv Serials TRP: టీఆర్పీలో కార్తీక దీపం-2 నెంబర్ వన్.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు!

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి అత్యధిక టీఅర్పీలు వస్తుంటాయి. రూరల్ అండ్ అర్బన్ లో ఎక్కడ చూసిన ఈ సీరియల్స్ సత్తా చాటుతున్నాయి. మరి ఈ వారం దేనికి అత్యధిక టీఆర్పీ వచ్చిందో ఓసారి చూసేద్దాం.  రూరల్ , అర్బన్ లో 16.16 టీఆర్పీ తో కార్తీక దీపం-2 నెంబర్ వన్ స్థానంలో ఉంది.  15.15 టీఆర్పీతో ఇల్లు ఇల్లాలు పిల్లలు రెండో స్థానంలో ఉండగా, 13.84 టీఆర్పీ తో ఇంటింటి రామాయణం నాల్గవ స్థానంలో ఉంది. ఇక గుండె నిండా గుడిగంటలు 13. 16 తో అయిదో స్థానంలో ఉంది. ఇక మద్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్ లో బ్రహ్మముడి టాప్ లో ఉంది. మధ్యాహ్నం టైమ్ స్లాట్ సీరియల్స్ లో అత్యధికంగా 6.10 టీఆర్పీ తో బ్రహ్మముడి నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత 5.71 టీఆర్పీతో నిన్ను కోరి ఉంది. పలుకే బంగారమాయే సీరియల్ కి 5.38 టీఆర్పీ వస్తోంది.  ఇక ఈ వారం ఓవరాల్ గా సీరియల్స్ అన్నింటిలో కార్తీక దీపం-2 సీరియల్ సూపర్ సీరియల్ గా నిలిచింది. ఎందుకంటే కార్తీక దీపం-2 లో.. తాజా ఎపిసోడ్ లలో అన్నీ పాజిటివ్ అంశాలే జరిగాయి. దీప ప్రెగ్నెంట్ కావడం.. శివన్నారాయణ ఫ్యామిలీ దీపని అక్కున చేర్చుకోవడం.. కొత్త ఎండీగా శ్రీధర్ ఎన్నికవ్వడం.. ఇవన్నీ ఈ సీరియల్ కి ప్రధాన బలంగా నిలిచాయి. అయితే ఇవన్నీ చూసి చాలామంది ఈ సీరియల్ త్వరలో ముగుస్తుందని అంటున్నారు కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్ అనే విషయాన్ని జ్యోత్స్న తీసుకోలేకపోతుంది. మరోవైపు దాస్ జ్యోత్స్నని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దానితో పాటుగా శివన్నారాయణకి స్వామి రానున్న ఆపద గురించి చెప్పాడు. అంటే ఇంటివారసులు దీప అనే విషయం శివన్నారాయణ, సుమిత్ర, దశరథ్ లకి తెలుస్తుందేమో.. దాంతో దీపని చంపడానికి జ్యోత్స్న  ఏం అయినా ప్లాన్ చేస్తుందేమో.‌. ఈ రకంగా సాగితే ఇంకో రెండు సంవత్సరాల దాకా కార్తీక దీపం-2 సీరియల్ కి డోకా లేదు. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు.. ముగ్గురు కోడల్లు.. ఎదురింట్లోనే శత్రువులు ఉండటం రామరాజు సీరియల్ కి హైప్ ఇస్తోంది. ఇక ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో కోడలు, కొడుకు ఇచ్చే ట్విస్ట్ లతో ఇంటి పెద్ద రామరాజుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది. అయితే ఎప్పుడైనా కంటెంట్ లేకుంటే రామరాజు, వేదవతిల మధ్య రొమాంటిక్ యాంగిల్ ని కూడా చూపిస్తున్నాడు దర్శకుడు. అందుకే ఈ సీరియల్ కి క్రేజ్ పెరుగుతుంది. స్టార్ మా సీరియల్స్ లో మీ ఫెవరెట్ సీరియల్ ఏంటో కామెంట్ చేయండి.

Jayam serial : గంగ రిసెప్షన్ కి లక్ష్మీ వస్తుందా.. బ్యూటిషియన్ ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -126 లో....పెద్దసారు బయటకు వెళ్తాడు. అటుగా వెళ్తున్న లక్ష్మి, పెద్దసారుని చూసి తన దగ్గరికి వస్తుంది.  ఎవరికి చెప్పకుండా రుద్ర బాబు గంగని పెళ్లి చేసుకున్నాడని మీరు కోపంగా ఉన్నారా అని అడుగుతుంది. అదేం లేదు రేపు గంగ, రుద్రకి రిసెప్షన్ చేస్తున్నాం.. మీరు తప్పకుండా రండి అని చెప్తాడు. మరొకవైపు గంగ రిసెప్షన్ అన్న సంగతి మర్చిపోయి మంచిగా పడుకుంటుంది. అప్పుడే ప్రీతి, స్నేహ, ప్రమీల వచ్చి నిద్ర లేపుతారు. ఈ రోజు నీ రిసెప్షన్ మర్చిపోయావా అని అంటారు. అప్పుడే శకుంతల వస్తుంటే.. గమనించి ఇంకా గంగ రెడి అవలేదని తిడుతుందని తనకి గంగ కనిపించకుండా కవర్ చేస్తారు. ఆ గంగ వల్ల ఇంటి పరువు పోకూడదు మంచిగా రెడీ చేసి తీసుకొని రండి అని శకుంతల కోపంగా చెప్పి వెళ్తుంది. దాంతో స్నేహ బ్యూటీషియన్ ని రప్పిస్తుంది. మరొకవైపు రుద్ర రెడీ అవుతుంటే ఇషిక, వీరు వస్తారు. సారీ బావ నువ్వు గంగని పెళ్లి చేసుకుంటే ఆపొజిట్ చేసానని ఏదో ప్లాన్ ప్రకారం మాట్లాడతాడు. ఆ టాపిక్ వద్దని రుద్ర చిరాకుపడుతాడు. మరోవైపు లక్ష్మీ రిసెప్షన్ కి వెళ్లడానికి రెడీ అవుతుంది. అప్పుడే పైడిరాజు వస్తాడు. తనని చూసి.