వచ్చింది జాతిరత్నాలు కాదు.. జాతి మొగుళ్లు!

  కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో ముందుంటారు మెగాబ్రదర్ నాగబాబు. 'జబర్దస్త్' షో సమయంలో చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేసి వాళ్లను ప్రోత్సహించిన నాగబాబు.. ఆ షో నుండి బయటకి వచ్చిన తరువాత జీతెలుగులో 'అదిరింది' షోతో కొన్నాళ్ల పాటు అలరించారు. అయితే ఆ షోని ఎక్కువకాలం కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తరువాత 'ఖుషీఖుషీగా ' అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కమెడియన్లతో కామెడీ షో నిర్వహించారు నాగబాబు. అయితే ఇప్పుడు ఎక్కువమందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో యూట్యూబ్ పై ఫోకస్ పెట్టారు.  'అదిరింది' కామెడీ షోతో పాపులర్ అయిన సద్దాం, యాదమ్మ రాజు, భాస్కర్, హరిలతో 'బస్తీ బాయ్స్' అనే వెబ్ సిరీస్ ను మొదలుపెట్టారు. ఈ సిరీస్ కి నాగబాబు కాన్సెప్ట్ అందించి.. ఇన్ఫినిటంతో కలిసి నిర్మించారు. తాజాగా 'బస్తీ బాయ్స్' ఫస్ట్ ఎపిసోడ్‌ను నాగబాబు యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు.. "వచ్చింది జాతి రత్నాలు కాదు.. జాతి మొగుళ్లు" అంటూ తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టి యూట్యూబ్ లింక్ ని షేర్ చేశారు.  ఈ స్కిట్ లో నటించిన సద్దాం.. తనను తానే బాబు అని పేరు పెట్టేసుకొని.. బిల్డప్ ఇచ్చాడు. "యూట్యూబ్‌లో ఒక్కొక్క ట్యూబ్‌లు పగిలిపోతాయ్. వారం అంతా యూట్యూబ్‌లో ట్యూబ్‌లు పగలగొట్టేస్తాం" అంటూ హడావిడి చేస్తున్నాడు. పదహారు నిమిషాల నిడివితో ఉన్న 'బస్తీ బాయ్స్' వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో సద్దాం, భాస్కర్ లు కనిపించారు. తొలి ఎపిసోడ్ చాలా కామెడీతో అల‌రించింది. ప్ర‌స్తుతం 1.1 మిలియ‌న్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో నంబ‌ర్ వ‌న్‌గా ట్రెండ్ అవుతున్నారు 'బ‌స్తీ బాయ్స్‌'.

డెలివెరీ టైమ్‌కి కరోనా.. హరితేజ షాకింగ్ వీడియో!

  బిగ్ బాస్ ఫేమ్ హరితేజ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ.. కోవిడ్ వల్ల పడిన ఇబ్బందుల గురించి చెప్పింది. డెలివెరీ టైమ్ లో తనకు కరోనా సోకిందనే విషయాన్ని చెప్పుకొచ్చింది. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో చాలా కష్టాలు పడ్డానని ఎమోషనల్ అయింది. తనకు పాప పుట్టిన సమయంలో అందరూ విషెస్ చెప్పారని.. కానీ అప్పుడు ఎవరితో మాట్లాడే పరిస్థితుల్లో లేనని చెప్పింది. తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా ఉన్నానని.. డెలివెరీకి వారం రోజుల ముందు చెకప్ చేయిస్తే అంతా బాగుందని.. నార్మల్ డెలివెరీ అవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంది. కానీ సడెన్ గా ఇంట్లో అందరికీ కోవిడ్ పాజిటివ్ రావడంతో.. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదని వాపోయింది.  డెలివెరీ సమయానికి డాక్టర్స్ డెలివెరీ చేయలేం.. మీకు పాజిటివ్ కాబట్టి కోవిడ్ హాస్పిటల్ కి వెళ్లమని చెప్పారని.. ఆ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని.. ఆపరేషన్ చేసి బేబీని బయటకి తీశారని.. ఆ సమయంలో తన భర్త మాత్రమే తనతో ఉన్నారని చెప్పుకొచ్చింది. బేబీ పుట్టిన వెంటనే తన దగ్గర నుండి తీసుకు వెళ్లిపోయారని.. పాలు కూడా ఇవ్వలేకపోయానని.. వీడియో కాల్స్ లో పాపని చూసుకున్నానని.. ఆ సమయంలో చాలా బాధ అనుభవించానంటూ ఎమోషనల్ అయింది.  ఇంటికి వచ్చిన తరువాత కూడా అందరూ ఐసోలేషన్ లోనే ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయంలో ఎవరి సహాయం అడ‌గ‌లేకపోయామని.. స్నేహితులు తోడుగా ఉన్నారని వెల్లడించింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండమని కోరింది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా జరిగినా కూడా అధైర్య పడొద్దని చెప్పుకొచ్చింది. ఇంత జరుగుతున్నా కూడా చాలా మంది మాస్క్ లు పెట్టుకోవడం లేదని.. ముందు నుండే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించింది. 

పెళ్లిరోజు భార్యకి యశ్వంత్ మాస్టర్ స్పెషల్ గిఫ్ట్

  ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' షో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న చాలా మంది డాన్సర్లకు అవకాశాలు వచ్చాయి. ఈ షో ద్వారానే యశ్వంత్ మాస్టర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొరియోగ్రాఫర్ గా సినిమాలకు కూడా పని చేస్తున్నారు. అలానే కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. యశ్వంత్ తన చిన్ననాటి స్నేహితురాలు వర్షను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వీరిద్దరికీ పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తన భార్యకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు యశ్వంత్. ఆ గిఫ్ట్ ఏంటంటే.. 'చౌ చౌ' అనే జాతికి చెందిన ఓ కుక్కపిల్లను యశ్వంత్ తన భార్యకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు యశ్వంత్. ఇప్పటికే వీరి దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి. ఇది మూడోదన్న మాట. దానికి చెర్రీ అని పేరు కూడా పెట్టేశారు.  ఇక సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర సెలబ్రిటీల నుండి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యశ్వంత్ భార్య వర్ష.. ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తోంది. అయితే అప్పుడప్పుడు తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది వర్ష. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇప్పటికే 'డాన్స్ ప్లస్' షోతో పాటు 'క్యాష్' అలానే 'వావ్' లాంటి కొన్ని టీవీ షోలలో వీరిద్దరూ అతిథులుగా కనిపించారు.  

