కోడలు ఇంటిలిజెన్స్ చూసి అత్త షాక్.‌. సంతోషంలో భర్త!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ '‌ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -212 లో......అందరు కొటేషన్ లతో బిట్ వెయ్యడానికి వెళ్తారు. రామలక్ష్మి కొటేషన్ తో ఎంట్రీ ఇస్తుంది. అందరు బిట్ వేసాక రిజల్ట్స్ కోసం చూస్తుంటారు. అందరి కోటేషన్లు చూసి ఎవరు తక్కువ వేస్తే వాళ్లకు బిట్ ఇవ్వాలని వాళ్లు అనుకుంటారు. అంతకుముందే వేరొకా కంపెనీ కి బిట్ ఇవ్వాలని ముందే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. తీరా చుస్తే వాళ్ళ కంటే సీతాకాంత్ వేసిన బిట్ తక్కువ అమౌంట్ తో వేసి ఉంటుంది. ఇదేంటి సీతాకాంత్ బిట్ అందరికంటే తక్కువ ఉందని అనుకుంటారు. ఆ తర్వాత ముందు డబ్బులు తీసుకున్న అతనికి వాళ్ళు ఫోన్ చేసి పక్కకి రమ్మని చెప్పి.. మీ కంటే సీతాకంత్ కొటేషన్ తక్కువ వేసాడు. న్యాయం గా అయితే వాళ్ళకే వెళ్ళాలి కానీ మీరు డబ్బులిస్తే మీకు వస్తుందనగానే అతను డబ్బులు ఇస్తాడు. అదంతా రామలక్ష్మి చూసి వీడియో తీస్తుంది. అందరు బయటకు వచ్చి ఈ బిట్ శ్రీజ గ్రూప్ కి వెళ్తుందని చెప్పగానే అదేంటి అందరికన్న మేమే తక్కువ వేసాము కదా అని రామలక్ష్మి అంటుంది. మీది రిజెక్ట్ చేసాం సీతాకాంత్ గారి సైన్ లేదు.. మీ సైన్ లేదు అని వాళ్లు అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆడవాళ్ళ కీ పెత్తనమిస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పటివరకు ఓటమి అంటూ తెలియదు సీతాకాంత్ అంటారు. లేదు నేను అన్ని బానే మెయిల్ చేసానని రామలక్ష్మి అంటుంది. డబ్బులు తీసుకున్న అతన్ని రామలక్ష్మి పక్కకు పిలిచి డబ్బులు తీసుకున్న వీడియో చూపిస్తుంది. సారీ మేడమ్ తప్పు చేసాను అంటాడు. ఆ తర్వాత అందరి ముందు వచ్చి సీతాకాంత్ గారు బిట్ గెలుచుకున్నారని చెప్తాడు. దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ఎటాక్ లు చేస్తుంది ఎవరో కనుకోవడానికి సీతాకాంత్ ఒక డిటేక్టివ్ ని ఏర్పాటు చేస్తాడు. అతను వచ్చి సీతాకాంత్ తో మాట్లాడతాడు. జరిగింది మొత్తం చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ నందిని ఫోటో చుపించి ఈమె చేసిందేమో డౌట్ గా ఉందని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వస్తుంది. అందరూ బిట్ మనకే వచ్చిందా అంటూ అడుగుతారు. రామలక్ష్మి సైలెంట్ గా ఉండడంతో బిట్ పోయిందంటు శ్రీవల్లి అంటుంది. అప్పుడే ఎవరో సీతాకాంత్ కీ ఫోన్ చేసి బిట్ వచ్చిందని చెప్తారు. ఆ విషయం సీతాకాంత్ అందరికి చెప్తాడు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటి ఎలా వచ్చిందని శ్రీవల్లి శ్రీలతలు అనుకుంటారు. మరొకవైపు సీతాకాంత్ అన్న మాటలు నందిని గుర్తుచేసుకుంటుంది. అప్పుడే హారిక వస్తుంది. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య డిజైన్స్ లో ఏం ఉందంటే.. భర్తకి తెలియకుండా అలా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -526 లో......కావ్య ఆఫీస్ కి హడావిడిగా రెడీ అవుతుంటే.. కనకం టిఫిన్, లంచ్ బాక్స్ తీసుకొని వస్తుంది. టిఫిన్ చేసే టైమ్ లేదు కానీ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తానంటూ కావ్య వెళ్తుంటే.. కృష్ణమూర్తి ఎదరుపడి ఛార్జ్ డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు. ఉన్నాయని కావ్య అనగానే చూపించమని అంటాడు. డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నావని కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతాడు. కావ్యకి డబ్బులు ఇచ్చి కృష్ణమూర్తి అటోలో వెళ్ళమని చెప్తాడు. కావ్య వెళ్ళిపోయాక మీరు కావ్య జాబ్ చెయ్యడానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ దాని కాపురం బాగుండాలంటూ మాట్లాడుతుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే అపర్ణ, ఇందిరాదేవిలు కంపెనీకి మంచి పేరు తీసుకొని రావాలని చెప్తారు. అదంతా చూస్తున్న రుద్రాణి అనామికకి ఫోన్ చేసి రాజ్ మళ్ళీ ఆఫీస్ కి వెళ్తున్నాడని చెప్తుంది. వెళ్లనివ్వు.. నా ప్లాన్ లో నేనున్నా.. ఇక కావ్య డిజైన్స్ ని అడ్డం పెట్టుకొని స్వరాజ్ కంపెనీని తొక్కేస్తాను. ఇక భార్య వర్సెస్ భర్త అని అనామిక అంటుంది. మరొకవైపు రాజ్, కావ్యలు అనుకోకుండా ఇద్దరు ఒకే గుడికి వెళ్తారు. ఇద్దరు ఒకేసారి గంట కొడుతుంటే.. నువ్వా అంటూ రాజ్ అంటాడు. ఇక ఇద్దరి మధ్య ఎప్పటిలాగా వార్ మొదలవుతుంది. ఆ తర్వాత పూజారి అర్చన చేస్తుంటే నాకు పెళ్లి కాలేదని రాజ్ అనగానే.. అయ్యో ఇంకా పెళ్లి కాలేదా ఏదైనా లోపం ఉండి ఉంటుంది హాస్పిటల్ లో చూపించుకోమని పూజారి అంటాడు. దాంతో కావ్య నవ్వుతుంది. నాకు పెళ్లి అయింది నా మొగుడు తాగి వచ్చి టార్చర్ చేస్తున్నాడంటూ కావ్య కావాలనే అంటుంది. ఆ తర్వాత రాజ్ తొక్క పై అడుగేసి పడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. రాజ్ తిక్కగా మాట్లాడుతుంటే అతడిని చేతుల్లో నుండి వదిలేస్తుంది కావ్య.. దాంతో రాజ్ కింద పడిపోతాడు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లేసరికి అందరు వర్క్ చేయకుండా ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో రాజ్ అందరిపై కోప్పడతాడు. తరువాయి భాగంలో  కావ్య డిజైన్స్ మాకు వేస్తుందని కావ్యకి తెలియొద్దని అనామిక మీడియటర్ కి చెప్తుంది. అతను కావ్యతో పెద్ద కంపెనీతో టై అప్ అయ్యాం.. మీరు మంచి డిజైన్స్ వేయండి అంటాడు. దానికి కావ్య సరే అంటుంది. సామంత్ రాజ్ తో ఛాలెంజ్ చేస్తాడు. ఇక మా కంపెనీనే నెంబర్ వన్ లో ఉంటుందని అంటాడు. ఆ తర్వాత రాజ్ ఒకవైపు.. కావ్య ఒకవైపు డిజైన్స్ వేస్తుంటారు. కావ్య డిజైన్స్ వేస్తుంటే నీ మనసులో ఉంది కాగితంపై వేస్తున్నావా అని కావ్యతో కనకం అంటుంది. కావ్య డిజైన్స్ కాకుండా రాజ్, కావ్యల ఫోటోని వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిఖిల్ తప్పుల్ని లేపేసిన బిగ్ బాస్ ఎడిటర్.. సోనియా చేసిన చిల్లర పని అదే!

