`కార్తీక దీపం` షాకింగ్‌ ట్విస్ట్ అదిరింది

దేశ వ్యాప్తంగా నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్‌గా పేరు తెచ్చుకున్న ధారావాహిక `కార్తీక దీపం`. రేటింగ్ విష‌యంలోనూ సంచ‌ల‌నం సృష్టించిన కార్తీక దీపం గ‌త కొన్ని రోజులుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తోంది. డాక్ట‌ర్ బాబు - దీపా క‌ల‌వ‌డం.. మోనిత జైలుకి వెళ్ల‌డంతో ఎండ్ కార్డ్ ప‌డాల్సిన ఈ సీరియ‌ల్‌ని బ‌త్తాయి ర‌సంలా పిండేస్తూ ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర సాగ‌దీస్తున్నారు. దీంతో అమితంగా అభిమానించిన ప్రేక్ష‌కులు ఈ సీరియ‌ల్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ సీరియ‌ల్ రేటింగ్ కూడా దారుణంగా ప‌డిపోవ‌డంతో ఇప్ప‌టికైనా ఈ సీరియ‌ల్‌ని ఆపేయ‌డం బెట‌ర‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సోమ‌వారం ఎపిసోడ్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర‌. దీంతో ఆడియ‌న్స్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 1197వ ఎపిసోడ్‌లోకి ఎంట‌రైన ఈ సీరియ‌ల్ అదిరిపోయే ట్విస్ట్‌తో స‌రికొత్త మ‌లుపు తిరిగింది. మోనిత‌కు పుట్టిన కొడుకు పేగు మెడ‌లో వేసుకుని పుట్టాడ‌ని.. దాని వ‌ల్ల తండ్రికి ప్రాణ‌గండ‌మ‌ని తెలియ‌డంతో కార్తీక్ త‌ల్లి మోనిత‌తో క‌లిసి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేయిస్తుంది. అయితే దీని వెన‌క డాక్ట‌ర్ భార‌తి చెప్పిన ఓ అబ‌ద్ధం కార‌ణ‌మ‌ని తెలియ‌డం ప్రేక్ష‌కుల‌ని షాక్‌కు గురిచేస్తోంది. ఇన్ని ట్విస్ట్‌ల మ‌ధ్య ఇదేం ట్విస్ట్ అంటూ త‌ల బాదుకుంటున్నారు. క‌ట్ చేస్తే నా వంట‌కు ఎన్ని మార్కులు వేస్తావ‌ని దీప డాక్ట‌ర్ బాబుని అడుగుతుంది. దానికి ప‌దికి ప‌ది అని చెబుతాడు. దానికి దీప మీరు అన్నీ అబ‌ద్ధాలే చెబుతున్నారంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. కార్తీక దీపంలో సోమ‌వారం ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిదే. 

అప్పుడే స‌గం చ‌చ్చిపోయా : సాయి కిర‌ణ్‌

త‌రుణ్ హీరోగా ప‌రిచ‌యం అయిన చిత్రం `నువ్వే కావాలి`. ఇదే సినిమాతో సెకండ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యారు సాయికిర‌ణ్‌. కానీ హీరోగా మాత్రం రాణించ‌లేక‌పోయారు. 25కు పైగా చిత్రాల్లో హీరోగా న‌టించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో సాయికిర‌ణ్ గ‌త కొంత కాలంగా బుల్లితెర‌పై రాణిస్తున్నారు. తండ్రి పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీగా మారిపోయారు.  కోయిల‌మ్మ‌.., ఇంటి గుట్టు... గుప్పెడంత మ‌న‌సు వంటి ధారావాహిక‌ల్లో న‌టిస్తున్నారాయ‌న‌. ఇంటి గుట్టులో తండ్రిగా న‌టిస్తున్న సాయి కిర‌ణ్ అదే త‌ర‌హా తండ్రి పాత్ర‌ని `గుప్పెడంత మ‌న‌సు`లో న‌టిస్తున్నా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఈ మూడు సీరియ‌ల్స్‌ల‌లో ఇంటి గుట్టు, గుప్పెడంత మ‌న‌సు మంచి రేటింగ్‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్త్యూలో సాయికిర‌ణ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. త‌న‌కు బుల్లితెర‌పై గుర్తింపుని తెచ్చిన `కోయిల‌మ్మ‌` సీరియ‌ల్‌ని అర్థాంత‌రంగా ఆపేయ‌డంతో స‌గం చ‌చ్చిపోయాన‌న్నారు. ఈ సీరియ‌ల్‌లో సింగ‌ర్ మ‌నోజ్ కుమార్‌గా న‌టించా. అది నా మ‌న‌సుకు చాలా ద‌గ్గ‌రైన పాత్ర‌. ఇదే సీరియ‌ల్‌ని మ‌ల‌యాళంలోనూ ఏక కాలంలో చేశా. కానీ రెండు భాష‌ల్లోనూ ఈ సీరియ‌ల్‌ని ఒకేసారి ఆపేయ‌డంతో స‌గం చ‌చ్చిపోయా ` అన్నారు సాయి కిర‌ణ్‌. త‌న కెరీర్‌లో `కోయిల‌మ్మ` సీరియ‌ల్ పెద్ద మైలు రాయిగా నిలిచింద‌ని అలాంటి సీరియ‌ల్‌ని మ‌ధ్య‌లోనే ఆపేయ‌డంతో త‌ట్టుకోలేక‌పోయాన‌న్నారు సాయికిర‌ణ్‌

కిస్‌ అడిగిన జెస్సీ.. అంద‌రూ చూస్తున్నారంటూనే ముద్దు పెట్టిన‌ సిరి!

