లక్ష డాలర్ల ఫీజు మినహాయింపు.. ఎవరెవరికి వర్తిస్తుందో తెలుసా?

అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. హెచ్-1బీ వీసా కోసం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (ఇండిమర: కరెన్సీలో దాదాపు 8 కోట్ల 30 లక్షలు) ఫీజు విషయంలో   స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఎఫ్‌-1 (విద్యార్థి), జే-1 (పరిశోధకులు), ఎల్-1 (అంతర్గత బదిలీ) వంటి వీసాలపై ఉన్నవారు హెచ్-1బీకి మారేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది.  యూఎస్‌సీఐఎస్‌ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ ఫీజు నిబంధన అమెరికా వెలుపల నుంచి కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్న విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించింది. అలాగే, ప్రస్తుతం హెచ్-1బీపై పనిచేస్తూ వీసాను పునరుద్ధరించుకునేవారికి,  లేదా  అక్కడే పని చేస్తూ ఒక కంపెనీ నుంచి మరో  కంపెనీకి మారేవారికి కూడా ఈ ఫీజు వర్తించదు. ఇది నిస్సందేహంగా భారీ ఊరటేనని చెప్పవచ్చే. అయితే ఇందుకూ కొన్ని మినహాయింపులూ, షరతులు ఉన్నాయి.  ఎవరైనా విద్యార్థి వీసాపై ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక పనులు చేసినట్లు తేలితే, వారికి ఈ మినహాయింపు లభించదు. అలాంటి వారి వీసా మార్పు దరఖాస్తు తిరస్కరణకు గురైతే, వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించి తీరాలి. అలాగే ఈ ఏడాది  సెప్టెంబర్ 21వ తేదీకి ముందు హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందిన వారికి కూడా పాత నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది. అంటే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందదు. ఇప్పటికిప్పుడు గణాంకాల ప్రకారం చూస్తే అమెరికాలో 3లక్షల 30 వేల మంది భారత విద్యార్థులు ఉన్నారు. అంటే అక్కడకు వెళ్లి చదువుకుంటున్నారు. వారిలో లక్ష మందికి పైగా  ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నారు. ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో స్టెమ్ కోర్సులు చదివి మూడేళ్ల వరకూ అమెరికాలో పని చేసే అవకాశం ఉన్న విద్యార్థులకు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు లభించినట్లే.  అంతే కాదు కంపెనీల యాజమాన్యాలు కూడా వీరికి హెచ్-1బీ స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తాయి.  

మనుషుల్ని భయపెట్టే కుందేళ్లున్నాయి.. ఎక్కడంటే?