అసలు బిగ్ బాస్ హౌస్ లో లైవ్ టాస్క్ లలో ఏం జరుగుతుంది. బిగ్ బాస్ ఎడిటర్ మావ ఏం చూపిస్తున్నాడో ఓసారి చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపడం కోసం ఇరు టీమ్ లకి మధ్య టాస్క్ లు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ లో .. నిఖిల్ టీమ్ నుండి పృథ్వీ, సీత టీమ్ నుండి నబీల్ వచ్చారు. ఇక బాల్ ని పగలకుండా ఇద్దరు రెండు చేతులతో పట్టుకొని ఉన్నారు. అయితే బిగ్ బాస్ పదిహేను నిమిషాలు అలా ఉంటే సరిపోతుందని చెప్పాడు కానీ దాదాపు 2:30 గంటల సేపు వాళ్ళిద్దరు పట్టుకొని నిల్చున్నారు.‌ ఇకీ గేమ్ తర్వాత బిగ్ బాస్ నబీల్ ని అభినందించాడు. మహాతాలి టాస్క్ ముగిసిన వెంటనే ఈ టాస్క్ ఒక పెట్టాడు బిగ్ బాస్. ఇక అప్పటికే ఫుల్ గా తిన్న నబీల్ అసలు కాస్త కూడ ఆడలేని సిచువేషన్ లో ఉన్నాడు. కానీ కాంతారా టీమ్ ని గెలిపించడానికి ముందుకొచ్చాడు నబీల్. గేమ్ స్పిరిట్, టీమ్ స్పిరిట్ అంటే ఇదే అని నబీల్ ఆటతీరు చెప్తుంది. ఇక ఇద్దరు రెండు చేతులతో కాదు ఒక్క చేతితో పట్టుకోవాలని బిగ్ బాస్ మళ్ళీ మార్చేశాడు. అయినప్పటికి‌ పృథ్వీకి నబీల్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇక కాసేపటికి నబీల్ చేతి నొప్పి భరించలేక వచ్చేశాడు. పృథ్వీ గెలిచాడు. శక్తి టీమ్ ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపింది. ఇదంతా ఎడిటర్ మావ లేపేశాడు.‌ఇక ఆ తర్వాత నబీల్ దగ్గరికి నిఖిల్ వెళ్ళి సూపర్ రా అంటు అభినందిస్తాడు. కాసేపు నబీల్ దగ్గరే ఉండి అతనికి మసాజ్ కూడా చేస్తాడు. హౌస్ అంతా నబీల్ ఎఫర్ట్స్ ని గుర్తించి అభినందిస్తారు. అది లేపేశాడు‌ ఎడిటర్ మావ.  నిఖిల్, సీత ఇద్దరు కలిసి.. టీమ్ ల వారిగా కాదు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపాలని చెప్పి కలిసి ఆడాలని అనుకుంటారు. ఇది ఎడిటర్ మావ లేపేశాడు. ఇక సీతతో  నిఖిల్ మాట్లాడి వెళ్ళి.. సోనియా చెప్పగానే దానికి ఒకే అని నబీల్ తీసేద్దామని అనుకుంటారు. బిగ్ బాస్ ఎడిటర్ మావ ఇది లేపేశాడు. ఇలా శక్తి టీమ్ లోని సోనియా, నిఖిల్ భాగోతాన్ని మొత్తం దాచేసి... మోస్ట్ వాల్యుబుల్ ఎపిసోడ్ ని కాస్తా పాటలు, డ్యాన్స్ లతో సప్పగా చేశారు.  

నాన్నతో చివరి హగ్ ఫోటో అదే.. నరేష్ లొల్ల వాళ్ళ నాన్న ఇక లేరు!

  నరేష్ లొల్ల.. అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు.. అమర్ దీప్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు నరేష్ లొల్ల. జానకి కలగనలేదు, గీతాగోవిందం, రామచక్కని సీత వంటి సీరియల్స్‌లో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నరేష్ లొల్ల.. బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అమర్ దీప్‌కి ప్రాణ స్నేహితుడు. గత సీజన్‌లో అమప్ దీప్ హౌస్‌లో గెలుపుకోసం పోరాడితే.. బయట ట్రోలర్స్‌తో పోరాడి వార్తల్లో నిలిచాడు నరేష్ లొల్ల. నరేష్ లోల్ల.. 'లొల్లాస్ వరల్డ్' అనే యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఇక కొన్ని గామడల క్రితం తన తండ్రి హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్తూ వ్లాగ్ చేశాడు. అందులో నరేష్ ఏం అన్నాడంటే..  ఇలాంటి పరిస్థితి తనకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని, మీ బ్లెస్సింగ్ నాకు కావాలి. దీన్ని మీరు నెగిటివ్ అనుకున్నా పబ్లిసిటీ అనుకున్నా పర్లేదు. నాకు ఫస్ట్ టైం ఒక ఛాన్స్ వచ్చింది. మా డాడీ అంటే ఎంత ఇష్టమో.. పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. నేను పుట్టినప్పటి నుంచి చాలా విషయాలు మా డాడీకి చెప్పుకోలేదు. అవన్నీ చెప్పుకోవాలని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాను. మా డాడీకి 60 ఇయర్స్ బర్త్ డే సెలబ్రేషన్ చేశాను. ఆరోజు డాడీతో మనసు విప్పి మాట్లాడాను.  నేను పుట్టినప్పటి నుంచి నాతో చెప్పని చాలా విషయాలు ఆయన నాతో చెప్పారు. కానీ ఒక్కరాత్రిలో లైఫ్ మొత్తం మారిపోయింది. మా డాడీ హాస్పిటల్‌లో ఉన్నారు. ఆయన తొందరగా కోలుకోవాలి. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని బ్లెస్ చేయండి అని వ్లాగ్ చేశాడు. అయితే ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే నరేష్ లొల్ల వాళ్ళ నాన్న చనిపోయారు. ఇదే విషయాన్ని తెలుపుతూ లొల్ల తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాడు.  