అరవై ఏళ్ల బామ్మలతో సుడిగాలి సుధీర్ డాన్స్‌.. ర‌చ్చ ర‌చ్చే!

  ఈటీవీలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే కామెడీ షోని ప్రసారం చేస్తున్నారు. మొదట్లో కొందరు కమెడియన్లను, సీరియల్ నటులను యాంకర్లుగా పెట్టి వ్యూస్ రాబట్టాలని ప్రయత్నించారు. అయితే కంటెంట్ ఆకట్టుకోకపోవడంతో షోకి సరైన గుర్తింపు రాలేదు. దీంతో నిర్వాహకులు 'జబర్దస్త్' కమెడియన్లను రంగంలోకి దింపారు. హోస్ట్ గా సుడిగాలి సుధీర్ కి బాధ్యతలు అప్పగించారు. అప్పటినుండి 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కామెడీ షోకి క్రేజ్ దక్కింది. ఇప్పుడు రామ్ ప్రసాద్, వర్ష, బిగ్ బాస్ హిమజ, ఇమ్మాన్యుయేల్, పొట్టి నరేష్ వీళ్లంతా కూడా ఈ షోలో తమ స్కిట్ లతో అలరిస్తున్నారు.  తాజాగా ఈ షోకి సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్.. 'ఎంటర్టైన్మెంట్ బిగిన్స్' అంటూ అరవై ఏళ్ల బామ్మలతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమాలో 'లాహే.. లాహే' అనే పాటకి వీళ్లంతా కలిసి చేసిన డాన్స్ మాములుగా లేదు. ఇది కదా గ్రేస్ అంటే.. ఇది కదా డాన్స్ అంటే అంటూ సుధీర్ వారితో పోటీ పడి మరీ డాన్స్ వేశాడు. డాన్స్ కి వయసు అడ్డం కాదని ఈ బామ్మలు నిరూపించారు.  మొన్నామధ్య ఓ టీవీ షో కోసం నటి రేఖ కూడా స్టేజ్ మీద డాన్స్ వేసింది. ఆమె వయసు కూడా అరవైకి పైగానే ఉంటుంది. ఇప్పుడు అదే వయసులో ఉన్న కొందరు మహిళలు కూడా డాన్స్ చేసి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. మొత్తానికి సుధీర్ రాకతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి కొత్త కళ వచ్చిందనే చెప్పాలి. ఇక టీఆర్ఫీ కూడా ఓ రేంజ్ లో వస్తుందని అంచనా వేస్తున్నారు. 

త్వ‌ర‌లో దీప్తి-ష‌న్ను పెళ్లి?

  సూప‌ర్ హిట్ మూవీ సాంగ్స్‌కు క‌వ‌ర్ సాంగ్స్ చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ పెయిర్‌. డాన్స్ వీడియోలు కూడా వారికి మంచి ఆద‌ర‌ణ తెచ్చాయి. వారిది క్యూట్ పెయిర్ అంటూ సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ప్ర‌శంసిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. దీప్తి సున‌య‌న ఇప్ప‌టికే బిగ్ బాస్ సీజ‌న్ 2లో పాల్గొన‌గా, బిగ్ బాస్ సీజ‌న్ 5లో ష‌ణ్ముఖ్ కంటెస్టెంట్‌గా పాల్గొన‌బోతున్నాడంటూ బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ఇద్ద‌రూ డేటింగ్‌లో ఉంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. కొంత కాలం క్రితం వారిద్ద‌రికీ బ్రేక‌ప్ అయ్యింద‌నే వ‌దంతులు కూడా సోష‌ల్ మీడియాలో షికారు చేశాయి. అయితే ఇటీవ‌ల ఓ షోలో పాల్గొన్న ఆ ఇద్ద‌రూ తాము ఆఫ్ స్క్రీన్ క‌పుల్ అంటూ చెప్ప‌డంతో ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. పైగా ఆ ఇద్ద‌రూ చేతిపై ఒకే ర‌మైన టాటూలు వేయించుకొని త‌మ మ‌ధ్య ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టారు.  లేటెస్ట్‌గా వీరి అనుబంధంపై వెబ్ సిరీస్ యాక్ట‌ర్ సూర్య‌స్వామి స్పందిస్తూ, ఇంకో రెండేళ్ల‌లో వారిద్ద‌రు పెళ్లి చేసుకోవ‌చ్చు అని చెప్ప‌డంతో, ఆ ఇద్ద‌రూ సీరియ‌స్‌గా ల‌వ్‌లో ఉన్నార‌ని అర్థ‌మైంది. సూర్య‌స్వామి చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో విరివిగా వ్యాప్తిలోకి వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే దీప్తి-ష‌న్ను పెళ్లి చేసుకోనున్నారంటూ ఫ్యాన్స్ హ‌డావిడి చేస్తున్నారు. ష‌న్ను ప్ర‌స్తుతం సూర్య అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు.

తోటి జడ్జిల‌తో గొడవకు దిగిన మోనాల్!