కుందేలు అనగానే భయంభయంగా చూసే చూపులు గుర్తుకొస్తాయి. మనిషి అలికిడి వినిపిస్తే చాలు గుంతులేస్తూ పరుగులెత్తే పొడుగు చెవుల బెదురు జీవి చెవులపిల్లి. అయితే జపాన్ లోని ఆ దీవిలో మాత్రం కుందేళ్లు ఇందుకు భిన్నంగా ఉంటాయి. విప్లవ కవి వంగపండు ప్రసాదరావు రాసినట్లు సెమరపిల్లులు శంఖమూదినట్లు.. మనిషి అలికిడి వినిపిస్తే చాలు చుట్టుముట్టేస్తాయి. మనిషినే భయంతో పరుగులెత్తేలా చేస్తాయి. ఇంత పిసరు భయం లేదు. పైపెచ్చు సంఘటిత శక్తికి తిరుగే లేదన్నట్లు వేల సంఖ్యలో మందలు మందలుగా వచ్చి ఎదుట నిలుస్తాయి. అన్నికుందేళ్లు దాడి చేసినట్లుగా మీదమీదకి రావడం చూస్తే కొమ్ములు తిరిగిన మొనగాడైనా సరే భయంతో వణకాల్సిందే. కుందేళ్లేమిటి.. మనుషులను బెదరించడమేంటి అనుకుంటున్నారా? ఆగండాగండి.. అక్కడికే వస్తున్నా.. జపాన్ లోకి కుందేళ్ల దీవిలో కుందేళ్లకు భయమంటే ఏంటో తెలీదు. జపాన్ లోని ఒకోనిషిమా దీవినే కుందేళ్లు అంటారు. గతంలో ఈ దీవిని విషవాయువుల మీద పరిశోధనలకు వినియోగించేవారు. ఆ తరువాత దానిని పట్టించుకున్న వాళ్లే లేరు. అదిగో అలాంటి దీవిలో ఎవరో కొన్ని కుందేళ్లను వదిలారు. అనతి కాలంలోనే వాటి సంతతి వందలు దాడి వేలకు వేలు పెరిగింది.  వాటిని చూడడానికి జనం రావడం మొదలైంది. పెద్దగా సమయం తీసుకోకుండానే ఆ కుందేళ్ల దీవి ఓ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.  జపాన్ సర్కార్ కూడా దీనిని కుందేళ్ల అభయారణ్యంగా భావించి, ఆ దీవిలో చెత్త వేయడాన్ని నిలిపివేసింది. విషవాయువుల ప్రయోగాలను అంతకు ముందే ఆపేసింది. అంతే కాదు.. ఆ దీవిలోకి పెంపుడు జంతువులను తీసుకువెళ్లడాన్నీ నిషేధించింది. కుందేళ్లకు ఆహారం అందించడానికి పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. దీంతో అక్కడ పెరిగిన, పెరుగుతున్న కుందేళ్లకు తమ సహజసిద్ధ గుణమైన భయం మాయమైంది. స్వేచ్ఛగా ఆ దీవే తమ సామ్రాజ్యం అన్న ధీమా వచ్చేసింది. ఆ దీవికి వచ్చే పర్యాటకులు కేందేళ్లకు ఆహారం తీసుకురావడం సహజం కదా? ఆ ఆహారం కోసమే మనిషి అలికిడి వినిపిస్తే చాలు వేల సంఖ్యలో కుందేళ్లు ఆ మనిషిని చుట్టుముట్టేస్తాయి.  ఆ కుందేళ్ల దీవిని సందర్శించిన వారు అక్కడి కుందేళ్ల ధైర్య సాహసాలకు సంబంధించిన ఫొటోలూ, వీడియోలూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడా దీవి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ జపాన్ లోనే అతి ప్రధానమైన పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.  

ఆధార్ లింక్డ్ టీష‌ర్టులెక్క‌డైనా చూశారా!?

ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు.. ఊరే మెచ్చిన ప‌నివాడు.. అన్న ముత్తు సినిమాలోని  పాట వినే ఉంటాం. అయితే ఇక్క‌డ అంద‌రూ మొన‌గాళ్లే. అంద‌రూ ప‌నివాళ్లే.. కావాలంటే ఈ ఆధార్ ముద్రిత టీష‌ర్టును చూడండీ.. మీకిట్టే తెలిసిపోతుంది. అరే ఇదేదో భ‌లేగుందే.. అని మీకూ అనిపించింది కదూ.. అయితే మీరీ స్టోరీ త‌ప్ప‌క తెలుసుకోవ‌ల్సిందే. ఏపీలోని అన‌కాప‌ల్లి జిల్లా న‌క్క‌ల‌ప‌ల్లి మండ‌లంలోని.. రాజ‌య్య పేట గ్రామంలో బ‌ల్క్ డ్ర‌గ్ ఫ్యాక్ట‌రీ వ్య‌తిరేక ఉద్యమం జ‌రుగుతోంది. మొన్నామ‌ధ్య వీరు హోం మంత్రి అనిత‌ను అట‌కాయించ‌డంతో పాటు.. జిల్లా క‌లెక్ట‌ర్ని సైతం త‌మ ఊరికే ర‌ప్పించిన ఘ‌నులు.  అయితే ఈ గ్రామ ఆందోళ‌న‌కారులు.. త‌మ ఊరిలోకి మ‌రెవ‌రూ రాకూడ‌ద‌న్న నిబంధ‌న పెట్టుకున్నారు. అంటే ఈ గ్రామ ఉద్య‌మంలో మ‌రే ఇత‌ర అసాంఘిక, రాజ‌కీయ శ‌క్తులు లోప‌ల‌కు రాకూడ‌ద‌నుకున్నారో ఏమో.. మా మూమెంట్ ఎక్స్ క్లూజివ్ అన్న ముద్ర వేయాల‌నే అనుకున్నారో తెలీదు గానీ,  ఒక రూలైతే పెట్టుకున్నారు.  అంతా బాగుంది కానీ.. ప్ర‌తి సారీ వీడు మ‌నూరోడూ.. వీడు మ‌నూరోడు కాడ‌ని ఎలా తెలుసుకోవ‌డం?.. అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. అరెరే పెద్ద చిక్కే వ‌చ్చిందే అని బ్ర‌హ్మానందంలా ఫీల‌య్యి.. ఎట్ట‌కేల‌కు ఇదిగో ఈ టీష‌ర్టు ఐడియా అమ‌లు చేశారు. దీంతో ఎస్ ఇలాంటి ఆధార్ ప్రింటెడ్ టీష‌ర్టు  మ‌నం త‌ప్ప మ‌రే ఊరోళ్లూ వేస్కోర‌ని క్రేజీగా ఫీల‌య్యి.. ఇదిగో ఇలా త‌మ టాలెంట్ చూపించార‌న్న‌మాట‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్లు, ఔట‌ర్ ఐడీలు మాత్ర‌మే చూసిన జ‌నం.. ఇదిగో ఈ ఊరోళ్లు ఆధార్ లింక్డ్ టీష‌ర్టుల‌ను చూసి.. ఈ ఊరోళ్లంతా భ‌లే టాలెంటెడ్ గా ఉన్నారే.. అంటూ స‌ర‌దా కామెంట్లు చేస్తున్నారు ఈ ప‌రిస‌ర ప్రాంత వాసులు.

జగన్ దీపావళి వేడుకల వెనుక అసలు రహస్యం ఇదేనా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది దిపావళి సంబరాలలో పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా బాణ సంచా కాల్చి సందడి చేశారు. సతీసమేతంగా ఆయన దీపావళి సంబరాలు చేసుకుని బాణసంచా కాల్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ తన లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత బెంగళూరులోని తన యహలంక ప్యాలెస్ లో సతీమణి భారతితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. ఎందుకంటే జగన్ బహిరంగంగా దీపావళి సంబరాల్లో పాల్గొన్న సందర్భం గతంలో ఎన్నడూ లేదు. కాగా జగన్ దీపావళి పండుగను జరుపుకున్న విషయాన్ని వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా షేర్ చేశారు.  గతంలో ఎన్నడూ ఇలా ఒక హిందూ పండుగను జగన్ దంపతులు జరుపుకున్న సందర్భం లేదు. అసలాయన హిందూ పండుగలు జరుపుకోవడానికి పెద్దగా ఇష్టపడరన్న ప్రచారం ఉంది. దేవాళయాలకు వెళ్లినా అక్కడ తీర్థం, ప్రసాదం వంటివి స్వీకరించడానికి జగన్, ఆయన కుటుంబం విముఖత చూపుతారన్న ప్రచారం కూడా ఉంది. అటువంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన సతీసమేతంగా దీపావళి వేడుక జరుపుకోవడం తనపై ఉన్న హిందూ వ్యతిరేక ముద్రను చెరిపివేసుకోవడానికేనని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 

రాష్ట్రపతి ముర్ముకు తృటిలొ తప్పిన ప్రమాదం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలొ బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ల్యాండ్ అయిన తరువాత ఒక పక్కకు ఒరిగిపోయిన హెలికాప్టర్ ను నిముషాల పై ముందుకు నెట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురక్షితంగా హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఈ సంఘటన కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో బుధవారం (అక్టోబర్ 22) జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.   రాష్ట్రపతి నాలుగు రోజుల కేరళ పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి బయలుదేరి కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ద్రౌపది ముర్ము యథావిథిగా తన పర్యటన కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్ సంఘటన జరిగిన తరువాత ఆమె ముందుగా నిర్ణయించిన కార్యక్రమం మేరకు అక్కడ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. 

