"న‌న్ను చాలా మంది తిడుతున్నారు".. వాపోయిన డాక్ట‌ర్ బాబు!

  బుల్లితెరపై హీరో రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు 'కార్తీకదీపం' డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ తో పాటు 'హిట్లర్ గారి పెళ్లాం' అనే మరో సీరియల్ కూడా చేస్తున్నారు. అయితే నిరుపమ్ ఎక్కడికి వెళ్లినా.. 'కార్తీకదీపం' సీరియల్ గురించే అడుగుతుంటారట. వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మోనిత ప్రెగ్నెంట్ న్యూస్ తో మరింత ఆసక్తికరంగా మారింది.  దీప, కార్తిక్ లు కలుస్తారనుకునే సమయంలో మోనిత ఇచ్చిన ట్విస్ట్ తో సీరియల్ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో నెటిజన్లు ఈ సీరియల్ కు ముగింపు ఉండదా..? దీప, కార్తిక్ లు ఎప్పుడు కలుస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై చాలా మంది తనను తిడుతున్నారని.. పర్సనల్ మెసేజ్ లు కూడా పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.  ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'కార్తీకదీపం' సీరియల్ గురించి మాట్లాడారు. ఈ సీరియల్ ఇంత క్లిక్ అవుతుందనుకోలేదని అన్నారు. వంటలక్క క్యారెక్టర్ విన్నప్పుడు సక్సెస్ ఫార్ములా కాబట్టి నమ్మకం ఏర్పడిందని.. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదని చెప్పారు. మీమ్స్, ట్రోల్స్ చూసినప్పుడు నవ్వుకుంటానని.. తిట్టినప్పుడు మాత్రం ఫీల్ అవుతుంటానని అన్నారు. తనకు పర్సనల్ గానే చాలా మంది మెసేజ్‌లు పెట్టి తిడుతుంటారని... ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోనని అన్నారు. 

వ్యాక్సిన్ వేయించుకోవడానికి అనసూయ పాట్లు!

  బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తరచూ ఏదొక టాపిక్ మీద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. ఆమెకి సపోర్ట్ చేసే వారికంటే ట్రోల్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆమె డ్రెస్సింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ట్రోల్స్ పడుతూనే ఉంటాయి. అయినప్పటికీ అనసూయ మాత్రం తనకు నచ్చినట్లే ఉంటుంది.  తాజాగా ఈ బ్యూటీ తన భర్త భ‌రద్వాజ్‌తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో స్వచ్చంద సంస్థలు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపడుతున్నారు. దీంతో అనసూయ కూడా వ్యాక్సిన్ కోసం వెళ్లింది. అయితే ఆమెకి సూది మందంటే భయమని తెలుస్తోంది.  వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకొని.. కళ్లు మూసుకొని తెగ భయపడిపోయింది. మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకున్నామని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంకుర హాస్పిటల్స్ చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగుందని కూడా అనసూయ కితాబిచ్చింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. బుల్లితెరపై టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. 'పుష్ప' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ పాత్రలో కనిపించనుంది. అలానే తమిళ, మలయాళ సినిమాల్లో కొన్ని సినిమాలు చేస్తోంది. 

వ‌న్ డే లైఫ్ వితౌట్ వైఫ్‌.. కౌశల్ వీడియో వైరల్!

  బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో కౌశల్ ఫాలోయింగ్ గురించి సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కౌశల్ కోసం ఏకంగా ఓ ఆర్మీ తయారైంది. ఆ తరువాత కొన్ని వివాదాలు కూడా జరిగాయి. ఈ విషయాలను పక్కన పెడితే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరూ యూట్యూబ్ లో సొంతంగా ఛానెల్స్ ఓపెన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.  వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. కౌశల్ కూడా అలానే ఓ ఛానెల్ మొదలెట్టాడు. కొన్ని రోజులుగా కౌశల్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కౌశల్ భార్య నీలిమకు కరోనా సోకడం.. ఆమె యూకేలో ట్రీట్మెంట్ తీసుకోవడంపై ఆ మధ్య పోస్ట్ లు వైరల్ అయ్యాయి.  ఇదిలా ఉండగా.. తాజాగా కౌశల్ ఓ వీడియో షేర్ చేశారు. ఒక రోజు భార్య ఇంట్లో లేకపోతే జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో వీడియోను రూపొందించారు. అయితే ఇందులో బిగ్ బాస్ షో అనుభవం పనికి వచ్చిందని కౌశల్ అన్నారు. వంట వండుకోవడం, తన పని తాను చేసుకోవడం అక్కడే అలవాటు అయిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి కౌశల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో తన పర్సనల్ విషయాలను పంచుకోవడంతో పాటు పిల్లలతో ఆడుకుంటూ కనిపించారు.