  'సుడిగాడు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హీరోయిన్ మోనాల్ గజ్జర్. ఆ తరువాత టాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేసిన ఈమెకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది. సుదీర్ఘ విరామం అనంతరం బిగ్ బాస్ షో కోసం మళ్లీ తిరిగి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి మోనాల్ క్రేజ్ పెరిగిపోయింది. తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ట్రయాంగిల్ లవ్ స్టోరీతో బాగా ఫేమస్ అయింది. గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకులతో హౌస్ లో ఎక్కువ కాలం ఉండగలిగింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత మోనాల్ కి ఆఫర్లు తెగ వస్తున్నాయి.  ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్' సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రముఖ ఛానెల్ లో ఓంకార్ నిర్వహిస్తోన్న 'డాన్స్ ప్లస్' అనే షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది మోనాల్. ఈ షో కోసం మొదట్లో గ్లామరస్ గా కనిపిస్తూ వ‌చ్చిన‌ మోనాల్.. ఈ మధ్యకాలంలో సంప్రదాయబ‌ద్ధంగా కనిపిస్తోంది. ఇటీవల మోనాల్ మెంటర్ గా వ్యవహరిస్తోన్న టీమ్ కి తక్కువ స్టార్లు రావడంతో షో నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో మోనాల్ చాలా ఎమోషనల్ అయింది.  ఇక రీసెంట్ గా ఈ షోకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో మోనాల్ మిగిలిన జడ్జిలు అందరితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. తన టీమ్ ని సపోర్ట్ చేయలేదని మోనాల్ చెబుతున్న సమయంలో యశ్వంత్ మాస్టర్ కలుగజేసుకొని ఆమెకి కౌంటర్ ఇచ్చాడు. దానికి బాబా భాస్కర్ చప్పట్లు కొట్టాడు. దీంతో ఆమెకి కోపం మరింత పెరిగింది. ''ఎందుకు చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు ఏమైందని..? దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి'' అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది.

ఆయ‌న త‌ప్పు చేయ‌డు.. భర్త అరెస్ట్ పై శ్యామల రియాక్షన్!

  ఓ మహిళను మోసం చేసిన ఛీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద కోటి రూపాయలు తీసుకొని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంపై యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడారు. తన భర్త తప్పు చేయడని.. ఇది తప్పుడు కేసు అని చెప్పారు. తనకు కూడా అరెస్ట్ విషయం మీడియా ద్వారానే తెలిసిందని.. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని మాత్రం కచ్చితంగా చెప్పగలనని వెల్లడించారు. కోటి రూపాయల కోసం ఓ ఆడపిల్లను మోసం చేయాల్సిన అవసరం కానీ.. అలాంటి వ్యక్తిత్వం కానీ తన భర్తది కాదని నమ్మకంగా చెప్పారు. తన పదేళ్ల సంసార జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని.. తన భర్త డబ్బుల కోసం అమ్మాయిలతో ఆడుకునే మనిషి కాదని అన్నారు. త్వరలోనే నిజం అందరికీ తెలుస్తుందని.. అప్పటివరకు తప్పుడు ఆరోపణలపై న్యూస్ ప్రసారం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఒక అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి నిజానిజాలు విచారించకుండా... అరెస్ట్ చేస్తారనే నాలెడ్జ్ తనకు ఉందని.. కానీ నిజమేంటో అందరికీ త్వరలోనే తెలుస్తుందని అన్నారు. తనకు కొంచెం సమయం ఇస్తే జరిగిన విషయాల గురించి తెలుసుకుంటానని.. పోలీసుల వైపు నుండి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు.  ఏదేమైనా.. తను మాత్రం తన భర్త వైపున నిలబడతానని స్పష్టం చేశారు. ఓ మహిళతో నరసింహకు చాలా కాలంగా సంబంధం ఉందని.. గొడవలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని.. తనకు ఈ ఇష్యూ గురించి ఇప్పటివరకు తెలియదని వెల్లడించారు. అయితే ఇది తప్పుడు కేసు కాబట్టి పెద్దగా వర్రీ అవ్వడం లేదని.. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు తెలియజేస్తానని తెలిపారు. 

బోల్డ్ క్యారెక్టర్స్ చేసినా ఇబ్బంది ప‌డ‌లేదు.. 'కార్తీక‌దీపం' న‌టి!

  'కార్తీకదీపం' సీరియల్ లో అర్ధపావు భాగ్యం క్యారెక్టర్ పోషిస్తోన్న నటి ఉమ తన పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. సీరియల్‌లో ఆమెతో చేయించే కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈ నటి ఒకప్పుడు సినిమాల్లో కూడా నటించింది. కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా కనిపించింది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇండస్ట్రీలో తనకు ఎదురైన సవాళ్లను, అనుభవాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సినిమా, టీవీ ఇండస్ట్రీలో నటించాలంటే ఇబ్బందులు వస్తాయని అనుకుంటే.. ఎక్కడైనా ఇబ్బందే అని.. ఇబ్బంది ఉండదు అనుకుంటే ఎక్కడా ఉండదని చెప్పింది. పనికోసం చాలా మంది ఎన్నో విధాలుగా ఎదురుచూస్తున్నారని.. మనం కావాలనుకున్న పని దొరికినప్పుడు దైవంగా భావించి చేస్తే ఎలాంటి ఇబ్బంది కనిపించదని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్ల తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇబ్బందిగా ఫీలైన సందర్భం లేదని చెప్పింది. ఎదుటివారితో ఇష్టంగా, ప్రొఫెషనల్ గా నటించాలని.. లేదనుకుంటే ఇంట్లో కూర్చోవాలని చెప్పుకొచ్చింది. తనకైతే ఇండస్ట్రీలో ఎలాంటి చెడు అనుభవం ఎదురుకాలేదని.. ఎవరి వలన ఇబ్బంది పడలేదని స్పష్టం చేసింది.  తను బోల్డ్ పాత్రల్లో నటించినప్పుడు కూడా పెద్ద ఇబ్బందులు రాలేదని.. ఒక ఆర్టిస్ట్ తన కెరీర్‌ని ప్రొఫెషనల్‌గా భావించినప్పుడు ఎలాంటి పాత్రలో అయినా నటిస్తాడని.. తను కూడా అంతేనని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈ క్యారెక్టర్ ఎందుకు చేశానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. మంచి తొందరగా వెళ్లదు.. చెడు తొందరగా వెళ్తుందని చెప్పడానికి తను చేసిన బోల్డ్ పాత్రలే ఉదాహరణ అని చెప్పింది. తను చాలా తక్కువగా బోల్డ్ పాత్రలు చేశానని.. కానీ ఇప్పటికీ వాటి గురించే చెప్పుకుంటారని వెల్లడించింది. భవిష్యత్తులో తనకు పిచ్చిదాని క్యారెక్టర్ చేయాలని ఉందని.. అందులో వైవిధ్యాన్ని ప్రదర్శించాలనుందని చెప్పుకొచ్చింది. 