‌ సారీ అండి నేను వేరే వాళ్ళ ఇంటికి వచ్చానని అంటాడు. నేనే అని లక్ష్మీ అంటుంది. రుద్ర, గంగలకి రిసెప్షన్ చేస్తున్నారట మనం ఖచ్చితంగా వెళదామని రిక్వెస్ట్ చేస్తుంది. మరొకవైపు గంగని రెడీ చెయ్యడానికి ఏ చీర సెట్ అవ్వదు. ఆ తర్వాత బ్యూటిషియన్ ఇషిక దగ్గరికి వచ్చి పెళ్లి కూతురు ఎక్కడ అని అడుగుగా.. అక్కడా ఉందని ఇషిక చెప్తుంది. తను గంగ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత అందరు గెస్ట్ లు వచ్చారు. ఇంకా గంగ, రుద్ర రాలేదని పెద్దసారు అంటాడు‌. అప్పుడే రుద్ర, గంగ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయనున్న అప్పు.. తన నిర్ణయం సరైనదేనా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -889 లో...అప్పుని కళ్యాణ్ బయటకు తీసుకొని వెళ్తాడు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందని అప్పు అంటుంది. వద్దు మా అమ్మ తిడుతుందని కళ్యాణ్ అంటాడు. దాంతో అప్పు గొడవ చెయ్యడం తో ఐస్ క్రీమ్ దగ్గర కళ్యాణ్ కార్ ఆపుతాడు. పక్కనే కదా మా స్టేషన్ కి వెళ్లి అందరికి హాయ్ చెప్పేసి వస్తానని అప్పు స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ ఒకావిడ తన బిడ్డని వెతకమని ఏడుస్తుంటే కానిస్టేబుల్ తనపై కోప్పడుతాడు. ఎందుకు అలా వాళ్ళతో మాట్లాడుతున్నావని అప్పు కానిస్టేబుల్ పై కోప్పడుతుంది. ఏమైందని అడుగుతుంది. నా కూతురు సంవత్సరం నుండి కన్పించడం లేదని ఆవిడ చెప్తుంది. సంవత్సరం నుండి కనిపించడం లేదా డిపార్ట్ మెంట్ ఏం చేస్తుందని కానిస్టేబుల్ పై అప్పు కోప్పడుతుంది. దాంతో లోపలికి వెళ్లి తన హై ఆఫీసర్ ని కలిసి మాట్లాడుతుంది. తన కూతురు ఎప్పుడో చనిపోయింది.. ఆ విషయం వాళ్ళ అయన కూడా చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ చేసాం అదే చెప్పాము.. అయిన ఆవిడా వినట్లేదని ఆఫీసర్ అంటాడు. అలా ఆవిడ తన కూతురు ఉందని అంటుంటే డీప్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి కదా అని అప్పు అంటుంది. ఇక ఆ ఒక్క కేసు పట్టుకొని కూర్చుంటామా అని ఆఫీసర్ అప్పుపై కోప్పడతాడు. కాసేపటికి అప్పు వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్, కావ్యల దగ్గరికి అపర్ణ, సుభాష్ వస్తారు. మీరు రాహుల్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఎందుకో తప్పు అనిపిస్తుందని అంటారు. అదేం లేదు ఈ ఇంట్లో అప్పుకి నాకు సమానమైన గౌరవం లభిస్తుంది.. అది మా అక్కకి కూడా దక్కాలని కావ్య అంటుంది. రాహుల్ కి ఒక ఛాన్స్ ఇస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటాడని రాజ్ చెప్తాడు. మరొకవైపు అప్పు పడుకుంటుంది. కలలో స్టేషన్ లో కన్పించినా ఆవిడ తన కూతురిని పట్టుకొని ఏడుస్తున్నట్లు కల వస్తుంది. ఉల్లిక్కి పడి లేచి కళ్యాణ్ కి చెప్తుంది. ఆ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి లేదంటే రెగ్రెట్ గా ఫీల్ అవుతానని అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప కడుపులోని బిడ్డకి జ్యోత్స్న వల్ల ముప్పు.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -526 లో.. కార్తీక్ తో శివన్నారాయణ పంతులు చెప్పిన విషయం చెప్పి టెన్షన్ పడతాడు. నువ్వేం కంగారుపడకు తాత.‌ నేను ఉన్నానని కార్తీక్ దైర్యం చెప్తాడు. ఆ తర్వాత మా మమ్మీ నన్ను కొట్టడం ఏంటని జ్యోత్స్న అనగానే నువ్వు మాట్లాడింది తప్పు అని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న కోపంగా ఇప్పుడు చెప్పు అని తన పీకపై కత్తి పెట్టి మరి జ్యోత్స్న అడుగుతుంది. అయినా తప్పు నీదే అని పారిజాతం అంటుంది. అసలు ఆ దీప కడుపులో బిడ్డని బ్రతనివ్వనని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. తప్పుగా మాట్లాడితేనే సిచువేషన్ ఇలా ఉంది.. లేకుండా చేస్తే ఇంకెలా ఉంటుందని పారిజాతం అంటుంది. నువ్వు పిల్లలని మార్చావ్ ఏమైనా అయిందా అని జ్యోత్స్న అనగానే అప్పుడు కార్తీక్ గాడు చిన్నోడు ఇప్పుడు వాడిని ఎదుర్కోవడం కష్టమని పారిజాతం అంటుంది. మరొకవైపు