కామెడీని కామెడీలా చూడండి.. హైప‌ర్ ఆదిని వెన‌కేసుకొచ్చిన క‌మెడియ‌న్‌!

  ఓ కామెడీ షోలో హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, ఆడవాళ్లను కించపరిచారని తెలంగాణ జాగృతి విద్యార్ధి సంఘం నేతలు ఆదిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే దీనిపై ఆది క్షమాపణలు తెలియజేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా ఈ వివాదంపై జబర్దస్త్ కమెడియన్ మహిధర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక ప్రాంతాన్ని లేదా సంస్కృతిని హేళన చేసే వ్యక్తిత్వం హైపర్ ఆదికి లేదని మహిధర్ అన్నాడు.  ఈ ఇష్యూ చూస్తుంటే తనకొక డైలాగ్ గుర్తొస్తుందని.. మనోభావాలు ఉన్నదే దెబ్బతినడానికి అని వర్మ చెబుతుంటారని.. అవి ఎప్పుడూ దెబ్బ తింటూనే ఉంటాయని ఆయన అంటుంటారని అన్నాడు. నిజానికి హైపర్ ఆది అయినా.. మరెవరైనా.. షోలో ఒక ప్రాంతాన్ని ఒక సంస్కృతిని కించపరచాలని అనుకోరని చెప్పాడు. కామెడీని కామెడీలా చూడటం మానేసి.. వివాదాన్ని వెతకడం అలవాటు అయిపోయిందని నిట్టూర్చాడు.  పట్టించుకోవాల్సిన విషయాలను పక్కన పెట్టేసి ఇలాంటి వాటిపై పడుతుంటారని విమర్శించాడు. స్కిట్ కోసం స్క్రిప్ట్ రాస్తే.. దాన్ని పర్సనల్ తీసుకుని ఫీల్ అయిపోతే ఏం చేయలేమని అన్నాడు. కామెడీ షోని కామెడీ షోగా చూస్తే మంచిదని అన్నారు. హైపర్ ఆదితో నాలుగేళ్లుగా పని చేస్తున్నానని.. ఆయన వ్యక్తిత్వం ఏంటో తనకు తెలుసని అన్నాడు. తెరపై పంచ్ లు వేసి నవ్విస్తుంటారేమో కానీ నిజ జీవితంలో చాలా నార్మల్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చాడు. 

"నాకు నువ్విష్టం.. నిన్ను తిన‌లేను క‌దా".. మ‌ర‌ద‌లు ప్రియ‌మ‌ణితో బావ ఆది స‌ర‌సాలు!