Karthika Deepam2 : పెళ్ళి చేసుకొని వచ్చిన స్వప్న, కాశీ.. నాన్నని పిలిపించమని పెద్దాయాన ఆర్డర్

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -160 లో.....స్వప్న, కాశీ లు కార్తీక్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. స్వప్నని జాగ్రత్త గా చూసుకో నిన్ను నమ్మి వచ్చిందని కార్తీక్ అనగానే.. ప్రాణం పోయినా చెయ్ వదలనని చెప్పి కాశీ స్వప్నని తీసుకొని వెళ్తాడు. దీప మాతో పాటురా అని కాంచన  అంటుంది. అందరి పెళ్లి చేస్తుంది. నా పెళ్లి చేయదా అని కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. మరొకవైపు శ్రీధర్ కి స్వప్న ఫోన్ చేసి.. నేను క్షేమంగా ఉన్నాను.. మీరు టెన్షన్ పడకండి.. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను.. నేను కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తారని కాల్ చేస్తున్నాను.. ఈవినింగ్ వస్తానని కాల్ కట్ చేస్తుంది స్వప్న. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకున్నట్లు చెప్పొచ్చు కదా అని కాశీ అంటాడు. ఎప్పుడు మా డాడే సర్ ప్రైజ్ ఇస్తాడా.. నేను ఇవ్వొద్దా అని స్వప్న అంటుంది. మరొక వైపు శ్రీధర్ కీ సుమిత్ర ఫోన్ చేసీ త్వరగా ఇంటికి రండి అన్నయ్య.. జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి ముహూర్తం గురించి అని చెప్తుంది. దానికి శ్రీధర్ సరే అంటాడు. ఆ తర్వాత స్వప్న ఈవినింగ్ వచ్చాక ఎక్కడికి వెళ్లనివ్వకు వచ్చాక మాట్లాడతాను.. అక్కడ కొడుకు పెళ్లి గురించి ముహూర్తం అంట అని కావేరితో  శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే.. అప్పుడే స్వప్నని కాశీ తీసుకొని వస్తాడు. తనని చూసి పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. వీడిని ఇక్కడ నుండి పంపించాలని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత మమ్మల్ని ఆశీర్వదీంచండి అని పారిజాతంతో  కాశీ అంటాడు. దాంతో కాశీని తిడుతుంది పారిజాతం. అప్పుడే దీప, కార్తీక్ కాంచన లు వస్తారు. మమ్మల్ని ఆశీర్వదించండి అని కాశీ మళ్ళీ అనగానే పారిజాతం తిడుతుంది. మా పెళ్లి ఒక మంచి మనిషి సమక్షంలో జరిగిందని కాశీ అంటాడు. ఎవరి సమక్షంలో అని పారిజాతం అనగానే దీపక్క అని కాశీ అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఈ పిల్ల మావయ్య కూతురని తెలిసే ఈ పని చేసినట్లు ఉందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత  స్వప్నని పారిజాతం తిడుతుంది. నన్ను తిట్టకండి. నాకు ఒక గౌరమైన ఫ్యామిలీ ఉందని స్వప్న అంటుంది. అందరు ఎక్కడ స్వప్న శ్రీధర్ గురించి చెప్తుందోనని టెన్షన్ పడుతారు. మీ నాన్న ఎవరో పిలిపించమని శివన్నారాయణ అనగానే.. కార్తీక్, దీప లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరి ప్రేమకి మధ్యలో శ్రీలత.. ఆమె డ్రీమ్ నెరవేరుతుందా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -211 లో.....పేపర్స్ పట్టుకోబోతుంటే రామలక్ష్మి అనుకోకుండా సీతాకాంత్ కి ముద్దు పెడుతుంది.. నీకు పెడతానని సీతాకంత్ అనగానే.. ముందు పని చూసుకోండి. బోలెడంత కాంపిటీషన్ ఉంది బయట అని అంటుంది. దాంతో సీతాకాంత్ బిట్ వెయ్యడని కొటేషన్ రెడీ చేస్తుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు నిద్రపోతుంటే.. అప్పుడే శ్రీవల్లి మెల్లిగా గదిలోకి వస్తుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ఎక్కడ ఉందని వెతుకుతుంది. ఆ తర్వాత టేబుల్ మీద కొటేషన్ కవర్ చూసి.. శ్రీవల్లి తీసుకోబోతుంటే అక్కడ కింద ఉన్న ర్యాట్ ప్యాడ్ పై కాలు వేస్తుంది. దాంతో కాలు స్టిక్ అవుతుంది. అలా కొటేషన్ కవర్ తీసుకొని మెల్లిగా ఆ ప్యాడ్ తోనే శ్రీలత దగ్గరికి వెళ్లి తియ్యమంటుంది. ప్యాడ్ తీస్తుండగా శ్రీలత చెయ్ కి అతుకుంటుంది. ఎలాగైనా విడిపించుకుంటారు ర్యాట్ ప్యాడ్. మళ్ళీ అక్కడే పెట్టు లేదంటే డౌట్ వస్తుందని శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి నిద్రలేచి రాత్రి జరిగిన విషయం గుర్తుచేసుకుంటుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ని దాచిపెటి రామలక్ష్మి రెడి చేసిన కొటేషన్ టేబుల్ పై పెట్టి ఎవరైనా వచ్చారో లేదో తెలుసుకోవడానికి ర్యాట్ ప్యాడ్ ని కూడా పెడుతుంది అది ఫోటో తీసుకుంటుంది. ఆ సంఘటన గుర్తుచేసుకొని ఈ పాటికి కొటేషన్ కొట్టేసి ఉండాలని ర్యాట్ ప్యాడ్ పెట్టిన చోట ఉందో లేదో ఫోటో చూస్తుంది. పెట్టిన చోట లేకపోయేసరికి ఎలుకలు వచ్చాయన్న మాట అని అనుకుంటుంది. ఆ తర్వాత కానిస్టేబుల్ సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. మీపై ఎటాక్ జరిగింది కదా.. ఎవరిపైన అయిన డౌట్ ఉందా అని అడుగుతాడు. ఏం లేదని చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. దూరం నుండి శ్రీవల్లి వింటుంది. ఏంటి అక్క పోలీస్ లు వచ్చారని అడుగుతుంది.  ఎటాక్ చేసిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయమన్నానని శ్రీవల్లిని భయపెడుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి వెళ్లి శ్రీలత కి చెప్తుంది. ఆ తర్వాత ఇది ఎవరో కావాలనే చేశారని రామలక్ష్మి అంటుంది. నువ్వు అన్ని ఆలోచించకు.. ఆఫీస్ కి వెళ్ళమని శ్రీలత అంటుంది. బయటకు వచ్చాక నాపై డౌట్ రాలేదు. ఆ రామలక్ష్మిని ఉంచకూడదని శ్రీలత అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి బిడ్ వెయ్యడానికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్యకి గుడ్ న్యూస్.. అప్పు పోలీస్ జాబ్ తెచ్చుకోగలదా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -525 లో....సీతారామయ్య ఫ్రెండ్ తన ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులాగా మీ కంపెనీతో నా మనవడు కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. ఇక ఆ కాంట్రాక్టు కాన్సిల్ చేసుకున్నాడని అతను చెప్తాడు. ఎందుకు ఏమైంది అని సీతారామయ్య అంటాడు. మర్యాద తక్కువ అయింది.. నా మనవడిని రాహుల్ అవమానించాట అని అతను చెప్తాడు. ఇన్ని రోజుల నుండి మన మధ్య స్నేహం ఉంది కాబట్టి ఆ విషయం చెప్పాడనికి వచ్చానని అతను అనగానే చాలా థాంక్స్ రా ఇప్పటికైనా మా కంపెనీలో ఏం జరుగుతుందో తెలియజేశావని సీతారామయ్య అంటాడు.  ఆ తర్వాత అతను వెళ్లిపోయాక రాహుల్ ఎందుకు ఇలా చేసావ్ అంటూ తిడుతారని ముందుగానే రాహుల్ ని తిడుతుంది రుద్రాణి. నటించింది చాలు ఎక్కడ మేమ్ తిడుతామో అని తిట్టినట్లు నటిస్తున్నావ్ కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆ రోజే కావ్య చెప్పింది.. రాహుల్ వద్దు ఇలాంటి సిచువేషన్ వస్తుందని కానీ పట్టించుకోలేదు. ఇక నుండి రాజ్ ఆఫీస్ కి వెళ్తాడని సీతారామయ్య చెప్తాడు. నేను వెళ్ళను.. పిన్నికి ఇష్టం అయితే వెళ్తా అని రాజ్ అంటాడు.... నా కొడుకు న్యాయం జరగాలి అన్నాను కానీ అది పక్కన పెట్టి ఈ విషయం ఆలోచిస్తున్నారు.. రాజ్ ఆఫీస్ వెళ్లడం నాకు ఇష్టమే కానీ కళ్యాణ్ ని ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత రాజ్ దే అని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తాన్నాడు అని న్యూస్ తెలిసి కావ్యకి కనకం చెప్పాలని వస్తుంది. నాకేం చెప్పొద్దని కావ్య అనగానే సరే మీ ఆయన గురించి మా ఆయనకి చెప్తానని కనకం అంటుంది. రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడంట రాహుల్ ఏదో తప్పు చేస్తే మళ్ళీ రాజ్ ని వెళ్ళమన్నారంట అని అనగానే కావ్య కూడా వింటుంది. ఆ తర్వాత అందరిలో తిట్టావంటూ రాహుల్ కోపంగా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి.. మీ ఇద్దరి యాక్టింగ్ సూపర్ సొంత కంపెనీలో ఇలా చేసేవాళ్ళని మిమ్మల్నే చూస్తున్నానని స్వప్న అంటుంది. మరొకవైపు అప్పు పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే కళ్యాణ్ తనకి భోజనం తినిపిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