  బిగ్‌బాస్ సీజ‌న్ 5 పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. గ‌త సీజ‌న్‌తో పోలిస్తే తాజా సీజ‌న్ చాలా చెత్త‌గా వుంద‌ని.. టాస్క్‌ల‌తో పాటు కంటెస్ట్‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. హోస్ట్‌గా నాగ్ వ్య‌వ‌హార శైలి విమర్శ‌ల‌కు తావిస్తోంది. శ‌నివారం ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ సీజ‌న్ 5 పై విమ‌ర్శ‌లు మ‌రింత‌గా పెరిగిన విష‌యం తెలిసిందే. ఈ వారాంతంతో ఈ షో 10వ వారంలోకి ఎంట‌ర‌వుతోంది. ఇదిలా వుంటే ఈ వారం నామినేష‌న్స్‌లో యాంక‌ర్ ర‌వి, సిరీ, స‌న్నీ, మాన‌స్, కాజ‌ల్ వున్నారు. ఈ ఐదుగురిలో ఎవ‌రు సేవ్ అవుతారు.. ఎవ‌రు హౌస్ నుంచి బ‌య‌టికి వెళుతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే గ‌త కొన్ని వారాలుగా చివ‌రి వ‌ర‌కు వ‌చ్చి సేవ్ అవుతూ వ‌స్తున్న కాజ‌ల్ ఈ వారం ఎలిమినేట్ కావ‌డం ఖాయం అంటూ సంకేతాలు వినిపించాయి. అందుకు త‌గ్గ‌ట్లే మాన‌స్‌తో పాటు కాజ‌ల్ కూడా డేంజ‌ర్ జోన్‌లోకి వెళ్లి, ఎలిమినేష‌న్ అంచుల దాకా వ‌చ్చింది. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేష‌న్ అవ‌డం త‌ప్ప‌ద‌ని అంతా అనుకున్నారు. కానీ ఇద్ద‌రినీ బిగ్ బాస్ సేవ్ చేశాడు. ఈ వారం ఎవ‌రూ ఎలిమినేట్ కాలేదు. అలా అని ఎవ‌రూ హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని అనుకోవాల్సిన ప‌నిలేదు. వారం క్రిత‌మే తీవ్ర అనారోగ్యానికి గురైన జెస్సీ.. హెల్త్ ప్రాబ్ల‌మ్స్ వ‌ల్ల తాను హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నాన‌ని అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే అత‌డిని పూర్తిగా బ‌య‌ట‌కు తీసుకురాకుండా సీక్రెట్ రూమ్‌లో ఉంచిన బిగ్ బాస్‌, అత‌డికి డాక్ట‌ర్ల‌తో ప‌రీక్ష‌లు చేయించాడు. అత‌నికి స్పెష‌లిస్టుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రీట్‌మెంట్ అవ‌స‌రం కాబ‌ట్టి త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో హౌస్ బ‌య‌ట‌కు పంపించాల్సి వ‌స్తోంద‌ని నాగ్ ప్ర‌క‌టించారు.  అలా జెస్సీ ఈ వారం హౌస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో మాన‌స్‌, కాజ‌ల్ ఇద్ద‌రూ ఈ వారం ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నారు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జెస్సీ.. స్టేజి మీద‌కు వ‌చ్చి, ఫోన్‌లో ఒక్కో కంటెస్టెంట్‌తో మాట్లాడి, ఈ వారం ఎవ‌రి గేమ్ ఎలా ఉందో తాను సీక్రెట్ రూమ్ నుంచి గ‌మ‌నించిన విష‌యాల‌ను వాళ్ల‌తో పంచుకుంటూ, వాళ్ల‌కు సూచ‌న‌లు అంద‌జేశాడు. సిరిని కిస్ పెట్ట‌మ‌ని అడిగాడు. అంద‌రూ చూస్తున్నార‌ని సిరి అంటే, ఫ‌ర్వాలేద‌న్నాడు. ఫోన్‌లోనే జెస్సీకి ముద్దు పెట్టింది సిరి. ఆమెతో జెస్సీ ఎమోష‌న‌ల్‌గా బాగా క‌నెక్ట‌య్యాడ‌ని అంద‌రికీ అర్థ‌మైంది. చివ‌ర‌గా ష‌ణ్ణుతో మాట్లాడాడు జెస్సీ. క్లోజ్ ఫ్రెండ్‌గా అత‌నికి స‌ల‌హాలిచ్చాడు. మొత్తానికి అనారోగ్యంతో జెస్సీ బ‌య‌ట‌కు వెళ్లడం అంద‌రినీ బాధించింది.

డాక్ట‌ర్ బాబు ఫ్యామిలీ చేష్ట‌ల‌కు చిరాకుప‌డుతున్న వీక్ష‌కులు!

  అతిగా ఆశ‌ప‌డే మ‌గ‌వాడు అతిగా ఆవేశ‌ప‌డే ఆడ‌ది సుఖ‌ప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు అన్న‌ట్టే అతిగా ఏది చేసినా అది బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. ఇది ఇప్పుడు పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం` విష‌యంలో అక్ష‌ర స‌త్యంగా నిలుస్తోంది. గ‌త కొంత కాలంగా మ‌హిళాలోకం నీరాజ‌నాలు అందుకుంటూ దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ సీరియ‌ల్‌గా జేజేలు అందుకున్న `కార్తీక దీపం` తాజాగా త‌న ప్రాభ‌వాన్ని కోల్పోతోంది. ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని టాప్ వ‌న్ పొజిష‌న్‌లో నిలిచిన ఈ సీరియ‌ల్ తాజాగా ప్రేక్ష‌కుల‌కు అస‌హానాన్ని క‌లిగిస్తోంది. జాతీయ స్థాయిలో నెంబ‌ర్‌వ‌న్ సీరియ‌ల్‌గా పాపులారిటీని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా రేటింగ్ విష‌యంలోనూ టాప్‌లో నిలిచిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని రోజులుగా దారుణంగా ప‌డిపోతోంది. వంట‌ల‌క్క దీప క్రేజ్‌తో ఓ రేంజ్‌లో బుల్లితెర‌పై సంద‌డి చేసిన `కార్తీక దీపం` రేటింగ్‌ ఇప్పుడు దారిత‌ప్పుతోంది. మోనిత నెల‌త‌ప్ప‌డంతో గాడి త‌ప్పిన ఈ సీరియ‌ల్ ప్రేక్ష‌కుల‌కు అస‌హ‌నాన్ని క‌లిగిస్తోంది. ఏదో ఒక విధంగా సీరియ‌ల్‌ని సాగ‌దీయాని ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర చేస్తున్న ప‌నులు సీరియ‌ల్‌ని దారుణంగా ట్రోల్ కు గుర‌య్యేలా చేయ‌డ‌మే కాక‌కుండా రేటింగ్‌ని కూడా ప్ర‌భావితం చేస్తున్నాయి. 21.01 రేటింగ్‌తో ఇండియాలోనే టాప్ రేటింగ్‌ని సాధించిన సీరియ‌ల్‌గా ఘ‌న‌త సాధించిన 'కార్తీక‌ దీపం' ఆ త‌రువాత నుంచి క్ర‌మ క్ర‌మంగా రేటింగ్ త‌గ్గుతూ దారుణ స్థాయికి ప‌డిపోతోంది. సాగ‌దీత కార‌ణంగా 21.01 రేటింగ్‌లో వున్న ఈ సీరియ‌ల్ రేటింగ్ కాస్తా 18కి ప‌డిపోయింది. తాజాగా అది కాస్తా 12.92కి ప‌డిపోయింది. సీరియ‌ల్ టాప్‌లోనే కొన‌సాగుతున్నా రేటింగ్ విష‌యంలో మాత్రం వెన‌క‌బ‌డిపోతోంది. దీంతో ప్రేక్ష‌కులు వంట‌ల‌క్క‌కు ఊహించ‌ని షాకిచ్చార‌ని ప్రేక్ష‌కులు చెప్పుకుంటున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర మ‌ళ్లీ కార్తీక దీపాన్ని గాడిలో పెడ‌తారో లేదో చూడాలి. 

బోన్‌లో పెట్టాల్సింది నాగ్‌నా?

  బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. గ‌త సీజ‌న్‌తో పోలిస్తే తాజా సీజ‌న్ ఏమంత బాగాలేద‌ని నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. షో ప్రారంభం నుంచి కూడా నెటిజ‌న్‌ల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఈ షో నిర్వ‌హ‌ణ తీరుపై పెద‌వి విరుస్తూ ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ఆ విమ‌ర్శ‌లు ఈ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కింగ్ నాగార్జున‌ని చుట్టుముడుతున్నాయి.  నాగ్ బ్యాడ్‌ హోస్ట్ అని కొంత మంది దుమ్మెత్తిపోస్తుంటే, మ‌రి కొంతమంది ఆయ‌న డ‌మ్మీ హోస్ట్‌గా మారిపోయార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. శ‌నివారం ఎపిసోడ్‌లో నాగార్జున వ్య‌వ‌హ‌రించిన తీరు.. సన్నీపై విమ‌ర్శ‌లు చేసిన తీరు నెటిజ‌న్‌ల‌కు ఆగ్ర‌హాన్ని అస‌హ‌నాన్ని తెప్పించింది. టాస్క్‌లో స‌న్నీని ఇబ్బందిపెట్టిన సిరిని.. ఆ త‌రువాత ష‌ణ్ముఖ్‌ని ప‌క్క‌న పెట్టి కేవ‌లం స‌న్నీని మాత్ర‌మే టార్గెట్ చేస్తూ అత‌న్ని బోన్‌లో దోషిగా నిల‌బెట్ట‌డం.. అత‌న్ని దారుణంగా విమ‌ర్శించ‌డం నెటిజ‌న్‌ల‌కు ఆశ్చ‌ర్యాన్ని, ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. దీంతో బోన్‌లో పెట్టాల్సింది స‌న్నీని కాదు డ‌మ్మీ హోస్ట్‌గా మారిన నాగ్‌ని అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టాస్క్‌లో భాగంగా సిరి, ష‌ణ్ముఖ్ రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే స‌న్నీ రియాక్ట్ కావాల్సి వ‌చ్చింది. ఇది వీడియోలో స్ప‌ష్టంగా వుంది. ఆ విష‌యాన్ని వ‌దిలేసి నాగ్ కేవ‌లం సిరిని అప్పడం.. ఇలాగే చేస్తే తంతా.. అప్పడాలు అమ్ముకో అంటే ముందుగా అమ్మేది నిన్నే అని స‌న్నీ అన‌డాన్ని త‌ప్పుబ‌ట్ట‌డం.. రెచ్చగొట్టి గొడ‌వ‌కు కార‌ణ‌మైన సిరి, ష‌ణ్ముఖ్‌ల‌ని ఏమీ అన‌క‌పోవ‌డం నెటిజ‌న్‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. దీంతో షోనే కాదు.. హోస్ట్ నాగ్ కూడా దారి త‌ప్పాడ‌ని .. ఆయ‌న బ్యాడ్‌ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్రేక్ష‌కులు మండిప‌డుతున్నారు. ఈ సీజ‌న్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ ఎలిమినేష‌న్‌కు గురై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉమాదేవి సైతం త‌న ఇన్‌స్టా స్టోరీలో నాగార్జున తీరును త‌ప్పుప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

బిగ్ షాక్.. 'జ‌బ‌ర్ద‌స్త్'కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్!

బుల్లితెర ప్రేక్షకుల్లో సుడిగాలి సుధీర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కామెడీ షో 'జబర్దస్త్'లో కంటెస్టెంట్ గా వచ్చిన సుధీర్.. టీమ్ లీడర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు షోలు, సినిమాలతో సుధీర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే  'జబర్దస్త్'తో ఇంత ఫేమ్ తెచ్చుకున్న సుధీర్.. ఇప్పుడు ఆ షో నుంచి బయటకు వచ్చాడని తెలుస్తోంది. బుల్లితెరపై పలు పాపులర్ షోలను నిర్మించే మల్లెమాల సంస్థ ప్రతి సంవత్సరం జబర్దస్త్ కమెడియన్స్ తో అగ్రిమెంట్ చేయించుకుంటుదట. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా కమెడియన్స్ తో అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకోవడానికి ప్రయత్నించగా.. అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి  సుధీర్ నిరాకరించార‌ట‌. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో వెండితెరపైనా వరుస ఆఫర్స్ పట్టేస్తున్నాడు సుధీర్. 'సాఫ్ట్ వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిశాడు. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తున్న సుధీర్.. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సుధీర్ పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో 'జబర్దస్త్' షోని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ తో పాటు మల్లెమాల నిర్మిస్తున్న ఇతర షోలకు కూడా సుధీర్ దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. 'జబర్దస్త్' నుంచి సుధీర్ బయటకు వచ్చేస్తున్నాడన్న వార్త నిజమైతే అది ఆ షోకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆ షోకి మంచి రేటింగ్ రావడానికి ప్రధాన కారణాల్లో సుధీర్ టీమ్ కూడా ఒకటి. ఇప్పుడు సుధీర్ బయటకు వచ్చేస్తే అతనితో పాటు అతని టీమ్ సభ్యులు గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కూడా బయటకు వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

`కార్తీక దీపం` స‌రికొత్త ట్విస్ట్‌లు.. వంట‌ల‌క్క దారెటు..

స్టార్ మా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ రోజుకో మ‌లుపులు తిరుగుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే 1000 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని 1196వ ఎపిసోడ్‌లోకి ఎంట‌రైన `కార్తీక దీపం` ఈ రోజు ఎపిసోడ్ ర‌స‌వ్త‌ర మ‌లుపులు .. ట్విస్ట్‌ల‌కు కేంద్ర బిందువుగా మార‌బోతోంది. గ‌త ఎపిసోడ్‌లో దీప .. మోనిత ఇంటికి రావ‌డం.. దీప‌ని అవ‌మానిస్తూ మోనిత కౌంట‌ర్‌లు ఇవ్వ‌డం.. దానికి బ‌దులుగా దీప ఓ రేంజ్‌లో మోనిత వార్నింగ్ ఇచ్చి త‌న‌తో ఎందుకు పెట్టుకున్నానా.. ఎందుకు బ్ర‌తికి వున్నానా? అని త‌ల గోడ‌కేసి బాదుకునేలా  చేస్తాను నీమీద ఒట్టు` అంటూ దీప .. మోనిత‌కు వార్నింగ్ ఇవ్వ‌డం తెలిసిందే. అయితే ఊహించ‌ని విధంగా దీప వార్నింగ్ ఇవ్వ‌డంతో ఏంటీ దీప ధైర్యం ? అంటూ ఆలోచ‌న‌లో ప‌డుతుంది మోనిత‌. క‌ట్ చేస్తే కొత్త నంబ‌ర్‌తో డాక్ట‌ర్ బాబుకి ఫోన్ చేస్తుంది. త‌న‌కు ఫోన్ చేసింది దీప అనుకుని `దీప నువ్వేనా` అంటాడు డాక్ట‌ర్ బాబు.. కానీ మోనిత పెద్ద‌గా న‌వ్వి `నేను కార్తీక్‌.. నువ్వు నా ఫోన్ ఎత్త‌క‌పోతే నా ద‌గ్గ‌ర మా ఉద్యోగుల నంబ‌ర్లు వేల‌ల్లో వున్నాయి అంటుంది. దీప గురించి అడుగుతూ `ఏంటీ రోజూ దీప త‌న గురించే అడుగుతోందా? .. లేక త‌న‌ని త‌లుచుకుంటూ ఏడుస్తోందా? అని వెట‌కారంగా అడుగుతుంది. దీంతో డాక్ట‌ర్ బాబుకు చిర్రెత్తుకొచ్చి `ఆపు మోనితా` అంటాడు. దీప‌ని నెత్తికి ఎక్కించుకున్నావో దాన్ని పాతాళానికి తొక్కేస్తాను` అని డాక్ట‌ర్ బాబుకు వార్నింగ్ ఇస్తుంది మోనిత‌. ఆ మాట‌లు విన్న డాక్ట‌ర్ బాబుకు కోపం వ‌చ్చేస్తుంది వెంట‌నే `మ‌రో మాట మాట్లాడితే మార్యాద‌గా వుండ‌దు` అంటూనే మోనిత ఫోన్ క‌ట్ చేస్తాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ మ‌రిన్ని ట్విస్ట్‌లు.. మ‌లుపుల‌తో ర‌స‌వ‌త్త‌రంగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఆనీ ఆట‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్స్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 రోజు రోజుకీ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. అయితే గ‌త సీజ‌న్ తో పోలిస్తే మాత్రం బ‌రింత తాజా సీజ‌న్ అంత ఆస‌క్తిక‌రంగా లేద‌ని నెటిజ‌న్స్ పెద‌వి విరుస్తున్నారు. అంతేనా కంటెస్టెంట్‌ల‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా శుక్ర‌వారం నాటి ఎపిసోడ్‌పై మాత్రం నెటిజ‌న్స్ మ‌రింత‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 69 రోజులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ షో ప‌లు విమ‌ర్శ‌ల‌ని ఎదుర్కొంటోంది. కంటెస్టెంట్‌ల విష‌యంలోనూ వీక్ష‌కుల్ని నిరాశ ప‌రిచిన మేక‌ర్స్ షో నిర్వ‌హ‌ణ విష‌యంలోనూ వీక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాక‌రంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల‌పై మాత్రం ఓ రేంజ్‌లో వీక్ష‌కులు దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ మాస్ట‌ర్ ఆనీపై మండిప‌డుతున్నారు. 10వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా `ట‌వ‌ర్‌లో వుంది ప‌వ‌ర్‌` అనే టాస్క్ ని నిర్వ‌హించారు. ఈ టా స్క్ కి ఆనీ మాస్ట‌ర్‌ని సంచాల‌కురాలిగా నియ‌మించారు బిగ్‌బాస్‌. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ మొద‌లైంది. సంచ‌లాకులు ఎవ‌రికీ స‌పోర్ట్ చేయ‌కూడ‌ద‌న్న రూల్ వుంది. ఆ రూల్‌ని ప‌క్క‌న పెట్టి ఆనీ త‌న‌ని మొద‌టి నుంచి స‌పోర్ట్ చేస్తున్న ర‌విని స‌పోర్ట్ చేస్తున్న‌ట్టుగా చెప్పేసింది. ఆ త‌రువాత స‌న్నీ.. కాజ‌ల్‌ల‌పై త‌న‌దైన స్టైల్లో ఎదురుదాడికి దిగిన ర‌చ్చ చేసింది. ఫైన‌ల్‌గా ఆనీ హెల్ప్ కార‌ణంట‌గా ర‌వి కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ సంద‌ర్భంగా ఆనీ ప్ర‌వ‌ర్త‌న మ‌రీ ప‌రాకాష్ట‌కు చేరింది. కాజ‌ల్‌తో గొడ‌వ‌.. నాగిన్ డ్యాన్స్‌.. స‌న్నీని క్రిటిసైజ్ చేయ‌డం వంటి సిల్లీ ప‌నుల‌ని చూసి విసుగెత్తిన నెటిజ‌న్స్ ఆనీని ఎర్ర‌గ‌డ్డ పిచ్చాసుప‌త్రికి త‌ర‌లించండి బిగ్‌బాస్ అంటూ మండిప‌డుతున్నారు.

'అన్‌స్టాపబుల్' షోలో నాని సర్ప్రైజ్.. ఎమోషనల్ అయిన బాలయ్య!

'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోతో ఓటీటీ వేదిక ఆహాలో నటసింహం నందమూరి బాలకృష్ణ అలరిస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య తొలిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ షోకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ షోలో మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా సీనియర్ నటుడు మోహన్ బాబు రాగా.. సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని వచ్చాడు. సెకండ్ ఎపిసోడ్ కూడా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య, నానిలు కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్యకి నాని ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. పదేళ్ల క్రితం బాలయ్య గొప్ప మనస్సుతో చేసిన ఓ సాయాన్ని గుర్తు చేస్తూ నాని ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో బాలయ్య ఎప్పుడూ ముందుంటాడు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ బారిన పడిన ఎందరో పేదవారికి ఉచిత వైద్యం అందించాడు. అలా పదేళ్ల క్రితం ఓ చిన్నారి ప్రాణాలను నిలబెట్టాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నాని మొదట ఓ వీడియో ద్వారా సర్ ప్రైజ్ చేశాడు. ఆ వీడియోలో వినీలాంబిక అనే పదేళ్ల పాప, ఆమె తల్లి కనిపించారు. వీడియోలో వినీల తల్లి మాట్లాడుతూ.. 2011 జూన్ లో మా పాప పుట్టిందని, పుట్టిన కొన్ని నెలలకే ఆరోగ్య సమస్యలు వచ్చాయని, ఎన్నో ఆసుపత్రులు తిరిగినా వైద్యం అందలేదని తెలిపింది. చివరికి మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ద్వారా బసవతారకం ఆసుపత్రికి వెళ్లామని చెప్పింది. ఆరోగ్య శ్రీ లేకపోయినా వైద్యం అందించి మా పాపని కాపాడారని, ఈరోజు మా పాప ఇలా కళ్ళ ముందు ఉందంటే దానికి బాలకృష్ణ గారే కారణమని ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె చెప్పుకొచ్చింది. ఆ వీడియో చూసి బాలయ్య ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు మీకు ఇంకో సర్ ప్రైజ్ అంటూ నాని ఆ పాప వినీలాంబికని బాలయ్య ముందుకి రమ్మని పిలిచాడు. దీంతో ఆ పాప బాలయ్య దగ్గరకు ఆనందంగా వచ్చింది. బాలయ్య ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దాడాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలలో వైరల్ గా మారాయి. బాలయ్య మనస్సు బంగారం అంటూ నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

ఊహించ‌ని ట్విస్ట్‌: తుల‌సి కాళ్లు ప‌ట్టుకుని బోరుమ‌న్న నందు

జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ధారావాహిక `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. ఈ సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొన్ని ఎపిసోడ్‌ల‌ని ప‌రిశీలిస్తే లాస్య మాయ‌లో ప‌డిన నందు భార్య‌ తుల‌సిని అనుమానిస్తూ అవ‌మానిస్తూ చివ‌రికి ఆమెకు విడాకులిస్తాడు. అయితే తులిసి నిజాయితీ తెలిసిన నందు తండ్రి ఆమెకు అండ‌గా నిలిచి త‌న ఇంటిని ఆమె పేరు మీద రాసేస్తాడు. దీంతో నందుక‌కు విడాకులిచ్చినా తుల‌సి ఇంట్లోనే వుండిపోతుంది. గ‌త కొంత కాలంగా లాస్య ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగెత్తిపోయిన నందు తుల‌సితో క‌లిసి ఆఫీస్ ప‌నిమీద క్యాంప్‌కి వెళ్లాల్సి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ఒంట‌రిగా క‌లుసుకున్న భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తీసుకోబోతోంది. హోట‌ల్ రూమ్‌లో తుల‌సిని వ‌దిలి బ‌య‌టికి వెళ్లిన నందు చిత్తుగా తాగి వ‌స్తాడు. ఇది గ‌మ‌నించిన తుల‌సి తాగి వ‌చ్చారా? అని నందూని నిల‌దీస్తుంది. మ‌నం మాజీ భార్యా భ‌ర్త‌లం అన్నావ్‌.. ఎవ‌రిదారి దారిది అన్నావ్ ఇప్పుడ న‌న్నెందుకు నిల‌దీస్తున్నావ్ అంటాడు నందు. దానికి తుల‌సి సారీ చెబుతుంది. ఆ త‌రువాత `నీతో నిజాలు చెప్పాల‌ని.. అందుకు ధైర్యం చాల‌కే తాగి వ‌చ్చాన‌ని అంటాడు నందు. ఆ త‌రువాత తుల‌సి - నందుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర మాట‌లు చోటు చేసుకుంటాయి. అయితే లాస్య లాంటి మాయ లేడి వ‌ల‌లో ప‌డ్డాన‌ని, త‌న నుంచి కాపాడ‌మ‌ని నందు వేడుకుంటూ తుల‌సి కాళ్ల‌పై ప‌డ‌టం.. తుల‌సి .. నందుని ఓదార్చ‌డం .. చివ‌ర‌కు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వ‌డం ఈ రోజు ఎపిసోడ్‌లోని కీల‌కాంశాలు. అయితే నందు నిజంగానే తుల‌సి కోసం ఏడ్చాడా? .. నందు లాస్య‌ని వ‌దిలించుకోవాల‌ని నిజంగానే భావిస్తున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు జీ తెలుగులో ప్ర‌సారం అయ్యే `ఇంటింటి గృహ‌ల‌క్ష్మీ` ఎపిసోడ్ చూడాల్సిందే.

