Mohan Babu award

లండన్ లో మోహన్ బాబుకు సత్కారం

  మోహన్బాబు అంటే మనకు గుర్తొచ్చేది ఆయన కంఠం, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. ఎటువంటి సపోర్టు లేకుండానే తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రతిభకు గుర్తుగా సత్కారం పొందనున్నారు. లండన్ తెలుగు అసోసియేషన్ (టీఏఎల్) వాళ్లు తెలుగు చిత్రపరిశ్రమకు 40 సంవత్సరాలుగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా వచ్చే శనివారం మోహన్బాబును అవార్డుతో సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. తమ సంస్థ తరపున అవార్డు అందిస్తూ సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉందని టీఏఎల్ అధ్యక్షుడు దాసోజు రాములు తెలిపారు. తను అందుకోబోతున్న అవార్డును తన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు అంకితం చేస్తున్నానని మోహన్బాబు అన్నారు.

MAA Elections

మా ఉపాధ్యక్షురాలు మంచు లక్ష్మి

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ పడుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ పోటీ వలన సినీ పరిశ్రమలో చీలిక ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న సినీ పెద్దలు కొందరు వారిరువురిలో ఎవరో ఒకరిని పోటీ నుండి విరమిమ్పజేసేందుకు ఇరువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీ మోహన్ జయసుధకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆయన కూడా ఈ పోటీని నివారించి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. సినీ పరిశ్రమలో అందరి కంటే సీనియర్ అయిన దాసరి నారాయణరావు సహకారంతో ఈ పోటీని నివారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనబడటం లేదు. రాజేంద్ర ప్రసాద్, జయసుధ ఇరువురూ కూడా తమ నామినేషన్లు వేసారు. ఈనెల 29న మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు ఇస్తున్నట్లు నాగబాబు ప్రకటించడంతో ‘మెగా హీరోల మద్దతు ఆయనకే ఉంటుందని అనదరూ భావిస్తున్నారు.   ఇక ప్రముఖ నటి మరియు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ‘మా’ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఆమెతోబాటు శివకృష్ణ కూడా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, శివాజీ రాజా ప్రధాన కార్యదర్శిగా, ప్రముఖ హాస్యనటుడు ఆలీ ‘మా’ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