దీప, కార్తీక్ ల దగ్గరికి సుమిత్ర వచ్చి మీరు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు నాకు తెలుసు.. దానికి సారీ అని చెప్తుంది. జ్యోత్స్నకి కోపం కాదు ఈర్ష్య మాత్రమే ఎందుకంటే కార్తీక్ ని తను పెళ్లి చేసుకునేది కానీ నువ్వు చేసుకున్నావ్ కాబట్టి దానికి అలా అని చెప్తుంది. ఈ టైమ్ లోనే పేరెంట్స్ నీ దగ్గర ఉండాలని అనుకుంటావ్ కానీ రెండు ప్రేమలని చూపించడానికి కార్తీక్ ఉన్నాడని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత శ్రీధర్ ఫైల్ పట్టుకొని శివన్నారాయణ దగ్గరికి వస్తాడు. కంపెనీ అకౌంట్ నుండి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు జ్యోత్స్న అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్తాడు. ఏం చేసావని జ్యోత్స్నని శివన్నారాయణ అడుగుతాడు. ల్యాండ్ తీసుకున్న అమ్మకి పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నానని జ్యోత్స్న చెప్తుంది మరి ఎందుకు ఇవ్వలేదని కార్తీక్ అడుగుతాడు. సిచువేషన్ బాలేదు కదా మళ్ళీ ఇచ్చే సిచువేషన్ రాలేదని జ్యోత్స్న అనగానే అబద్ధం అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : నగల కోసం భద్రవతి కుటుంబం గొడవ.. ప్రేమని ఇరికించిన శ్రీవల్లి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -327 లో.... శ్రీవల్లి నగలన్నీ వేసుకొని మురిసిపోతుంటే అప్పడే తిరుపతి వస్తాడు. ఎక్కడ ఇవి ప్రేమ నగలు అని గుర్తుపడతాడోనని శ్రీవల్లి కొంగు కప్పుకుంటుంది. శ్రీవల్లి నీ గురించి ఈ రోజు నువ్వు అంటే ఏంటో తెలిసిందని తిరుపతి అనగానే నగలు చూసేసాడా ఏంటని శ్రీవల్లి భయపడుతుంది. నీ పద్దతి గురించి అంటున్నానని తిరుపతి అనగానే శ్రీవల్లి రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఈ నగలు ఇలా చాటుగా వేసుకొని మురిసిపోవడం తప్ప ఏం చేసేది లేదని నగలన్నీ తీసి దాచేస్తుంది. ఆ తర్వాత భద్రవతి ఇంటికి మార్వాడి అతను వస్తాడు. మెరుగు పెట్టించమంటే ఇలా తీసుకొని వచ్చారని రేవతి అంటుంది. ఇవి బంగారం కాదు గిల్టీ నగలు అని మార్వాడి అనగానే అందరు షాక్ అవుతారు. ఈ నగలు ఎవరైనా తీసారా అని భద్రవతి అడుగుతుంది. తిరుపతి ఇచ్చాక అవి అలాగే తీసుకొని వచ్చి బీరువాలో పెట్టానని రేవతి అంటుంది. ఇప్పుడు అర్థం అయింది. ఈ నగలన్నీ తీసుకొని గిల్టీ నగలు ఆ రామరాజు పెట్టాడన్నమాట అని అందరు అనుకుంటారు. ఆ తర్వాత భద్రవతి కుటుంబం మొత్తం రామరాజు ఇంటికి గొడవకి వెళ్తారు. గిల్టీ నగలు పెట్టి మమ్మల్ని మోసం చేసావని సేనాపతి గొడవ పడుతాడు. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. ఏం చేస్తావో నాకు తెలియదు.. నిజమైన బంగారు నగలు నాకు తీసుకొని రావాలని  రామరాజుకి భద్రవతి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అసలు నగలు ఏమైయ్యాయని రామరాజు ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. వాటికి సంబంధించి మొత్తం ప్రేమకి తెలుసు.. ఇప్పుడు తను పోలీస్ అవ్వాలని అనుకుటుంది కదా అందుకే వాటిని అమ్మేశారేమోనని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Suman Shetty Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ రేస్ నుండి సుమన్ శెట్టి అవుట్.. పోరాడి ఓడాడుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక సీరియస్ గేమ్ మొదలైంది. కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన ప్రెషర్ ఉంది. ఏ టాస్క్ లోను  ఎవరు  తగ్గడం లేదు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ డిఫరెంట్ గా ఫ్లాన్ చేశాడు బిగ్ బాస్. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలోని కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించి వారితో కంటెస్టెంట్స్ ని కెప్టెన్సీ టాస్క్ ఆడిస్తున్నాడు. మొదటగా ప్రియాంక జైన్ రాగా తను కల్యాణ్ తో ఆడింది. అందులో కళ్యాణ్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ట ఎంట్రీ ఇచ్చాడు. తను భరణితో ఆడి గెలిచాడు. ఇక భరణి కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయ్యాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో దేత్తడి హారిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దేత్తడి హారిక ఫేస్ మొత్తం కవర్ చేస్తూ చీర కొంగుని వేసుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తనని గుర్తుపట్టమని దేత్తడి హారిక అనగా కాసేపటి దాకా ఎవరు గుర్తుపట్టరు. దాంతో తనే హింట్ ఇస్తుంది. సీజన్-4 కంటెస్టెంట్ అనగానే అందరు ఆలోచనలో పడగా .. ఏయ్ దేత్తడి అని ఇమ్మాన్యుయల్ అనగా.. ఎస్ ఇమ్మూ అని దేత్తడి హారిక అంటుంది. ఇక అందరి గురించి చెప్పుకొచ్చింది దేత్తడి హారిక. భరణి గారిని హగ్ చేసుకోవచ్చా అంటూ దివ్యని , తనూజని అడిగింది దేత్తడి. రీతూ దగ్గరికి రాగానే.. వచ్చిందండి వయ్యారి.. ఇప్పుడే అడుగుతున్నా అంటూ సెటైర్ వేసింది దేత్తడి. ఇక రీతు నవ్వేసింది.  కెప్టెన్సీ కంటెండర్ కోసం నీతో ఆడటానికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావని దేత్తడి హారికని బిగ్ బాస్ అడుగగా.. సుమన్ శెట్టి అని చెప్పింది. ఇక కాసేపటికి బిగ్ బాస్ ఇద్దరికి టవర్ టాస్క్ ఇచ్చాడు.‌ గార్డెన్ ఏరియాలో టాస్క్  సంబంధించిన అన్ని పెట్టేసి, రూల్స్ చెప్పేసి సంఛాలక్ గా ఎవరిని తీసుకుంటావని హారికని బిగ్ బాస్ అడుగగా.. తను భరణిని సంచాలకులుగా ఉంటారని అంది. ఇక టాస్క్ మొదలైంది. ఫస్ట్ ఆఫ్ వరకు సుమన్ శెట్టి బాగా ఆడాడు. ఇక ఇద్దరు టవర్ పేర్చారు. ఎప్పుడైతే సుమన్ శెట్టి టవర్ కిందపడుతుందో అప్పుడే బజర్ మోగించాడు బిగ్ బాస్ మామ. దాంతో ఈ టాస్క్ లో దేత్తడి హారిక గెలిచింది. సుమన్ శెట్టి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నాడు. అయితే ఫస్టాఫ్ వరకు సుమన్ శెట్టి గెలుస్తాడని అనుకున్నారంతా అంత బాగా ఆడాడు.. కానీ టవర్ పై ఇంకో బాల్ పెట్టగానే అది కూలిపోయింది..  ఆ బాల్ పెట్టకుండా ఉండి ఉంటే సుమన్ శెట్టి గెలిచేవాడు కెప్టెన్సీ రేస్ లో నిలిచేవాడు. సుమన్ శెట్టి పోరాడాడు కానీ జస్ట్ కొంచెంలో మిస్ అయ్యాడు. 

దివ్యకి క్షమాపణ చెప్పిన భరణి.. ఏం జరిగిందంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో అతి ఎక్కువ బాండింగ్స్ తో గేమ్ స్పాయిల్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరంటే భరణి అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సీజన్ మధ్యలో వరకు కూడా భరణి, తనూజ, దివ్య చుట్టునే కెమెరా ఫోకస్ అయింది. భరణి రీఎంట్రీ తర్వాత వాళ్లిద్దరిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన సజెషన్ తో వారిలో కొంత మార్పు వచ్చింది. భరణి నామినేషన్ లో కూతురు, చెల్లికి ఇచ్చిపడేశాడు. ఇదే వైఖరి మొదటి నుండి కంటిన్యూ అయితే భరణి విన్నర్ రేస్ లో ఉండేవాడు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో దివ్య దగ్గరికి భరణి వచ్చి మాట్లాడతాడు. నువ్వు ఇలా అర్థం చేసుకుంటే.‌. నేను మాట్లాడను సైలెంట్ గా ఉండిపోతానని అంటాడు. అంటే మీరు నాతో బలవంతంగా మాట్లాడుతున్నారా ఇదే వద్దని దివ్య కోపంగా మాట్లాడుతుంది. ఇదే నీతో ప్రాబ్లమ్ టాపిక్ ని సాగదీస్తావని భరణి అంటాడు. నిన్న ప్రేరణ వచ్చినప్పుడు కూడా మధ్యలో దూరి ఎల్డెస్ట్ అని అంటున్నావ్.. ప్రతీసారి ఏజ్ టాపిక్ ఎందుకు తీస్తావని భరణి అంటాడు. నేను ఏదో జోక్ గా అన్నాను.. మీరు అది సీరియస్ గా తీసుకుంటే నేనేం చెయ్యలేను దివ్య అంటుంది. మరి నిన్న నేను.. కుంటూ కుంటూ నడుస్తుంటే నాల నడిచి ఇమిటేట్ చేస్తున్నారు కదా అది నేను జోక్ గా తీసుకున్నప్పుడు నేను అన్నవి మీరు ఎందుకు జోక్ గా తీసుకోలేక పోతున్నారు అని దివ్య కోపంగా అనేసరికి  భరణి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దివ్య, సుమన్ శెట్టి వాళ్ళతో బయట కూర్చొని మాట్లాడుతుంది. భరణి వచ్చి దివ్య సారీ నిన్న నిన్ను ఇమిటేట్ చేసినందుకు అని అంటాడు. నాతో ఎంత క్లోజ్ ఉన్నా నేను అలా మాట్లాడను.. ఎందుకు అలా చేశానంటూ చేతులు జోడించి సారీ చెప్తాడు. అంత వద్దని దివ్య అనగానే సారీ ఇలాగా చెప్తారని భరణి అంటాడు. అది చూసిన ప్రేక్షకులు ఇక వీళ్ళు మారేలా లేరనుకుంటున్నారు.