  'జబర్దస్త్' కామెడీ షోతో మంచి పాపులారిటీ దక్కించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీ అయ్యాడు. 'ఢీ' షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ పంచుతుంటాడు హైపర్ ఆది. తాజాగా విడుదలైన 'ఢీ 13' ప్రోమోలో హైపర్ ఆది చేసిన రచ్చ మాములుగా లేదు. ప్రియమణితో హైపర్ ఆది రొమాంటిక్ టూర్ వేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజం కానప్పటికీ ఆ రేంజ్ లోనే బిల్డప్ ఇచ్చారు.  ప్రియమణిని హైపర్ ఆది ఓ రిసార్ట్ కి తీసుకెళ్లినట్లు చూపించడంతో ఈ వీడియో వెంటనే వైరల్ అయింది. ఇక ఇందులో బావా మరదలుగా వాళ్లిద్దరూ రెచ్చిపోవడం బాగా హైలైట్ అయింది. 'ఢీ' డాన్స్ షోలో మెంటర్ గా ఉంటోన్న హైపర్ ఆది.. తన పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజా ప్రోమోలో మాత్రం తన రొమాంటిక్ మూడ్ తో షాకిచ్చాడు.  "ప్రియా..." అంటూ హైపర్ ఆది ముద్దుగా పిలుస్తుండగా.. "బావా".. అంటూ ప్రేమగా అతన్ని పిలుస్తూ కనిపించింది ప్రియమణి. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదంటూ ఆది చెప్పిన డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. "నీకు దోశ కావాలా, ఇడ్లీ కావాలా?" అని ఆది అడ‌గ‌గా, "నీకేది ఇష్ట‌మో అదివ్వండి బావా.. నేను తింటాను." అని చెప్పింది ప్రియ‌మ‌ణి. "నాకు నువ్విష్టం.. నిన్ను తిన‌లేనుక‌దా" అని త‌న‌దైన స్టైల్‌లో ఆది పంచ్ వేశాడు. అత‌డి పంచ్‌కు ఫీలైపోయిన ప్రియ‌మ‌ణి ఆది భుజం మీద చేత్తో ట‌ప‌ట‌పా కొట్టేసింది. వీళ్లకు పక్క రూములో పూర్ణతో సుడిగాలి సుధీర్ ఉండడం.. ఈ రెండు జోడీల మధ్య సన్నివేశాలు, వాళ్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిపోయిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో తెగ‌ వైరల్ అవుతోంది. 

షర్ట్ లేకుండా అఖిల్.. 'అమ్మో' అంటూ మోనాల్‌!!

  బిగ్ బాస్ నాల్గో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లందరూ తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. కొందరికి పాజిటివ్ ఇమేజ్ రాగా.. మరికొందరికి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఈ సీజన్ లో లవ్ ట్రాక్ లు బాగానే వైరల్ అయ్యాయి. ఇందులో మోనాల్ చుట్టూ తిరిగిన స్టోరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. మోనాల్, అభిజిత్, అఖిల్ ట్రాక్ ఎంతటి వివాదానికి దారి తీసిందో తెలిసిందే.  బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో మోనాల్ ఎక్కువగా అఖిల్, అభిజిత్ లతోనే సమయం గడిపేది. కానీ కొన్నాళ్ళకు అభిజిత్ కి, మోనాల్ కి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మోనాల్.. అఖిల్ కి మరింత క్లోజ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయి బయటకు వచ్చినప్పుడు కూడా అఖిల్ కి మద్దతు తెలిపింది. కానీ అతడు రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో అఖిల్-మోనాల్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది.  అప్పుడప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై పోస్ట్ పై మరొకరు కామెంట్స్ పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా అఖిల్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన షర్ట్ బటన్ పెట్టుకోకపోవడంతో మోనాల్ సెటైర్ వేసింది. "షర్ట్ బటన్ పెట్టుకో" అంటూ లైవ్ లో చెప్పింది. తాజాగా అఖిల్ మరో పోస్ట్ పెట్టాడు. అందులో తన బెడ్ రూమ్ లో పడుకొని ఉన్నాడు. షర్ట్ లేకుండా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ లాక్ డౌన్ లో తన రోజులు ఇలా గడిచిపోతున్నాయని చెప్పాడు. దానికి మోనాల్.. ''బటన్ పెట్టుకోమని చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు షర్ట్ లేదు.. అమ్మో'' అంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

డాన్స్ షోలో రమ్యకృష్ణ!

  కరోనా వైరస్ విజృంభ‌ణ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ ను ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెర‌గ‌డంతో సినిమా, టీవీ షూటింగ్ లను నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రావడంతో రమ్యకృష్ణ షూటింగ్ లో పాల్గొంటున్నారు. విజ‌య్ టీవీలో ప్రసారమవుతోన్న 'బీబీ జోడిగళ్' డాన్స్ షోకి రమ్యకృష్ణ కో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.  తాజాగా ఈ షోకి సంబంధించిన షూటింగ్ లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రమ్యకృష్ణ. "బీబీ జోడిగళ్ సెట్ కు మళ్లీ వచ్చేశాం.. సేఫ్టీ ప్రొటోకాల్స్‌తో షూటింగ్ కొనసాగుతోంది. మాస్క్ లు పెట్టుకొని.. సురక్షితంగా షూటింగ్ చేస్తున్నాం" అంటూ రాసుకొచ్చారు రమ్యకృష్ణ. ఆ త‌ర్వాత ఆ షో లేటెస్ట్ ప్రోమో వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు జాగ్రత్తగా ఉండమంటూ సలహాలు ఇస్తున్నారు.  ఈ షోలో వనితా విజయ్ కుమార్ ఓ కంటెస్టెంట్. ఆమె కూడా రమ్యకృష్ణతో పాటు షూటింగ్ లో పాల్గొంది. ఈ షోలో సురేష్ చక్రవర్తితో కలిసి వనితా విజయ్ కుమార్, సోమశేఖర్‌తో శివానీ నారాయణ్, అజిద్ ఖాలీక్యుతో గ్యాబ్రియెల్లా చార్లటన్, షరీఖ్ హసన్‌తో అనితా సంపత్, సంయుక్త కార్తీక్‌తో జితన్ రమేష్  తదితరులు పాల్గొంటున్నారు.