చంద్రబాబు దుబాయ్ పర్యటన.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలక్ష్యంతో అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. ఆ లక్ష్య సాధనలో బాగంగానే ఈయన మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కోసం బుధవారం (అక్టోబర్ 22) ఉదయం అమరావతి నురంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి యూఏఈ యాత్రకు బయలుదేరారు. విశాఖలో ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన భాగస్వామ్య సదస్సుకు దేశవిదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిథులు హాజరు కానున్నారు.  తన యూఏయూ పర్యటనలో కూడా చంద్రబాబు  వివిధ పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లతో భేటీ అవుతారు. విశాఖ  భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన వారిని ఆహ్వానిస్తారు. ఇక పోతే తన యూఏఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు  దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అలాగే తన పర్యటన తొలి రోజు అయిన బుధవారం చంద్రబాబు  ఐదు సంస్థల ప్రతినిధులతో  భేటీ అవుతారు. ఇక రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు.  అలాగే పర్యటన చివరి రోజున దుబాయ్‌లో  తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.  తొలి రోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు.  

ఆపరేషన్ సిందూర్ హీరోలకు వీర చక్ర పురస్కారాలు

దేశ రక్షణలో   విశిష్ఠ‌ సేవలు అందించడంతో పాటు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన  భారత సైనిక దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది.  ఆపరేషన్ సిందూర్  సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ, వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్ఠాత్మక  వీర చక్ర  పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు కేంద్రం  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ఆపరేషన్లలో భాగంగా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన 1988  మీడియం బ్యాటరీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్‌కు వీర చక్ర లభించింది. అదే విధంగా అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలోనే ప్రత్యేక పరికరాలను విమానాల ద్వారా సమర్థంగా తరలించి, సైనిక సామర్థ్యాన్ని చాటిన 302 మీడియం రెజిమెంట్‌కు చెందిన కల్నల్ కోశాంక్ లాంబాకు కూడా ఈ పురస్కారం వరించింది. భారత వైమానిక దళం నుంచి పలువురు అధికారులు వీర చక్రకు ఎంపికయ్యారు. శత్రువుల   గగనతలంలోకి చొచ్చుకు వెళ్లి నిర్దేశిత లక్ష్యాలను  ఛేదించినందుకు ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూ, ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్) స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించిన గ్రూప్ కెప్టెన్ అనిమేశ్‌ పట్నీ, అలాగే  అర్ధరాత్రి వేళ శత్రు భూభాగంలోకి ప్రవేశించి కోటలాంటి లక్ష్యాలను ధ్వంసం చేసిన స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్, సంక్లిష్టమైన వైమానిక దాడిలో అద్భుతమైన సమన్వయం ప్రదర్శించిన స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్‌లకు  వీర చక్ర పురస్కారాలు ప్రకటించారు. మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీర చక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకితభావం, నాయకత్వ పటిమ, కార్యాచరణ నైపుణ్యాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

హస్తినను కమ్మేసిన వాయు కాలుష్యం

వాయుకాలుష్యం మళ్లీ దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసింది. ఐదేళ్ల కనిష్ఠానికి వాయు నాణ్యత పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం దీపావళి సందర్భంగా నగరవాసులు టపాసులు కాల్చడమేనని పర్యావరణ నిపుణులు అంటున్నారు. దిపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చడానికి తోడు గాలుల మందగమనం కూడా ఈ స్థాయిలో వాయు కాలుష్యం ప్రబలడానికి కారణంగా చెబుతున్నారు. సెంట్రల్ పొల్లూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) మేరకు గత ఐదేళ్లలో ఎన్నడూ హస్తినలో ఈ స్థాయిలో వాయు కాలుష్యం ఏర్పడలేదు.  ఈ నేపథ్యంలో ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లలో  జీఆర్ఎపీ-2 చర్యలు అమలులోకి  వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది దిపావళి సందర్భంగా పరిమితంగానే హరిత బాణసంచా ఉపయోగించినప్పటికీ కాలుష్యం ఈ స్థాయిలో ఏర్పడటంలో హరిత బాణ సంచ నాణ్యతపై కూడా తనిఖీలు చేపట్టాల్సిన అసవరం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