Jayam serial : గతం చెప్పి భయపెట్టాలనుకున్న వీరు.. గంగ మాస్ వార్నింగ్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -125 లో......గంగకి ఎలా ఉండాలో.. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించండి అని ప్రీతీతో రుద్ర చెప్తాడు. అలా ఏం లేదు.. గంగలా ఎవరు ఉండలేరు.. తనకి నచ్చినట్లు ఉండనివ్వు అన్నయ్య అని ప్రీతీ చెప్తుంది. మరొకవైపు గంగని పెద్దసారు పిలిచి.. ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలివి డిగ్నిపైడ్ గా ఉండాలని చెప్తాడు. ఏది పడితే అది మాట్లాడకూడదని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం పని చేసినా పెద్దసారుకి చెప్తుంది. పెద్దసారు వంట ఏం చేయాలి. వాటర్ ఆన్ చెయ్యాలా..‌ ఆఫ్ చెయ్యాలా.. ఇలా ప్రతీది అడుగుతుంది. ఆ తర్వాత గంగకి వీరు ఎదురుపడుతాడు.  నా దారికి అడ్టులేండి అని గంగ అనగానే నా దారికే నువ్వు అడ్డు వస్తున్నావని కోపంగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఒక అమ్మాయిని రూమ్ కి రమ్మని పిలిచాడని, వాడి కార్ నెంబర్ చూసి కంప్లైంట్ ఇచ్చావ్ కదా.. అది ఎవరో కాదు నేనే అని వీరు అనగానే గంగ షాక్ అవుతుంది. అలా నిజాలన్నీ వీరు చెప్తాడు. అయితే గంగ ఏ మాత్రం భయపడకుండా వీరుకి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు పెద్దసారు పంతులిని పిలిపిస్తాడు. గంగ, రుద్రకి ఈ రోజు రిసెప్షన్ అని చెప్తాడు. వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టమని పెద్దసారు అనగానే.. శకుంతల షాక్ అవుతుంది. దాంతో పంతులు ముహూర్తం పెడతాడు. గంగ కాఫీ తీసుకొని వచ్చి.. శాంతి ముహూర్తం అంటే ఏంటని గంగ అడుగుతుంది. కార్యం అని పంతులు అంటాడు. అంటే ఏంటని గంగ అడుగుతుంటే పంతులు చెప్పడానికి సంకోచిస్తాడు. దాంతో అప్పుడే ప్రీతి వచ్చి గంగని పక్కకు తీసుకొని వెళ్లి ఫస్ట్ నైట్ అని చెప్పగానే గంగ సిగ్గుపడుతుంది. పెద్దసారు చెప్పడంతో గంగ, రుద్ర ఇద్దరు పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వీరు, ఇషిక కలిసి రిసెప్షన్ లో గంగ పరువుపోయేలా ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో గంగకి ఓవర్ మేకప్ వేసేలా ఇషిక ప్లాన్ చేస్తుంది. గంగ ఓవర్ మేకప్ తో అందరి ముందుకు వచ్చేసరికి అందరు అసహ్యించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : రాహుల్ చేతిలో కొత్త కంపెనీ.. రాజ్, కావ్యల ఆశలకి చెక్ పెట్టనున్నాడా!

స్టార్ట్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -888 లో.....రాజ్ స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీ రాహుల్ కి అని తెలుసుకుంటుంది స్వప్న. మిమ్మల్ని తప్పుగా అపార్ధం చేసుకున్నానని కావ్యని స్వప్న క్షమించమని అడుగుతుంది. నాకు మరొక ఛాన్స్ ఇస్తున్నందుకు థాంక్స్ అని  రాహుల్ అంటాడు. చూసావా అనవసరంగా రాజ్, కావ్యని తప్పు పట్టావని రుద్రాణి పై ఇందిరాదేవి, అపర్ణ కోప్పడుతారు. ఈ రోజు మీ పెళ్లి రోజు అత్తయ్య అందరు హ్యాపీగా ఉండాలి.. వెళ్లి భోజనం చేద్దాం పదండి అని కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్, కావ్యలని సీతారామయ్య పక్కకి పిలిచి ఎవరు చెయ్యని పని మీరు చేస్తున్నారు.. కంపెనీ వేరుగా పెట్టడం ఇప్పటివరకు చెయ్యలేదు.. దీనివల్ల ప్రాబ్లమ్ వస్తుందేమోనని సీతారామయ్య అంటాడు. నేను చూసుకుంటాను అని రాజ్, కావ్య అంటారు. మరొకవైపు ధాన్యలక్ష్మి నగలు సర్దుతుంటే రుద్రాణి వస్తుంది. తను రాగానే త్వరగా అన్ని సర్దుతుంది. ఏంటి నేను రాగానే అలా చేస్తున్నావని రుద్రాణి అడుగుతుంది. అదేం లేదు అన్ని నగలు చూసి ఇంకా లేవని అనుకుంటానని ధాన్యలక్ష్మి ఇండైరెక్ట్ గా రుద్రాణితో అంటుంది. నేను అన్ని నగలు చేసుకుంటాను.. నా కొడుకు ఒక కంపెనీకి చైర్మన్ అని రుద్రాణి అంటుంది. అది బాధ్యతలు తెలిసినప్పుడు అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో రుద్రాణి కోపంగా రాహుల్ దగ్గరికి వెళ్తుంది. వాళ్లు పెద్ద సంస్థలో ఉంటూ నీకు చిన్న కంపెనీ ఇచ్చారని  రాహుల్ తో రుద్రాణి అంటుంది. వాళ్ళు నాకు ఇచ్చింది కంపెనీ కాదు మమ్మీ కత్తి.. దాంతో ఎలా చేస్తానో చూడమని రాహుల్ అంటాడు. మరొకవైపు కావ్య తన కోరికల చిట్టాలో చివరిది బుల్లెట్ బండిపై రైడ్.. ఆ బుల్లెట్ బండిని తీసుకొని వచ్చి కావ్యకి రాజ్ సర్ ప్రైజ్ ఇస్తాడు. నేను నడుపుతానని కావ్య నడుపుతుంది. దాంతో రాజ్ వెనకాల కూర్చొని భయపడుతాడు. మరుసటి రోజు.. నీ కొత్త ఆఫీస్ కి నువ్వు వెళ్ళమని రాహుల్ తో సుభాష్ చెప్తాడు. పాత ఆఫీస్ కి నేను, కావ్య వెళ్తామని రాజ్ చెప్తాడు. ఇక అప్పు కూడా డ్యూటీకి వెళ్తుందని కళ్యాణ్ అనగానే డెలివరీ వరకు వద్దని ధాన్యలక్ష్మి అంటుంది. అయిన ధాన్యలక్ష్మికి తెలియకుండా అప్పుని తీసుకొని కళ్యాణ్ డ్యూటీకీ బయల్దేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : జ్యోత్స్నని బ్లాక్ మెయిల్ చేసిన దాస్.. శివన్నారాయణ భయం ఏంటంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -525 లో.....