నిఖిల్ నిజస్వరూపం బయటపడింది. గోతికాడ నక్క!

  బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి కంటెస్టెంట్స్ మరోసారి షాక్ అయ్యారు. అసలేం జరుగుతుందో అర్థం కానట్లుగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం జరిగే టాస్క్ లలో రెండు క్లాన్స్ మధ్య చిచ్చు రేగింది.  నిన్న హౌస్ లో రెండు టాస్క్ లు జరుగగా అందులో ఒకటి సీత టీమ్ గెలవగా.. మరొకటి ఎవరు గెలవలేదు. ఇక నేడు తాజాగా రీలీజ్ చేసిన ప్రోమోలో శక్తి క్లాన్ గెలిచినట్లు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ కాంతారా టీమ్ నుండి ఒకరిని తప్పుకోమని చెప్పాలి మ కానీ కంటెస్టెంట్ ని తీసేసే పవర్ శక్తి క్లాన్ కి ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో కాంతారా టీమ్ నుండి నబీల్ ని తీసేశాడు నిఖిల్ . దాంతో కిర్రాక్ సీత, ప్రేరణ ఇద్దరు ఫుల్ ఫైర్ అయ్యారు. అలా ఎలా తీస్తారు. మన టీమ్ లో నబీల్ బాగా ఆడుతున్నాడు. అతడిని తీసేస్తే వాళ్ళే అన్ని టాస్క్ లు గెలుస్తారని కాంతారా టీమ్ భయపడుతుంది. ఇక మణికంఠ విషయంలో నిఖిల్, సోనియా, పృథ్వీ ఇచ్చిన ప్రెషర్ తో అతన్నే తప్పుకునేలా చేశారంటు ప్రేరణ, సీత అడుగగా.‌. ఎస్ అంటు మణికంఠ సమాధానమిచ్చాడు. దాంతో సోనియా అతడిపై ఫైర్ అయింది. ఇలా మోసం చేస్తావనుకోలేదంటు మణికంఠని ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడుతుంది సోనియా. ఇక సోనియాతో పాటు నిఖిల్ , పృథ్వీ కూడా మణికంఠదే తప్పు అన్నట్టుగా మాట్లాడేసరికి అతను మైక్ విసిరిపారేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

మణికంఠ మగాడు కాదంటూ నీచంగా మాట్లడిన యష్మీ...

  బిగ్ బాస్ చరిత్రలో ఓ మగాడి గురించి ఇంత నీచంగా మాట్లాడిన సందర్భం లేదు. బహుశా యష్మీ మాట్లాడిన మాటలే ఫస్ట్ టైమ్. మణికంఠని ఫిజికల్ గా వీక్ అంటూ యష్మీ ఎటాక్ చేస్తుంది. తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా మణికంఠని మాటలతో మానసికంగా ఇబ్బంది పెడుతుంది యష్మీ. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్ట్ ఎంట్రీలని ఆపడానికి కంటెస్టెంట్స్ కి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా హౌస్ లో ఉన్న రెండు క్లాన్ల సభ్యలు తమకి సాధ్యమైనంతగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇలా టాస్క్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. అలా నిన్న జరిగిన ఓ ఎపిసోడ్ లో మణికంఠని టార్గెట్ చేసి నిఖిల్, యష్మీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. మణికంఠ తనని ఓదార్చడంలో భాగంగా.. హగ్ చేసుకున్నాడని... పెద్ద డ్రామా క్రియేట్ చేసి తెగ ఫీల్ అయిపోయిన యష్మీ గౌడ.. అదే వ్యక్తిని మగాడే కాదంటూ నీఛంగా మాట్లాడింది. హౌస్ మొత్తం ఒక్క చోట కూర్చుని.. మణికంఠ మగతనం గురించి మాట్లాడి వాళ్ల క్యారెక్టర్‌లను బజారున పెట్టుకున్నారు. వీళ్లకంటే.. ఆ బజారున బతికేవాళ్లే నయం అన్నంత నీఛంగా మాట్లాడారు. అందరు కలిసి మణికంఠ మగతనంపై జోక్‌లు వేసుకుని నవ్వేశారు. అరెయ్ మణి అందరం ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కడివే అక్కడ కూర్చున్నావేంటి ఇక్కడికి రా అని నిఖిల్ అనగానే.. ఇక్కడ మగాళ్ళు మాత్రమే కూర్చుంటారని యష్మీ అంది. అంటే మణికంఠ మగాడు కాదని అంది. ఇలా అతడి క్యారెక్టర్ ని పదేపదే కించపరుస్తూ మాట్లాడుతుంది యష్మీ. మరి బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూపై స్పందించడం లేదో ఏమో. వీకెండ్‌లో నాగార్జున అయిన ఈ ఇష్యూ మీద హెచ్చరిస్తారో.. లేదంటో యష్మీకి ఆ ఫ్రీడమ్ ని అలాగే కంటిన్యూ చేయమంటారో చూడాలి మరి.  ఈ వారం మణికంఠ నామినేషన్ లో ఉన్నాడు‌. నబీల్ తర్వాత ప్రేరణ, మణికంఠ ఉన్నారు. యష్మీ మాటలకి మణికంఠకి బీభత్సమైన పాజిటివిటి పెరిగింది. మరి ఈ ఇష్యూ ఎలా ముగుస్తుందో చూడాలి.  

ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ నేరం కాదు

ఈ శుక్రవారం శనివారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో స్కిట్ ఒక్కోలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో రౌడీ రోహిణి బాగా నవ్వించింది. ఇందులో రోహిణి బెగ్గింగ్ రోల్ లో నటించింది. బెగ్గింగ్ కోచింగ్ సెంటర్ పెట్టి అందులో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ కోచింగ్ సెంటర్ కి ఆటో రాంప్రసాద్, దొరబాబు ఇద్దరూ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు. "మాకు జాబ్ లు ఇస్తామని చెప్పింది బెగ్గర్స్ గానేనా" అని ఆటో రాంప్రసాద్ అడిగేసరికి "అవును బెగ్గింగ్ కోసమే" అని చెప్పింది రోహిణి. దానికి ఆటో రాంప్రసాద్ కొంచెం ఫీలైనట్టు కనిపించాడు. "చీప్ గా అడుక్కోవడం ఏంటండీ దరిద్రంగా " అని అడిగేశాడు రాంప్రసాద్. "చీప్ గా అడుక్కోవడం ఏమిటి " అని అడిగాడు. "చీప్ గా అడుక్కోవడమా ...ఏమనుకుంటున్నావ్. ఈ దేశంలో రిగ్గింగ్ నేరం కానీ బెగ్గింగ్ కాదు" అని చెప్పింది రౌడీ రోహిణి. ఇక రోహిణి అడుక్కునే అమ్మాయి రోల్ లో బాగా నటించింది. దీంతో జడ్జెస్ ఐతే ఫుల్ జోష్ తో నవ్వేశారు. దాంతో శాంతి, రోహిణి ఇద్దరూ కలిసి జడ్జెస్ దగ్గరకి వెళ్లేసరికి వాళ్ళు ఒకరికి 10  , ఇంకొకరికి 8 మార్కులు వేశారు. ఇలా ఈ వారం జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో నబీల్...25 రోజుల్లో లక్షన్నర మంది ఫాలోవర్స్!

బిగ్ బాస్ హౌస్ లో నబీల్ ఓ కొత్త మార్పుని తీసుకొచ్చాడు. నిన్న మొన్నటి దాకా అసలెందుకు చూడాలి అనిపించిన ఈ సీజన్.. సోనియాని నబీల్ నామినేషన్  చేసిన తీరుతో చూడాలనే ఇంట్రెస్టింగ్ కలిగింది. హౌస్ లో ట్రయాంగిల్ రిలేషన్ షిప్ జరుగుతుంది. అది ఎవరని బిగ్ బాస్ చూసే ప్రతీ ఒక్కరికి తెలుస్తుంది. ఇక వీరిని స్ట్రాంగ్ గా అపోజ్ చేసిన వ్యక్తులలో నబీల్ టాప్ లో ఉన్నాడు. సందు దొరికినప్పుడల్లా వాయించేస్తున్నాడు. నబీల్‌ కాకుండా హౌస్‌లో ఉన్న మిగిలిన మేల్ కంటెస్టెంట్లు అందరూ అమ్మాయిల వెనకాల హగ్గుల కోసం తిరుగడమే సరిపోయింది. నిఖిల్ టాస్కులు బాగా ఆడుతున్నప్పటికీ అస్తమానం సోనియా వెనకాల తిరగడం, సపోర్ట్ చేయడం ఆడియన్స్‌కి అస్సలు నచ్చడం లేదు. అలానే మిగిలిన వాళ్లు కూడా సందు దొరికితే చాలు అమ్మాయిలన ఓదార్చడమే సరిపోతుంది. కానీ నబీల్, ఆదిత్య మాత్రం వీటికి దూరంగా ఉంటున్నారు. ఇక నబీల్ తన ఆటతీరు, మాట తీరుతో ఆడియన్స్‌ మనసులు గెలుచుకుంటున్నాడు. అందుకే ఈ వారం ఓటింగ్‌లో కూడా స్టార్స్‌ను తలదన్ని దూసుకుపోతున్నాడు నబీల్.  తొలిరోజు ఓటింగ్‌లోనే నబీల్ రికార్డులు కొట్టేశాడు. మరి ఇదే ఆటతీరు కొనసాగిస్తే టాప్ లో ఉంటాడనేది వాస్తవం. బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టేముందు నబీల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 4 లక్షల 50 వేల మంది ఫాలోవర్లు ఉండేవారు. కానీ మూడు వారాలు గడిచాయో లేదో ఇప్పుడు నబీల్ ఖాతాలో దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే 25 రోజుల్లోనే లక్షన్నర మంది ఫాలోవర్లు పెరిగారు. నిజానికి హౌస్‌లోకి వెళ్లిన 14 మందిలో ఈ రేంజ్‌లో ఫాలోవర్లు పెరిగింది ఒక్క నబీల్‌కి మాత్రమే. అసలు నబీల్‌కి పెరిగిన ఫాలోవర్లలో సగం మంది కూడా ఏ కంటెస్టెంట్‌ సంపాదించలేకపోయారు. ఇక నబీల్ టాస్క్ లో తన వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తూ అందరికి బిగ్ బాస్ చూడాలనిపించేలా చేస్తున్నాడు.

యష్మీ రాక్ డెసిషన్.. నిఖిల్ , సోనియా కన్నింగ్ బయటపడిందిగా!

  సోమవారం నాటి నామినేషన్ కాంతారా టీమ్ వర్సెస్ శక్తి టీమ్ అన్నట్టుగా సాగింది. ఇక ఆ తర్వాత కొత్త ఛీఫ్ కోసం కంటెస్టెంట్స్ చేత సుత్తి టాస్క్ ఒక్కటి పెట్టాడు బిగ్ బాస్. అందులో చివరగా కిర్రాక్ సీత గెలిచి కొత్త చీఫ్ అయ్యింది.  ఇక కిర్రాక్ సీత క్లాన్ లోకి నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య, యష్మీ , నబీల్ వచ్చారు‌. ఇక నిఖిల్ క్లాన్ లోకి ఎప్పటిలాగే సోనియా, పృథ్వీ ఉన్నారు. ఇక మణికంఠ వంతు రాగానే బిగ్ బాస్ మెలిక పెట్టాడు. సోనియా టీమ్ ఫుల్ అయ్యింది ఎవరినైన స్వాప్ చేసుకోవాలనగా‌‌.. సీత దానికి అంగీకరించలేదు‌. దాంతో నిఖిల్ క్లాన్ కి వెళ్ళాడు. ఇక చివరగా ప్రేరణ మిగిలింది. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ స్వాప్ చేసుకోమనగా.. ప్రేరణ నిఖిల్ టీమ్ లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు‌‌. దాంతో యష్మీ కన్విన్స్ అయ్యింది. అటు సీతకి, ఇటు ప్రేరణకి చెప్పేసి నిఖిల్ టీమ్ కి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సోనియా, పృథ్వీ మినహా హౌస్ మొత్తం సీత టీమ్‌లోకి వెళ్లేందుకే ఇష్టపడ్డారు. ఇక ఈ చీఫ్ లోని కంటెస్టెంట్స్ సెలక్షన్ అయిపోయిన తర్వాత సీత తన టీమ్‌తో మాట్లాడింది. నిఖిల్‌, సోనియాలపై గట్టిగానే కౌంటర్లు వేసింది. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ క్లాన్‌కి వెళ్లలేదు.. ఇప్పుడైనా వాళ్లకి అర్థం కావాలి.. ఫ్రెండ్ షిప్, బాండ్ గురించి వాళ్లారా మాట్లాడేది.. మరి రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకిచ్చాడురా అంటూ సీత కౌంటర్ల మీద కౌంటర్లు వేసింది. ఇక మరోవైపు నిఖిల్ ఎప్పటిలాగే పృథ్వీ, సోనియాలతో గుసగుసలు పెట్టాడు. యష్మీ తమ టిమ్ లోకి రావడం గురించి తన అనుమానాలని చెప్పాడు నిఖిల్. మణికంఠ.. అలానే యష్మీ కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏంటో ప్రూ చేయాలనే వచ్చింది.. నెగెటివ్ ఏంటి పాజిటివ్ ఏంటని.. కానీ ఈరోజు టీమ్ సెలక్షన్‌తో నాకు ఓ క్లారిటీ వచ్చింది.. మన త్రీ వర్సెస్ హౌస్ అన్నట్లుగా మొత్తం మారిపోయిందని నిఖిల్ అన్నాడు. నీకు లేటుగా అర్థమైందా అంటూ పృథ్వీ అన్నాడు. అది కాదురా నిన్ను ఇష్టపడేవాళ్లు నన్ను ఇష్టపడేవాళ్లు కూడా అపోజిట్ అయ్యారు.. ఎవరి దగ్గర నాకు లిమిట్‌గా ఉండాలనే క్లారిటీ వచ్చింది..నా క్లాన్‌కి వచ్చేసరికి మీ ఇద్దరికీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తానని వాళ్లు అనుకుంటున్నారు. అయిన సోనియాను హేట్ చేసే యష్మీ.. నిన్ను (పృథ్వీ) ద్వేషించే మణికంఠ ఇద్దరూ నా టీమ్‌లోకే వచ్చారు చూడమని నిఖిల్ అన్నాడు. ఇక అదే సమయంలో యష్మీ రావడంతో వాళ్ళు టాపిక్ ని ఆపేసి నార్మల్ గా మాట్లాడుకున్నారు.