Jendapai Kapi Raju

జెండాపై కపిరాజు సినిమా రివ్యూ

  మళ్ళీ చాలా రోజుల తరువాత నాని జెండాపై కపిరాజుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేడు. నాని తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. కానీ ఏదో చాలాసార్లు చేసినట్లు చాలా అలవోకగా రెండు పాత్రలను ఇరగదీసేసాడు. రెండు పాత్రలలో ఒకటి డీసెంటుగా ఉండే ఐ.టి. ప్రొఫెషనల్, మరొకటి దానికి పూర్తి భిన్నంగా ఉండే మోసగాడి పాత్ర. తమిళ్, తెలుగు బాషలలో ఒకేసారి నిర్మింపబడిన ఈ సినిమాలో తెలుగులో నాని, తమిళ్ (నిమ్రిందు నిల్)లో జయం రవి చేసారు. రెండూ ఒకేసారి నిర్మించబడినప్పటికీ ముందుగా (క్రిందటి నెలలో) విడుదలయిన తమిళ వెర్షన్ సూపర్ హిట్ అయ్యింది. కనుక తెలుగులో కూడా రిలీజ్ కాకముందే హిట్ టాక్ మూటగట్టుకొని మరీ వచ్చింది. మరి హిట్టా ఫట్టా ఒకసారి లుక్కేద్దామా?   ఇంతకీ కధ ఏమిటంటే నాని ఒక ఐ.టి.ప్రొఫెషనల్. తన చుట్టూ ఉండే సమాజంలో అందరూ పద్ధతి ప్రకారం నడుచుకోవాలనుకొంటాడు. నీతి నియమం, న్యాయం ధర్మం అవసరమని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో కొంత ఘర్షణ ఎదుర్కోవలసి వస్తుంటుంది. ఈ లైన్ వినగానే టక్కున అందరికీ ‘అపరిచితుడు’ సినిమా గుర్తుకు రావచ్చును. కాకపోతే ఈ కధ వాస్తవానికి దగ్గరగా సహజంగా ఉంటుంది. దానిని నాని తన స్టయిల్లో చాలా చక్కగా ప్రెజంట్ చేసాడు. ప్రతీ వ్యక్తి ముందు తనను తాను సంస్కరించుకొంటే సమాజంలో కూడా మార్పు వస్తుందనేది సినిమా కాన్సెప్ట్.   నానితో హీరోయిన్ గా నటించిన అమలాపౌల్ చాలా చక్కగా నటించి ఈ సినిమా ద్వారా తన ప్రతిభను మరొకసారి చాటుకొంది. మరో హీరోయిన్ రాగిణీ ద్వేవేది కూడా బాగానే చేసింది. కానీ ఆమె అందాల ప్రదర్శనకే సరిపెట్టుకోవలసి వచ్చింది. తనికెళ్ళ భరణి, ఆహుతీ ప్రసాద్, వెన్నెల కిషోర్, శరత్ బాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. సూరి, శివ బాలాజీ, ధన్ రాజ్ తదితరులు కూడా బాగానే నటించారు. ఈసినిమా ఫాస్ట్ ఆఫ్ చాలా వేగంగా సాగినప్పటికీ, సెకండ్ ఆఫ్ వచ్చేసరికి కొంచెం స్పీడ్ తగ్గింది. పైగా సినిమాకి మసాలా జోడించే ప్రయత్నంలో అనవసరమయిన చోట పాటలు, ఫైట్లు పెట్టారు. కానీ నానీ తన స్టయిల్ తో ఆ లోపాలనన్నిటినీ కనబడకుండా మాయచేయడంతో ప్రేక్షకులకు ఎక్కడా విసుగనిపించదు. ఈ సినిమాలో లోపాలను కొంచెం పక్కనబెడితే ఇది తప్పకుండా చూడదగ్గ సినిమాయే.   నిర్మాతలు: కె.యస్. శ్రీనివాసన్ మరియు కె.యన్. శివరామ్; బ్యానర్: వాసన్ విజువల్స్ వెంచర్స్, కధ, దర్శకత్వం: సముద్రఖని, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, కెమెరా: యమ్. సుకుమార్ ఎడిటింగ్: యస్.యాన్. ఫాజిల్,