జ్యోత్స్నని దాస్ కాలుస్తాడు. దీప ఎలాగూ పేదింట్లో పెరిగింది కానీ తన బిడ్డ అలా కాదు.. ఆ పెద్దింట్లో పెరగాలి.. అలా కాదని నువ్వు అడ్డుపడితే నిజం చెప్పడానికి నేనే వస్తానని జ్యోత్స్న ని దాస్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు దీప కి టెస్ట్ లు ఎప్పుడు చేయించాలని కార్తీక్ డాక్టర్ తో మాట్లాడతాడు. అప్పుడే దీప వచ్చి ఇవన్నీ ఎందుకు బావ ఇప్పుడే అని అంటుంది. అప్పట్లో అయితే ఇవన్నీ ఏం లేవు కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందని కార్తీక్ అంటాడు. ఇక రేపటి నుండి పనికి రాకు అని కార్తీక్ అనగానే.. వస్తాను బావ.. అక్కడ అమ్మనాన్నలని చూస్తూ ఉండొచ్చు కదా అని దీప అంటుంది. మరుసటి రోజు స్వప్నకి కాశీ డాష్ ఇవ్వగా పడిపోతుంటే కాశీ పట్టుకొని సారీ చెప్తాడు. స్వప్న సైలెంట్ గా వెళ్తుంటే.. ఏంటి మాట్లాడవు. మీ అన్నయ్య మనల్ని కలిపాడు కదా అని కాశీ అనగానే మా అన్నయ్య అంటే గౌరవం ఉందని స్వప్న గొప్పగా మాట్లాడుతుంది. దాంతో కాశీకి కోపం వచ్చి మీ అన్నయ్య చేసేది ఆఫ్ట్రాల్ డ్రైవర్ జాబ్ అని అంటాడు. అది శ్రీధర్ విని.. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడే స్థాయి నీది అని కాశీపై శ్రీధర్ కోప్పడతాడు. నీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. అది వచ్చాక చెప్తానని శ్రీధర్ ఆఫీస్ కి వెళ్తాడు. మరొకవైపు శివన్నారాయణ హాల్లో డల్ గా కూర్చుంటాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. సుమిత్ర అందరికి హారతి ఇస్తుంది. దీప నువ్వు జాగ్రత్తగా ఉండాలని దశరథ్, శివన్నారాయణ అంటారు.  దీపకి ఇదేం కొత్తేమీ కాదు.. ఆల్రెడీ పిల్లలని కనడంలో అనుభవం ఉంది అని జ్యోత్స్న తప్పుగా మాట్లాడడంతో దశరథ్ తనపై చెయ్ ఎత్తేలోపే జ్యోత్స్నని సుమిత్ర కొడుతుంది. నువ్వు దీపని కాదు మాతృత్వాన్ని అవమానిస్తున్నావని అమ్మతనం గురించి సుమిత్ర గొప్పగా చెప్తుంది. దాంతో జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. దీప ఏడుస్తూ వెళ్తుంది. కార్తీక్ కి సుమిత్ర సారీ చెప్తుంది. కార్తీక్ ని శివన్నారాయణ బయటకు తీసుకొని వస్తాడు. పంతులు అతడితో ఏం చెప్పాడో అన్నీ కార్తీక్ కి చెప్తాడు. నాకు భయంగా ఉందిరా ఎవరికి ఆపద వస్తుందోనని శివన్నారాయణ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : పెద్దకోడలు రిక్వెస్ట్ చేయడంతో భోజనం చేసిన రామరాజు.. శ్రీవల్లి దొరికిపోతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో.. సాగర్ ఎదురుతిరిగి మాట్లాడడంతో రామరాజు డల్ గా ఉంటాడు. ఏవండీ భోజనం చేద్దాం రండి అని వేదవతి పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదని రామరాజు అంటాడు. నిన్నటి నుండి ఏం తినలేదని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. దొరికింది ఛాన్స్ అని ఇంకా ఈ నర్మద, ప్రేమ ఇద్దరిని ఇరికించాలని శ్రీవల్లి అనుకుంటుంది. పాపం మావయ్య గారిని చూస్తుంటే జాలిగా ఉంది. ప్రేమ జాబ్ చేస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చొక్కా పట్టుకొని చింపారని శ్రీవల్లి గతాన్ని గుర్తుచేస్తుంది. ప్రేమ, నర్మదలపై ఇంకా కోపం కలిగేలా చేస్తాడు. ఆ తర్వాత భోజనం చెయ్యండి మావయ్య అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఇంటికి పెద్ద కోడలిగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావమ్మ అని రామరాజు అంటాడు. ఆ తర్వాత  పదండి తిందామని రామరాజు అంటాడు. కాసేపటికి పూజ కోసం నర్మద రెడీ అవుతుంది. సాగర్ డల్ గా ఉంటే తనకి నచ్చజెప్పుతుంది. మరొకవైపు రేవతితో తిరుపతి మాట్లాడతాడు. అప్పుడే రామరాజు వచ్చి ఏంట్రా వాళ్ళతో మాట్లాడుతున్నావని అంటాడు. ఏంటి అండి ఎన్నటికి ఉన్నా రెండు కుటుంబాలు కలుస్తాయని వేదవతి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి నగలు అన్నీ వేసుకొని మురిసిపోతుంది. అప్పుడే తిరుపతి వస్తాడు. ఎక్కడ ఇవి ప్రేమ నగలు అని గుర్తుపడుతాడో