విష్ణుప్రియకి ప్రపోజ్ చేసిన పృథ్వీ!

  ఇదేందయ్యా సామి.. నిన్న మొన్నటి దాకా పృథ్వీ వెనకలా విష్ణుప్రియ ఎంత తిరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడేమో తనకోసం ఏకంగా పాటలు పాడేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్-8 లో విష్ణుప్రియ, పృథ్వీ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుండే అతడిపై విష్ణుప్రియ కాస్త ఇష్టం పెంచుకుంది. ఇక హౌస్ లో‌ తనకి ఏది అడిగినా చేసి పెడుతూ.‌ కాఫీ కలిపి ఇస్తూ.. అలా అలా నడిపిస్తోంది. కానీ మన పృథ్వీ అసలు పట్టించుకోలేదు కానీ తాజాగా రిలీజైన ప్రోమోలో.. ఎవరెవరో .. నాకెదురైనా అని పృథ్వీ పాడాడు. ఇక ఇది ఎవరి కోసం పాడుతున్నావని అడుగగా.. విష్ణుప్రియ కోసమని పృథ్వీ చెప్పాడు. దాంతో హౌస్ అంత ఒకటే అరుపులు. వీరితో పాటు మన ఎడిటర్ మావ కూడా ఓ లవ్ సాంగ్ ఏసేసాడు. ఉండిపోరాదే గుండె నీదేలే అంట వారిద్దరిని చూపిస్తూ ఎడిటర్ ఈ ప్రోమోలో ఆడ్ చేశాడు.  హౌస్ లో కొత్తగా కిర్రాక్ సీత క్లాన్ మొదలైంది. ఇక కాంతారా టీమ్ కి శక్తి టీమ్ కి మధ్య టాస్క్ లు సాగుతున్నాయి. మరో రెండు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పడంతో.. కంటెస్టెంట్స్ అంతా తమ వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తున్నారు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

డేంజర్ జో‌న్‌లో సోనియా, పృథ్వీ.. ఆ అమాయకపు చక్రవర్తిని బలి చేస్తారా?

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు గేమ్స్ భళే సాగుతున్నాయి. అయితే నామినేషన్ లో ఉన్న  ఆరుగురిలో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.  హౌస్ లో బాగా ఆడేది ఎవరంటే మొదటి రెండు వారాల్లో నిఖిల్, విష్ణుప్రియ, కిర్రాక్ సీత ఉండేది.‌ ఇప్పుడు కొత్తగా నబీల్ వచ్చేశాడు. మొదటి రెండు వారాలు సైలెంట్ గా ఉన్న నబీల్.. మూడో వారం నామినేషన్ నుండి ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. దాంతో ఓటింగ్ లో అతనికి అత్యదిక శాతం ఓట్లు పడుతున్నాయి. అంతకుముందు జరిగిన టాస్క్‌లలో కూడా నబీల్ అఫ్రిది అదరగొట్టిన సోనియాని నామినేషన్ చేసిన తర్వాతే అతనికి హైప్ వచ్చింది. ఎందుకంటే అతను గత సీజన్ భోళే షావలి లాగా పర్ఫామెన్స్ చేస్తూ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాడు.  ఇక ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గర్లో ఉన్నది ఆ ఇద్దరు గజదొంగలే.. అదే పృథ్వీ, సోనియా. అయితే ఓటింగ్ ప్రకారం సోనియా లాస్ట్ లో ఉంది.‌ ఎంత అంటే ఆదిత్య ఓం.. పృథ్వీ, సోనియాలపై ఉన్నాడు. ఈ సారి ఈ కన్నింగ్ బ్యాచ్ లో నుండి ఎవరైనైనా పంపిస్తాడా లేక ఆదిత్య ఓం ని బలిచేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి మన బిగ్ బాస్ మామ టీఆర్పీ కోసం పృథ్వీ, సోనియాని లోపలే ఉంచి .. మన అమాయాకపు చక్రవర్తి బలిచేస్తారా అని అనుకుంటున్నారు. మరి ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్ లో ఉన్న పృథ్వీ, సోనియాలలో ఎవరో ఒకరిని బయటకు పంపిస్తాడా లేక మరేదైనా ట్విస్ట్ ఇస్తాడా చూడాలి మరి.  

లక్ష గెలిచిన కాంతారా టీమ్.. నిఖిల్ టీమ్ నుండి మణికంఠ అవుట్!

  బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల పరంపర కొనసాగుతుంది. అయితే వైల్ట్ కార్డ్ ఎంట్రీలు.. హౌస్ లోకి రాకుండా ఆపే టాస్క్ లు‌ ఇవి.‌ మరి టాస్క్ లో‌ ఎవరు‌ గెలిచారో చూసేద్దాం. మొదటి టాస్కు 'బాల్ ని పట్టు టవర్ లో పెట్టు'.. ఇందులో మొదటగా నిఖిల్ అండ్ నబీల్ ఆడారు. ఆ తర్వాత ఇరు టీమ్ ల నుండి ఒక్కొక్కరుగా వచ్చి బాల్స్ ని వేయగా.. మొదటగా కాంతారా టీమ్ గెలిచింది. ఆ తర్వాత పన్నెండో నెంబర్  వైల్డ్ కార్డ్ ని తీసేసి కాంతారా ఫ్లకార్డ్ ని పెట్టేశారు.  ఇక ఈ టాస్క్ లో శక్తి టీమ్ ఓడిపోవడంతో నిఖిల్‌ను తన క్లాన్‌ నుంచి ఒక సభ్యుడిని తీసేయాలని బిగ్‌బాస్ కోరాడు. దీంతో అందరూ ఆలోచించుకొని మణికంఠను పక్కన కూర్చోబెట్టేశారు. అయితే ఇది కేవలం తర్వాతి టాస్కు వరకే కదు ఈ వారం మొత్తం మణికంఠ.. నిఖిల్ క్లాన్‌కి దూరంగా ఉండాలి. అలానే హౌస్‌లో ఏ టాస్కులోనూ పార్టిసిపేట్ చేయకూడదు. ఇలా మొత్తానికి అందరూ కూడబలుక్కొని మణికంఠను పక్కన కూర్చోబెట్టేశారు. ముఖ్యంగా యష్మీ, పృథ్వీ అస్తమానం మణికంఠ ఫిజికల్‌గా వీక్ అంటూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చెప్పి టాస్కుల నుంచి మణికంఠను కూర్చోబెట్టేశారు. ఇక ఆ తర్వాత ' ఈట్ ఇట్ అండ్‌ బీట్ ఇట్' సెకెండ్ టాస్క్ గా ఫుడ్ పంపించాడు బిగ్ బాస్. అదే 'మహా తాలి'. బిర్యానీ, చికెన్ ఫ్రై, పరోట ఇలా అన్నీ నాన్ వెజ్ కలిపి దాదాపు అయిదారుగురు తినే ఫుడ్ ని ఒకరు కంప్లీట్ చేయాలని బిగ్ బాస్ కోరాడు.‌ఇక ఇరు టీమ్ ల నుండి ఎవరొస్తారని అడుగగా.. నిఖిల్ టీమ్ నుండి సోనియా, సీత టీమ్ నుండి నబీల్ వచ్చారు. ఇక ఇద్దరికి నలభై అయిదు నిమిషాల్లో తాలిని తినాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక వారిద్దరూ మరొకరిని హెల్ప్ కోసం పంపించాడు బిగ్ బాస్. యష్మీ, ఆదిత్య ఓం ఇద్దరు వెళ్ళగా వాళ్ళు కూడా ఆ తాలిని తినలేకపోయారు. ఇక నలభై అయిదు నిమిషాలు పూర్తవ్వడంతో బజర్ మోగించేశాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో ఏ టీమ్ గెలవలేదు. తర్వాతి టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.  