Tungabhadra Review

'తుంగభద్ర' రివ్యూ

తారాగణం: అదిత్, డింపుల్, సత్యరాజ్‌, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, సప్తగిరి, రాజేశ్వరి నాయర్‌, ధన్‌రాజ్‌, నవీన్‌, రవివర్మ, చరణ్‌, శశాంక్‌ తదితరులు, నిర్మాత.. సాయి కొర్రపాటి, డైరెక్టర్.. శ్రీనివాస కృష్ణ   నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్రం బేనర్లో నిర్మించిన కొత్త చిత్రం తుంగభద్ర. ఈగ, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య లాంటి పలు హిట్ చిత్రాలు ఈయన నిర్మాణంలో వారాహి బేనర్ నుండి వచ్చినవే. అయితే వరుస హిట్ చిత్రాలు అందించిన ఈ బ్యానర్ నుండి వచ్చిన చిత్రం కాబట్టే తుంగభద్రపై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలే ప్రేక్షకులని థియేటర్ల వైపు నడిపించేలా చేశాయి. రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవల మధ్య ఓ చిన్న ప్రేమకథను జోడించి తుంగభద్ర చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చిందా, సాయి కొర్రపాటిపై ప్రేక్షకులు పెట్టుకొన్ననమ్మకాన్నినిలబెట్టుకోగలిగాడా లేదా చూద్దాం.  ఇక కథలోకి వెళదాం.. రామరాజు (సత్యరాజ్), త్రిమూర్తులు(చలపతిరావు) తాడికొండ నియోజకవర్గంలో పొలిటికల్ లీడర్లు. ఈ ఇద్దరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే ఈ పొలిటికల్ ఫ్యాక్షన్ గొడవల వల్ల రామరాజు చేతిలో త్రిమూర్తులు ప్రాణాలు కోల్పోతాడు. త్రిమూర్తులు కొడుకులు తమ తండ్రిని చంపిన రామరాజును చంపి పగ తీర్చుకొవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి అదను చూసి దాడి చేస్తారు. కానీ ఈ దాడిలో రామరాజు అనుచరులు తమ ప్రాణాలు అడ్డువేసి రామరాజుని కాపాడుతారు. ఆ చనిపోయిన అనుచరుల్లో ఒకడి కొడుకే హీరో శ్రీను (అదిత్). తమ తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి రామరాజుకు అనుచరుడిగా వచ్చిన శ్రీను రామరాజు కూతురి ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసిన రామరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు? తరువాత పరిస్థితులను శ్రీను ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ. ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.... ఈ సినిమాలో ముందుగా సత్యరాజ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. నాయకుడు పాత్రలో ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. సినిమా మొత్తానికి ఆయన ఫెర్ఫార్మెన్స్ హైలెట్. హీరో అదిత్ అంతా గొప్పగా చేయలేకపోయినప్పటికీ పర్వాలేదనిపించాడు. హీరోయిన్ డింపుల్ తన శక్తి మేరకు బానే చేసింది. అయితే ఇంతకు ముందు సినిమాల్లో కామెడీ పండించిన సప్తగిరి మాత్రం ఈసారి ఎక్కువ నవ్వించలేకపోయాడు. జబర్దస్త్ శ్రీను, నవీన్, ధనరాజ్ ఉన్నంతలో అక్కడక్కడా కామెడీ చేశారు. పైడితల్లి పాత్రలో కోట శ్రీనివాసరావు ఎప్పటిలాగే తన సహజనటనతో మెప్పించారు. టెక్నికల్ గా రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ బావుంది.  హరిహర అందించిన సంగీతం కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. స్క్రీన్ ప్లే కూడా అంత చెప్పుకోదగిన విధంగా ఏమీ లేదు. సినిమాలో ఇటు ఫ్యాక్షన్ అంశాలను, అటు ప్రేమకథను ఆసక్తికరంగా చూపడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరో, దర్శకుడి గురించి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోయినా వారాహి చలన చిత్రం దృష్టిలో పెట్టుకొని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు నిరాశకు గురయ్యాడు.

Coronation Street actress Catherine Tyldesley

కేథరిన్‌ డెలివరీ.. పండంటి అబ్బాయి..

  ప్రముఖ హీరోయిన్ కేథరిన్ టైడెస్లీ డెలివరీ అయింది. పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఆ పసికందు కూడా కేథరిన్ మాదిరిగానే ముద్దుగా వున్నాడని తెలుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్ టామ్ పిట్‌ఫీల్డ్‌తో కేథరిన్ కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. హాలీవుడ్ చిత్రం ‘ది క్యారీ’ సినిమాలో నటించడం ద్వారా కేథరిన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టామ్‌తో డేటింగ్ చేస్తోన్న కేథరిన్ ‘పెళ్ళి’ లాంటి వ్యవహారాల్లో ఇరుక్కోకుండానే ఎంచక్కా పిల్లాణ్ణి కనేసింది. తాను డెలివరీ అయిన అనంతరం ఆమె స్వయంగా ట్విట్లర్లో ఆ విషయాన్ని ప్రకటించింది. ‘మేమిద్దరం కన్న కలలు నిజమయ్యాయి.’ అని ట్విట్ చేసింది.