క‌రోనా వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఇంట్లో కూర్చోపెట్టింది!

  బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లలో కొందరికి అవకాశాలు వస్తున్నాయి. కొందరికి రావడం లేదు. అయితే అన్ని సీజన్ల సంగతి పక్కన పెడితే.. సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్ల‌కు మాత్రం అవకాశాలు బాగా వస్తున్నాయి. విన్నర్ అభిజిత్ స్టోరీలు వినే పనిలో ఉంటే.. సొహేల్‌, అఖిల్ లాంటి వాళ్లు సినిమాలు మొదలుపెట్టేశారు. మెహబూబ్, మోనాల్, దివిలు వెబ్ సిరీస్‌లతో బిజీ అయ్యారు. హారిక, లాస్య, నోయెల్, అరియనా, అవినాష్ లాంటి వాళ్లు ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు.  అయితే సీజన్ 3 కంటెస్టెంట్స్‌కి అవకాశాలు రాకుండా ఇంట్లో కూర్చోవడానికి కారణం కరోనా అని అలీ రెజా అంటున్నారు. ఇటీవల 'వైల్డ్ డాగ్' సినిమాలో నాగార్జునతో కలిసి నటించిన అలీ రెజా.. సీజన్ 3లో పాల్గొన్న తమకి సరైన అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను తెలియజేశాడు. సీజన్ 3 వాళ్లకి, సీజన్ 4 వాళ్లకి చాలా వేరియేషన్ ఉందని.. వాళ్లకి మంచి అవకాశాలు వస్తున్నాయని.. తమకు మాత్రం రావడం లేదని.. కారణం ఏంటో నాగార్జున గారికి కూడా తెలుసని అన్నారు.  బిగ్ బాస్ సీజన్ 3 అయిపోయిన తరువాత అందరం సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉన్నామని.. కరెక్ట్ గా అదే సమయంలో లాక్‌డౌన్ ప్రకటించారని అన్నారు. నిజానికి బిగ్ బాస్ షో తరువాత కంటెస్టెంట్స్ కి వచ్చే హైప్ కొన్నాళ్లు మాత్రమే ఉంటుందని.. దాన్ని లిమిటెడ్ కాలంలోనే ఉపయోగించుకోవాలని.. కానీ అదే సమయంలో కరోనా వచ్చి.. అందరినీ ఇంట్లో కూర్చోబెట్టేసిందని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ సమయంలోనే సీజన్ 4 మొదలయిందని.. అందరూ ఇంట్లో ఉండి షోని బాగా ఎంజాయ్ చేశారని.. దీంతో సీజన్ 4 కంటెస్టెంట్స్ కి బయటకి వచ్చిన తరువాత మంచి ఆఫర్లు వస్తున్నాయని.. ఇలా చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

నేను అలాంటి తప్పులు చేయలేదు!

  టాలీవుడ్‌లో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. ఈమె అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లు కూడా చేస్తుంటుంది. తెలుగమ్మాయి కావడంతో తమ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే శ్యామలను యాంకర్ సుమతో పోలుస్తూ సుమ తరువాత మీరే అని చాలా మంది ఫ్యాన్స్ అనడంతో తెగ పొంగిపోతోంది శ్యామల. సుమతో పోలుస్తూ తనను పొగుడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చింది.  చాలా మంది తమ ఇంట్లో అమ్మాయిలా ఉందని, పద్ధతులు పాటిస్తోందని.. మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నా.. కానీ పద్దతిగానే ఉంటుందని అందరూ చెబుతుంటారని.. మహిళలు తనకు బాగా కనెక్ట్ అవుతుంటారని శ్యామల చెప్పుకొచ్చింది. ఈవెంట్ కోసం బయటకి వెళ్లినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో యాంకరింగ్ చేస్తూనే.. సీరియ‌ల్స్‌లో నటించేదాన్ని అని చెప్పిన శ్యామల.. తన భర్త ప్రోత్సాహంతో యాంకరింగ్ మీద దృష్టి పెట్టినట్లు.. అలా తన భర్త స్నేహితుడి ద్వారా 'మా ఊరి వంట' ప్రోగ్రాంలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది.  ఇక తన మీద ఇప్పటివరకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ రాలేదని.. ఎందుకంటే తను వాటికి అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. తన జర్నీ చాలా స్మూత్ గా సాగిపోతోందని తెలిపింది. కొంతమంది ఫాస్ట్ రిజల్ట్ కోసం పరుగులు పెడతారని.. ఈ క్రమంలో కొన్ని తప్పులు చేస్తుంటారని.. తను మాత్రం అలాంటి తప్పులు చేయలేదని.. అందుకే బ్యాడ్ కామెంట్స్ రాలేదని చెప్పుకొచ్చింది. 

మోసం చేశాడ‌ని ఆరోపించిన భార్య‌.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన న‌టుడు!

  ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కిన మ‌ల‌యాళం టీవీ న‌టి అంబిలీ దేవి భ‌ర్త‌, న‌టుడు ఆదిత్య‌న్ జ‌య‌న్ ఆత్మ‌హ‌త్య య‌త్నం చేశారు. అందిన స‌మాచారం ప్ర‌కారం ఆదివారం సాయంత్రం త్రిసూర్‌లోని త‌న కారులో అత‌ను చేయి న‌రాల‌ను కోసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. వెంట‌నే అత‌డిని త్రిసూర్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ప్ర‌స్తుతం అత‌ను ఐసీయూలో ఉన్నాడు. "అత‌ను అధిక మోతాదులో నిద్ర‌మాత్రలు మింగాడు. అత‌డి పొట్ట‌ను శుభ్రం చేశాం. చేతి మ‌ణిక‌ట్టు ద‌గ్గ‌ర కోసుకున్న గాయం ఉంది. త‌దుప‌రి చికిత్స కోసం స‌ర్జ‌న్‌ను సంప్ర‌దిస్తున్నాం. రోగి కొంచెం మ‌గ‌త‌లో ఉన్నాడు కానీ రెస్పాండ్ అవుతున్నాడు. 24 నుంచి 48 గంట‌ల అబ్జ‌ర్వేష‌న్ త‌ర్వాతే వివ‌రాలు తెలియ‌జేస్తాం." అని హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపాయి. భార్య అంబిలీదేవితో వ్య‌క్తిగ‌త గొడ‌వ‌ల కార‌ణంగా అత‌ను ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచాడు. ఆదిత్య‌న్ త‌న‌ను మోసం చేశాడ‌ని అంబిలి ఆరోపించారు. విడాకులు ఇవ్వ‌మని అడుగుతున్నాడ‌నీ, లేదంటే చంపుతాన‌ని బెదిరిస్తున్నాడ‌నీ ఆమె ఆదిత్య‌న్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఆమె ఆరోప‌ణ‌ల‌ను ఆదిత్య‌న్ ఖండించాడు. త‌న‌కు చెడ్డ‌పేరు తీసుకురావ‌డానికి అలాంటి ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌ల్ని ఉప‌యోగించుకోవ‌ద్ద‌ని అత‌ను కోరాడు. 2019లో అంబిలీదేవి, ఆదిత్య‌న్ జ‌య‌న్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఆ ఇద్ద‌రూ 'సీతాక‌ల్యాణ‌మ్‌' అనే టీవీ షోలో జంట‌గా న‌టించారు. ఆ ఇద్ద‌రికీ అర్జున్ అనే కొడుకు ఉన్నాడు.

అర్ధ‌న‌గ్న వీడియోలు తీసి బెదిరిస్తున్నాడు.. ఫియాన్స్‌పై న‌టి కంప్ల‌యింట్‌!

  త‌మిళ తార‌ జెన్నిఫ‌ర్ (24) త‌న ఫియాన్స్ న‌వీన్ కుమార్‌పై పోలీస్ కంప్ల‌యింట్ ఇచ్చారు. న‌వీన్‌తో పాటు అత‌ని తండ్రి ఉద‌య‌కుమార్‌, చిట్టిబాబు అనే పోలీసుపై కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఇటీవ‌ల త‌న మొద‌టి పెళ్లిని దాచిపెట్టి త‌న‌తో పెళ్లికి సిద్ధ‌మ‌య్యిందంటూ న‌వీన్ కుమార్ ఆరోపించ‌డంతో జెన్నిఫ‌ర్ వార్త‌ల్లోకి ఎక్కారు. న‌వీన్‌పై తాను చేసిన ఫిర్యాదు త‌ర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. శ‌ర‌వ‌ణ‌న్‌తో త‌న‌కు ఇదివ‌ర‌కే పెళ్ల‌యి, విడాకులు తీసుకొనే ప్రాసెస్‌లో ఉన్నామ‌ని తెలిసే పెళ్లి చేసుకుందామ‌ని న‌వీన్ త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ని జెన్నిఫ‌ర్ వెల్ల‌డించారు. అప్ప‌ట్నుంచీ తామిద్ద‌రం స‌హ‌జీవ‌నం చేస్తున్నామ‌న్నారు. న‌వీన్‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఉద్యోగం పోవ‌డంతో త‌న న‌గ‌లు తాక‌ట్టుపెట్టి అత‌డికి రూ. 2 ల‌క్ష‌లు ఇచ్చాన‌నీ, అత‌ను త‌ర‌చుగా డ‌బ్బులు డిమాండ్ చేస్తూ రావ‌డంతో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌నీ ఆమె చెప్పారు. తాము పాండిచ్చేరిలో ఉండ‌గా, మార్చి 25న న‌వీన్ త‌న‌పై దౌర్జ‌న్యం చేశాడ‌నీ, దీనిపై అత‌ని త‌ల్లిదండ్రుల‌కు కంప్ల‌యింట్ చేస్తే, అత‌నితో మాట్లాడి స్నేహ‌పూర్వ‌కంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని ఆమె తెలిపారు. ఆ త‌ర్వాత కూడా ఏప్రిల్ 14న న‌వీన్ రూ. 5 ల‌క్ష‌లు డిమాండ్ చేశాడ‌నీ, తాను ఇవ్వ‌న‌ని చెప్ప‌డంతో, త‌న డ్ర‌స్ చింపి, అర్ధ‌న‌గ్నంగా ఉన్న త‌న వీడియోలు తీసి, వాటిని ఇంట‌ర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తాన‌ని బెదిరించాడ‌నీ ఆమె ఆరోపించారు. న‌వీన్ వ్య‌వ‌హారం గురించి చెప్పినా అత‌ని త‌ల్లిదండ్రులు ప‌ట్టించుకోలేద‌నీ, అత‌డిని వెన‌కేసుకొచ్చార‌ని కూడా ఆమె ఆరోపించారు. తాను రాజీప‌డేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఏప్రిల్ 18న న‌వీన్‌తో పాటు పోలీసైన అత‌ని తండ్రి, అత‌ని ఫ్రెండ్స్ త‌న‌ను, త‌న తండ్రినీ, త‌న సోద‌రినీ వేధించార‌నీ, దీనిపై తాను చేసిన ఫిర్యాదును పోలీస్ స్టేష‌న్‌లో తీసుకోలేద‌నీ ఆమె ఆరోపించారు. న‌వీన్‌నీ, అత‌ని తండ్రినీ కాపాడ్డానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌నీ, పైగా వ్య‌భిచారం కేసులో త‌న‌ను ఇరికిస్తామ‌ని బెదిరిస్తున్నార‌నీ ఆమె తెలిపారు. చివ‌ర‌కు క‌మిష‌న‌ర్ ఆఫీస్‌లో త‌న కంప్ల‌యింట్ తీసుకున్నార‌ని వెల్ల‌డించిన ఆమె, మ‌రో చిత్ర (డిసెంబ‌ర్ 6న ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌మిళ టీవీ న‌టి) లాగా తాను కాద‌ల‌చుకోలేద‌న‌నీ, అందుకే అన్ని అడ్డంకుల్నీ ఎదుర్కొంటూ త‌న స‌మ‌స్య‌ను బ‌య‌ట‌కు వినిపిస్తున్నానీ ఆమె అన్నారు. సెంబ‌రుతి అనే సీరియ‌ల్‌తో పాపుల‌ర్ అయిన జెన్నిఫ‌ర్‌, ప్ర‌స్తుతం వాన‌దై పోల అనే సీరియ‌ల్ చేస్తున్నారు.