అని చీర కప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu Top-5 contestants : బిగ్ బాస్ సీజన్-9 లో టాప్-5 ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో  రోజురోజుకి విన్నర్ ఎవరు అవుతారా, టాప్-5 లో ఎవరుంటారనే క్యురియాసిటి అందరిలోను నెలకొంది. హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది ఉన్నారు. గతవారం దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ ఇమ్మాన్యుయల్ తన పవరస్త్రాని ఉపయోగించడంతో దివ్య సేవ్ అయింది. ప్రస్తుతానికి విన్నింగ్ రేస్ లో తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో లేడీ బిగ్ బాస్ విన్నర్ అయితే అవ్వలేదు. ఒకవేళ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తే ఈసారి లేడీ బిగ్ బాస్ విన్నర్ ని చూడాల్సిందే. కళ్యాణ్ పడాల విన్నర్ అవుతాడా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే అతను టాస్క్ ల పరంగా తన బెస్ట్ ఇస్తున్నాడు. మిగతా వారికంటే ఇప్పటివరకు టాప్-2 లో ఉన్నాడు. ఇక టాప్-3 ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ఉండే అవకాశం ఉంది. మొదట్లో అందరు అతడే విన్నర్ అని అనుకున్నారు. హౌస్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తను లేకుంటే ఈ సీజన్ లేదన్నట్లు అంతా ఎంటర్‌టైన్‌మెంట్ చేసాడు. ఇక టాప్-4 విషయానికి వస్తే డీమాన్ లేదా రీతూ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత టాప్-5 భరణి అని చెప్పొచ్చు. రీఎంట్రీ తర్వాత నుండి గేమ్ బాగా ఆడుతున్నాడు. ఇదే గేమ్ ఎంట్రీ నుండి ఆడితే భరణి విన్నర్ అయ్యేవాడు.. అందులో ఆశ్చర్యం లేదు. మొన్న ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళలో చాలా మంది సుమన్ శెట్టిని టాప్ -5 కంటెస్టెంట్ అన్నారు కానీ ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో టాప్-6 పొజిషన్ లో ఉన్నాడు. ఇక ఈ వారం ఓటింగ్ లో దివ్య, సంజన లీస్ట్ లో ఉన్నారు.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరూ బయటకు వెళ్లడం ఖాయం.. ఒకవేళ ఫినాలే వీక్ కి టాప్-6 అని బిగ్ బాస్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అవుతుంది. సంజన, దివ్య ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు.

ప్రియాంకతో శివ్ బ్రేకప్... బంగారంతో విగ్రహం కట్టిస్తా!

హీరోస్ వెర్సెస్ హీరోయిన్స్ స్పెషల్ ఎపిసోడ్ గా నెక్స్ట్ వీక్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో రాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ షోకి అర్జున్ అంబటి, మానస్ నాగులాపల్లి, ముఖేష్ గౌడ, శివ్ కుమార్, ఆకర్ష్ బైరాముడి, నిఖిల్ మలయక్కల్, సుహాసిని, ప్రియాంక జైన్ వంటి వాళ్లంతా వచ్చారు. "మన సీరియల్ పురంలో విగ్రహం కడదామని ఫిక్స్ ఐపోయాం" అంటూ హరి చెప్పాడు. ఇక హీరోలు స్టేజి మీదకు వచ్చేసరికి శ్రీముఖి అందుకుంది. "ఎందుకు అంత గాప్ ఇచ్చావ్ అంటూ" హోస్ట్ శ్రీముఖి నిఖిల్ ని చాలా సరసంగా అడిగింది. "నీకు ఫోన్ చేశాడా" అంటూ హరిని అడిగింది. "చేసాడు..కానీ అప్పుడు బిజి వచ్చింది" అని చెప్పాడు. దాంతో శ్రీముఖితో పాటు అందరూ నవ్వేశారు. "నువ్విప్పుడు హీరో కాదు. యంచోర్ "అనేసింది. అదేంటి అని అడిగేసరికి "వాళ్ళు అక్కడ నిన్ను తీసేయాలి నువ్వు ఇక్కడికి వచ్చేయాలి" అంది. అంతే తలబాదుకున్నాడు మానస్. తర్వాత "ఏరా నాన్న ఎం చేస్తున్నావ్" అంటూ అంబటి అర్జున్ ని అడిగింది. ఎం సమాధానం చెప్పకుండా నవ్వేసాడు.  "నువ్వు ఇందాక విగ్రహాలు అని అదేదో అన్నావ్ కానీ" అని శ్రీముఖి అనేసరికి "ఒక్క నిమిషం అర్జున్ కి విగ్రహం కట్టే డబ్బులతో నేను పది అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవచ్చు" అంటూ కామెంట్ చేసాడు హరి. "సుహాసిని నీ విగ్రహం కట్టించేటప్పుడు అందులో నీ నడుము ఉండదు" అని చెప్పింది శ్రీముఖి. "చూసావా ఎంత సిమెంట్ మిగిల్చానో" అని సుహాసిని ఫన్నీగా చెప్పింది. "శివ్ విగ్రహం కడితే పక్కన ప్రియాంక విగ్రహం కూడా కట్టాలా" అని హరి అడిగేసరికి "హే వొద్దొద్దు.. నేను సోలోనే ఎప్పుడు" అన్నాడు. అంతే సీరియస్ గా చూసింది ప్రియాంక. "అతను సోలో మ్యాన్ అంట. బ్రేకప్ ఐపోయిందంట" అని శ్రీముఖి అనేసరికి "అవును తెలీదా మీకు" అంది ప్రియాంక. మరి చెప్పలేదేమిటి అంటూ అవినాష్ వెళ్లి ప్రియాంక చేయి పెట్టుకొనేసరికి "హే సిమెంట్ తో ఎందుకండీ నా ప్రియాంకను గోల్డ్ తో కట్టించాలి" అన్నాడు. అంతే ఒహ్హ్ అంటూ అందరూ అరిచేసారు.