Bandla Ganesh

దాసరికి బండ్ల గణేష్ కౌంటర్

  అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్య మూర్తి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు దాసరి నారాయణ రావు మాట్లాడుతూ “ఇదివరకు ఏ.యన్.ఆర్. యన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమను దశాబ్దాలపాటు ఏలారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇరువురు మంచి నటులుగా పేరు సంపాదించుకొన్నారు. అందుకే వారిరువురికీ అసంఖ్యాకంగా అభిమానులున్నారు. కొత్తగా సినీ రంగంలో ప్రవేశిస్తున్నవారు, ఇప్పటికే సినిమాలలో నటిస్తున్న వారు కూడా వారిరువురిని అనుకరించే ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాము,”అని అన్నారు.   ఏ.యన్.ఆర్. యన్టీఆర్ ల తరువాత అంత ప్రజాధారణ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లుపొందుతున్నారన్నట్లు మాట్లాడిన దాసరి నారాయణ మాటలకి చిరంజీవి అభిమానులకు ఆగ్రహం కలగడం సహజం. ఆయన చిరంజీవి ప్రసక్తి తేకుండానే వారిని మాత్రమే పొగిడటం ద్వారా చిరంజీవిని తక్కువచేసి చూపారని భాధపడుతున్నారు.   ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ విషయంలో బాధపడినట్లే ఉంది. అందుకే ఆయన కొన్ని ట్వీట్ మెసేజ్ లు పెట్టారు. ఇవి చదివితే చిరంజీవి అభిమానులు సంతోషించడానికి ఈ నాలుగు ముక్కలు సరిపోవూ? అని అనుకోకుండా ఉండలేము.   “రాముడు లేని రామాయణం చదవం. చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం. కాలం మారినా గుణం మారని ధ్రువ నక్షత్రం మెగాస్టార్.”   “రామారావుగారు, నాగేశ్వరరావుగారు, కృష్ణగారు తర్వాత స్వయంకృషితో నెంబర్-వన్ అయ్యి మూడు దశాబ్దాలుగా నిలబడిపోయిన మెగాస్టార్ చిరంజీవి.”   “తెలుగువారి క్యాలెండర్లో పండగలు ఉంటే, తెలుగు సినీపరిశ్రమ కాలెండర్లో చిరంజీవిగారి సినిమా రిలీజ్ డేట్స్ ఉంటాయి.”   “చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అని చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటాం.”   “ బాక్స్ ఆఫీసుని పునర్నిర్వచించిన మెగాస్టార్ చిరంజీవి. సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నించి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ దాక ఎదురుచూసే సినిమా మెగాస్టార్ సినిమా.”   “జై చిరంజీవ!! జై చిరంజీవ! చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!!"                

salmankhan

ఐశ్వర్య ఊసెత్తని సల్మాన్

  కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలతో ఎంత పాపులరో, రూమర్లతో కూడా అంతే పాపులర్. మన హీరో ఎప్పుడూ ఎదో ఒక గాసిప్ తో నిరంతరం వార్తల్లో ఉంటూనే ఉంటాడు. లేటెస్ట్ గాసిప్ ఏంటంటారా అక్కడికే వస్తున్నామండీ. సల్మాన్ తొలినాళ్ల ప్రేయసి సంగీతా బిజ్ లానీ... ప్రస్తుత ప్రియురాలు లులియా వంట్యూర్ కలిసి ఒకే పార్టీలో ఎంజాయ్ చేశారట. అదే పార్టీలో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడట. తను తన లైఫ్ లోకి వచ్చిన అందరి ప్రియురాళ్ల గురించి వారితో మాట్లాడాడట కానీ ఒక్క ఐశ్వర్య గురించి మాత్రం ప్రస్తావించలేదట. మిగిలిన అందరితో తాను చాలా సంతోషంగా గడిపానని...వారి సాన్నిహిత్యాన్ని ప్రతి క్షణం ఆస్వాదించానని చెప్పాడట. అంటే ఐశ్వర్యతో సంతోషంగా గడపలేదా అని బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి.

 bahubali movie may 15

'బాహుబలి' విడుదల ఎప్పుడు?