పేకాట శిబిరాలపై చర్యల నివేదిక.. డీజీపీకి పవన్ కల్యాణ్ ఆదేశం

గత వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహించిన పలు చట్ట విరుద్ధ కార్యకలాపాలలో   జూదం ఒకటి. రమ్మీ క్లబ్‌లు, పేకాట శిబిరాలు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ నేతలు  సహా జూద గృహాలను నిర్వహించారు. నిర్వహిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో తెలుగుదేశం నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరి 18 మాసాలు అయినా కూడా ఈ జూద గృహాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్,  ఆఫ్‌లైన్ సహా ఈ పేకాట జాడ్యం విస్తరించింది. దీనిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి పేకాట శిబిరాలు, జూదగృహాలపై పలు ఫిర్యాదులు అందాయి.   వివిధ జిల్లాల ప్రజలు పంపిన ఫిర్యాదుల్లో, కొందరు ప్రముఖులు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్లు అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.   ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974 ప్రకారం జూదం నిర్వహించడం, ఆడడం   శిక్షార్హమైన నేరాలు.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న పేకాట కేంద్రాలపై ఉప ముఖ్యమంత్రి దృష్ఠి సారించారు. చట్ట విరుద్ధంగా రాష్ట్రంలో సాగుతున్న ఈ పేకాట శిబిరాలు, జూదగృహాలపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యల నివేదిక తనకుసమర్పించాల్సిందిగా పవన్ కల్యాణ్ డీజీపీని ఆదేశించారు.  

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతుంటారు. బుధవారం (అక్టోబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 26 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 21) శ్రీవారిని మొత్తం 76 వేల 343 మంది దర్శించుకున్నారు. వారిలో 18 వేల768 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది. 

ప్రత్యేక కోర్టు ద్వారా లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ : సీఎం చంద్రబాబు

  కందుకూరులో ఇటీవల హత్యకు గురైన లక్ష్మీనాయుడు కేసును ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్షపడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా లక్ష్మీ నాయుడు హత్యను సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంత అమానుషమని, అమానవీయం అని వ్యాఖ్యానించారు. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అన్నారు. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. రూ.5 లక్షల చొప్పున పరిహారం.. 2 ఎకరాల చొప్పున భూమి లక్ష్మీనాయుడు హత్యతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వీరితో పాటు దాడిలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడి ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని చంద్రబాబు అధికారులను సూచించారు.  అంతేకాకుండా ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని అన్నారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని చెప్పారు. భార్గవ్‌కు కూడా రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా వ్యవహారాల పట్ల ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భధ్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. 

పేకాట శిబిరాల నిర్వహణపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు

  ఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం,  జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ - 1974 ప్రకారం  శిక్షార్హులు అవుతారు అని చట్టం చెబుతోంది. రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని డిప్యూటీ సీఎం కార్యాలయానికి  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.  పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదుల్లో తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారి మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే  ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  దీనిపై ఆరా తీశారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని హోం శాఖకి  రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేశారు.

రియాజ్ ఎన్‌కౌంటర్‌పై హెచ్‌ఆర్సీ సుమోటో కేసు

  రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన వరస కథనాల ఆధారంగా చేసుకొని హెచ్ఆర్సి కేసు నమోదు చేసుకుని... ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలంటూ తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు .కానిస్టేబుల్ ఎం. ప్రమోద్ కుమార్ ను అతి కిరాతకంగా హత్య చేసిన అనంతరం నిందితుడు రియాజ్ పరారీలో ఉన్నాడు.  అయితే డిజిపి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. రియాజ్‌ను  వెంటనే పట్టుకోవాలంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిన్న నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సారంగాపూర్ లో నిందితుడు రియాజ్ ఓ ద్విచక్ర వాహనదారుడి తో గొడవ పడుతుండగా పోలీసులు అతన్ని పట్టుకొని... నిజామాబాద్ హాస్పి టల్ కి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందు తున్నాడు.  అయితే నిందితుడు రియాజ్ బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా తనకు సెక్యూరిటీగా ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సర్వీస్ గన్ తీసుకొని పోలీసు లను చంపుతానంటూ బెదిరింపు లకు గురి చేస్తూ అక్కడినుండి పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ పై దాడికి పాల్పడ డంతో ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపామని.... ఈ క్రమంలోనే అతను మరణించాడని పోలీసులు వాదించారు.  ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవ నివేదిక సమర్పించాలంటూ హెచ్ఆర్సీ....డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ లేదా మెజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివ రాలు ఇవ్వాలని సూచించారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 కింద ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది... కాబట్టి ఈ ఘటనపైసుప్రీంకోర్టు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్కౌంటర్ కు దారి తీసిన పరి స్థితులు మరియు ఎన్కౌంటర్ మరణంపై హెచ్ఆర్సీ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ కాపీ మరియు పోస్టు మార్టం నివేదికతో సహా నవంబర్ 24వ తేదీ వరకు నివేదిక ను సమర్పించా లంటూ డీజీపీకి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కారు ఢీకొని బాలుడి మృతి

    ఓ కారు మితిమీరిన వేగంతో బీభత్సం.... ఓ చిన్నారి బాలుడి ప్రాణం ఖరీదు... దీపావళి పండుగ రోజు ఇంట్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్.. చేయకూడదంటూ పోలీసులు  హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అయినా కూడా యువత ఆ మాటలను పెడచెవిన పెట్టి మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ఇతరుల మరణానికి కారకులవుతున్నారు. నిన్న దీపావళి పండుగ రోజు నార్సింగీ పరిధిలో ఓ కారు చేసిన బీభత్సానికి ఓ చిన్నారి బాలుడు మృత్యువాతపడ్డాడు.  ఆ ఘటన పలువురి హృదయాలను కదిలించివేసింది... రంగారెడ్డి జిల్లా నార్సింగీ కి చెందిన నవీన్ కుమార్ దీపావళి పండుగ సందర్భంగా తన రెండు సంవత్సరాల కొడుకు కూషన్ జోయల్‌ను  తీసు కొని టపాసులు కోసమని బైక్ మీద ఖాజా గూడా వెళ్లారు. తిరిగి ప్రయాణంలో అల్కాపూర్ రాగానే వీరి ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుండి ఒక కారు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టింది.  ఆ తాకిడికి బైక్ పై ఉన్న తండ్రి కొడుకు ఇద్దరు ఎగిరి రోడ్డు మీద పడిపోయారు. వెనువెంటనే కారు చిన్నారిపై నుండి రయ్ రయ్ అంటూ దూసుకువెళ్ళింది. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారి బాలుని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ బాలుడు మృతిచెందాడు.  దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలను కొనుక్కొని తన కొడుకుతో పాటు సంతోషంగా ఆడుకోవాలని చూసిన ఆ తండ్రికి... తన చేతు ల్లోనే ప్రాణాలు విడిచిన కొడుకును చూస్తూ బోరున విలపించాడు... అతని రోదన చూసి స్థానికులు, వాహన దారులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన పలువురి హృదయాలను కదిలించివేసింది. కొడుకు మరణ వార్త వినగానే తల్లి తన గారాల పట్టి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడంటూ  గుండెలు బాదుకుంది. నవీన్ కుమార్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగించారు.

వైసీపీ నేత భూమనకు షాక్

  వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డికి తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గోవుల మృతిపై ఆధారాలు చూపాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని తిరుపతి ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. గోశాలలోని అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే పదుల సంఖ్యలో గోవులు అకాల మరణం చెందాయని భూమన విమర్శించారు. వాటికి సరైన సంరక్షణ, వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భూమన ఆరోపించారు. భూమన చేసిన ఆరోపణలు స్థానికంగా రాజకీయ దుమారం రేపడంతోపోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. 