Brahmamudi : అనామిక ప్లాన్ లో‌ కావ్య కీలుబొమ్మ కానుందా.. భర్త వర్సెస్ భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -524 లో.....కనకం దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఏంటి పిలవని పేరంటానికి వచ్చావ్.. ఈ సాకుతో నీ కూతురిని కాపురానికి పంపించి చేతులు దులుపుకుందామనుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగదని రాజ్ ఎప్పుడో చెప్పాడు కదా అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కనకం వెళ్లి.. తన మంచి చెడులు కనుక్కుంటుంది. అబ్బో కూతురు ప్రాణం మీదకి తెచ్చింది.. తల్లి కుశలం అడుగుడానికి వచ్చిందని రుద్రాణి అంటుంది. దాంతో రుద్రాణిపై అపర్ణ కోప్పడుతుంది. మీరు నా వాళ్ళ గొడవపడకండి అని కనకం అనగానే.. అవునులే మీ జీవితానికి సిగ్గా, శరమా అని రుద్రాణి అనగానే.. ఏదైనా జరిగితే నాకు కావ్యకి జరిగింది అంతే గాని వాళ్ళేం చేశారని రాజ్ అంటాడు. ఆ తర్వాత నా కూతురు అల్లుడు విడిపోలేదు.. అందుకు సాక్ష్యం అల్లుడు పక్కన నా కూతురు చీర ఉంది.. మరొకటి కావ్య తయారు చేసిన విగ్రహం తిరిగి ఈ ఇంటికే చేరింది. ఇది దైవ నిర్ణయమని కనకం అనగానే.. అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ షాక్ అవుతాడు. మరొకవైపు అనామిక సామంత్ కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఒకతనితో ఇప్పుడు కావ్య వస్తుంది. తనని డిజైన్ వెయ్యడానికి మీ కంపెనీలోకీ తీసుకొని ఆ డిజైన్స్ మాకు అమ్మాలని చెప్తుంది. దానికి అతను సరే అంటాడు. కావ్య వచ్చిందని తెలిసి ఫోన్ లైన్ పెట్టి అతని కావ్య దగ్గరికి అనామిక పంపిస్తుంది. మీకు నా కంపెనీలో జాబ్ ఇస్తున్నానని కావ్యకి అతను చెప్పగానే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ మాటలన్ని అనామిక ఫోన్ లో వింటుంది. ఆ తర్వాత కావ్య హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఇంటికి వచ్చి జాబ్ వచ్చిందని చెప్తుంది. కానీ కనకం చిరాకు పడుతుంది. అల్లుడు వచ్చినా నువ్వు వెళ్ళలేదని అంటుంది. ఆ తర్వాత సీతారామయ్య ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు వచ్చావంటే ఏదో పని వుండి వచ్చావని సీతారామయ్య అంటాడు. నా మనవడు శ్రీకాంత్ ఎప్పుడు మీ కంపెనీలో పెట్టుబడి పెట్టేవాడు.. ఇప్పుడు సామంత్ గ్రూప్ కంపెనీలో పెడుతున్నాడని అతను చెప్పగానే.. ఎందుకని సీతారామయ్య అడుగుతాడు. నా మనవడిని రాహుల్ అవమానించాడట అని అతను చెప్తాడు. తరువాయి భాగంలో రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. కంపెనీని వృద్ధి చెయ్ అని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడని చెప్తుంది. నా ప్లాన్ లో నేనున్నాను.. భర్త వర్సెస్ భార్య అని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : వాళ్ళిద్దరి పెళ్లి చేసిన దీప.. షాక్ లో కార్తీక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -159 లో.... శ్రీధర్ ని దీప లోపలికి రాకుండా చేసి.. స్వప్న, శ్రీకాంత్ ల పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది. పెళ్లి కొడుకు అమ్మాయి పోయే ఆస్తి పోయే అంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళండి అని దీప అనగానే.. ఇప్పుడు మా డాడ్ ని ఎలా ఆపారో తెలియదు కానీ ఆపారు.. కానీ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నాకు పెళ్లి చేస్తాడని స్వప్న అనగానే.. ఇప్పుడు మా పెళ్లి చేస్తేనే దీనికి సొల్యూషన్ అని కాశీ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత మాకు ఇప్పుడు పెళ్లి చెయ్యండి అంటూ దీపని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. మరొకవైపు ఏంటి అండి.. ఫోన్ కట్ చేస్తున్నారని శ్రీధర్ దగ్గరికి  కావేరి వెళ్లి అడుగుతుంది. అక్కడ మా చెల్లి సుమిత్ర ఉందని చూపిస్తాడు. మరి పెళ్లి అని కావేరి అనగానే.. ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు కానీ ఇప్పుడు దొరికిపోతే ప్రాబ్లమ్ అవుతుందని శ్రీధర్ అంటాడు. మరొకవైపు కాశీ స్వప్నలకి దీప పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత సుమిత్ర చూడకుండా.. శ్రీధర్, కావేరిలు లోపలికి వస్తుంటారు. దీప వాళ్ళని చూసి కాశీ, స్వప్నలని బయటకు పంపిస్తుంది. కావేరి, శ్రీధర్ లు వెళ్లేసరికి అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటారని శ్రీధర్ కావేరిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. దీప దగ్గరికి సుమిత్ర వచ్చి.. నన్ను బయట ఉండమని చెప్పి నువ్వు లోపలికి వచ్చావ్ ఏంటని సుమిత్ర అంటుంది. అప్పుడే కాశీ ఫోన్ చేస్తాడు. నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్లున్నావ్ నేను కార్తీక్ జ్యోత్స్నల పెళ్లి ముహూర్తం అడుగుతాను. నువ్వు వెళ్ళమని సుమిత్ర అనగానే సరేనని దీప వెళ్తుంది. మరొకవైపు కార్తీక్ ఆలోచిస్తుంటే అప్పుడే సుమిత్ర ఫోన్ చేసి.. తాతయ్య పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఇంటికి అమ్మని తీసుకొని రమ్మని చెప్పాడు. వెళ్ళమని చెప్పగానే కార్తీక్ సరే అంటాడు. ఆ తర్వాత దీప వస్తుంది. మీరు ఒక జంటని దీవించండి అని చెప్పి.. స్వప్న, కాశీలని పిలుస్తుంది. వాళ్ళని చూసి నాతో ఒక్కమాట కూడా చెప్పలేదని కార్తీక్ అనుకుంటాడు‌. ఆ తర్వాత కాశీతో కాంచన మాట్లాడుతుంది. ఇద్దరిని కాంచన ఆశీర్వదిస్తుంది. కార్తీక్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు.. ఆశీర్వాదం తీసుకుంటారు.. ఇబ్బందిగానే కార్తీక్ ఆశీర్వదిస్తాడు. ఎక్కడ వాళ్ళ నాన్న వస్తాడోనని కార్తీక్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : అనుకోకుండా ముద్దు పెట్టుకున్న భార్య.‌. ఆ ప్రాజెక్ట్ ఎవరికంటే!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -210 లో.....కంపెనీ బోర్డు మెంబర్ శ్రీలత వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మొన్న మనం అనుకున్న ప్రాజెక్ట్ కి రేపే బిట్ వేస్తున్నారు. సీతాకాంత్ కీ కాకుండా వేరే వాళ్లకు బిట్ వచ్చేలా చేస్తే మనకి టెన్ పర్సంట్ కమిషన్ ఇస్తానని అన్నారని అతను చెప్తాడు. సీతాకాంత్ బిట్ వెయ్యడానికి వెళ్తే కచ్చితంగా ఆ బిట్ తనకి వస్తుందని అతను అంటాడు. తను రాకుండా నేను చూస్తాను కదా అని శ్రీలత అంటుంది. వాళ్ళ మాటలన్నీ దూరం నుండి రామలక్ష్మి వింటుంది. మీ ప్లాన్ లో మీరు ఉన్నారు.. నా ప్లాన్ లో నేను ఉంటానని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. రేపు బిట్ వేయడానికి వెళ్తున్నానని సీతాకాంత్ పెద్దాయనతో అంటాడు. నీకు రెస్ట్ అవసరం.. నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని అంటాడు. మరి మీరు వెళ్ళండి తాతయ్య అని అనగానే వేరే మీటింగ్ ఉందని చెప్తాడు. బావ గారి తర్వాత మా అయన కాబట్టి మా అయన వెళ్తాడని శ్రీవల్లి అంటుంది. వద్దని రామలక్ష్మి అంటుంది. ఏంటి సందీప్ ని చేతకాని వాడు అనుకుంటున్నావా మనసులో ఏదో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావని శ్రీలత అంటుంది. ఒకవైపు రామలక్ష్మి మరొకవైపు శ్రీలత ఇద్దరు గొడవపడుతుంటే సీతాకాంత్ కోప్పడి వెళ్లిపోతుంటాడు. తినకుండా వెళ్తున్నావ్ నేను కూడా తిననని శ్రీలత అనగానే సీతాకాంత్ కూర్చుంటాడు. నీకు రామలక్ష్మి వెళ్లడం ఇష్టమైతే తననే పంపించు అని శ్రీలత అంటుంది. మరొక వైపు శ్రీవల్లి, సందీప్ లు కోపంగా ఉంటారు. అప్పుడే శ్రీలత వస్తుంది. మీరేంటి రామలక్ష్మిని బిట్ వెయ్యడానికి వెళ్ళమని చెప్పారని అంటారు..నువ్వు వెళ్తే బిట్ ఓకే కాకపోతే సీతాకాంత్ తిడతాడు. అదే రామలక్ష్మి బిట్ వేస్తె రాకపోతే రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. అంతే కాకుండా ఆ బిట్ రామలక్ష్మి కి రాకుండా మనం చేయాలని శ్రీలత అంటుంది. మరొకవైపు సీతాకాంత్ బిట్ కి సంబంధించిన కొటేషన్ రెడీ చేస్తుంటే రామలక్ష్మి వస్తుంది. ఫ్యాన్ వేసుకులేదు అని ఫ్యాన్ వేస్తుంది. పేపర్స్ అని గాలికి ఎగిరిపోతాయ్. దాంతో ఇద్దరు పట్టుకున్నే ప్రయత్నం చేస్తుంటే రామలక్ష్మి అనుకోకుండా సీతాకాంత్ కి ముద్దు పెడుతుంది. నువ్వు నాకు పెట్టావ్ వడ్డీతో సహా తిరిగి ఇస్తానని సీతాకాంత్ సరదాగా మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బిగ్ బాస్‌లోకి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ... కంటెస్టెంట్స్ కి బిగ్ షాక్!

  తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నేటి ఎపిసోడ్ ఉండబోతుందని తాజాగా విడుదలైన ప్రోమోని చూస్తే తెలుస్తుంది. హౌస్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేషన్ అయి బయటకు వెళ్లారు. ఇక ఈ వీక్ సర్వైవల్ వీక్ అని చెప్తూ బిగ్ బాస్ ప్రోమోని వదిలాడు. అంటే హౌస్ లోకి ఒక్కటి కాదు అయిదు కాదు మొత్తంగా పన్నెండు(12) మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వబోతున్నారని బిగ్ బాస్ చెప్పడంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. ఇక మొదటిసారి హౌస్ లోని వాళ్ళకి ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే హౌస్ లో కొన్ని టాస్క్ లు పెడతాడు బిగ్ బాస్. హౌస్ లోని వాళ్ళు ఆ టాస్క్ లు తమ ఎఫర్ట్ పెట్టి ఆడి గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదు. అంటే ఎన్ని టాస్కలు గెలుస్తారో అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండవని అర్థం. ఇక హౌస్ లో ఇక నుండి ట్విస్ట్ ల‌ మీద ట్విస్ట్ లతో గేమ్స్ ఉండబోతున్నాయని ప్రోమోని బట్టి తెలుస్తుంది. ' వైల్డెస్ట్ ట్విస్ట్ ఎవర్' అంటూ వదిలిన ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ షాకిచ్చాడు బిగ్ బాస్. తాజగా శక్తి క్లాన్, కాంతారా క్లాన్ రెండు టీమ్ లుగా విభజించబడ్డారు. మరి బిగ్ బాస్ ఇప్పుడు పెట్టే టాస్క్ లు అందరికి కలిపి ఉంటాయా లేక ఇండివిడ్యువల్ టాస్క్ లా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రోమోని చూస్తే తెలుస్తుంది. మరి  మీరు చూసేయ్యండి.