అఖిల్ బెడ్ రూమ్‌లో మోనాల్ ఫోటో!

  బిగ్ బాస్ షోతో అఖిల్, మోనాల్ ల జంటకు పాపులారిటీ వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుస్తుంటారు. రీసెంట్ గా మోనాల్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. "నువ్వే నా రాణి" అంటూ తెగ పొగిడేశాడు అఖిల్. ఇక అఖిల్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో టాప్ లో నిలిస్తే 'అఖిల్ నెంబర్ వన్' అంటూ అతడిపై ప్రేమ కురిపించింది మోనాల్.  తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌తో అఖిల్ చిట్ చాట్ నిర్వహించాడు. ఈ ఇంటర్వ్యూ అఖిల్ ఇంట్లో జరిగింది. ఈ క్రమంలో అతడు తన బెడ్ రూమ్ ని చూపించాడు. అప్పుడ‌క్క‌డ‌ మోనాల్ గజ్జర్ ఫోటో కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ వెనుక ఆమె నిల్చొని ఉన్న సమయంలో తీసిన ఫోటో అది. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.  మోనాల్ గురించి మాట్లాడుతూ.. ఆమె అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. మోనాల్ ను ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తుంటానని... అందుకే ఆమె ఫోటోని బెడ్ రూమ్ లో పెట్టుకున్నట్లు చెప్పారు. "నాకోసం ఎక్కువగా ఆలోచించేవాళ్లలో మోనాల్ ఒకరు.. అందుకే ఆమె నాకు అంత దగ్గరైంది." అని వెల్ల‌డించాడు అఖిల్.   

వర్షిణితో లిప్ లాక్.. రవితో ఆడుకున్న ముక్కు అవినాష్‌!

  ఈ మధ్యకాలంలో బుల్లితెరపై మేల్ అండ్ ఫీమేల్ యాంకర్స్ చేస్తోన్న రచ్చ మాములుగా లేదు. పలు షోలలో కనిపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'కామెడీ స్టార్స్' షోకి మంచి టీఆర్పీలు వస్తుండడంతో షోకి మరింత రొమాన్స్ యాడ్ చేసి అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వర్షిణికి యాంకర్ రవి లిప్ లాక్ ఇస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  తాజాగా విడుదల చేసిన 'కామెడీ స్టార్స్' ప్రోమోలో ఈ లిప్ కిస్ కనిపించింది. ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ షోతో మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వర్షిణి ఈ షోలో యాంకర్ గా చేస్తోంది. అలానే రవి.. లాస్యతో కలిసి సందడి చేస్తున్నాడు. వీరితో పాటు చమ్మక్ చంద్ర, అవినాష్, హరి లాంటి బుల్లితెర కమెడియన్స్ ఫన్ పంచుతున్నారు.  ఈ క్రమంలో వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో ముక్కు అవినాష్ స్కిట్ కోసం యాంకర్ రవిని హీరోగా, వర్షిణిని హీరోయిన్ గా మార్చేశారు. డైరెక్టర్ గా కనిపించిన అవినాష్.. హీరోయిన్ వర్షిణితో మీకు లిప్ లాక్ సీన్ ఉంటుందని చెప్పడంతో రవి సంబర పడిపోయాడు. ముందుగా వర్షిణిని హగ్ చేసుకొని రొమాంటిక్ గా చూడమని చెబుతాడు అవినాష్. అయితే రవి పెర్ఫార్మన్స్ అవినాష్ కి నచ్చకపోవడంతో ఎలా చేయాలో తనే స్వయంగా చేసి చూపిస్తాడు. షాట్ ఓకే అంటూ రవిని ఫూల్ చేస్తాడు. ఈ ప్రోమో నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది.