నవంబర్ 19న బతుకమ్మ చీరలు పంపిణీ

  తెలంగాణలో మహిళా సంఘాల సభ్యులకు చీరలు నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంచింది. మహిళా శక్తితో పేరుతో వీటిని పంపిణి చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బతుకమ్మ పండుగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్దం కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ 15 నాటికి తయారీ చేసి 19న పంపిణీ చేయాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,848 స్వయం సహాయకం బృందాల్లో (ఎస్‌హెచ్‌జీ).. 1.94లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపుల్లో ఉన్న వారందరికీ.. ఒక్కో చీర చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అంటే మొత్తం 1.94 లక్షల చీరలు అవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా చీరలను ఇవ్వడం ప్రారంభించింది. సరిగ్గా బతుకమ్మ నాటికి చీరలను పంపిణీ పూర్తి చేసేది. అయితే బీఆర్ఎస్ సర్కార్ పంపిణీ చేసిన చీరలు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. బతుకమ్మ పండుగకు నాణ్యమైన చీరలు ఇస్తామని ప్రకటించింది. అందుకోసం చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను తయారీ చేయిస్తున్నారు.

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి : సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ పోలీసు శాఖ చర్యలతో మవోయిస్టు, ఉగ్రవాద చర్యలు తగ్గిపోయాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహాల్​‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్​ ఫ్లాగ్​ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు.  ఆజ్జాతంలో ఉన్న మవోయిస్టులు లోంగిపోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొందరు మవోయిస్టు అగ్రనేతలు కొందరు లొంగిపోయారని అలాగే మిగిలినవారు కుడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి తెలంగాణ పునర్నిర్మాణనికి తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని సీఎం తెలిపారు.  మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారని గుర్తుచేశారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ వెల్ఫేర్ నుండి రూ.8 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు  

ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే వాళ్లకు అదే ఆఖరి రోజు : సీఎం చంద్రబాబు

  ఏపీలో పోలీస్ శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తుమన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని 6 ఏపీఎస్పీ బెటాలియన్ లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కల్తీ మద్యంపై సీఎం కీలక వ్యాఖ్యలు..ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పాను రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేశారని పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవు చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే ఉండేవని కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.  వాళ్లు ఏది అనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీన్ని కొత్త ఛాలెంజ్ గా తీసుకోవాలి కొత్త ట్రెండ్స్ ను అరికట్టడానికి చొరవ తీసుకుని ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదు. సీసీ కెమోరాలు, డ్రోన్లు, గూగుల్ టేకౌట్‌లను ఉపయెగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.  పోలీసు సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి పనిచేస్తున్నారంటూ పోలీసులను ప్రశంసించారు. ఈ ఏడాది విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని,. వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.  ఈ కార్యక్రమంలో  సీఎస్ విజయానంద్ , డీజీపీ హరీష్ కుమార్ గుప్తా  పాల్గొన్నారు.