Bharani Out of The Captaincy Task: కెప్టెన్సీ రేసు నుంచి భరణి అవుట్.. కూతురి డ్రీమ్ నెరవేరేనా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ తర్వాత నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక ఆ తర్వాత హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లు ఆడించడానికి హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ వచ్చారు. గౌతమ్ హౌస్ లోకి పంచకట్టులో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే అందరి ఆటతీరు చెప్పాడు. సుమన్ గారు మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు.. మీరంటే చాలా ఇష్టం అని చెప్పి సుమన్ ని హగ్ చేసుకుంటాడు గౌతమ్. హౌస్ లో ఫన్ క్రియేట్ చెయ్యడానికి ఇద్దరు ఇద్దరిగా వెళ్లి అమ్మాయిలని ఫ్లర్టింగ్ చేయాలని గౌతమ్ చెప్తాడు. దాంతో మొదటగా సంజనని భరణి ఫ్లర్టింగ్ చేస్తాడు. వాళ్ళ మధ్యలోకి సుమన్ వచ్చి సంజనని ఫ్లర్ట్ చేస్తాడు. ఆ తర్వాత రీతూని కళ్యాణ్, దివ్యని ఇమ్మాన్యుయల్.. తనూజని డీమాన్ ఫ్లర్ట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ తనతో టాస్క్ ఆడడానికి భరణిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ టాస్క్ లో భరణి ఓడిపోతాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి తొలగిపోతాడు. దాంతో భరణి ఎమోషనల్ అవుతాడు. గౌతమ్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎంత కష్టమైనా ఆడుదామని అనుకున్నాను.. నా కూతురు ఫ్యామిలీ వీక్ లో వచ్చినప్పుడు.. "నాన్న నువ్వు కెప్టెన్ అవ్వాలి" అని అందంటూ భరణి డిసప్పాయింట్ అవుతాడు. హౌస్ లో ఉన్న తొమ్మిది మందిలో అందరు ఒక్కసారి కెప్టెన్ అయ్యారు. ఇమ్మాన్యుయల్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. భరణి ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు.. పైగా కెప్టెన్సీ టాస్క్ ఇదే చివరి వారం.. నెక్స్ట్ వీక్ నుండి కెప్టెన్సీ టాస్క్ ఉండదు. అందుకే భరణి అంతలా ఎమోషనల్ అవుతున్నాడు. అన్ని టాస్క్ లు అయ్యేసరికి రేస్ నుండి తొలగిపోయిన వారందరికి మళ్ళీ టాస్క్ పెట్టొచ్చు.. ఆ టాస్క్ లో గెలిచిన వారికి కెప్టెన్సీ రేస్ లో పోటీపడేందుకు ఛాన్స్ వస్తుంది కావచ్చు. అందులో భరణి ఉంటాడేమో చూడాలి మరి.

Bigg Boss 9 voting : ఫేక్ ఓటింగ్‌తో తనూజ టాప్.. డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక పన్నెండవ వారం హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ లు మొదలెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలో ఉన్న కెప్టెన్ లని హౌస్ లోకి రప్పిస్తున్నాడు బిగ్ బాస్. ఎక్స్ కంటెస్టెంట్స్ వర్సెస్ సీజన్-9 కంటెస్టెంట్స్ అన్నట్టుగా ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఈ వారం రీతూ కెప్టెన్ గా ఉండటంతో తను తప్ప హౌస్ లోని వాళ్ళంతా నామినేషన్ లో ఉన్నారు. మరి వారిలో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది.. జెన్యున్ ఓటింగ్.. ఫేక్ ఓటింగ్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. ఏ అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్ చూసిన తనూజ టాప్ లో ఉంది. తనకి ముప్పై శాతం పైనే ఓటింగ్ పడుతోంది. అంటే వంద మంది ఓటింగ్ చేస్తే అందులో ముప్పై మంది తనకి ఓటింగ్ చేయగా మిగిలిన డెబ్బై మంది ఏడుగురు కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేస్తున్నారన్న మాట. తనూజకి పడే ఓటింగ్ అంతా బిగ్ బాస్ మామ దగ్గరుండి చేసుకుంటున్నాడని, ఫేక్ ఓటింగ్ క్రియేట్ చేస్తున్నారనే రూమర్ అయితే నడుస్తోంది. ఇక రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ పడాల ఉన్నాడు. అతనికి ఇరవై అయిదు శాతం ఓటింగ్ పడుతోంది. అయితే ఇందులో కూడా కొంత ఫేక్ ఓటింగ్ అనేది ఉంది.. ఎందుకంటే బిగ్ బాస్ మామ ఈ సీజన్-9 లో కళ్యాణ్ ని విన్నర్ చేయాలని, తనూజని రన్నరప్ చేయాలని చూస్తున్నాడని సోషల్ మీడియా అంతటా ప్రచారం సాగుతుంది. ఇక మూడో స్థానంలో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. అతనికి పదమూడు శాతం ఓటింగ్ పడుతోంది. సంజన గల్రానీకి ఏడు శాతం ఓటింగ్ పడుతోంది. భరణికి, డీమాన్ పవన్ కి ఆరు శాతం ఓటింగ్ పడుతోంది. సుమన్ శెట్టి, దివ్య నిఖితకి అయిదు శాతం ఓటింగ్ పడుతోంది. అంటే ఈ వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు చాలా వరకు ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టికి బిగ్ బాస్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే తను గేమ్ ఆడినా ఆడకపోయినా అతను ఇప్పటివరకు హౌస్ లోనే ఉన్నాడు. ఈ లెక్కన ఈ వారం దివ్య నిఖిత ఎలిమినేషన్ ఫిక్స్ అన్నమాట. హౌస్ లో జెన్యున్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య నిఖిత.. మిగతా వారంతా ఎంతో కొంత కన్నింగ్ అండ్ స్ట్రాటజీలు ప్లే చేస్తూ నెట్టుకొచ్చేవాళ్ళే. నేటి ఓటింగ్ ని బట్టి చూస్తే సుమన్ శెట్టి, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు.