టీచర్లు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలంటూ జీవో.. వెంటనే ఉపసంహరణ

ముందు వెనుకలు ఆలోచించకుండా మాట అనేయడం, వెనక్కు తీసుకోవడం తెలంగాణ విద్యాశాఖకు, ఆ శాఖ మంత్రికి ఒక అలవాటుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. నిన్న గాక మొన్న బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనపై అలవోకగా ఒక మాట అనేసి ఆనక తీరిగ్గా వెనక్కు తీసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు చాలా సిల్లీ సమస్యలపై ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించిన సబితా ఇంద్రారెడ్డి ఆ తరువాత ఆ వ్యాఖ్యను వెనక్కు తీసుకున్నారు. మంత్రిగారి బాటలోనే విద్యాశాఖ కూడా ఇంటర్ పరీక్షా ఫలితాల విషయంలో రోజుకో మాట చెబుతూ ఫలితాల వెల్లడిని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నది. తాజాగా విద్యాశాఖ ఒక సంచలన జీవో జారీ చేసి.. ఆ వెంటనే నాలుక కరుచుకుని ఉపసంహరించుకుంది. విద్యాశాఖ పరిధిలో పని చేసే టీచర్లు అందరూ తమ వార్షిక ఆదాయాన్ని ప్రకటించాలంటూ పాఠశాల విద్యాశాఖ జీవో ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా, విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని , స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొంటూ  ఈనెల 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.   ప్రభుత్వం ఈ జీవో విడుదల చేయడానికి చెప్పిన కారణం ఉపాధ్యాయులు రిజిస్టర్లో సంతకం చేసి విధులు ఎగ్గొట్టి ప్రైవేటు వ్యాపారాలు, దందాలూ చేసుకుంటున్నారని. దీనిపై పెద్ద దుమారమే రేగింది.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.. ఉపాధ్యాయులను టార్గెట్‌ చేసి ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి.   దీంతో, వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. విజిలెన్స్‌ విభాగం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశామనీ, వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

మరణించిన మన వారి మాట‌లను వినిపిస్తుంది.. అలెక్సా!

రేడియోలో పాట‌లు విన‌డం కాలం పోయి అలెక్సాలో విన‌డం వ‌చ్చేసింది. కాలేజీ నుంచి ఇంటికి రాగానే కాస్తంత టిఫిన్ అయినా తిన్నా తిన‌క‌పోయినా పిల్ల‌లు మాత్రం బెడ్రూమ్ కి వెళ్లి ఏదో స్నేహితుల‌తో మాట్లాడిన‌ట్టు, ఆర్డ‌ర్ చేసిన‌ట్టు అలెక్సా అనే బుజ్జి ముండ‌ని అడ‌గ్గానే ఆ పాట వ‌చ్చేస్తుంది. ఇపుడు దీనికి కొత్త టెక్ రూపం వ‌చ్చింది. అదేమంటే, సెల‌బ్ర‌టీల వాయిస్ మిమిక్రీ చేసి వినిపించ‌డం. అయితే దీనికి డ‌జ‌న్ల గంట‌ల‌పాటు ఆయా వ్య‌క్తుల ఆడియోను రికార్డు చేయ‌వ‌ల‌సి వుంటుంది.   చిరంజీవి డైలాగ్ .. మొక్కే క‌దా అని పీకేస్తే.. పీక కోస్తా..! అనేది వినాల‌నుకుంటే ఆ డైలాగ్ ఆడియోను రికార్డు చేసి వుండాలి. ఇలా చాలా మంది సెలెబ్స్ వాయిస్ రికార్డు చేసి మ‌రీ మార్కెట్‌లోకి తేబోతున్నారు. ఖ‌రీదు మాట ఎలా వున్నా, మీకు న‌చ్చిన హీరో, హీరోయిన్‌, లేదా రాజ‌కీయ నాయ‌కుడు, గొప్ప గాయ‌కుల వాయిస్ విన‌డానికి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. పాట బ‌దులు మాట  వింటారు, మీతోనే మాట్లాడుతున్న‌ట్టు. ఇదో గొప్ప అనుభూతి కాగ‌ల‌దు.  ఇలాంటి  గొప్ప సౌక‌ర్యం క‌ల్పించే అలెక్సా అని పిలిచే ఆ వ‌స్తువు  తీరా చూస్తే, అర‌చేతంతే వుంటుంది! కాబోతే రెండు మూడు గంట‌లు చార్జ్ చేయాల్సి వుంటుంది. ఇంత‌వ‌ర‌కూ బాగానే వుంది. ఇప్పుడు దీనికే మ‌రో విశేషం కూడా జోడిస్తున్నార‌ట‌. అదేమంటే చ‌నిపోయిన మీ పెద్ద‌వారి గొంతు కూడా మ‌ళ్లీ విన‌వ‌చ్చు. అంటే అమ్మ‌మ్మ‌, తాత‌ల వాయిస్ వినాల‌నుకునేవారు, గుర్తుంచు కోవాల‌నుకునేవారు, వారి వాయిస్‌ను అలెక్సా మిమిక్రీ ప‌రిక‌రం ద్వారా విన‌చ్చు! ఇది నిజంగా అద్బుతం. అమెజాన్ వారి అలెక్సాకు భ‌విష్య‌త్తులో ఫాన్స్ సంఖ్య బాగా పెరుగుతుంది. నిజంగానే పూర్వీకుల వాయిస్ వినిపించే సౌక‌ర్యంతో వ‌స్తే మాత్రం అలెక్సా ఇంటి స‌భ్యురాలు అవుతుంది. ఇప్ప‌టికే అమెజాన్ దాదాపు దేశంలో అంద‌రి ఇళ్లల్లోనూ స‌భ్య‌త్వం తీసేసుకుంది!  ఇలా క‌రోనా మ‌హ‌మ్మ‌రి విజృంభించిన స‌మయంలో మ‌న‌కు దూర‌మ‌యిన మ‌న‌వారితో మ‌ళ్లీ సంబంధాలు ఏర్ప‌ర‌చుకోవ‌డానికి అంటే  వారి జ్ఞాప‌కాల‌తో కొంత స‌మ‌యం గ‌డ‌ప‌డానికి అలెక్సా వాయిస్ మిమిక్రీ ప‌రిక‌రం ఎంతో మేలు చేయ‌నుంది. అంటే కోల్పోయిన‌వారికి, మ‌న‌కి మ‌ధ్య విచిత్ర‌మైన వార‌ధిగా మార‌నుంది అని అమెజాన్ అలెక్సా ఏఐ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్. శాస్త్ర‌వేత్త‌ల విభాగం అధిప‌తి డాక్ట‌ర్ రోహిత్ ప్ర‌సాద్ తెలియ‌శారు. ఇది నిజంగా హ‌ర్ష‌ణీయం!  

ఆస్ప‌త్రిలో ఏడ్చినందుకు ఆదనంగా రూ. 3000 చెల్లించు!

దొంగ‌కి జ‌రిమానా వేయ‌డం విన్నాం. క‌రెంటు బిల్లు అద‌న‌పు ఛార్జీలు క‌ట్ట‌మ‌ని తాకీదు నిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే.. ఫోన్ కు చలానా కట్టాలని మెసేజ్ వచ్చేస్తుంది. కానీ  ఒక  డాక్ట‌ర్  త‌న పేషెంటుకి అదనంగా మూడు వేలు క‌ట్ట‌మ‌ని బిల్లు ఇచ్చాడు. ఎవ‌ర‌న్నా రోగుల‌ను ప‌రీక్షించి ఫీజు కింద డాక్టర్లు ఎంతో కొంత డ‌బ్బులు ఫీజుగా తీసుకోవ‌డం  సహజం. కానీ  చికిత్స జ‌రిగే స‌మ‌యంలో భ‌య‌ప‌డో, లేదా ఏదో ఆందోళ‌న‌కు గుర‌య్యో ఏడిచిన పేషెంటుని అదనంగా మూడు వేల రూపాయ‌ల  బిల్లు క‌ట్ట‌మ‌న్నాడు  ఒక డాక్ట‌ర్‌! విన‌డానికి  చాలా చిత్రంగా వుంది గ‌దూ?  కానీ ఇది నిజంగా నిజ‌ం. ఈ సంఘటన న్యూయార్క్‌లో జ‌రిగింది.  న్యూయార్క్ లో ఒక మ‌హిళ గ‌త కొద్ది రోజులుగా ఆరోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో స్థానికంగా వున్న ఆసుప‌త్రికి వెళ్లి డాక్ట‌ర్‌ని సంప్ర‌దించింది. ఆమెకు చికిత్స చేయాల‌ని డాక్ట‌ర్లు నిర్ధారించేరు. అంత‌వ‌ర‌కూ బాగానే వుంది. కానీ చికిత్స స‌మ‌యంలో స‌ద‌రు మ‌హిళ తీవ్ర భావోద్వేగానికి గుర‌యింది. కంట త‌డి పెట్టింది.  భయంతోనో, లేక తట్టుకోలేని నొప్పితోనో ఆమె చికిత్స సమయంలో బాధ‌తో ఏడ్చేసింది.  చాలామందికి డాక్ట‌ర్ని లేదా ఆస్ప‌త్రి వాతావ‌ర‌ణం చూడ‌గానే భావోద్వేగానికి గుర‌యి ఏడుపు వ‌స్తుంది. అలాగే  ఆ  పెద్దామె ఏడ్చేసింది. డాక్ట‌ర్ ఆమె ఏడుపు విని కోప‌గించుకున్నాడు. చికిత్స చేస్తుంటే ఏడిస్తే ఎలా అని ఆమె మీద విసుక్కున్నాడు. కానీ ఆస్ప‌త్రి వారు ఆమె కి చివ‌ర‌గా బిల్లు ఇచ్చిన‌పుడూ ఆమెకు ఏడవక తప్పలేదు.   ఎందుకంటే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర  అలా ఏడ్చినం దుకు మూడు వేల రూపాయ‌లు అదనంగా కట్టమని ఆ బిల్లులో.  చేసేదేమీ లేక ఆ మొత్తాన్ని చెల్లించేసింది. తాజాగా ఆ రిసిప్ట్‌ను ఆమె సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది వెంటనే వైరల్ అయిపోయందిజ దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.  

సర్కారు వారి పాట!.. ఎకరా పది కోట్లు.. అమరావతి భూముల విక్రయానికి జీవో!

మొండివాడు రాజుకంటే బలవంతుడు. పిచ్చోడి చేతిలో రాయి వంటి సామెతలన్నీ వరుసపెట్టి గుర్తుకు వచ్చేలా జగన్ పాలన ఉంది. అమరావతే ఏపీ రాజధాని దానికి మా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తోంది అంటూ విపక్ష నేతగా నిండు అసెంబ్లీలో ప్రకటించిన జగన్ అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం చేశారు. అమరావతి పురోగతిని, అభివృద్ధిని పాతాళంలోకి పాతేశారు. ఆయన మనసు తెలుసుకున్న వైసీపీ నేతలు అమరావతిని శ్మశానం అంటే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి పనికిరాదన్నారు. వరదలు వస్తే మునిగిపోతుందన్నారు. ఎన్నెన్నో చెప్పారు. మూడు రాజధానులన్నారు. అమరావతి కోసం.. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా విధాలుగా వేధించారు. వెరసి ఈ మూడేళ్లలో అమరావతిలో ఒక్క పని చేపట్టలేదు. జరుగుతున్న పనులను ఆపేశారు. అమరావతి కోసం చారిత్రక పోరాటం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎకసెక్కాలాడారు. వారిపై కేసులు పెట్టారు. ఇక ఇప్పుడు రాజధాని అభివృద్ధి కోసం నిధుల సేకరణ అంటూ అమరావతి భూముల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అభివృద్ధిని అన్ని విధాలుగా అణగదొక్కేసిన జగన్ సర్కార్ మూడేళ్ల తరువాత అభివృద్ధి కోసమంటూ రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే అవి నిరాకరించాయి. దీంతో ప్రభుత్వం కన్ను అమరావతి భూములపై పడింది. దీంతో వీటి అమ్మకానికి రెడీ అయిపోతోంది. ఈ మేరకు ఎకరాకు రూ.10 కోట్లు ధర నిర్ణయించి సర్కారు వారి వేలం పాటకు రెడి అయిపోతోంది జగన్ ప్రభుత్వం.  మొత్తం 600 ఎకరాల విక్రయానికి ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తొలి విడతలో 248.34 ఎకరాల విక్రయానికి రెడీ అయిపోయింది. జగన్ సర్కార్ విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న భూములన్నీ గత ప్రభుత్వం వివిధ విద్యా సంస్థలకు కేటాయించినవే. తొలి విడతలో విక్రయానికి సిద్ధం చేసిన భూములలో బీఆర్ షెట్టీ మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన 148 ఎకరాలు ఉన్నాయి. ఆయా సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నిటినీ అధికారంలోకి రాగానే జగన్ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడేమో కేటాయించిన భూములలో సంస్థలు ప్రారంభించేందుకు ఆయా సంస్థలు ముందుకు రాని కారణంగా కేటాయింపులు రద్దు చేసి భూములను విక్రయిస్తున్నామంటూ చెబుతోంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థల పెట్టుబడులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించి, ఇప్పుడేమో ఆదాయం కోసం వాటికి కేటాయించిన స్థలాలను విక్రయించడానికి సిద్ధపడిపోయింది జగన్ సర్కార్. గత ప్రభుత్వంలోనే ఆయా సంస్థలకు భూముల కేటాయింపు జరిగింది. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని అభివృద్ధి చేసి ఆ తరువాత మిగులు భూములను విక్రయిస్తే లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని ప్రకటించారు. జగన్ ప్రభుత్వమేమో అభివృద్ధిని విస్మరించి 2,480 కోట్ల నామ మాత్రపు ధరకు తొలి విడతలో దాదాపు 250 ఎకరాల భూముల విక్రయానికి సిద్ధమైపోయింది. అయితే భూముల విక్రయానికి రైతులు అంగీకరిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రైతులు న్యాయపోరాటంలో విజయం సాధించినా ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేస్తుందన్న విశ్వాసం లేక ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధుల సేకరణ అంటూ భూముల విక్రయానికి తెగబడితో మరో సారి కోర్టుకు వెళ్లడం ఖాయమని రైతులు అంటున్నారు. ముందుగా ఒప్పందం ప్రకారం తమకు అభివృద్థి చేసిన భూములు అప్పగించిన తరువాతనే ప్రభుత్వం భూ విక్రయం చేయాలని వారు పట్టుబడుతున్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వం ముందుకు వెళితే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. అయినా జగన్ సర్కార్ మాత్రం మొండిగా ముందుకే వెళుతోంది. సర్కార్ వారి వేలం పాట ఖాయమని చెబుతోంది. 

అధికార అహంతో ముందుకెళ్లే జనం వాతలు పెడతారు.. కోటంరెడ్డి

అధికారం తలకెక్కితే ఏం జరుగుతుందో మూడేళ్ల తరువాత ఆ వైసీపీ ఎమ్మెల్యేకు అర్థమైంది. తనకొక్కడికే అర్ధమైతే చాలదనుకున్నారో ఏమో సొంత పార్టీ నేతలకే ఆయన కొంచం జాగ్రత్తగా ఉండండంటూ హెచ్చరిక లాంటి సూచన చేశారు. తన మాటలు పట్టించుకోకుంటే ముందు ముందు కష్టాలు తప్పవనీ పేర్కొన్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీ నేతలనూ, కార్యకర్తలనే కాదు, విపక్షాలను, చివరికి పరిశీలకులనూ కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. జనం మాత్రం గడపగడపకూ మన ప్రభుత్వంలో తగిలిన నిరసన సెగలతో ఆయనకు దిమ్మతిరిగి బొమ్మ కనపడి ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలో ఇప్పుడు రాజకీయ హీట్ పీక్స్ లో ఉంది. అధికార విపక్షాల మధ్య  రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండే విమర్శల స్థాయి ఎప్పుడో దాటి పోయింది. అధికారంలో ఉన్న ధీమాతో వైసీపీ తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దాడులు సాగిస్తోంది. టీడీపీ నేతల ఇళ్లను కూల్చివేయడానికి సైతం సిద్ధపడుతోంది. ఇటీవలి కాలం వరకూ వైసీపీ ఆగడాలను మౌనంగా భరించిన టీడీపీ.. ఒంగోలులో మహానాడు విజయవంతం అయిన తరువాత నుంచి అధికార పార్టీతో సై అంటే సై అంటూ నిలబడుతోంది. అధికార పార్టీ నేతలు విపక్ష నేతలను వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరులో శుక్రవారం జరిగిన వైసీపీ నెల్లూరు రూరల్ ప్లీనరీ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారియి. సోంత పార్టీ నేతలనే షాక్ కు గురి చేశాయి. వేదికపై ఉన్న మంత్రి కాకాని సమక్షంలోనే కోటం రెడ్డి విపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగానే చూడాలి తప్ప శత్రువులుగా కాదని కుండబద్దలు కొట్టినట్లు చేశారు. అధికార ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే జనం పెట్టాల్సిన చోట వాత పెడతారని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నాయకలు, కార్యకర్తలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వేధింపులకు పాల్పడవద్దనీ, ఇబ్బందులు పెట్టవద్దనీ వైసీపీ నేతలకు ఆయన హెచ్చరిక లాంటి సూచన చేశారు.  అధికార పార్టీ నేతలు, కార్యకర్తలూ అందరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. 

తాత‌ గారికి అమ్మ‌మ్మ భ‌ర‌ణం!

వాళ్లిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. వారి ఇద్ద‌రి కుమార్తెల‌కూ పెళ్లిళ్ల‌యి పిల్ల‌ల‌తో మ‌రో చోట‌ హాయిగానే వున్నారు. పెద్దాయ‌న‌కి 83, ఆమెకి 78 ఏళ్లు. ఆయ‌న‌కు షుగ‌ర్‌, గుండె సంబంధిత స‌మ‌స్య‌. ఆమెకు షుగ‌రు. వీరిద్ద‌రికీ 1964లో పెళ్ల‌యింది. వీరిది పుణే. ఆయ‌న  ఒక  విద్యా సంస్థను న‌డుపుతుండేవాడు. ఆ సంస్థ‌కు డైరెక్ట‌ర్‌గా ఆయ‌న భార్య వుండేది. చాలా కాలం ఎంతో చ‌క్క‌గా న‌లుగురికి ఆద‌ర్శ ప్రాయంగానూ జీవించారు. ఇద్ద‌రూ వృద్ధుల‌యిన త‌ర్వాత‌నే అస‌లు గొడ‌వంతా వ‌చ్చి ప‌డింది. వీరి మ‌ధ్య‌ హ‌ఠాత్తుగా చిన్న‌పాటి గొడ‌వ‌లు వ‌చ్చి అవి చిలికి చిలికి గాలివానగా మారి ఏకంగా కోర్టు దాకా వెళ్లారు. త‌న‌ను ఆమె బొత్తిగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌నను బాగా చూసుకోవ‌డం లేద‌ని  ఆ పెద్దాయ‌న కంప్ల‌యింట్‌. త‌న‌ను తెగ వేధిస్తోంద‌ని కోర్టువారిని ఆశ్ర‌యించాడు. వ‌య‌సులో బాగా పెద్ద‌వాడ‌యిన భ‌ర్త‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన ఆమె చాలా నిర్ల‌క్ష్యంగా చూస్తోందిట‌. ఏకంగా ఆయ‌న్ను ఆ వ‌య‌సులో ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్ల‌గొ్ట్టాల‌ని తెగ ప్ర‌య‌త్నించింది. ఇలా గొడ‌వ‌లు పెరిగి 2019లో ఇద్ద‌రూ విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఆ ద‌ర‌ఖాస్తు వివ‌రాలు తెలుసుకుని జ‌డ్జి తెగ న‌వ్వుకున్నారు. అస‌లు సంగ‌తి క‌నుక్కుం దామ‌నుకుని ఆయ‌నే స్వ‌యంగా ఈ పెద్ద‌వాళ్లున్న ఇంటికి వెళ్లారు. పూర్వాప‌రాలు తెలుసుకున్నారు. వీళ్లు క‌లిసి వుండే అవ‌కాశాలు త‌క్కువేన‌ని గ్ర‌హించారు.  కానీ ఇంత పెద్ద వ‌య‌సులో ఆమెకి త‌న భ‌ర్త‌ను హింసించాల‌ని ఎలా అనిపించిందో న్యాయ మూర్తిగారికీ బోధ‌ప‌డ‌లేదు. చాలాకాలం ఎంతో అన్యోన్యంగా వున్న ఈ దంప‌తులు ఇప్పుడు అదీ కృష్ణా.. రామా అనుకుంటూ కాలం వెళ్ల‌దీయాల్సిన స‌మ‌యంలో విడాకులు అడ‌గ‌డ‌మేమిటో ఎవ్వ‌రికీ అర్ధంకాలేదు, పైగా న‌వ్వుకుంటున్నారు. మొత్తానికి ఈ కేసు పూర్వాప‌రాల మీద చ‌ర్చించిన మీద‌ట న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పే ఇచ్చింది. అదేమ‌య్యా అంటే.. భ‌ర్త‌కు ప్ర‌తినెలా రూ.25 వేలు భరణం ఇవ్వాలంటూ తీర్పు నిచ్చింది. భ‌ర్త‌కు భార్య ఇంత పెద్ద మొత్తంలో భ‌ర‌ణం ఇవ్వాల‌ని ఆదేశించ‌డం రాష్ట్రంలో ఇదే మొద‌టి కేసు అని న్యాయ‌వాది అన్నారు.   తీర్పుకి ముందు ఆ పెద్దాయ‌న అభిప్రాయాన్ని అడిగితే .. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేని సమయంలో తాను బాగా చూసుకున్నానని, ఆరోగ్యం నయమయ్యాక తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అస‌లు ఇలాంటి కేసు రాష్ట్రంలోనే మొద‌టిది అని మరాఠీలు అనుకుంటున్నారు.  భార్య సంపా దిస్తూ.. అదే క్రమంలో భర్తకు ఆదాయ వనరు లేకపోతే, గొడవలు జరిగిన క్రమంలో భర్త కూడా హిందూ వివాహ చట్టం ప్రకారం భరణం కోసం దావా వేయవచ్చని బ‌హుశా ఇప్పుడు అంద‌రికీ తెలుస్తుందేమో!   

రేవంత్ ఒంటరి పోరాటం?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్’లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యంలో, ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. నిజానికి, రాష్ట్ర విభజన జరిగితే ఏపీలో ఏమి జరుగుతుందో కాంగ్రెస్ నాయకత్వానికి ముందే తెలుసు. అయినా, భారీమూల్యం తప్పదని తెలిసినా,తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి, ప్రధానంగా యువకుల ఆత్మ బలిదనాలను నిరోధించేందుకు, కాంగ్రెస్ అధ్యక్షురాలు  సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించారు. ఒక విధంగా ఆ రోజున ఆమె చాలా  ధైర్యంగా  సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అయినా, ఆరు పదుల తమ ఆకాంక్షను నెరవేర్చినా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. తెలంగాణ యిచ్చింది, కాంగ్రెస్ పార్టీనే అయినా, తెచ్చిన తెరాస (?) కే ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమాన్ని  ముందుండి నడిపించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.  ఇక అక్కడి నుంచి కుటుంబ సామ్రజ్య స్థాపనపై దృషి పెట్టిన కేసీఆర్, రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం పైనే దృష్టిని కేంద్రీకరించారు. రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ పార్టీని గట్టిగా దెబ్బ తీశారు. తెలంగాణ ఇస్తే, తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాటిచ్చిన కేసీఆర్, తెరాసను కాంగ్రెస్’లో విలీనం చేయలేదు కానీ, కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం’ అయితే చేశారు. సామదానదండోపాయాలు ప్రయోగింఛి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాస లోకి తోలుకు పోయారు. ఒకరు ఇద్దరు కాదు, మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలను గులాబీ గూటికి తరలించారు. చివరకు, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కుడా దక్కకుండా చేశారు.  ఒక విధంగా కాంగ్రెస్ కథకు ముగింపు పలికారు. అయితే, అనూహ్యంగా, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడంతో, కేసీఆర్ గేమ్ ప్లాన్’ కు బ్రేకులు పడ్డాయి. పడిలేచిన కెరటంలా, కాంగ్రెస్ పార్టీ ఎగిసి పడింది కేసీఆర్’కు సవాలు విసురుతోంది. అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బతికించారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆందోళనలు చేపట్టారు. రేవంత్ రెడ్డి శ్రమ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంది. తెరాసకు ప్రత్యాన్మాయంగా గుర్తింపు పొందే స్థాయికి ఎదిగింది.  ప్రజల్లోనే కాదు, కాంగ్రెస్ పనైపోయిందని ఇతర పార్టీలలోకి వెళ్ళిన నాయకులు, అధికార తెరాస పార్టీ నేతలు కూడా ఇప్పడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే, రేవంత్  రెడ్డి పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు శక్తికి మించి పనిచేస్తుంటే, ఇతర  కీలక నేతలు కొందరు,  పార్టీని నడిపించే బాధ్యత తమకు లేదన్నట్లు వ్యహరిస్తున్నారు.  మరో వంక పనిగట్టుకుని కొదంరు నేతలు అంత‌ర్గ‌త కుమ్ములాటాలు తెచ్చి చోద్యం చూస్తున్నారు.దీంతో రాష్ట్రంలో కాంగెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా త‌యారైందనే మాట రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. అందుకే పార్టీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. పదేళ్ళ తర్వాత అందివచ్చిన అవకాశం చేజారి పోతుందేమో అనే ఆందోళన పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది  తాజాగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మళ్లీ రచ్చకెక్కింది. రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండాలో రచ్చబండ రచ్చరచ్చగా మారింది. మరోసారి ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ  నేత సుభాష్ రెడ్డి,  జ‌హిరాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మ‌ద‌న్ మోహన్ రావు వర్గీయులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. అయితే ఇది ఇప్పుడే పుట్టిన సమస్య కాదు. ఈ ఒకక్ జిల్లా సమస్య మాత్రమే కాదు.  ఈ ఇద్దరి సమస్య మాత్రమే కాదు. ఇదొక ఉదాహరణ మాత్రమే.  చాలా వరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పాత ఉత్సాహంతో పాటుగా పాత కక్షలు, ముఠా కుమ్ములాటలు కూడా పైకొస్తున్నాయి. ఈ అన్నిటి కంటే, రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గం స్థాయి వరకు తెరాస కోవర్టుల వలన సమస్యలు తప్పడం లేదని,పార్టీ నాయకులు కొందరు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక విషయంలో తెరాస కోవర్టులు చక్రం తిప్పే ప్రమాదం ఉందని, గతంలోనూ అదే జరిగిందని పార్టీ నాయకులు అంటున్నారు. ఒకప్పుడు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని పరిష్కారం చూపేది, ఇప్పడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని, అందుకే రేవంత్ రెడ్డి మీద భారం ఎక్కువ పడుతోందని అంటున్నారు. ఒక విధంగా చూస్తే, ఇటు రాష్ట్ర నేతల నుంచి సహకారం లేక అటు కేంద్ర నాయకత్వం, ‘సొంత’ సమస్యల చట్రంలోంచి బయట పడే పరిస్థితి లేక  రేవంత్ రెడ్డి  ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదని అంటున్నారు.

పరీక్ష పాసైన వాళ్లకే ప్రొబేషన్!.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇదేమంత హ్యాపీ న్యూస్ కాదని గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత  పరీక్ష నిర్వహించి మరీ లక్షా 17వేల మందిని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా నియమించింది. నియామకం సమయంలో వారిని అప్రెంటిస్ ఉద్యోగులుగా పేర్కొంటూ రెండేళ్ల పాటు రూ.15వేల వేతనానికి పని చేయాలని పేర్కొంది. ఆ తరువాత అందరికీ ప్రొబేషన్ ఇస్తామని పేర్కొంది. అయితే ఇప్పుడు మాట మార్చి ప్రభుత్వం నిర్వహించిన డిపార్ట్ మెంట్ పరీక్ష లో పాసైన వారు మాత్రమే ప్రొబేషన్ కు అర్హులంటూ షరతు పెట్టింది. ప్రభుత్వం నిర్వహించిన డిపార్ట్ మెంట్ పరీక్షలో కేవలం 56 వేల మంది మాత్రమే పాసయ్యారంటూ మిగిలిన వారికి ప్రోబేషన్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కు ఆమోదముద్ర వేసినప్పటికీ వారిలో దాదాపు సగం మందికి పైగా ప్రొబేషన్ కు అర్హత లేని వారే కావడంతో వారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రొబేషన్ ఇచ్చిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పే స్కేలును ఖరారు చేసిన జగన్ వార్డు సచివాలయ ఉద్యోగులకు పేస్కేలును 23, 120 నుంచి 74 వేల 770 రూపాయలకు, ఇతర సచివాలయ ఉద్యోగులకు 22, 460 నుంచి 72, 810 రూపాయలయకు అటు సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్‌ను ఖ‌రారు చేస్తూ కూడా ప్రభుత్వం మ‌రో కీల‌క నిర్ణయం తీసుకుంది పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీల పే స్కేల్‌ను రూ.23,120 నుంచి రూ.74,770కు, ఇతర సచివాలయ ఉద్యోగుల పే స్కేల్‌ను రూ.22,460 నుంచి రూ.72,810 పెంచుతూ  ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రోబేషన్ దక్కని సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జగన్ సర్కార్ విభజించి పాలించు అన్న విధానాన్ని సచివాలయ ఉద్యోగుల విషయంలో అవలంబించి వారి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. 

జగన్ కూల్చివేతలకు మూడేళ్లు.. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఫైర్

ఏపీలో జగన్ సర్కార్ కూల్చివేతల పర్వానికి నేటితో మూడేళ్లు నిండాయని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. జగన్ అధికారంలోనికి వచ్చిన తరువాత చేసిన మొదటి పని ప్రజా వేదిక కూల్చివేత అని పేర్కొన్న ఆయన దానితో మొదలైన కూల్చివేతల పర్వం ఈ మూడేళ్లుగా జగన్ ఒక ఉద్యమంలా చేశారనీ, ఆయన కూల్చివేతలన్నీ ప్రజలకు ఉపయోగపడేవేననీ అన్నారు. అన్న క్యాంటిన్లే, తెలుగుదేశం కార్యాలయం ఇలా చెప్పుకుంటూ పోతే వాటి లెక్క అలా పెరిగిపోతూనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే తన సైకో పాలన ఎలా ఉంటుందో తెలియజెప్పారనీ.. ఈ తరువాత ఈ మూడేళ్ల కాలంలో వ్యవస్థలను కూల్చేశారు. వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను కూల్చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుప్ప కూల్చేశారు, అభివృద్ధిని కూల్చేశారని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, దళితుల గూడును, యువత భవితనున కూల్చేసిన జగన్ ఆఖరికి ప్రజారాజథాని అమరావతిని, రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం పురోగతిని కూడా కూల్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. కూల్చివేతలు వినా జగన్ ఈ మూడేళ్లలో నిర్మించినది శూన్యం. కూల్చడం తేలికే.. నిర్మాణమే కష్టం ఈ విషయాన్ని జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. లేకుంటే వచ్చే ఎన్నికలలో జనం ఆయన ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అని చంద్రబాబు పేర్కొన్నారు. 

మత్స్యకారుల వలకు అరుదైన చేపలు.. వేలం పాటలో కోటి ఆదాయం!

మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటకు వెడతారు. వలేసి చేపలు పడతారు. రోజు బాగుంటే వల నిండుగా చేపలు పడతాయి. లేకుంటే శ్రమంతా వృధానే. అరుదుగా మత్స్యకారులు పంట పండింది అనుకునే రోజులు వస్తాయి. ఏదో వేటాడాం చేపలు పట్టాం అన్నట్లుగానే వారి జీవనం సాగుతుంటుంది. సముద్రంలోని ఆటుపోట్లలాగే వారి జీవితంలో కూడా ఆటుపోట్లు సహజం. వాతావరణం అనుకూలించాలి. అలా అనుకూలించిన రోజున వలకు చేపలు చిక్కుతాయి. రోజూ మంచి రోజే అంటూ ఆశ అనే చుక్కానితో జీవిత నావ లాగించేస్తూ ఉంటారు. అలాంటి మత్స్య కారులే ఉప్పాడ మండలం యు.కొత్త పల్లికి చెందిన వంకా సత్తిబాబు, ఉమ్మిడి అప్పారావులు. చేపల వేటకు విరామం సమయం పూర్తయిన తరువాత వారు బోటులో చేపల వేటకు సముద్రంపైకి వెళ్లారు. అయితే వారి అదృష్టం పండింది. అత్యంత అరుదైన కోనం జాతి చేపలు వారి వలకు చిక్కాయి. అలా ఇలా కాదు పెద్ద సంఖ్యలో చేపలు వారి వలలో పడ్డాయి. ఒక బోటులో వేటకు వెళ్లిన వారు.. ఒడ్డు నుంచి మరో రెండు బోట్లు తెప్పించుకుని వారి వలకు చిక్కిన చేపలను మొత్తం మూడు బోట్లలో ఒడ్డుకు తీసుకు వచ్చాయి. మార్కెట్ లో వారి వలకు చిక్కిన చేపల విలువ కోటి రూపాయలు పలికింది. పది రోజుల కిందట వేటకు వెళ్లిన ఈ మత్స్యకారులకు అత్యంత అరుదైన కోనం జాతి చేపలు, అవీ దాదాపు అన్నీ ఒకే సైజు ఉన్నవి పడటంతో వారి ఆనందానికి అవధులే లేకుండా పోయింది. మొత్తం 13 టన్నుల చేపలను వేటాడి తీసుకువచ్చారు.  

మ‌హా సంక్షోభంతో ఉద్ధ‌వ్‌కే మేలు

శివ‌సేన సింహం గుహ‌, అందులోకి ఎవ‌ర‌యినా వెళ్ల‌డ‌మేగాని తిరిగి రావ‌డం వుండ‌దన్నారు మ‌నోహ‌ర్ జోషి. శివ‌సేన ను ఎందుకు వీడ‌లేక‌పోతున్నార‌ని అడిగితే మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎదిగి ఆ త‌ర్వాత లోక్‌స‌భ స్పీక‌ర్‌గా చేసిన మ‌నోహ‌ర్ జోషి ఇచ్చిన స‌మాధానం అది. కానీ ఇపుడు  ఆ భ్ర‌మ ప‌టాపంచ ల‌యింది. శివ‌సేన పార్టీ నుంచి వూహించ‌నివిధంగా చాలామంది వీడిపోవ‌డంతో ఆ పార్టీ వీరాభిమానులు సైతం ఆశ్చ‌ర్యంలోంచి ఇంకా తేరుకోలేక‌పోతున్నారు. గ‌తంలో చ‌గ‌న్ భుజ‌బ‌ల్‌, నారాయ‌ణ్ రాణె, రాజ్ థాక్రే వంటి హేమాహేమీలు చేయ‌లేనిదాన్ని ఇపుడు ఏక్‌నాథ్ షిండే చేసి చూపారు. అప్ప‌ట్లో వాళ్లు సేన‌ను వీడితే చిన్న‌పాటి అల‌జ‌డి అయిందేగాని అది సునామీగా మార‌లేదు. శివ‌సేన పుంజుకుంది. కానీ ఇవాళ శివ‌సేన పార్టీ అస్థిత్వ‌మే ప్ర‌శ్నార్ధ‌క‌మైంది. ఇప్పుడు రెండింట మూడు వంతుల ఎమ్మెల్యేలు ఉద్ధ‌వ్‌కి వ్య‌తిరేకంగా  త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌తార‌న్న‌ది షిండే రుజువు చేసుకోవాలి. అస‌లు శివ‌సేన పార్టీ సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన పార్టీ కాదు, బాలాసాహెబ్ థాక్రే ను ఆరాధ్యునిగా చేసుకుని ఆయ‌నవ‌ల్ల‌నే ప‌టిష్టంగా ఏర్ప‌డిన పార్టీ. ఆయ‌న మాటే శాసనంగా ముంబైలో ఆధిప‌త్యం సాధించింది. అందుకు మ‌రో ప్ర‌ధాన‌కార‌ణం శివ సైనికులు గుడ్డిగా ఆయ‌న ఆదేశాల‌ను పాటించ‌డ‌మే. ప్ర‌భుత్వం ఎలాంటి ప‌ద‌విని ఎప్పుడూ చేప‌ట్టనప్ప‌టికీ, ఆయ‌నే చ‌ట్టంగా వ్య‌వ‌హ‌రించేవారు. ఒక్క మాట‌లో చెప్పా లంటే ఆయ‌న మ‌హారాష్ట్రీయుల‌కు స‌ర్కార్‌! ప్ర‌ముఖ కార్టూనిస్ట్  ఆర్‌.కె. ల‌క్ష్మ‌ణ్ తో  క‌లిసి ప‌నిచేసిన‌వాడు బాలాసాహెబ్ థాక్రే. మంచి ర‌చ‌యిత, కార్టూ నిస్టు. ఆయ‌న తండ్రి  గొప్ప సంఘ‌సంస్క‌ర్త కేశ‌వ్ సీతారామ్ ప్ర‌బోధ‌క‌ర్‌. ఆయ‌నే  ఒక సంద‌ర్భంలో బాల్ థాక్రే గురించి ఇలా అన్నారు.. ఇక నుంచి నా కుమారుడి జీవితం రాష్ట్రంలో యావ‌త్ మ‌హారాష్ట్రీయుల అభ్యున్న‌తికి అంకితం అని ప్ర‌క‌టించార‌ట‌. మ‌హారాష్ట్రీయుల కోసం మ‌హారాష్ట్ర‌ను కాపాడ‌మ‌ని  సీనియ‌ర్ థాక్రే పిలుపునిచ్చారు. అది ఆయ‌న కుమారుడు ముందుకు తీసికెళ్ల‌గ‌ల‌డ‌ని ఆయ‌న న‌మ్మ‌కం. 1966లో శివ‌సేన ఆవిర్భావానికి ముందు, మ‌హారాష్ట్రీయుల కోసం మ‌హారాష్ట్ర అనేది ఒక భావ‌న‌, దాన్ని ప‌టిష్ట‌ప‌ర చాలి. బాలాసాహెబ్ ఆ త‌ర్వాత పార్టీ ఏర్పాటు చేసి ఆ భావ‌నను ప‌టిష్ట‌ప‌రిచారు. అప్ప‌ట్లో  శివ‌సేన‌కు కాంగ్రెస్ డ‌బ్బు మూట‌ల‌తో మ‌ద్ద‌తునిచ్చింది. 1970ల్లో ఇందిరాగాంధీ ఎమ‌ర్జ‌న్సీ ప్ర‌క‌టించిన‌పుడు థాక్రే దాన్ని స‌మ‌ర్ధించ‌డం పెద్ద వింతేమీ కాదు. అప్ప‌టికి ఆ పార్టీ హిందూత్వ పార్టీ కాదు. అప్ప‌ట్లో ఇత‌ర రాష్ట్రా ల నుంచి ముంబైకి త‌ర‌లివ‌చ్చేవారి సంఖ్య పెర‌గ‌డంతో మ‌రాఠీ మనుష్  అన్న నినాదాన్ని బ‌ల‌ప‌ర చడం థాక్రే వంత‌యింది.  ఇప్ప‌టికీ ఢిల్లీ, ముంబై మ‌ద్య సంక్ష‌భం లో మ‌రాఠీ గుర్తింపును కాపాడుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.  ఓట్ల రాజ‌కీయాల్లో శివ‌సేన ఆధిప‌త్యం వున్నంత‌కాలం బిజెపితో స‌త్సంబంధాలే క‌లిగి వుంది.  థాక్రే నివాసం మాతోశ్రీ ని నిర్ల‌క్ష్యం చేసి మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవ‌డ‌మ‌న్న‌ది ఏ  బిజెపి నాయ‌కుని వ‌ల్లా కాలేదు.  కానీ బిజెపి రాజ‌కీయాల్లోకి న‌రేంద్ర మోడీ కీల‌క స్థానంలోకి రావ‌డంతో ఈ మొత్తం సీన్ తారు మార‌యింది. 2014లో బిజెపి, శివ‌సేన విడి విడిగా పోటీచేశాయి. మ‌హారాష్ట్ర‌లో బిజెపి ప్ర‌భుత్వానికి  శివ‌సేన మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. కానీ త‌ర్వాత ప్ర‌భుత్వంలో  కూట‌మి భాగ‌స్వామిగా శివ‌సేన వుండి కూడా ప్ర‌తిప‌క్షాల మీద కంటే మోదీ, బిజెపీల మీదే ఎక్కువ విరుచుకుప‌డింది.  2019లో బిజెపితో క‌లిసి పోటీ చేసినప్ప‌టికీ,  ఆ త‌ర్వాత బిజెపి ఝ‌ల‌క్ ఇచ్చి శ‌ర‌ద్‌ప‌వార్ ఎన్‌సిపితో జ‌త క‌ట్టింది. అప్ప‌టికి శివ‌సేన పెద్ద‌న్న స్థాయి కోల్పోయింది. కేంద్రంలో కాంగ్రెస్ స్థానంలో బీజేపీ వచ్చింది, మరాఠీ అస్మితపై ఆధిపత్యం చెలాయించే 'న్యూ' ఢిల్లీగా ఇప్పుడు సేనను చూస్తోంది బీజేపీ. ఎన్‌సిపి , కాం గ్రెస్‌లు శివసేనకు షరతులను నిర్దేశించే పరిస్థితిలో లేవు, కానీ బిజెపి ఆ పని చేయగలదు. శివ‌సేన‌, బిజెపి ల మ‌ధ్య సంక్షోభం కేవ‌లం రెండుపార్టీల మ‌ధ్య నెల‌కొన్న‌దిగా భావిస్తే దాని వెనుక వాస్త‌వాన్ని తెలుసుకో న‌ట్టే అవుతుంది.  మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన తన మరాఠీ ప్రాంతీయ గుర్తింపును సమర్ధవంతంగా ఉపసంహరించు కోగల ఏ  అఖిల భారత పార్టీకి ద్వితీయ‌శ్రేణిగా వుండ‌ద‌ల‌చుకో లేదు. చారిత్రాత్మకంగా,  మరాఠాలు ఎప్పు డూ ఢిల్లీకి లొంగిపోలేదు. ఇద్దరూ నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి ఛత్రపతి శివాజీ అతిపెద్ద చిహ్నం. బాలాసాహెబ్ థాకరే మరణంతో శివసేనను తారుమారు చేయవచ్చని  భావించినవారు సేన ఉనికికి గల ప్రాథమిక కారణాన్ని కోల్పోయారు. ఎక్కువ విద్యావంతులైన వలసదారులచే  అట్టడు గుకు నెట్టబడ్డారని భావించిన గొంతులేని మహారాష్ట్రీయులకు సేన వాయిస్ ఇచ్చింది. ఉద్ధ‌వ్ నాయ‌క‌త్వాన్ని కాద‌ని తిరుగుబాటుకు నాయ‌క‌త్వం వ‌హించిన ఏక్‌నాథ్ షిండే  ఒక‌ప్పుడు మామూ లు  ఆటో డ్రైవ‌ర్‌. అస‌లా మాట‌కి వ‌స్తే,  శివ‌సేన నాయ‌కుల్లో ప్ర‌ముఖులంతా చిన్న స్థాయినుంచి ఎదిగిన వారే. మ‌రి ప్ర‌స్తుతం ఢిల్లీ గేమ్ ఆడుతున్నవాడిగా మ‌రాఠీ అస్మిత సింబ‌ల్‌గా అంద‌రి దృష్టిలో  ప‌డిన షిండేను ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా ?  మొత్తానికి, షిండే, అతని బృందానికి దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంద‌నేది అంత‌గా అనిపించ‌ని సంగ‌తి.  ప్రస్తు తానికి, అతను విజేతగా కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో, అతని సమూహం ఎప్ప‌టికీ మ‌రాఠా వాదానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహులుగా  కనిపిస్తుంది. ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి కంటే మృదుస్వభావి, ఎక్కువ అనుకూలత కలిగి ఉంటారనడంలో సందేహం లేదు. కానీ ఈ ఎపిసోడ్ థాకరే వారసత్వాన్ని నాశనం చేస్తుందని అనుకోవడం నిర్లక్ష్యమే. ఠాక్రే , మాతోశ్రీ, కేవలం పేరు లేదా నివాసం కాదు, వారు ఎల్లప్పుడూ కేంద్రం యొక్క శక్తిని ప్రతిఘటించే , ఎప్పుడూ లొంగిపోని ఆలోచనకు ప్రతీక. సింహం మ‌ళ్లీ పుంజుకుంటుంది.

60 ఏళ్ల తర్వాత ఆత్మకూరులో తొలి ఉప ఎన్నిక

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఉప ఎన్నిక జరిగింది. తొలిసారి 1955లో జరిగిన ఉప ఎన్నిక కంటే ఈసారి ఉప ఎన్నిక భిన్నంగా జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో సాధారణం ఎన్నికల్లో కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేస్తే.. ఈ దఫా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. నాటి సాధారణ ఎన్నికల్లో పోలైన ఓట్ల కన్నా ఉప ఎన్నికల్లో 11 వేలకు పైగా ఓట్లు పెరిగితే.. తాజా ఉప ఎన్నికలో 35 వేలకు పైగా తగ్గడం గమనార్హం. 1955లో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో 35 వేల 959 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడేళ్ల తర్వాత అంటే 1958లో బెజవాడ గోపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా వెళ్లారు. దాంతో ఆయన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలా అనివార్యమైన ఉప ఎన్నికలో 46 వేల 976 మంది ఓటు వేశారు. అంటే ఆ ఉప ఎన్నికలో సాధారణం కన్నా 11 వేల 17 మంది అదనంగా ఓటు వేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో లక్షా 72 వేల 288 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో   గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో లక్షా 37 వేల 81 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే.. 2019 కంటే.. ఇప్పుడు 35 వేల 207 ఓట్లు తగ్గాయన్నమాట. ఆత్మకూరు నియోజకవర్గంలో 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 8 వేల 990 ఉంది. ఈసారి ఉప ఎన్నికల సందర్భంగా ఆ సంఖ్య 2 లక్షల 13 వేల 338కి చేరింది. అంటే 4 వేల 348 మంది ఓట్లరు పెరిగారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఓటు వేసిన 35 వేల 207 మంది ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు రాకుండా ముఖం చాటేశారని స్పష్టమవుతోంది.

మహా సంక్షోభానికి ముగింపు ఎప్పుడో ?

మహారాష్ట్ర సంకీర్ణ కూటమికి సారధ్యం వహిస్తున్న శివసేనలో ఏర్పడిన సంక్షోభం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై, పార్టీ సీనియర్ నాయకుడు, ఏకనాథ్ షిండే ఎగరేసిన తిరుగుబాటు సృష్టించిన సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతోంది. గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు, సెంటిమెంట్ ను పండించేందుకు రాత్రికి రాత్రి అధికార నివాసం వదిలి, మాతృశ్రీకి చేరుకున్నారు. అనారోగ్యాన్ని, ఇతర వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించి, సింపతీ గైన్ చేసే ప్రయత్నమూ చేశారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్దమయ్యారు. అయిన ఎన్ని చేసినా, చేసిన ప్రయత్నాలు అన్నీ విఫల మయ్యాయి.  మరో వంక తిరుగుబాటు జెండా ఎగరేసిన ఏక్ నాథ్ శిందే బలం రోజురోజులు పెరుగుతోంది.  చివరకు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు కూడా బయటకు రాగానే, ఫ్లైట్ ఎక్కి చలో గౌహతి అని ఏక్‌నాథ్‌ శిబిరానికి చేరుతున్నారు. దీంతో, అసెంబ్లీలో బలం లేదు. ప్రభుత్వాని నిలుపుకోవడం అయ్యే పని కాదని ఉద్దవ్ ఠాక్రేకి అర్థమైంది.  అందుకే ఇక ఇప్పడు చేసేది లేక, ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పోయినా పార్టీని అయినా కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా శివసేన జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించారు. కన్నీరు పెట్టుకున్నారు. హిందుత్వను, బాల్ ఠాక్రే ఆదర్శాలను వదలనని ప్రతిజ్ఞ చేశారు. మరో వంక శివసేన జాతీయ కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే,తిరుగుబాటు వర్గం నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రయత్నాలను సాగిస్తున్నారు. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.  మరోవంక, వీధి పోరాటాలకు ఉద్దవ్ ఠాక్రే వర్గం తెర తీసింది. ఒక విధంగా ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన సూత్రధారిగా విమర్శలు ఎదుర్కుంటున్న సంజయ్ రౌత్, వీధి పోరాటాలకు  నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఠాక్రేసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు లక్ష్యంగా దాడులు సాగిస్తోంది.  పూణేలోని కత్రాజ్‌లోని బాలాజీ ప్రాంతంలో శివసేన పార్టీ రెబెల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయాన్ని ఇవాళ శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. సావంత్ రాష్ట్రంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరు. ప్రస్తుతం ఆయన అస్సాంలోని గౌహతి క్యాంప్ లో ఏకనాథ్ షిండే శిబిరంలో ఉన్నారు. ఇదే కోవలో మరికొందరు రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్లపైనా ఠాక్రేసేన శివసేన కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. దీంతో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేల నేత అయిన ఏకనాథ్ షిండే ఇంటికి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం భద్రతను తొలగించింది. అసమ్మతి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ముంబయిలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గువాహటి శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 50కి చేరుకున్నట్లు సమాచారం. వారిలో 40 మంది శివసేనకు చెందిన వారేనని అసమ్మతి వర్గ నేత శిందే ఓ వార్తా సంస్థకు స్వయంగా వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇంతవరకు తెర వెనక నుంచి చక్రం తిప్పుతున్న బీజేపే నాయకత్వం, రాష్ట్ర్మలో పరిస్థితి అదుపు తప్పితే, రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రపతి పాలనకు, శివసేనతో పాటుగా కాంగ్రెస్, ఎన్సీపీకి కూడా సుముఖంగానే ఉన్నాయని అంటున్నారు అయితే. శివసేన రెబెల్ వర్గం అందుకు అంగీకరించ పోవచ్చని, ఉద్దవ్ ఠాక్రే , సమయం వస్తే    ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని రెబెల్ వర్గం భావిస్తోంది. ఏమైనా, మహా సంక్షోభానికి .. ముగింపు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదని అంటున్నారు.

వెనిగార్‌తో క‌లుపు మొక్క‌లు మాయం!

స‌ర‌దాగా అలా పార్కులోనో, పెర‌ట్లోనో తిరిగే అల‌వాటు వున్న‌వారికి క‌లుపు మొక్క‌లతో ఇబ్బంది వుంటూనే వుంది. తోట‌మాలి లేని పార్క‌ల్లో  అవి బాగా విస్త‌రించి న‌డిచే దారిలో తెగ అడ్డుప‌డుతూంటాయి. ఇటీవలి వేడి వాతావరణం ఆరుబయట సమయం గడపడానికి సరైన సాకుతో, తోటపని చాలా మందికి ప్రాధాన్య తగా మారింది.  మనలో చాలామంది భయపడే ఒక పని ఉంది - కలుపు తీయడం.  కలుపు మొక్కలు వికారమైనవి, తొలగించడానికి చాలా సమయం తీసుకుంటాయి  కానీ  అలా చేయడం చాలా ఖరీదైనది, అయినప్పటికీ వాటిని అల్లర్లు చేయడానికి వదిలివేయడం తోట రూపాన్ని వేగంగా నాశనం చేస్తుంది. క‌లుపు మొక్క‌ల త‌ల‌నొప్పి బాగా ఇబ్బందిక‌రంగా మారింది. ఇలాంటి వాటిని తొల‌గిం చుకోవాలంటే ఏం చేయాల‌ని  ఒక మ‌హిళ ఆలోచించింది. ఒక‌రోజు  ఆమె త‌క్కువ ఖ‌ర్చుతో ప‌ని జ‌రిగే మార్గాన్ని క‌నుగొన్న‌ది.         మాంచెస్టర్ లో, ఒక మహిళ తన త‌ల్లికి సహాయం చేయడానికి చౌకగా చేయడం కోసం తన చిట్కాను పంచుకుంది.  ధర కేవలం ప‌ది రూపాయ‌లు. డబ్బు ఆదా చేసే ఫేస్‌బుక్ గ్రూప్‌లో దీన్ని షేర్ చేస్తూ, కేవలం ఒక లీటరు వైట్ వెనిగర్, మూడు పెద్ద స్పూన్ల ఉప్పు, మూడు పెద్ద చెంచాల వాషింగ్-అప్ లిక్విడ్ , స్ప్రే బాటిల్‌ని ఉపయోగించి ఇంట్లో మీ స్వంతంగా తయారు చేసుకోవాలనే సూచ న‌లు చూశానని చెప్పింది. ఆమె తల్లికి ఇప్పటికే చాలా పదార్థాలు ఉన్నాయి - అవి సాధారణ గృహోపకరణాలు - ఆమె ఇంటి ఖ‌ర్చు ల కోసం దాచుకున్న సొమ్ము నుంచి రెండు కొంత తీసి వెనిగర్ బాటిళ్లను కొన్న‌ది. ఈ ప‌నికి  ఆమెకు కావా ల్సింది అంతే. మా అమ్మ తన వాకిలి, న‌డిచేమార్గంలో స్లాబ్‌ల మధ్య పెరుగుతున్న కలుపు మొక్కల గురించి మాట్లాడు తోంది అని ఆ మహిళ చెప్పింది. మొన్న రాత్రి నిద్ర పట్టలేదు కాబట్టి గూగ్లింగ్ చేయడం మొదలుపెట్టాను. వీడ్ కిల్లర్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తూ ఈ వెబ్‌సైట్‌కి వచ్చింది. ఇంటి ఖ‌ర్చుల నుండి వెనిగర్‌ను 50 మి.లీ కొన్న‌ది . అద‌నంగా ఆమె ఇప్పటికే అవసరమైన మిగిలిన పదార్థాలను కలిగి ఉంది. మ‌న క‌రెన్సీలో సుమారు 115 రూపాయ‌లు ఖర్చవుతుంది ఆదివారం దానిని ఉపయోగించిన తర్వాత ఆమె ఇది అత్యుత్తమ కలుపు నివారణ అని చెప్పింది! ఇది ఎవరికైనా సహాయపడుతుందని ఆశిస్తున్నాను అన్న‌ది. 

రక్షణ రహస్యాలకు హనీట్రాప్ ముప్పు!

పూర్వ కాలంలో శత్రు రాజ్యాల రహస్యాలు తెలుసుకునేందుకు వేగులు..(మనం గూఢ చారులు అని ఇప్పుడు అంటున్నాం) శత్రు రాజ్యాల్లోకి ప్రవేశించి అక్కడ ఎవరినో ఒకరిని మచ్చిక చేసుకునే వారట. వారి ద్వారా రాజ్యంలో సమస్యలు, లోతుపాతులు, లోగుట్టు తెలుసుకుని దానికి తమ రాజుకు చేరవేశేవారని చెబుతుంటారు.  ఆ తరువాతి కాలంలో శత్రు దేశాల రహస్యాలను తెలుసుకునేందుకు గూఢ చారులను వినియోగించేవారు. జేమ్స్ బాండ్, గూఢచారి 116 వంటి  సినిమాలు కూడా ఈ గూఢచర్యం కథాంశంతో కూడిన సినిమాలే. ఇప్పుడు వేగులు  ఇటువంటి వేగులు, గూఢచారులతో పని లేకుండా కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి తమకు కావలసిన రహస్యాలు చులాగ్గా సంపాదించేస్తున్నారు. అందుకు వారు ఉపయోగిస్తున్నది ‘హనీ ట్రాప్’ ఇప్పుడు దేశ రక్షణ రహస్యాలకు ‘హనీ’ ట్రాప్ ముంపు పొంచి ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఈ హనీ ట్రాప్ అంటే ఏమిటంటే.. అత్యంత కీలకమైన రహస్యాలను రాబట్టేందుకు అమ్మాయిల వలపు వలను ప్రయోగించడం. దేశ క్షిపణి అభివృద్ధి రహస్యాలను తెలుసుకునేందుకు ఒక ఇంజనీర్ పై పాక్ హనీట్రాప్ ను ప్రయోగించింది. దీంతో ఆ ఇంజనీర్ రెండేళ్ల పాటు అంటే 2019 నుంచి 2011 వరకూ క్షిపణులకు సంబంధించి కీలక సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేసినట్లు తేలింది. ఆ ఇంజనీర్ ను హనీట్రాప్ లో చిక్కుకునే టట్లు చేయడానికి సామాజిక మాధ్యమాన్నే శత్రుదేశం మాధ్యమంగా ఎన్నుకుంది. సామాజిక మాధ్యమంద్వారా పరిచయమైన యువతి వలపు వలలో పడిన ఇంజినీర్ అత్యంక కీలకమైన రహస్యాలను, కొన్ని చిత్రాలను, పత్రాలను కూడా ఆమెకు అందజేశాడు. డీఆర్ డీఏలో పని చేసే ఇతరులెవరూ ఇతడి చౌర్యాన్ని గుర్తించలేకపోవడమే ఆశ్చర్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.   పాక్‌ రహస్య గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) తరఫున మన దేశంలో చాలా మంది ఏజెంట్లుగా, స్లీపర్‌ సెల్స్‌గా పని చేస్తున్నారు. బయటపడిన కేసులు కొన్ని మాత్రమే. వెలుగులోనికి రాని ఇటువంటి వి చాలా ఉన్నాయన్నది నిఘావర్గాల అనుమానం.   గత సంవత్సరం జూలైలో బికనీర్‌ కి చెందిన హబీబూర్‌ రెహమాన్‌ అనే పాక్‌ గూఢచారిని అరెస్టు చేశారు. పోఖ్రాన్‌లోని ఆర్మీ బేస్‌ క్యాంపు నుంచి అతడు రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేసినట్టు పోలీసులు గుర్తించారు. పాక్‌ గూఢచారులకు అతడు కొన్ని మ్యాపులను, కోడ్‌ సమాచారాన్నికూడా అందిం చినట్టు దర్యాప్తులోతేలింది.అతడికి పంకజ్‌ కౌర్‌ అనే కానిస్టేబుల్‌ ఈ సమాచారాన్ని అందజేసినట్టు తెలియ వచ్చింది. ఆగ్రా కంటోన్మెంట్‌లో పని చేస్తున్న కౌర్‌నికూడా అరెస్టు చేశారు.రెహమాన్‌ బంధువులు పాక్‌లోని సింధ్‌లో నివసిస్తున్నారనీ, వారిని కలుసు కోవడానికి అతడు తరచూ వెళ్తుంటాడనీ,ఆర్మీ బేస్‌ క్యాం ప్‌కి కూరగాయలు సరఫరా చేసే హబీబూర్‌ రెహమాన్‌ కౌర్‌ ద్వారా సమాచారాన్ని సేకరించి సింధ్‌ వెళ్ళినప్పుడు ఐఎస్‌ఐ అధికారులకు అందజేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

తెలంగాణ కాంగ్రెస్ రేసు గుర్రం రేవంత్

తెలంగాణ రాజకీయాలలో మార్పులు విస్పష్టంగా గోచరిస్తున్నాయి.  కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడం, అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మంది గెలవడం, హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజేతగా నిలవడంతో  అధికార టీఆర్ఎస్- బీజేపీ మధ్య రాజకీయంగా నువ్వా నేనా అనే పోటీ నెలకొందన్న భావన రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమైంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మార్పులు చెందింది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తల బలానికి తోడు బలమైన నాయకులు కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గూటికి చేరడానికి క్యూ కట్టడం ఆరంభమైంది.   నెల రోజుల క్రితమే టీఆర్ఎస్ నుంచి నల్లాల ఓదెలు, ఆయన సతీమణి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ సమక్షంలో పార్టీలో చేరడం, మొన్నటికి మొన్న ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి  స్వగృహ ప్రవేశం అంటూ  కాంగ్రెస్ లోకి మళ్లీ వచ్చి చేరడం, తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు, మరి కొందరు   నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. సాధారణంగా విపక్షాల నుంచి నేతలు అధికార పార్టీ కండువా కప్పుకుంటారు. అయితే.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత అధికార టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరగడం విశేషం. అందుకు రేవంత్ రెడ్డి పార్టీ పరంగా తీసుకుంటున్న కార్యక్రమాలే కారణం అంటున్నారు. ఒక పక్కన టీఆర్ఎస్ తో, సీఎం కేసీఆర్ తో  సై అంటే సై అంటూ బీజేపీ నేతలు తలపడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పీఎం మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు కూడా వరుస పెట్టి తెలంగాణలో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు గతంలో బీజేపీ తీర్థం తీసుకున్నారు. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే రీతిలో రాజకీయం నడిచింది. అయితే కాంగ్రెస్ మాత్రం టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు ముందొక లెక్క.. తరువాత ఓ లెక్క అన్నట్లు దూసుకుపోతోంది. కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ వచ్చాడు, రేవంత్ వచ్చాడని తెలుసుకోండి అంటూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. సీనియర్ నేతల నుంచి ఆశించిన మేరకు మద్దతు, తోడ్పాటు లేకపోయినా రేవంత్ రెడ్డి వరుసగా కార్యక్రమాలు చేసుకుంటూ తనదైన శైలిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.   దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు అందుకుంది. అధికార టీఆర్ఎస్ లో సీనియర్ నేత, చెన్నూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లాల ఓదేలు రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లి మరీ ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం ఆశించి భంగపడ్డిన విజయారెడ్డి తాజాగా రేవంత్ రెడ్డితో చర్చించి,  హస్తం గూటికి చేరిపోయారు. విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని ఆ పార్టీ నేతలు స్వాగతించారు. ఓదేలుకు, విజయారెడ్డికి బీజేపీ ముందే ఆహ్వానం పలికిందట. కానీ వారు బీజేపీ ఆహ్వానాన్ని కాదని కాంగ్రెస్ లో చేరడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కారుకు గుడ్ బై చెప్పి హస్తాన్ని అందుకుంటానని ప్రకటించేశారు. పినపాక నియోజకవర్గం కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఓ ఫైర్ బ్రాండ్. అధికార టీఆర్ఎస్ వైఫల్యాల్ని తనదైన స్టైల్ లో ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ను ఇరుకున పెట్టడంలో ఏ చిన్న ఛాన్స్ నీ ఆయన మిస్ అవడం లేదు. టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలతో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నారని కారు పార్టీ వర్గాలే చెబుతున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పార్టీ అధిష్టానం స్వేచ్ఛ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి రేసు గుర్రంలా దూసుకుపోతున్నారంటున్నారు. ఈ క్రమంలోనే తాటి వెంకటేశ్వర్లుకు, విజయారెడ్డికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సమస్యలపై పోరాటం విషయంలో రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే.. బీజేపీ నేతలు ఒకింత వెనుకబడినట్లు పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తరఫున కార్యక్రమాలు నిర్వహించడంలో, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించడంలో రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. బీజేపీలో చేరితే టికెట్ వస్తుందో రాదో అన్న క్లారిటీ లేని పరిస్థితుల్లో  రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ కండువా కప్పుకుంటే మేలని టీఆర్ఎస్ అసంతృప్త నేతలు భావిస్తున్నరు.  రేవంత్ రెడ్డి సారథ్యంలో మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

పవన్ కళ్యాణ్ పై జన సైనికుల అగ్రహం.. ఎందుకో తెలుసా ?

రాజకీయాల్లో ఉండాలంటే రాజకీయం తెలియాలి ...  అంటే, అయినా ఇదేం  స్టేట్మెంట్, రాజకీయాలు తెలియని వారు రాజకీయాల్లో ఎందుకుంటారు, ఎలా ఉంటారు .. హౌ .. అని మనం అనుకోవచ్చును కానీ, రాజకీయాలు అంటే  కేవలం  జెండాలు, ఎజెండాలు మాత్రమే కాదు. ఇంకా చాలా కళలు తెలిస్తేనే కానీ, రాజకీయాల్లో రాణించ లేరని ఆధునిక రాజకీయ పండితులు ఘోషిస్తున్నారు. ప్రైవేటుగా పాఠాలు కూడా చెపుతున్నారు.  అప్పుడెప్పుడో సత్యకాలంలో గిరీశం మాస్టారు, ‘ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు, పోలిటిషియన్ కాలేరు’  అని ఓ సింపుల్ చిట్కా చెప్పి వదిలేశారు.  కానీ , ఇప్పుడు అదొక్కటే సరిపోదని ఆధునిక గిరీశం సార్లు చెపుతున్నారు. ఇప్పడు మనం ఆనాటి సత్యకాలంలో లేమని గుర్తు చేస్తున్నారు. సో ..ఈ రోజు రాజకీయాలలో రాణించాలంటే ... వాళ్ళు  సినిమా స్టార్లు అయినా సరే, జస్ట్ గ్లామర్ ఉంటే సరిపోదు, గ్రామరు కూడా తెలిసుండాలి. దానితో పాటుగా,నోరుండాలి,  ఆ నోట్లో  ఫినాయిల్ సీసాలు కాదు పీపాలు పోసి కడిగినా పోనంత బూతుండాలి..అందులో మీ ప్రత్యర్ధి, వైసేపీ బూతు భాషకు బ్రాండ్ అంబాసిడర్ అయినప్పడు  మీకు బూతు  బాష బాగా వచ్చుండాలి.. అంటూ ఆయనకు అయన అభిమానులు, అనుచరులు  పాఠాలు చేపితున్నారు. ..ట.  ఇంతకీ విషయంవిషయం ఏమంటే, ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా,  బూతు పాండిత్యంలో మాత్రం వైసీపీదే ఫస్ట్ ప్లేస్. ఆడ మగ తేడా లేకుండా, బ్రహ్మాండగా బూతులు మాట్లాడగల నాయకులు. ఎమ్మెల్యేలు, మంత్రుల కొరత  లేని పార్టీ, రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద  ఏదైనా ఉందంటే, అది వైసీపే ఒక్కటే, ఈవిషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఈ మధ్య, తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా వైసీపీతో పోటీ పడే ప్రయత్నం చేస్తున్నారు కానీ, అయినా, వైసీపీ స్థాయికి ఇంకా చేరలేదు. అదలా ఉంటే, బూతులు నేర్చుకోవయ్యా.. బాబు .. అంటూ పవన్ కళ్యాన్ అభిమానులు ఆయన వెంట పడుతున్నారు. సినిమాల్లో పవర్ స్టార్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్  ఈ విషయంలో చాలా చాలా వెనకబడి పోయారని, పొలిటికల్ గురువులు కూడా, పవన్ అప్డేట్ కావాలనే అంటున్నారు.  ఒకప్పదు ఏమో కానీ, ఈ రోజు రాజకీయ నాయకులు చాలావరకు సంస్కారహీనంగా మాట్లాడడమే రాజకీయ సంస్కారం అనుకుంటున్నారు. దిగజారి దూషణలకు దిగాజరుతున్నారు. ముఖ్యంగా వైసేపీ నాయకులు అయితే, ప్రత్యర్ధి  పార్టీల నాయకులనే, కాదు, నాయకుల కుటుంబ సభ్యులను కూడా అసభ్యంగా దూషించి, ఆనందం పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అంతటి నాయకుడే, అసెంబ్లీలో కళ్ళ నీళ్ళు పెట్టుకునే స్థితి వచ్చిందంటే, వైసీపీ ఏ స్థాయికి దిగజారిందో వేరే  చెప్పనక్కర లేదు. అలాగే, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కూడాడా వైసేపీ నాయకులు దిగజారుడు భాషలో దుర్భాషలాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం, వైసీపీ నాయకులకు దీటుగా, వారికి అరమయ్యే భాషలో సమాధానం ఇవ్వడం లేదనేది, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయన పై చేస్తున్న అభియోగం. నువు  తమలపాకుతో ఒకటంటే..నే తలుపు చెక్కతో రెండంటా’ అనేలా రాజకీయ భాష ఉండాలని లేదంటే, కష్టమని  పవన్ పై కాస్తంత కోపగించుకుంటున్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దారుణమైన భాషతో విరుచుకుపడ్డారు. అవి ప్రసారం చేసిన టీవీ చానళ్లపై కేసులు పెట్టారు. ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ బాలినేని గారూ మీ అనుచరులకు పద్దతులు నేర్పండి అంటూ ప్రకటన జారీ చేశారు. ఇదే జనసైనికులకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.అందుకే పవన్ కళ్యాణ్ అర్జెంటుగా బాతులు బాగా బట్టి పట్టాలని  అంటున్నారు.

బాబంటే భయం భయం.. బీజేపీ, వైసీపీ మైత్రికి అదే కారణం

బలమైన నేత ఏ రాష్ట్రానికీ ముఖ్యమంత్రిగా ఉండకూడదు. అలా అయితేనే కేంద్రం బలహీనతలపై గట్టిగా గళమెత్తే రాష్ట్రం కనిపించదు. ఇదీ మోడీ, షా ఉద్దేశం, లక్ష్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు మరోసారి అధికారం దక్కకూడదు. అందుకు ఏం చేయాలి? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని మరోసారి గద్దెనెక్కించేందుకు ఎలాంటి సహకారం అందించాలి. మోడీ, షా ద్వయం అనుక్షణం ఆలోచిస్తున్న విషయం ఇదే. వారి వ్యూహాలన్నీ ఏపీలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అడ్డుకోవడమెలా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు.. ఇదే వారి ఆందోళన. ఎందుకంటే ఏపీలో జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో పెల్లుబుకుతోందో వారికి బాగా అర్ధమైంది. కొంచం అటూ ఇటూలో జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ పై కూడా ప్రజా వ్యతిరేకత మెండుగానే ఉంది. ఇదీ వారికి అర్ధమైంది. అయితే జాతీయ స్థాయిలో విపక్షాల అనైక్యతను అడ్డుపెట్టుకుని ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావడం నల్లేరు మీద బండి నడకేనని మోడీ, షా ద్వయం భావిస్తున్నారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం కూలిపోయి, చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం మోడీ 3.0కు అడుగడుగునా విమర్శల గండాలు తప్పవని వారు ఊహిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో లేకపోవడం, రాష్ట్రంలో పరిస్థితిపై ఎక్కవ దృష్టి పెట్టాల్సి రావడంతో జాతీయ రాజకీయాలలో ఆయన పెద్దగా వేలు పెట్టడం లేదని వారికి తెలుసు. అదే ఒక సారి రాష్ట్రంలో అధికారంలోనికి వస్తే జాతీయ రాజకీయాలలో ఆయన చురుకుగా పాల్గొంటారనీ, విపక్షాల ఐక్యతకు బాటలు వేయడంలో ఆయన చాంపియన్ అని బీజేపీ పెద్దలకు అనుభవ పూర్వకంగా తెలుసు. అందుకే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం తమ ఎదుగు దలకు, అధికార సుస్థిరతకు ముప్పుగా పరిణమిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆరు నూరైనా, నూరు ఆరైనా చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టకూడదు.  ఇదీ హస్తినలో కమలం పార్టీ అగ్రనేతల భావన. అందుకే ఏపీలో జగన్ కు ఏ విధంగా సహాయపడాలి, మరోసారి జగన్ ను గద్దెనెక్కిస్తే.. ఏపీలో పరిస్థితి తాము తానా అంటే తానా తందానా అంటే తందానా అన్నట్లుగా ఉంటుందని వారి విశ్వాసం. అందుకే ఏపీలో  జగన్ కు మరో సారి అధికారం కట్టబెట్టడంపై హస్తిన నుంచే కమలం అగ్రనేతలు పావులు కదుపుతున్నారు.  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి విషయంలో అత్యంత అమానవీయంగా కమలం పెద్దలు వ్యవహరించడానికి ఆయనకు చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాలే కారణమని కమలం నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలైతే వెంకయ్య నాయుడి విషయంలో తమ పార్టీ అగ్రనేతలు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరంగా ఉందని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. క్రియాశీల రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనను చెప్పా పెట్టకుండా, హఠాత్తుగా.. స్పష్ఠంగా చెప్పాలంటే ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఉపరాష్ట్రపతిని చేసిన మోడీ, షా ద్వయం, ఆ సమయంలో ఆయనను తదుపరి రాష్ట్రపతిని చేస్తామని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే నాటి హామీని విస్మరించి, ఉద్దేశపూర్వకంగా ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయలేదని అంటున్నారు. ఇందుకు ఏకైక కారణం ఏపీ రాజకీయాలలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత, చంద్రబాబుతో ఆయనకు ఉన్న సత్సంబంధాలే కారణమని కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన కమలం నేతలు వివరిస్తున్నారు. అయితే వెంకయ్యనాయుడికి అన్యాయం జరిగిందనీ, ఆయనకు జరిగిన అన్యాయం బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు జరిగిన అన్యాయం వంటిదేననీ అంటున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం వద్ద తమ నిరసనను వ్యక్తం చేసే ధైర్యం మాత్రం చేయలేమని చేతులెత్తేస్తున్నారు.  ఇక పోతే చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపడితే.. దక్షిణాదిపై తాము ఆవలు వదిలేసుకోవలసిందేనన్న నిర్ధారణకు వచ్చిన మోడీ, షాలు ఏపీలో చంద్రబాబుకు అన్ని  విధాలుగా అవరోధాలు సృష్టించే ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ పై బీజేపీ అగ్రనాయకత్వానికి అపారమైన, అంతులేని ప్రేమాభిమానాలేమీ లేవు. తమ చెప్పు చేతల్లో ఉండే వ్యక్తిగానే జగన్ పట్ల వారు అపేక్ష చూపుతున్నారు. అడగక ముందే మోడీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి బేషరతుగా మద్దతు ప్రకటించేసిన జగన్ పట్ల వారికి ఇష్టం లేకపోయినా.. కోపం ఎందుకు ఉంటుంది? జగన్ కోరిందే తడవుగా సీబీఐ కోర్టు విదేశీ యానానికి అనుమతి ఇచ్చేయడం, కేసు విచారణను సుదీర్ఘంగా కొనసాగేలా ఆయనకు అనుకూలంగా వాయిదాల మీద వాయిదాలు వేయడం.. మోడీయే చెప్పినట్లు రాజకీయ నాయకులపై కేసుల విచారణను సత్వరమే అంటే వీలైతే ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయాలన్న భావననే వ్యక్తం చేయకపోవడం వంటి వన్నీ.. ఏపీలో తమ పల్లకి మోసే నేతగా వారు జగన్ ను గుర్తించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ పై ఏపీలో ఎంత ప్రజా వ్యతిరేకత గూడు కట్టుకుని ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకువస్తే అది  జగన్ పార్టీకి మేలు చేకూరుస్తుందన్న అంచనాతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. అందుకే పవన్ కల్యాణ్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు ఆయనను జగన్ పార్టీ ఎలా రెచ్చగొడుతోందో, అంతకు మించి బీజేపీ రెచ్చ గొడుతోండటం ఇందులో భాగంగానే చూడాలి. తెలుగుదేశం, జనసేన, వైసీపీలు వేర్వేరుగా పోటీలో ఉండి, ఏపీలో త్రిముఖ పోరు అనివార్యమైన పరిస్థితి తలెత్తితే అది జగన్ కే ప్రయోజనం చేకూరుస్తుందన్నది బీజేపీ అంచనా. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకూ మారేలా బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది.  రానున్న రోజులలో తెలుగుదేశం కీలక నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ ప్రతాపాన్ని చూపించే విధంగా వ్యూహాలు రచిస్తోందని కమలం వర్గాల ద్వారానే తెలుస్తోంది. తాడిపత్రిలో జేసీ సోదరుల నివాసాలపై ఈడీ దాడులను ఇందుకు ఆరంభంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   చంద్రబాబును ఈ సారి అధికారానికి దూరం చేయగలిగితే తెలుగుదేశం పని ఇక అయిపోయినట్లేనని బీజేపీ, వైసీపీ భావిస్తున్నాయి. అలా కాకుండా ఈ సారి చంద్రబాబు గెలిస్తే వైసీపీ పనైపోయినట్లేననీ, అలాగే బీజేపీకి ఇక ఏపీలో ఉనికి శూన్యమేననీ కూడా ఆ పార్టీలు భావిస్తున్నాయి.   ఏపీలో జనసేన టీడీపీ కలిసే అవకాశం లేకుండా బీజేపీ ఎత్తులు వేస్తోందని అంటున్నారు.  మొత్తానికి ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా.. విపక్షాలు ఏకమైనా కూడా.. బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం ఏపీలో మరోసారి వైసీపీని అధికార పీఠం ఎక్కించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాకుల దాడులకు చెక్ పెట్టడానికి గద్దను పెంచుతున్నాడు!

పిల్ల‌ల జోలికి వెళితే కుక్క‌లే కాదు, ప‌క్షులూ దాడిచేస్తాయి. కానీ కాలిఫోర్నియా లాస్ ఏంజెల‌స్ కౌంటీ పార్కులోకి ఎవ‌రు వెళ్లినా అక్క‌డి రెండు కాకులు అమాంతం మనుషులపై దాడి చేసి చీకాకు పరుస్తున్నాయి.  దీంతో అక్క‌డి బీచ్‌కి ద‌గ్గ‌ర‌లోని నోబెల్ పార్క్ అనే హోట‌ల్ య‌జ‌మాని చాలా న‌ష్ట‌పోతున్నాడ‌ట‌!  సాయంత్రాలు స‌ర‌దాగా గ‌డ‌ప‌డానికి బీచ్‌కి  వెళ్ల‌డం వైజాగ్‌లో లా ప్ర‌పంచంలో ఎక్క‌డ‌యినా స‌ముద్ర తీరం వున్న ప‌ట్ట‌ణాల‌ వారికి అలవాటు. కొంత‌సేపు ఆట‌ పాట‌లతో గ‌డిపి రావాల‌ని అనుకుంటారు. స‌హజంగా అక్క‌డ కుక్క‌ పిల్ల‌లు ఏదో ఒక కాయ‌ కోస‌మో, పండు కోస‌మో వెంట‌ బ‌డ‌టం మామూలే. కానీ ఏకంగా కాకుల దాడి మాత్రం వింతే!  కాకుల‌కు జ‌నాల్ని గుర్తు పెట్టుకునే శ‌క్తి వుంటుందిట‌. ఎవ‌ర‌యినా ఏద‌న్నా తింటూ, కుక్క‌ల్ని ప‌ట్టుకుని అలా షికారుగా  వెళుతుంటే కాలిఫోర్నియాలో  మాత్రం అమాంతం  చెట్ల మీంచి  విమాన వేగంతో వ‌చ్చి రెక్క‌ల‌తోనో, ముక్కుతోనో ఒక్క‌టి కొట్టి అంతే వేగంతో పోతున్నాయి.  ఈ  కాకుల దాడి కూడా మే, జూన్ మాసాల్లోనే ఎక్కువ‌గా వుంటుంది. కార‌ణం ఆ  మాసాల్లో అవి గుడ్లు పెడ‌తాయి. ఆ స‌మ‌యంలో అవి మ‌రింత జాగ్ర‌త్త‌గా  వుండాల‌న్న ధోర‌ణితో ఎక్కువ దాడులు చేస్తున్నా యిట‌.  కానీ  మ‌రీ ఆస్ప‌త్రికి వెళ్లాల్సినంత గాయాలు కావ‌డం లేద‌ని బీచ్ పోలీసులు అంటున్నారు. ఏమ‌యినా దాడి దాడే, కుక్క‌యినా, కాక‌యినా!  వాటి ధాటికి భ‌య‌ప‌డి చాలామంది ఆ బీచ్‌వేపు వెళ్ల‌డం లేద‌ట‌. అలా ప‌ర్యాట‌కుల శాతం త‌గ్గిపోయింద‌ని అక్క‌డి హోటల్ య‌జ‌మాని తెగ బాధ‌ప‌డుతున్నాడు. ఎందుకంటే న‌లుగురూ   వ‌స్తేనేగా త‌న ద‌గ్గ‌ర సమోసాలో, మిర్చిబ‌జ్జీలో అమ్ముడ‌య్యేది!  ఇలా అంద‌ర్నీ దూరం చేసుకోవ‌డం ఇష్టంలేక ఆయ‌న ఒక చిత్ర‌మైన ఆలోచ‌న చేసేడు. అదేమంటే  కాకుల్ని అక్క‌డి నుంచి పారిపోయేలా చేయ‌డానికి ఆయ‌న త‌న డ‌బ్బుల‌తో ఒక డేగ‌ను పెంచుతున్నాడ‌ట‌. నాలుగు డ‌బ్బులు వ‌చ్చే ఆలోచ‌న చేయ‌మంటే వచ్చేదానిలో రెండు రూపాయ‌లు పోయేలా చేసుకుంటున్నాడు. కానీ త‌ప్ప‌డం లేదు మ‌రి!