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'బహుబలి'. ఈ సినిమాలో అనుష్క తమన్నా కథానాయకులు కాగా రానా ఓ కీలక ప్రాతలో నటిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'బాహుబలి-2' ను ఈ ఏడాది చివరిలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ ద్వితీయార్ధంలో పాటలు విడుదల చేయనున్నట్లు సమాచారం.

 Trisha SwineFlu vaccine

త్రిషకి స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్...

స్వైన్ ఫ్లూ ఇప్పుడు ఇది అందరిని హడలిస్తోంది. అందరికి వణుకు పుట్టిస్తుంది. మామూలు మనుషులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తుంది. పాపం రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా ఈ వ్యాధికి గురై లబోదిబో అంటూ ఆస్పత్రిలో చేరింది. ఈ సంగతి తెలుసుకున్న నటి త్రిష భయపడిందో ఏమో వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారా అని వెతుక్కొని, తనకు సూదంటే భయమున్నప్పటికి వ్యాక్సిన్ వేయించుకొంది. తాను వ్యాక్సిన్ వేయించుకోవడమే కాకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోండని సలహా కూడా ఇస్తోంది. సీనీ తారలైతే ఏంటి వాళ్లు మనలాంటి మనుషులే కదా.

మంచు మనోజ్ నిశ్చితార్ధ వేడుక నేడే

  ప్రముఖ నటుడు మంచు మనోజ్ వివాహ నిశ్చితార్ధ వేడుక ప్రణతి రెడ్డితో ఈ రోజు ఉదయం 10.30గంటలకి హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో జరుగబోతోంది. ఈ వేడుకకు తెలుగు సినీపరిశ్రమ నుండి బాలకృష్ణ, ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు తదితరులు, తమిళ చిత్ర పరిశ్రమ నుండి రజనీ కాంత్, బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్ తదితరులు హాజరు అయ్యే అవకాశముంది. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు కేసీఆర్, నారా లోకేష్ ఇంకా అనేకమంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.   ప్రణతి రెడ్డి బిట్స్ పిలానీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ చేసారు. ఆమె మంచు విష్ణు భార్య వేరోనికాకు క్లాస్ మేట్. ఆమె ద్వారానే మంచు మనోజ్ తో ప్రణతి రెడ్డికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించడంతో వారిప్పుడు వివాహ బంధం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో గొలుసు అనే ఒక సినిమాలో నటిస్తున్నారు. అది ఏప్రిల్ నెలాఖరుకి పూర్తి అయ్యే అవకాశం ఉంది. కనుక అది పూర్తి కాగానే మే నెలలో వారు వివాహం చేసుకొనే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ నిర్మాత.. రామ్‌చరణ్ హీరో...

  పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి సినిమా నిర్మాణం మీద మొదటి నుంచీ ఆసక్తి వున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి నిర్మాతగా రంగప్రవేశం చేయబోతున్నారు. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పతాకం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించబోతున్నారు. ఆ సినిమాలో నటించే హీరో పవన్ కళ్యాణ్ కాదు.. మరెవరనుకుంటున్నారు.. రామ్ చరణ్. ఎస్... అబ్బాయ్ హీరోగా బాబాయ్ నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతోంది. కేవలం రామ్ చరణ్‌తో మాత్రమే కాకుండా ఇతర యువ హీరోలతో కూడా సినిమాలు నిర్మించే ఆలోచన పవన్ కళ్యాణ్‌కి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రతిభావంతులైన నూతన దర్శకులను కూడా పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ‘హైదరాబాద్ నవాబ్స్’ సినిమా తరహాలో వుండే హైదరాబాదీ సినిమాలను కూడా నిర్మించనున్నారట. పవన్ కళ్యాణ్ నిర్మించే సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.