అది నైట్ త‌రువాతే అంటూ శ్రీ‌ముఖి రచ్చ‌

కోవిడ్ కార‌ణంగా ఓటీటీల‌కు కొత్త ఊపొచ్చింది. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కుప్పులు తెప్ప‌లుగా రియాలిటీ షోల‌తో పాటు కొత్త కొత్త సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ఇదే క్ర‌మంలో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` వ‌రుస‌గా స‌రికొత్త టాక్ షోల‌తో ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టింది. ఇటివ‌లే హీరో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో `అన్ స్టాప‌బుల్‌` ని ప్రారంభించి ఆహా అనిపించారు. తాజాగా మ‌రో షోకు తెర‌లేపారు. ఇప్ప‌టికే జెమినీ టీవీలో అన‌సూయ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `మాస్ట‌ర్ చెఫ్‌`కి ధీటుగా `ఆహా` ఓటీటీ కోసం `ఛెఫ్ మంత్ర` పేరుతో కొత్త షోకి శ్రీ‌కారం చుడుతున్నారు. ఇదే ఓటీటీలో మంచు ల‌క్ష్మి హోస్ట్‌గా `ఆహా భోజ‌నంబు` పేరుతో ఓ షోని ఇప్ప‌టికే ప్ర‌సారం చేశారు. దానికి ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. దీంతో మ‌రింత కొత్త‌గా `మాస్ట‌ర్ చెఫ్‌`కి ధీటుగా వుండాల‌ని `ఛెఫ్ మంత్ర‌`ని మొద‌లుపెట్టారు. స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేయ‌బోతున్న ఈ షోకు హోస్ట్‌గా బుల్లితెర గ్లామ‌ర్ డాల్ శ్రీ‌ముఖి వ్య‌వ‌హ‌రిస్తోంది. జెమిని టీవీలో ప్ర‌సారం అవుతున్న`మాస్ట‌ర్ చెఫ్‌`కి ఆహా `ఛెఫ్ మంత్ర‌`కున్న తేడా ఏంటంటే ఇందులో ప‌లు రుచిక‌ర‌మైన వంట‌కాల‌ని ప‌రిచ‌యం చేస్తూనే ప‌లువురు సెల‌బ్రిటీల‌తో ఈ షోని మ‌రింత క‌ల‌ర్ ఫుల్‌గా మ‌లుస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని ఆహా టీమ్ వ‌దిలింది. ఈ ప్రోమోలో శ్రీ‌ముఖి, సుహాస్‌, శ్రియా, రెజీనా సంద‌డి చేస్తున్నారు. నాకు దోష కావాలి అని శ్రియ ముద్దు ముద్దుగా అడ‌గ‌డం.. డ్రింక్స్ వున్నాయా అని రెజీనా సంద‌డి చేయ‌డం.. అవ‌న్నీ నైట్ త‌రువాతే అని శ్రీ‌ముఖి బ‌దులివ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. స్సై\సీ జాడీని త‌ల‌పై పెట్టుకుని శ్రియ స్వాతిముత్యం డ్య‌మాన్స్ చేయ‌డం.. అయ్య‌య్యో తేలుతున్నారేంటీ?.. అంటూ శ్రీ‌ముఖి అంటున్న తీరు `ఛెఫ్ మంత్ర‌` షో పై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

`కామెడీ స్టార్స్‌`లో లోబోకి ఘోర‌ అవ‌మానం!

రియాలిటీ షోల మాస్ట‌ర్ ఓంకార్ `స్టార్‌` మా` కోసం `కామెడీ స్టార్స్‌` పేరుతో కామెడీ షోని అందిస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి తాజాగా అలీ, హీరోయిన్ శ్రీ‌దేవి జ‌డ్జ్‌లుగా, శ్రీ‌ముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ కామెడీ షో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తూ న‌వ్వులు పూయిస్తోంది. ఈ ఆదివా3రం ఈ షో మ‌రింత‌గా కామెడీతో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంది. ఈ ఆదివారం ఈ షోలోకి బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫేమ్ లోబో రాబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని స్టార్ మా ఇటీవ‌లే విడుద‌ల చేసింది. ప్రోమోని బ‌ట్టి చూస్తుంటే లోబోని ఈ షోలో బ‌క‌రాని చేసిన‌ట్టుగా తెలుస్తోంది. బ‌స్సెక్కితే ఎవ్వ‌రైనా ఊరికిపోత‌రు కానీ బిగ్‌బాస్‌లో మా లోబో అన్న నిద్ర‌బోత‌డు.. అంటూ లోబోపై ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లోనే అదిరిపోయే పంచ్‌వేసి షాకిచ్చారు. ఇదే క్ర‌మంలో త‌ను హౌస్‌లోకి వెళ్ల‌డానికి ముందు ఓట్లు వేయించ‌మ‌న్న అని లోబో అన‌గానే అత‌ని క‌టౌట్ వున్న ఓ ఫొటో దాని కింద ఓ నంబ‌ర్‌ని డిప్లే చేస్తూ లోబో ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ ఫొటో కింద వున్న నంబ‌ర్ త‌న‌ది కాద‌ని ఆ నంబ‌ర్ యాంక‌ర్ ర‌విది అని లోబో ల‌బోదిబోమ‌న‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇదిలా వుంటే లోబోని ఓ వ్య‌క్తి ఇంట‌ర్వ్యూ చేస్తానంటూ కూర్చోబోట్టి తిక్క తిక్క ప్ర‌శ్న‌లు వేయ‌డం ప్ర‌హ‌స‌నంగా మారింది. `బిగ్‌బాస్‌లోకి వాళ్లు పిలిచారా?  లేక మీరు అడుక్కున్నారా? ... దున్న‌పోతు ముళ్ల‌పంది.. అంటే మీరు ఒప్పుకుంటున్నారా? .. మీకు పెళ్లైంది... ఇవ‌న్నీ మీకు గుర్తున్నాయ్ .. మ‌రి లోప‌ల ఉప‌గారితో స‌ర‌సాలు ఆడారు క‌దా అప్పుడు గుర్తు లేదా? అంటూ యాంక‌ర్ లోబోని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం  చేయ‌డం.. విసిగెత్తిపోయిన లోబో నా ఇష్టంర బ‌య్ ... అని ఫైర్ అయ్యాడు.  ఆ త‌రువాత `లోబో  బిగ్‌బాస్  హౌస్‌లోకి  న‌వ్వించ‌డానికి లోప‌లికి వెళ్లి న‌వ్వుల పాలై బ‌య‌టికి వ‌చ్చాడు? అని యాంక‌ర్ అన‌గానే `అరేయ్ ఏందిరా క్వోశ్చ‌న్‌లు ఇవీ? అంటూ యాంక‌ర్‌పైకి దాడికి వెళ్ల‌డం.. త‌న‌ని షోకి పిలిచిన భాస్క‌ర్‌కి చెప్పేసి లోబో షో నుంచి బ‌య‌టికి వెళ్లిపోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా వుండే అవ‌కాశం వుంద‌ని ప్రోమో ద్వారా హింట్ ల‌భించ‌డంతో సండే ఎపి\సోడ్ కోసం బుల్లితెర ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు కొబ్బ‌రిచిప్ప‌లా క‌నిపించిన‌ సుధీర్ నెత్తి!

  ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే డాన్స్ షో 'ఢీ' సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. ఇప్ప‌టికి 12 సీజ‌న్లు పూర్తిచేసుకొని, 13వ సీజ‌న్ న‌డుస్తోందంటేనే ఏ రేంజ్‌లో ఆ షోకు వ్యూయ‌ర్స్ నుంచి ఆద‌ర‌ణ ల‌భించిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ షోకు ప్ర‌దీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ యాంక‌రింగ్ చేస్తుండ‌గా, ప్రియ‌మ‌ణి, పూర్ణ‌, శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే బుధ‌వారం ప్ర‌సారం కానున్న ఎపిసోడ్‌లో పూర్ణ‌కు బ‌దులు సెల‌బ్రిటీ జ‌డ్జిగా డైరెక్ట‌ర్ నందినీరెడ్డి క‌నిపించ‌నున్నారు. ఈ షోలో సుధీర్ కొద్దిగా జుట్టు వ‌చ్చిన గుండుతో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. దాంతో అత‌డి త‌ల శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు కొబ్బ‌రిచిప్ప‌లా క‌నిపించింది. ఆ క‌థేమిటంటే... ఈ షోకు గుండు త‌ల‌కు ట‌వ‌ల్ చుట్టుకొని వ‌చ్చాడు సుధీర్‌. శేఖ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి "మా ఏరియాలో ద‌స‌రాకు అమ్మ‌వారిని పెడుతున్నాం. ఫుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొంచెం చందా ఉంటే వేస్తే.." అని అడిగాడు.  "నేను చందా వెయ్యాలంటే న‌న్ను ఇంప్రెస్ చెయ్యాలి. చిన్న‌ప్పుడు నేను కోతిగార‌డీ చూసేవాడ్ని. అదొక్క‌సారి చూడాల‌ని వుంది" అన్నాడు శేఖ‌ర్‌. "ఏం చేస్తాం సార్‌.. కోతి లాగా?" అంటూ కోతి చేష్ట‌లు మొద‌లుపెట్టాడు సుధీర్‌. "అమ్మా.. అయ్య‌గారికి ద‌ణ్ణం పెట్టు" అంటూ కోతిలా గెంతుతూ దండం పెట్టాడు. అత‌డి చేష్ట‌లు చేసి ప్ర‌దీప్ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాడు. "కోతికేద‌న్నా ఇవ్వాలి.. అర‌టిపండో, గిర‌టిపండో ఏదో ఒక‌టి" అన‌డిగాడు సుధీర్‌.  "కొబ్బ‌రిచిప్ప లేద‌బ్బా.. ఓ.. నీ నెత్తిమీదే ఉందిగా" అన్నాడు శేఖ‌ర్‌, సుధీర్ త‌ల‌ను చూస్తూ. ఆ త‌ర్వాత ప్రియ‌మ‌ణిని చూపిస్తూ, "ఇక్క‌డికొచ్చి అమ్మ‌ని అడుగు" అన్నాడు.  సుధీర్ త‌న‌దైన ధోర‌ణిలో "అమ్మ‌గారికి ఒక ముద్దుపెట్ట‌రా" అంటూ ఆమె ద‌గ్గ‌ర‌కు కోతిలా గెంతుతూ వెళ్లి, అంత‌లోనే "వ‌ద్దులే" అంటూ ఆగిపోయాడు. "అమ్మ‌గారు మొట్టికాయ వేస్తారు చూడు.. కొబ్బ‌రిచిప్ప మీద" అన్నాడు ప్ర‌దీప్‌. ఈ హిలేరియ‌స్ సీన్ వ‌చ్చే బుధ‌వారం ప్ర‌సార‌మ‌య్యే 'ఢీ 13' ఎపిసోడ్‌లో మ‌నం చూడొచ్చు.

'ఏం త‌న్నాల‌ని వుందా?'.. 'త‌న్ను మ‌రి'.. సిరి విష‌యంలో స‌న్నీ-ష‌ణ్ణు కొట్లాట‌!

  బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు మ‌రో తీవ్ర‌మైన గొడ‌వ‌ను చూడ‌బోతున్నాం. సిరిని అప్ప‌డ‌మైపోతావ్ అని హెచ్చ‌రించిన స‌న్నీతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడ‌మంటూ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ అన్నాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయాడు స‌న్నీ. కెప్టెన్సీ కోసం పోటీప‌డేవాళ్ల‌కు 'ట‌వ‌ర్‌లో ఉంది ప‌వ‌ర్' అనే టాస్క్‌ను ఇస్తున్న‌ట్లు బిగ్ బాస్ ప్ర‌క‌టించాడు. అందులో విజ‌యం సాధించిన వారు ఈవారం కెప్టెన్ కానున్నారు. టాస్క్‌లో కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీప‌డుతున్న‌ప్పుడు స‌న్నీని క‌ద‌ల‌కుండా గ‌ట్టిగా ప‌ట్టుకుంది సిరి. దాంతో "ప్రొటెక్ట్ చేసేవాళ్ల‌ను ప‌ట్టుకోవాలి. ఆట‌లో ఉన్న‌వాళ్ల‌ను ప‌ట్టుకోవ‌డం మేంటి?" అని ప్ర‌శ్నించాడు స‌న్నీ. "ఇది నా స్ట్రాట‌జీరా" అని జ‌వాబిచ్చింది సిరి. "గేమ్ ఆడితే వ‌చ్చి తంతా" అన్నాడు కోపంగా స‌న్నీ. "అబ్బా.." అని వ్యంగ్యంగా ఏదో అంది సిరి. "అప్ప‌డ‌మ‌యితావ్‌.. తెలుసుగా" అన్నాడు స‌న్నీ. "అయితే వెళ్లి అమ్ముకో అప్ప‌డాలు" అంటూ గెంతులు వేసింది సిరి. "అప్ప‌డ‌మైతే నిన్నే అమ్మేది" అని స‌న్నీ అంటుంటే.. మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకున్నాడు ష‌ణ్ముఖ్‌. "త‌నేమీ అన‌లేదు క‌దా" అని అత‌డికి న‌చ్చ‌చెప్ప‌బోయాడు షణ్ణు. "ఏయ్ నువ్వాగు.." అంటూ ఆవేశంగా అత‌ని మీద‌కు వ‌చ్చాడు స‌న్నీ. "నువ్వు త‌న్న‌లేవ్" అన్నాడు ష‌ణ్ణు. "ఏం త‌న్నాల‌ని ఉందా?" అన్నాడు స‌న్నీ. "త‌న్ను మ‌రి" అని రెట్టించాడు ష‌ణ్ణు. "ద‌మ్ముంటే ఫైట్ చేసుకుందాంరా. ఆడ‌పిల్ల‌ను పంపించి మాట్లాడ్డం కాదు" అన్నాడు స‌న్నీ. రెస్పెక్ట్‌తో మాట్లాడ‌మ‌న్నాడు ష‌ణ్ణు. "నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది" అన్నాడు స‌న్నీ. ష‌ణ్ణును డిఫెండ్ చేస్తూ స‌న్నీపై సిరి ఫైర్ అవ‌గా, స‌న్నీని ఆప‌డానికి ప్రియాంక ప్ర‌య‌త్నించింది. వీళ్ల గొడ‌వ ఎంత దాకా వెళ్లిందో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

వంటలక్కకి షాక్.. దారుణంగా పడిపోయిన 'కార్తీకదీపం' రేటింగ్!

బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ ఓ సంచనలం. ఏ సీరియల్ కి సాధ్యం కాని టీఆర్పీ రేటింగ్స్ ఆ సీరియల్ సొంతం. స్టార్ హీరోల సినిమాలు ఉన్నా, క్రికెట్ మ్యాచ్ లు ఉన్నా, బిగ్ షోస్ ఉన్నా 'కార్తీకదీపం' రేటింగ్ కి డోకా ఉండేది కాదు. భారీ రేటింగ్ తో ఎప్పుడూ వెలిగిపోతూ ఉండేది. అయితే అదంతా మొన్నటిదాకా. ఇప్పుడు లెక్క తప్పింది. 'కార్తీకదీపం' సీరియల్ రేటింగ్ రోజురోజుకి తగ్గిపోతుంది. 'కార్తీకదీపం' సీరియల్ కి ఉన్న క్రేజ్ మరే సీరియల్ కి లేదంటే అతిశయోక్తి కాదేమో. సోషల్ మీడియాలో సైతం డాక్టర్ బాబు, వంటలక్క అంటూ ఆ సీరియల్ గురించి చర్చ జరుగుతుంటుంది. ఇతర సీరియల్స్, షోలు 'కార్తీకదీపం' రేటింగ్ అందుకోలేక ఆయాసపడుతుంటాయి. అయితే ఇప్పుడు అవసరం లేకుండా కార్తీకదీపమే వెనక్కి వచ్చేస్తోంది.  డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడెప్పుడు కలుస్తారా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోయారు.. మోనిత జైలు కు వెళ్ళింది అనుకున్న టైంలో.. మోనిత జైలు నుంచి తిరిగొచ్చి బిడ్డకు జన్మనివ్వడం.. మళ్లీ డాక్టర్ బాబు, వంటలక్కల మధ్య గ్యాప్ రావడం జరిగిపోయింది. ఇక అక్కడి నుంచి కథని అక్కడక్కడే తిప్పి సాగదీస్తుండటంతో ప్రేక్షకులు బోర్ గా ఫీలయ్యి 'కార్తీకదీపం' సీరియల్ ని చూడటం తగ్గిస్తున్నారట. గతంలో 18-21 మధ్య రేటింగ్ సాధించిన 'కార్తీకదీపం' ఈ వారం 14-15 కి పడిపోయిందట. సాగదీత ఇలాగే కొనసాగితే రేటింగ్ మరింత పతనమయ్యే అవకాశముందని అంటున్నారు. ఇకనైనా 'కార్తీకదీపం' టీమ్ మేల్కొని కథనంలో వేగం పెంచడమో లేక కథకి ముగింపు పలకడమో చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎనిమిది సంవ‌త్స‌రాలుగా నీ కోరిక ఎందుకు తీర‌ట్లేద‌క్కా?!

  కొన్నేళ్లుగా ర‌ష్మీ గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్ జోడీకి తిరుగ‌నేదే లేదు. బుల్లితెర‌కు సంబంధించి ఆ ఇద్ద‌రిపై వ‌చ్చిన‌న్ని గాసిప్స్ మ‌రే జోడీపై రాలేదు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ యాంగిల్ న‌డుస్తోంద‌నేది అత్య‌ధికుల అభిప్రాయం. త‌మ మ‌ధ్య అలాంటిదేమీ లేద‌ని వారితో పాటు, వారి ఫ్రెండ్స్ గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రామ్‌ప్ర‌సాద్ లాంటి వాళ్లు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా, జ‌నం మాత్రం ఆ మాట‌ల్ని న‌మ్మ‌డం లేద‌నేది వాస్త‌వం. ర‌ష్మీ-సుధీర్ జోడీకి వున్న క్రేజ్‌ను అనేక ప్రోగ్రామ్స్‌లో 'జ‌బ‌ర్ద‌స్త్' షో ప్రొడ్యూస‌ర్స్ మ‌ల్లెమాట ఎంట‌ర్‌టైన్‌మెంట్ క్యాష్ చేసుకుంటూ వ‌స్తున్నారు. అందులో భాగంగా ఆ ఇద్ద‌రికీ ఓ షోలో పెళ్లి కూడా చేశారు. కాగా రేపు (న‌వంబ‌ర్ 12) ప్ర‌సారం కానున్న 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' ఎపిసోడ్‌ను కార్తీక పౌర్ణ‌మి స్పెష‌ల్‌గా రూపొందించారు. అందులో భాగంగా ఓ న‌లుగురు అమ్మాయిల‌తో క‌లిసి వ‌చ్చిన ర‌ష్మి దీపాలు వెలిగించింది. "ఈరోజు దీపాలు వెలిగిచ్చుకొని ఏది కోరుకున్నా అది పూర్త‌వుత‌ది" అని చెప్పింది. ప‌క్క‌నున్న అమ్మాయి, "మ‌రి ఎనిమిది సంవ‌త్స‌రాలుగా నీ కోరిక ఎందుకు తీర‌ట్లేద‌క్కా?" అని ఆశ్చ‌ర్యంగా ప్ర‌శ్నించింది. దాంతో షాకైన‌ట్లు ఫీలింగ్ ఇచ్చి, న‌వ్వు దాచుకోవ‌డానికి ట్రై చేసింది ర‌ష్మి. ఎనిమిదేళ్లుగా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్ జోడీగా క‌లిసి క‌నిపిస్తున్నా, నిజ జీవితంలో వారు జోడీ కాలేక‌పోయారని మ‌న‌కు తెలుసు. అయితే సుధీర్‌ను పెళ్లి చేసుకోవాల‌నే కోరిక రష్మికి వున్నా, ఆ కోరిక తీర‌ట్లేద‌నే అర్థం వ‌చ్చేలా ఆ అమ్మాయి అడిగింద‌న్న మాట‌. ఆ త‌ర్వాత‌, "ఈరోజు గుడి ద‌గ్గ‌ర చాలా మంది ఎద‌వ‌లు తిరుగుతుంటారు. ఎవ‌రికి ప‌డితే వారికి ప‌డిపోకండి. అర్థ‌మైందా?" అని చెప్పింది ర‌ష్మి. అదే అమ్మాయి, "ఫుల్ ఎక్స్‌పీరియెన్స్ మా అక్క‌కి" అంది. ఈసారి నోట మాట‌రాలేదు ర‌ష్మికి. జ‌డ్జిలు మ‌నో, రోజా న‌వ్వుల్లో మునిగిపోయారు. 