డాక్ట‌ర్లు ఎక్కువ రోజులు బ‌త‌క‌డ‌ని చెప్పినా నన్ను పెళ్లిచేసుకుంది!

  'జబర్దస్త్' షోలో కమెడియన్స్ ఎంతగా ఎంటర్టైన్ చేస్తారో తెలిసిందే. అయితే వారి జీవితాల్లో మాత్రం చెప్పుకోలేనన్ని కష్టాలు ఉన్నాయి. ఒక్కో ఆర్టిస్ట్ వెనుక విషాద గాధ ఉంది. అవినాష్, అప్పారావు, నరేష్ ఇలా చాలా మంది వ్యక్తిగతంగా చాలా కష్టాలు పడుతున్నారు. 'జబర్దస్త్' స్టేజ్ మీద లేడీ గెటప్పులు వేసే నటుల పరిస్థితి గురించి ఇంక చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా.. 'జబర్దస్త్' షో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. ప్రసాద్‌కు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఆ మధ్య కొన్ని నెలలు 'జబర్దస్త్' షోకి దూరంగా ఉన్నారు. అయితే ప్రసాద్‌ను కాపాడడానికి మల్లెమాల కానీ, 'జబర్దస్త్' కానీ ముందుకు రాలేదనీ, ఈ విషయంలో నాగబాబు బాగా హర్ట్ అయ్యారనీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. 'జబర్దస్త్' నుండి బయటకు వెళ్లే ముందు కూడా ఈ విషయాలన్నీ గుర్తుచేసి మల్లెమాల టీమ్‌పై నాగ‌బాబు కామెంట్స్ చేశారు. ప్రసాద్‌కి అండగా ఆయ‌న‌ నిలబడ్డారు. 'జబర్దస్త్' ఆర్టిస్ట్ ల సహాయ సహకారాలతో ప్రసాద్ ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు మొత్తం నాగబాబు సేకరించారట. ఇప్పటికీ ఆ డబ్బు ఆయన దగ్గరే ఉందని.. ప్రసాద్ ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటారో అప్పుడు ఆ డబ్బు ఇస్తానని నాగబాబు చెప్పారట. ఇప్పుడే ఇచ్చేస్తే వేరే అవసరాల కోసం వాడేస్తారేమోనని ఆ డబ్బుని నాగబాబు తన వద్దే పెట్టుకున్నారని కొందరు ఆర్టిస్ట్ లు చెబుతుంటారు. తాజాగా తన భార్యతో కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నాడు ప్రసాద్. ఇందులో తమ ప్రేమ, ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పి అందరినీ ఏడిపించేశాడు. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో తనకు కిడ్నీ సమస్య ఉందని తెలిసిందని.. డాక్టర్లు ఈ అబ్బాయి ఎక్కువ రోజులు ఉండరు.. రిస్క్ ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని తన భార్యకి సలహాలు ఇచ్చారని.. కానీ ఆమె మాత్రం ఏడాది బతికినా, రెండేళ్లు బతికినా ఆయనతోనే ఉంటానని చెప్పి పెళ్లికి సిద్ధమైందని గుర్తు చేసుకున్నాడు ప్రసాద్. ఇప్పటికీ ప్రసాద్‌కి కిడ్నీ సమస్య అలానే ఉందని.. కొడుకు కాస్త ఎదిగిన తరువాత అత‌డి భార్యే ప్రసాద్‌కి కిడ్నీ ఇవ్వబోతుందంటూ మరో కమెడియన్ రామ్ ప్రసాద్‌ చెప్పాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది. భర్త కోసం కిడ్నీ దానం చేయడానికి రెడీ అయిన ప్ర‌సాద్ భార్య‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రైజ్ మనీ ఎగ్గొట్టారు.. ఓంకార్ షోపై సెన్సేషనల్ కామెంట్స్!