స్కిట్ తెచ్చిన తంటా.. క్షమాపణలు కోరిన హైపర్ ఆది!

  'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచేలా 'శ్రీదేవి డ్రామా కంపనీ' షోలో ఓ స్కిట్ చేశాడని.. అతడిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇటీవల ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ ముదిరిపోతుందని గ్రహించిన మల్లెమాల టీమ్ యూట్యూబ్ నుండి వీడియోను తొలగించింది.  ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించక తప్పలేదు. తను కేవలం ఆర్టిస్ట్ ను మాత్రమేనని స్క్రిప్ట్ తను రాయలేదని చెప్పాడు. తాజాగా తమ స్కిట్ కారణంగా బాధపడ్డ వాళ్లకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు హైపర్ ఆది. ఆంధ్ర, తెలంగాణ అనే బేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడూ ఉండవని ఈ వీడియోలో వివరించాడు.  అన్ని ప్రాంతాల వాళ్లం ఎంతో సరదాగా కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటామని.. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. కలిసే పరిష్కరించుకుంటామని తెలిపాడు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ.. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని స్పష్టం చేశాడు. అన్ని ప్రాంతాల వారి ప్రేమాభిమానాలు వలనే అందరినీ ఇలా ఎంటర్టైన్ చేయగలుగుతున్నామని చెప్పాడు. ఏది ఏమైనా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 

కూతురి అల్లరి.. "స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయిరా నాయనా" అని వాపోయిన ర‌వి!

  యాంకర్ రవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. భార్య, కూతురితో కలిసి రవి చేసే అల్లరిని నెటిజన్లు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రవి కూతురు వియాకు నెట్టింట్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె మాట్లాడే ముద్దు ముద్దు మాటలకు అందరూ ఫిదా అవుతుంటారు. దీంతో రవి తన కూతురితో తరచూ వీడియోలు చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటాడు.  రీసెంట్ గా ఇంట్లో వంటలు చేస్తూ వాటిని వియాకి తినిపిస్తూ వీడియోలు షేర్ చేశాడు రవి. తాజాగా మరో ఫన్నీ వీడియో పోస్ట్ చేశాడు. రవి ఇంట్లో వర్కవుట్ చేస్తుండగా.. వియా కాసేపు వర్కవుట్ చేయనివ్వకుండా డిస్టర్బ్ చేసింది. ఆ తరువాత తండ్రితో కలిసి తను కూడా వర్కవుట్ చేసింది. ఈ వీడియోకి 'రాకాసి గడుసు పిల్ల.. శివకాశి సరుకీ పిల్ల' అనే పాటను బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేసి వీడియో పోస్ట్ చేశాడు.  ''వియా నా చుట్టుపక్కల ఉన్నప్పుడు అసలు పని మీద దృష్టి పెట్టలేను. స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయ్ రా నాయనా'' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు రవి. ప్రస్తుతం రవి బుల్లితెరపై కొన్ని టీవీ షోలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటూ తన యూట్యూబ్ ఛానెల్ మీద ఫోకస్ పెట్టాడు. వెరైటీ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 

శేఖర్ మాస్టర్‌తో డాన్స్ ఎంజాయ్ చేసిన‌ శ్రీముఖి!

  టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా మారారు శేఖర్ మాస్టర్. ఆయన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. ఆయన కొరియోగ్రఫీ చేశారంటే ఆ సాంగ్‌ సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలా వెండితెరపై తన సత్తా చాటుతున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపైకి కూడా వచ్చారు. పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మొన్నటివరకు 'ఢీ' షోలో జడ్జిగా కనిపించిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు కొన్ని కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  మరోపక్క యాంకర్ శ్రీముఖి పలు ఎంటర్టైన్మెంట్ షోలతో బుల్లితెరపై దూసుకుపోతోంది. తన గ్లామర్, కామెడీ పంచ్ లతో అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈ బ్యూటీ శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.  వీరిద్దరూ కలిసి ఓ తమిళ పాటకు డాన్స్ చేశారు. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కాస్త లోపించిందని చెప్పిన శ్రీముఖి.. శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపింది. ఈ డాన్స్ వీడియో చూసిన విష్ణుప్రియ.. 'సూపర్ మచ్చి మచ్చా' అంటూ కామెంట్ పెట్టింది. శ్రీముఖి ఫ్యాన్స్ కూడా చాలా బాగా డాన్స్ చేశారంటూ రియాక్ట్ అవుతున్నారు. 