ద ఫ్యామిలీ మేన్ బాబు

  చంద్ర‌బాబు 4. 0 అంటే అంద‌రూ అది ప‌రిపాల‌న‌లో అనుకుంటారు. కానీ, ఆయ‌న ప‌రిపాల‌న ఇప్పుడేంటి ఎప్పుడో అంత‌ర్జాతీయ స్థాయికి చేరిపోయింది. ఈ విషయంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలే లేవు. ఆయ‌న ఇప్పుడే కాదు ఎప్ప‌టి నుంచో.. అడ్మినిస్ట్రేష‌న్ లో బ్రాండెడ్ సీఎంగా ఉన్నారు. ఆ మాట‌కొస్తే.. సీఈవో ఆఫ్ ద స్టేట్ అనే బిరిదు ఆయ‌న‌కు తాను తొలి సారి సీఎం అయిన‌ప్ప‌టి నుంచీ ఉంది. బాబు మారింద‌ని చెబుతోంది.. ఆయ‌న యాటిట్యూడ్ కి సంబంధించిన‌ది. ఇటు కుటుంబం కావ‌చ్చు, అటు ప్ర‌జ‌ల మ‌ధ్య ఆయ‌న తీరు తెన్నులు కావ‌చ్చు.. వీటి విష‌యంలో విశేష‌మైన మార్పు రావ‌డ‌మే.. బాబు 4. 0 స్పెష‌ల్ మీరు భువ‌నేశ్వ‌రిగానీ, లోకేష్ గానీ మాట్లాడేట‌పుడు బాబు గురించి వారేమంటారో గుర్తించారా? నా బాల్యంలో కావ‌చ్చు నా ఎదుగుద‌లలో కావ‌చ్చు డాడీ పెద్ద‌గా ఉండేవారు కాద‌ని అంటారాయ‌న‌. ఒక పొలిటీషియ‌న్ గా మ‌రీ ముఖ్యంగా ఒక సీఎంగా ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు ఆల్వేస్ బిజీయే. ఇక నారా భువ‌నేశ్వ‌రీ మాత అన్న‌మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే త‌న మొత్తం ఫ్యామిలీ లైఫ్ లో బాబు తీసిచ్చింది ఒకే ఒక్క చీర‌గా చెప్పుకుని బాధ ప‌డ్డారామె.  లోకేష్ కొర‌త తీరేలా త‌న కేబినేట్లో మంత్రిని చేసి.. ఇక్క‌డ కావ‌చ్చు, ఏదైనా విదేశాల‌కు తీసుకెళ్ల‌డం కావ‌చ్చు.. చేస్తూ కొడుకు ముచ్చ‌ట తీర్చుతున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న మోడీ క‌ర్నులు జీఎస్టీ స‌భ‌లో కూడా త‌న త‌న‌యుడ్ని అది ప‌నిగా ద‌గ్గ‌ర‌కు తీస్కుని మోడీకి మొమెంటో ఇప్పించారు చంద్ర‌బాబు. అది క‌దా తండ్రి కొడుకుల వాత్స‌ల్యం అనిపించేశారు. ఈ మ‌ధ్య కాలంలో ఒక చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న శాల‌కు వెళ్లిన‌పుడు త‌న భార్య కోసం ప్ర‌త్యేకించీ ఒక చీర కొన్నారు చంద్ర‌బాబు. మా ఆవిడ నేనే చీర కొనివ్వ‌లేద‌ని కంప్ల‌యింట్ చేస్తోందీ.. ఆమె కోసం ఒక మంచి చీర ఇవ్వండ‌య్యా అంటూ అడిగి మ‌రీ ఆ లోటు తీర్చే య‌త్నం చేశారు. అలాంటి చంద్ర‌బాబుకు పండ‌గ‌లు ప‌బ్బాలు కూడా.. ఫ్యామిలీతో క‌ల‌సి ఉండేవి కావు. ఎప్పుడూ ఏదో ఒక బిజీ బిజీ. అలాంటిది ఇప్పుడు త‌న కుటుంబానికి కూడా కాస్త స‌మ‌యం కేటాయిస్తున్న దృశ్యానికి ఇదిగో ఇదే అస‌లైన సాక్ష్యం. గృహ‌మే క‌దా స్వ‌ర్గ సీమ అన్న‌ట్టుగా త‌న ఉండ‌వ‌ల్లి నివాసంలో స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రితో క‌ల‌సి ఆయ‌న దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపుకోవ‌డం చాలా మంది దృష్టిని ఆక‌ర్షిస్తోంది. బాబు బొత్తిగా మారిపోయారోచ్ అంటూ ఒక‌టే కామెంట్లు పేలుతున్నాయ్ కొంద‌రి సోష‌ల్ మీడియా గోడల మీద‌. ఆ మాట‌కొస్తే.. బాబు ఫోర్ పాయింట్ ఓ అంటే ఇదేనంటూ కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు కొంద‌రు నెటిజ‌న్లు.