  అప్పట్లో 'ఢీ' డాన్స్ షోకి ధీటుగా 'ఆట' అనే డాన్స్ షోని మొదలుపెట్టాడు యాంకర్ ఓంకార్. ఈ షోతోనే అతడికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. సుందరం మాస్టర్, అమ్మ రాజశేఖర్, నటరాజ్ తదితరులు జడ్జీలుగా వ్యవహరించిన ఈ షో అప్పట్లో మంచి టీఆర్పీ తీసుకొచ్చింది. భరత్, సన్నీ, సందీప్, తేజు లాంటి డాన్సర్లు ఈ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 'ఢీ'లో చేసిన వాళ్లు స్టార్ కొరియోగ్రాఫర్లుగా మారితే 'ఆట'లో చేసిన వారెవరికీ సరైన అవకాశాలు రాలేదు. ఇదిలా ఉండగా.. 'ఆట' సీజన్ 5, సీజన్ 6 విజేతగా నిలిచిన సన్నీ మాస్టర్ ఈ షోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. "మా అదృష్టం బాలేదో.. లేక మేం ఎన్నుకున్న ఫ్లాట్ ఫామ్ మంచిది కాదో తెలియదు కానీ.. ఆట షోలో చేసిన డాన్స్ మాస్టర్స్ ఎవరికీ పేరు రాలేద"ని సన్నీ అన్నారు. 'ఢీ'లో చేసిన డాన్స్ మాస్టర్స్ అంతా ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్లుగా ఉన్నారని.. కానీ తాము మాత్రం అక్కడే ఆగిపోయామని చెప్పారు. ఆట రెండు సీజన్లలో విన్నర్ గా నిలిచినా తనకు ఒక్క రూపాయి కూడా ప్రైజ్ మనీ ఇవ్వలేదని అన్నారు. "జీ వాళ్లకు ఫోన్ చేసి అడిగితే.. ఎవరో వచ్చి చెక్ తీసుకున్నారని.. తామైతే ప్రైజ్ మనీ ఇచ్చేశామని అన్నారు. సీజన్ 6 సమయంలో కూడా ఇలానే చేశార"ని చెప్పుకొచ్చారు. సీజన్ 6లో తన కంటెస్టెంట్ గా ఆరేళ్ల బాబుని ఇచ్చారని.. అత‌ను మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా బాగా చేసేవాడని.. చివరికి టైటిల్ కూడా సంపాదించాడని చెప్పారు. "ఆ సమయంలో రెండు లక్షల ప్రైజ్ మనీ అని చెప్పారు. విన్నర్ కి లక్ష, మాస్టర్ కి లక్ష. అయితే ఇప్పటివరకు ఆ ప్రైజ్ మనీ రాలేదు." అని అన్నారు. ఆ పిల్లాడి తండ్రి రైల్వేలో కూలి అని.. తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం సన్నీ దర్శకుడిగా మారి ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. అలానే కన్నడలో రియాలిటీ షోలకి పని చేస్తున్నాడు.

ఆడిపాడే బొమ్మలమే కానీ.. స్టేజిపై ఏడ్చేసిన సునీత!

  ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతోన్న షోలను బాగా ఎమోషనల్‌గా డిజైన్ చేస్తున్నారు. ఎమోషన్ ఎంతగా పండితే ఆడియన్స్ అంతగా షోకి కనెక్ట్ అయిపోతారు. అలా ఇప్పుడు డ్రామా జూనియర్స్ అనే షో ఎమోషన్‌ని బాగా పండిస్తోంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. 'సరిగమప' షో అయిపోవడంతో ఆ షో స్థానంలో డ్రామా జూనియర్స్ అనే కొత్త షోను మొదలుపెట్టారు. టాలెంట్ ఉన్న చిన్నపిల్లలను తీసుకొచ్చి షో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా సింగర్ సునీత, రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి సెల‌బ్రిటీల‌ను తీసుకొచ్చారు. తాజాగా ఈ షోలో ఓ చిన్నారి వేసిన స్కిట్ చూసి చలించిపోయారు జడ్జిలు. సెలబ్రిటీలంటే అందరికీ వారిపై హక్కు ఉంటుందని ఫీల్ అవుతుంటారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్ లలో తారలపై రకరకాల రూమర్లు రాస్తుంటారు. ఇదే టాపిక్ తీసుకున్న చిన్నారి.. ఓ స్కిట్ వేసింది. అందులో ఆమె హీరోయిన్ కావాలని కలలు కని.. తన కలను నెరవేర్చుకుంటుంది. తండ్రి వద్దంటున్నా హీరోయిన్ అవుతుంది. అయితే మీడియా ఆమెపై రాసిన తప్పుడు వార్తల వలన తండ్రి విషం తాగి సూసైడ్ చేసుకుంటాడు. ఈ స్కిట్ చూసిన సునీత తన ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. స్టేజ్ మీదకు వచ్చి.. ''చాలా కనెక్ట్ అయిపోయాను.. మీకు మేం సెలబ్రిటీలం అవ్వొచ్చు. మీరు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు.. సినిమాల్లో ఆడిపాడి బొమ్మలమే కానీ అమ్మలం రా..'' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత  రేణు దేశాయ్ కూడా ఏడ్చేసింది. దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దంటూ వేడుకుంది.

ఫ‌స్ట్ టైమ్ కూతురి ఫోటో షేర్ చేసిన హరితేజ!

  బుల్లితెరపై సీరియల్స్ లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఆ తరువాత యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకుంది. అదే గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. హౌస్ లో తనదైన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ పండించింది. ఆమె చెప్పిన హరికథ బిగ్ బాస్ షోకి హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 'సరిలేరు నీకెవ్వరు', 'ప్రతిరోజు పండగే', 'ఎఫ్ 2', 'అరవింద సమేత', 'యూటర్న్', 'శ్రీనివాస కళ్యాణం' ఇలా చాలా సినిమాల్లో నటించింది హరితేజ. ఇదిలా ఉండగా.. ఈ భామ ఏప్రిల్ 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొదటిసారి తన చిన్నారిని సోషల్ మీడియా ద్వారా ఈరోజు పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాప రాకతో తమ వివాహ వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నెటిజన్లు హరితేజకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. హరితేజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలానే తన కూతురు ఫోటోని కూడా షేర్ చేసింది.

ఇప్పుడు ఈ ఫోటోలు అవసరమా..? అనసూయపై నెటిజన్లు ఫైర్!

  బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'పుష్ప' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నాయి. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. చిన్న పిల్లల అవతారమెత్తింది అనసూయ. రెండు జడలు వేసుకొని పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చింది. తాను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడూ అలానే ఉన్నానంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు ఆమెని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. "స్కూల్ బ్యాగ్ మర్చిపోయావ్" అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేయగా.. మరో నెటిజన్ అనసూయపై మండిపడ్డారు. కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో.. ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారని.. దీని గురించి ఎలాంటి బాధ లేకుండా ఇలాంటి ఫోటోలు ఎలా పెట్టాలనిపిస్తుందంటూ అనసూయని ప్రశ్నించాడు. ఈ కామెంట్ చూసిన అనసూయ.. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా జనాలకు కొంత వినోదం.. కాస్త నమ్మకాన్ని కలిగించడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నామంటూ అనసూయ బదులిచ్చింది. అయినప్పటికీ సంతృప్తి చెందని నెటిజన్.. ఇలాంటి సమయంలో జనాలకు కావాల్సింది చేయూత అని.. ఎంటర్టైన్మెంట్ కాదని అన్నారు. మొత్తానికి అనసూయ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయినా.. అనసూయకి ఇలాంటి పోస్ట్ లు, కామెంట్స్ కొత్తేమీ కాదు!

తిండిలేక ఇబ్బంది పడ్డా.. 75 రూపాయ‌లు ఇస్తే గొప్ప‌గా ఫీల‌య్యా!

  సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అంత ఈజీగా రాదు. టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈరోజు ఇండస్ట్రీలో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడినవారే. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా తన కెరీర్‌లో పడిన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. శేఖర్ మాస్టర్ ఒకప్పుడు కొరియోగ్రాఫర్ గానే పని చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన బుల్లితెరపై ఓ స్టార్‌గా ఎదిగారు. పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోల సినిమా అంటే కచ్చితంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఉండాల్సిందే.  చిరంజీవి, రామ్ చరణ్ లాంటి వాళ్లు శేఖర్ మాస్టర్‌ని ఎంతో బాగా ట్రీట్ చేస్తుంటారు. సినిమాలతో పాటు బుల్లితెరని కూడా బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొన్నిరోజులుగా శేఖర్ మాస్టర్ 'ఢీ' షో నుండి జడ్జిగా తప్పుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆయన 'ఢీ' షోలో కనిపించడం లేదు. సినిమాలతో బిజీగా ఉండడం వలన ఆయన షోకి రాలేకపోయారని అంతా అనుకున్నారు. అయితే అదే సమయంలో ఆయన 'కామెడీ స్టార్స్' అనే షోలో జడ్జిగా కనిపించారు. దీంతో ఆయన కావాలనే 'ఢీ' షోని వదిలేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం శేఖర్ మాస్టర్ 'కామెడీ స్టార్స్' షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో బయటకి వచ్చింది. అందులో అవినాష్ టీమ్ ఓ స్కిట్ చేసింది. ఆ స్కిట్ చూసిన శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు.. తిండి సరిగ్గా దొరికేది కాదని.. 75 రూపాయలు ఇస్తే ఎంతో గొప్పగా ఫీలయ్యాయని.. అన్నం కూడా దొరకని స్థితిలో ఉండేవాడ్ని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎమోషనల్ అవ్వడంతో స్టేజ్ మీద ఉన్న వారంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రోమోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. 

నీ మొహం అద్దంలో చూసుకున్నావా..?

  అందం కంటే టాలెంట్ చాలా ముఖ్యమని చెబుతుంటారు. నల్లగా ఉన్న రజినీకాంత్ సౌతిండియన్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ప్రతిభ ఉంటే రంగు అడ్డం కాదని నిరూపించారు. అయితే ఇప్పటికీ మన దేశంలో వర్ణవివక్ష ఉంటూనే ఉంది. నల్లగా ఉన్నవారిని కామెంట్ చేస్తూనే ఉంటారు. అయితే అదే నలుపు రంగుతో బుల్లితెరపై ఫేమస్ అయ్యాడు ఇమ్మానుయేల్‌. 'జబర్దస్త్' షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఈ కమెడియన్.. నల్లగా ఉన్నానని కుంగిపోకుండా.. గెలుపు కోసం పరుగులు తీస్తున్నాడు.  తన రంగుతోనే డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా ఎదిగాడు. లేడీ కమెడియన్ వర్ష.. 'జబర్దస్త్' షోలోకి ఎంట్రీ ఇవ్వగానే ఇమ్మానుయేల్ కెరీర్ మరింత ఊపందుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో.. ఇమ్మాన్యుయేల్ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో అత‌ను ముచ్చటిస్తుంటాడు. రీసెంట్‌గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన ఈ కమెడియన్‌కు నెటిజన్ల నుండి పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. కొందరు కావాల‌ని టార్గెట్ చేస్తూ.. ప్రశ్నలు వేసినా.. నవ్వుతూనే సమాధానాలు ఇచ్చాడు.  అందులో కొందరు 'కలర్ ఫోటో' సినిమాకి సీక్వెల్ తీయమని సలహా ఇచ్చారు. మరికొందరు పెళ్లి గురించి అడిగారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. ''నీ మొహం అద్దంలో చూసుకున్నావా..?'' అని అవమానించేలా ప్రశ్నించాడు. అయినప్పటికీ ఇమ్మాన్యుయేల్ సరదాగానే బదులిచ్చాడు. 'పోకిరి' సినిమాలో మహేష్ బాబు పెదవి విరిచే ఓ ఎక్స్‌ప్రెష‌న్‌తో కౌంటర్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. అయితే ఇలా ఒక వ్యక్తి ప్రతిభ గుర్తించకుండా.. కలర్ మీద కౌంటర్ వేయడంతో సదరు నెటిజన్‌పై మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది ఇమ్మాన్యుయేల్ ను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదేమైనా వ‌ర్ణ వివ‌క్ష‌పై మ‌న‌వాళ్ల‌లో చైత‌న్యం పెరిగింద‌ని సంతోష‌ప‌డొచ్చు.