న‌వ్య స్వామితో సుధీర్ పెళ్లి! వీడియో వైర‌ల్‌!!

  బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరని చెప్పాలి. ఆయన పెళ్లి మ్యాటర్ ఎప్పటినుండో వైరల్ అవుతోంది. 'జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌత‌మ్‌తో సుధీర్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారని మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఎప్పటికప్పుడు ఈ జంట క్లారిటీ ఇస్తూనే ఉంది. అయితే గతంలో ఓ షోలో భాగంగా సుధీర్, రష్మీలకు రీల్ పెళ్లి చేసేశారు. ఇప్పుడు మరోసారి సుధీర్ కి పెళ్లి చేయడం హాట్ టాపిక్ గా మారింది.  బుల్లితెరపై ప్రసారమవుతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి సుధీర్ గా హోస్ట్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ షోలో కమెడియన్స్ సరికొత్త కాన్సెప్ట్ లను ఎన్నుకొని ప్రేక్షకులను నవ్విస్తున్నారు. తాజాగా 'జంబలకడిపంబ' కాన్సెప్ట్ తీసుకొని ఎంటర్టైన్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా.. జంబలకడిపంబ స్టైల్‌తో సాగే ఈ స్కిట్‌ లో సుధీర్ కి సీరియల్ నటి నవ్య స్వామితో పెళ్లి చేసేశారు.  ముందుగా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అబ్బాయి గెటప్ లో రోహిణి  'ఏమైనా పాటలొచ్చా' అని సుధీర్‌ని అడగగా.. 'కనపడిన ప్రతీ ఒక్కరిని అడిగా.. అడిగా అని అడుగుతూనే ఉండేవాడు' అంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ వేశాడు. ఆ తరువాత ఈ స్కిట్‌లో ఆటో రామ్‌ప్రసాద్‌, హైపర్‌ ఆది డైల్సాగ్స్‌తో నవ్వించారు. అనంతరం అబ్బాయిలాగా డ్ర‌స్ చేసుకున్న న‌వ్య పెళ్లికూతురుగా ఎంట‌రైంది. "ఈవిడేనా పాపా?" అన‌డిగాడు సుధీర్‌. "ఫ‌ర్లేదు.. అబ్బాయి బాగానే ఉన్నాడు" అంది న‌వ్య‌. "పెళ్లికొడుకును ఏదైనా అడిగేదుంటే ముందే అడుగు" అని న‌వ్య‌తో చెప్పింది రోహిణి. "అడిగేదేముంది.. కోడిన‌డిగి మ‌సాలా నూర‌తామా" అని న‌వ్య అన‌డంతో ఆది బ్యాచ్ షాకైపోయింది. ఆ త‌ర్వాత‌ సుధీర్ కి, న‌వ్య‌కు పెళ్లి చేసేశారు. న‌వ్య త‌లెత్తుకొని సుధీర్ మెడ‌లో దండ వేస్తే, సుధీర్ త‌ల‌దించుకొని దండ‌ను న‌వ్య చేతికి ఇవ్వ‌గా, ఆమే దాన్ని త‌న మెడ‌లో వేసుకుంది. ప్రస్తుతం ఈ స్కిట్ కు యూట్యూబ్ లో మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.  

వివాదంపై హైపర్ ఆది క్లారిఫికేష‌న్‌!

  'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడని.. క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆది వివాదంలో చిక్కుకున్నాడు. దీనిపై స్పందించిన ఆయన తను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని.. స్క్రిప్ట్ తను రాసింది కాదని.. తను కేవలం ఆర్టిస్ట్ మాత్రమేనని అన్నాడు.  తెలంగాణ ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా భావించే బతుకమ్మ పండగ నేపథ్యంలో ఆది ఇటీవల చేసిన స్కిట్ ఇప్పుడు వివాదాలను తీసుకొచ్చింది. ఆదివారం నాడు జరిగిన ఓ షోలో ఈ స్కిట్ ప్రసారమైంది. అందులో "ఉయ్యాలో ఉయ్యాలో.." అంటూ బతుకమ్మ పాట పాడుతూ కమెడియన్లు అందరూ చుట్టూ తిరిగే దృశ్యం ఉంది. బతుకమ్మ పాట మీద కామెడీ చేస్తూ ఈ సన్నివేశాలను నడిపించారు. ఇది తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది. తెలంగాణ గ్రామదేవతల పండుగలను, ఇక్కడి ప్రజల యాస భాషలను కించపరిచేలా ఈ స్కిట్ ఉందని, హైపర్ ఆదితో పాటు ఈ స్కిట్ రైటర్, దీన్ని ప్రొడ్యూస్ చేసిన మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైనట్లు తెలియగానే  సదరు ఎపిసోడ్‌ను నిర్వాహకులు యూట్యూబ్‌ నుంచి తొలగించారు. 

''దూరంగా ఉంటూ.. కలలు కనేద్దాం"!

  బుల్లితెరపై యాంకర్ ఝాన్సీ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో తెలిసిందే. అలానే సినిమాల్లో కూడా ఏ పాత్ర చేసినా త‌న‌దైన ముద్ర వేస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అందరిలానే ఝాన్సీ కూడా ఇంటిపట్టునే ఉంటున్నారు. షూటింగులన్నీ ఆగిపోవడంతో చాలా మంది సినీ కార్మికులు రోడ్డున పడుతున్నారు. దీంతో కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి వారికి సాయం అందిస్తున్నారు.  ఇదిలా ఉండగా.. ఇటీవల కరోనాను విపరీతంగా ద్వేషిస్తున్నానంటూ ఝాన్సీ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తన బంధువుల పెళ్లికి హాజరు కాలేకపోయానని.. పెళ్లిని కూడా ఆన్లైన్ లో చూసుకోవాల్సి వచ్చిందనీ తెలిపారు. తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టారు. మామూలుగా అయితే సెలబ్రిటీలు షూటింగ్ ల కోసం, అలానే ట్రిప్ ల కోసం వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్లడం కుదరడం లేదు. దీన్నే సెటైరికల్ గా చెప్పారు ఝాన్సీ.  ''మళ్ళీ త్వరలో ఇలా ట్రావెల్ చేసే రోజులు వస్తే బాగుండు.. అంతా మన చేతుల్లోనే ఉందంట ... తొందరగా వాక్సిన్ వేయించేసుకోండి. అప్పటి వరకు మాస్కేసుకుని... దూరంగా ఉంటూ.. కలలు కనేద్దాం. ( వాటిని ఎవరూ ఆపలేరుగా )'' అంటూ ఇన్స్టాగ్రామ్ లో తన ట్రావెల్ ఫోటోని షేర్ చేసి రాసుకొచ్చారు. ఝాన్సీ చివరిగా 'మన్మథుడు 2' సినిమాలో కనిపించారు. 

యాంకర్‌గా ఛాన్స్ కొట్టేసిన మోనాల్!

  చాలా కాలం క్రితం హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మోనాల్. 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆమెకి సరైన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది. గతేడాది బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షోతో అమ్మడుకి క్రేజ్ బాగా పెరిగింది. తన గ్లామర్ తో చాలా మందిని ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు లవ్ ట్రాక్ లతో వార్తల్లో నిలిచింది.  హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ బులితెరపై 'డాన్స్ ప్లస్' షోలో జడ్జిగా కనిపించింది. ఈ షో పూర్తి కావడంతో స్టార్ మా ఛానెల్ మోనాల్ కి మరో ఆఫర్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ ఛానెల్ లో ఓ కామెడీ షోని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.  ఈ షోకి మోనాల్ ను యాంకర్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై ఆమె సంతకం కూడా పెట్టేసిందట. ఎంతో గ్రాండ్ గా ఈ షోని డిజైన్ చేస్తున్నారని.. ఇందులో చాలా మంది పేరున్న కమెడియన్లు భాగం కానున్నారని స‌మాచారం. అందుకే మోనాల్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. యాంకర్ గా మోనాల్ గనుక క్లిక్ అయితే ఆమెకి బుల్లితెరపై మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. 