'హైపర్ ఆది'పై దాడి.. విరుచుకుపడిన జబర్దస్త్ కమెడియన్!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్స్ లో తన పంచ్ డైలాగ్స్ తో ఎంతలా నవ్విస్తాడో, అదే స్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటాడు. గతంలో తన స్కిట్స్ లో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేయడంతో పాటు.. అనాధలపై దారుణ వ్యాఖ్యలు చేయడం వంటి వాటితో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణుని ఇమిటేట్ చేసి మరోసారి వివాదానికి తెరలేపాడు. హైపర్ ఆది రీసెంట్ గా చేసిన స్కిట్ లో మంచు విష్ణుని టార్గెట్ చేశాడు. మా ఎన్నికల సమయంలో సీనియర్ యాక్టర్ నరేష్ తో విష్ణు అన్న 'లెట్ దెమ్ నో అంకుల్' అనే మాటతో పాటు, విష్ణు బాడీ ల్యాంగ్వేజ్ ను తన స్కిట్ లో ఇమిటేట్ చేశాడు ఆది. విష్ణు పేరు ప్రస్తావించక పోయినా ఇది విష్ణుని ఉద్దేశించి చేసినది అనే ఆడియన్స్ కి అర్థమైంది. ఈ క్రమంలో మంచు అభిమానులు ఆదిని టార్గెట్ చేశారు. అంతేకాదు, ఆది దొరికితే చితకబాదడం కోసం విష్ణు అభిమానులు వెతుకున్నారని, భయంతో ఆది అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఆదిపై దాడి జరిగిందని కూడా వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై స్పందించిన ఆది.. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. దాడి వార్తలపై జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా స్పందించాడు. తన గురించి ఎవరో వెతుకుతున్నారని, తనపై దాడి జరిగిందని ఇలా రకరకాలుగా కొన్ని వెబ్ సైట్స్ ఫేక్ న్యూస్ రాస్తున్నాయని మండిపడ్డాడు. డబ్బులు కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ రాయకండిరా, డబ్బులు కావాలంటే నన్ను అడగండి నేనిస్తా అంటూ ఫైర్ అయ్యాడు. అసలు మీ లాంటి వాళ్లని శాంతి స్వరూప్ కి పట్టించాలి అంటూ హైపర్ ఆది తనదైన శైలిలో స్పందించాడు.

గంగవ్వ కల నెరవేరింది.. ఘనంగా గృహప్రవేశ వేడుక.. కొత్త ఇల్లు ఎంత బాగుందో!

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి ఆమె గృహప్రవేశం చేసింది. ప్రతిభకు వయస్సుతో సంబంధం లేదని రుజువు చేసింది గంగవ్వ. ఊరిలోని పిల్లలు, యువకులతో కలిసి ఆమె చేసిన కామెడీ వీడియోలు ఆమెకి పాపులారిటీని తీసుకొచ్చాయి. ఆ తర్వాత బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకున్న ఆమె మరింత పాపులర్ అయింది. అయితే అనారోగ్యం కారణంగా ఐదు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. అయితే ఆమె సొంతింటి కల గురించి తెలుసుకున్న నాగార్జున బిగ్ బాస్ లో ఆమె గెలుచుకున్న డబ్బులతో పాటు సొంతంగా తాను కూడా ఇంటి నిర్మాణం కోసం ఆర్థికంగా సాయం చేశాడు. అలా ఆమె బిగ్ బాస్ నుంచి బయటకి కొన్నాళ్ళకి మొదలైన ఇంటి నిర్మాణం ఇటీవల పూర్తయింది. దీంతో తాజాగా గంగవ్వ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బిగ్ బాస్ 4  రన్నరప్ కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్, సావిత్రి(శివ జ్యోతి), మై విలేజ్‌ షో టీం సభ్యులు, తదితరులు గంగవ్వ గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు. గంగవ్వ కొత్త ఇంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

క‌త్తితో త‌న‌ను తాను గాయ‌ప‌ర్చుకున్న కంటెస్టెంట్‌.. బిగ్ బాస్ హౌస్‌ నుంచి ఔట్‌!

  బిగ్ బాస్ హౌస్ అంటేనే హై-స్పీడ్‌ డ్రామా. అది ఏ భాష‌లో షో అయినా కంటెస్టెంట్ల మ‌ధ్య హై వోల్టేజ్ డ్రామా న‌డ‌వాల్సిందే. కోపాలు, తాపాలు, ప్రేమ‌లు, అల‌క‌లు, అప్పుడ‌ప్పుడు కొట్టుకోవ‌డాలు.. ఇలా వీక్ష‌కుల‌కు కావాల్సినంత మ‌సాలాను ఈ రియాల్టీ షో అందిస్తోంది. లేటెస్ట్‌గా బిగ్ బాస్ 15 (హిందీ) హౌస్ నుంచి కంటెస్టెంట్ అఫ్సానా ఖాన్ త‌న చ‌ర్య‌తో వ్యూయ‌ర్స్‌ను షాక్‌కు గురిచేసింది. 'విఐపి జోన్' టాస్క్ సంద‌ర్భంగా తోటి హౌస్‌మేట్స్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆమె, ఆ త‌ర్వాత కిచెన్ ఏరియాలోనూ గొడ‌వ‌ప‌డి, స‌హ‌నం కోల్పోయి ద‌గ్గ‌ర్లోని క‌త్తి తీసుకొని, త‌న‌ను తాను కోసుకుంటాన‌ని బెదిరించింది.  త‌ను చేసిన ఈ అనుచిత చ‌ర్య‌కు ఆమె త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని బిగ్ బాస్ ఆమెను ఆదేశించాడు.  విఐపి టాస్క్‌లో త‌న క్లోజ్ ఫ్రెండ్స్ ఉమ‌ర్ రియాజ్‌, క‌ర‌ణ్ కుంద్రా త‌న‌కు స‌పోర్ట్‌గా నిలుస్తార‌ని ఆశించిన అఫ్సానా, అలా జ‌ర‌గ‌క‌పోయేస‌రికి బాగా అప్సెట్ అయ్యింది. వాళ్లు త‌న‌ను మోసం చేశార‌న్న‌ట్లు బాధ‌ప‌డింది. ఆందోళ‌న‌కు గురైంది. క‌త్తితో త‌న‌ను తాను గాయ‌ప‌ర‌చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. దీంతో కంగారుప‌డిన నిర్వాహ‌కులు హౌస్ లోప‌ల‌కు ఒక మెడిక‌ల్ టీమ్‌ను పంపారు. ఆ త‌ర్వాత ఆమెను హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. హౌస్‌లో 'విఐపి మెంబ‌ర్' అయిన‌వాళ్ల‌కే ఫైన‌ల్ దాకా ఉండే అవ‌కాశం ల‌భిస్తుంది. దీని కోసం కంటెస్టెంట్ల‌కు విఐపి జోన్ టాస్క్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంలోనే అఫ్సానా ప్యానిక్ అయింది.