నిద్రలోనే చనిపోతాననుకున్నా.. నా చెల్లెలు వ‌చ్చి సేవ‌లు చేసింది!!

  'జబర్దస్త్' కామెడీ షోతో గత ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్నాడు అదిరే అభి. తన కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేసిన అభి.. ఆ తరువాత యాంకర్ గా కొన్ని షోలు చేశాడు. అతడికి మంచి పేరు రావడంతో సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్లుగా ఆయన బుల్లితెరకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో 'జబర్దస్త్' షోలో తన కామెడీ స్కిట్ లతో ఆకట్టుకుంటున్నాడు. మిగిలిన వారి స్కిట్ లలో బూతులు దొర్లినా.. అదిరే అభి మాత్రం క్లీన్ కామెడీతో మెప్పిస్తుంటాడు.  ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కమెడియన్లు కూడా నిజ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఆ విషయాలను బయటపెడుతుంటారు. అభి కూడా తన జీవితంలో ఓ మర్చిపోలేని అనుభవం గురించి ఓ షోలో చెప్పుకొచ్చాడు. సుమ యాంకర్ గా ప్రముఖ ఛానెల్ లో 'క్యాష్' షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోకి సెలబ్రిటీ అన్నా, చెల్లెళ్లను అతిథులుగా తీసుకొచ్చారు.  మహేష్ విట్టా, రోల్ రైడా, అదిరే అభి తమ చెల్లెళ్లతో రాగా.. బిగ్ బాస్ హిమజ తన తమ్ముడిని తీసుకొచ్చింది. వీరందరూ కలిసి షోని చాలా ఎంటర్టైనింగ్ గా మలిచారు. ఇదే సమయంలో అభి తను నిద్రలోనే చనిపోతాననుకున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. తనకు కరోనా సోకిందని.. అప్పుడు చనిపోతాననే భయంతో రాత్రిపూట తన రూమ్ గొళ్లెం పెట్టకుండా పడుకునేవాడ్నని చెప్పుకొచ్చారు. నిద్రలో ఏదైనా జరిగితే తనను చూడ్డం కుదరదని అలా చేసేవాడినని కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో తన చెల్లెలు దుబాయ్ నుండి వచ్చి తనకు సేవలు చేసిందని చెప్పుకొచ్చారు.

ఆ సీరియ‌ల్‌కు రాశి రెమ్యూనరేషన్ ఇదే!

  ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన తెలుగ‌మ్మాయి రాశి.. ఒకానొక దశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోల‌తో వెండితెరపై రొమాన్స్ చేసిన రాశి 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అగ్ర దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారంటే ఆమె పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.  'నిజం' సినిమాలో ఆమె నెగ‌టివ్ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురయ్యాయి. ఆ పాత్ర పోషించినందుకు రాశి ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటుంది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన రాశి.. మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్ లో హీరో త‌ల్లి జ్ఞానాంబగా అలరిస్తోంది.  ప్రస్తుతం ఈ సీరియల్ కు మంచి రేటింగులే వస్తున్నాయి. రాశి పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రాశికి అభిమానూలు బ్రహ్మరథం పడుతున్నారు. తన నటనతో అలరిస్తున్న రాశి ఈ సీరియల్ కోసం మంచి రెమ్యూనరేషనే తీసుకుంటోంది. ఆమెకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇటీవల ఆర్థిక‌ ఇబ్బందుల వలనే రాశి సీరియల్ లో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ ప్ర‌చారాన్ని రాశి ఖండించింది. 

హైపర్‌ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు

కమెడియన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, నిర్మాణ సంస్థ మల్లెమాల ప్రొడక్షన్‌ పై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.  బుల్లితెరపై తన కామెడి టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది.. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, హద్దుమీరిన కామెడీతో అప్పుడప్పుడు విమర్శల పాలవుతున్నాడు. గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా టీవీ షోలో ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ.. పలువురు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.  ఇప్పుడు తాజాగా ఆది తెలంగాణ భాషను, దేవతలను కించపరిచారు అంటూ ఫిర్యాదు నమోదైంది. మరి దీనిపై ఆది ఏం వివరణ ఇస్తారో చూడాలి.