కృష్ణం వందే జగద్గురుమ్!

దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణ కొరకు యుగయుగాన తాను జన్మిస్తానని, ధర్మ సంస్థాపన కొరకు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు చెబుతాడు. ప్రస్తుత మానవ సమాజానికి శ్రీకృష్ణుడు చెప్పిన ఎన్నో మాటలు వేదవాక్కులుగానూ, జీవితానికి గొప్ప మార్గాన్ని చూపే సూత్రాలుగానూ ఉంటాయి. ఒక్కసారి భగవద్గీత చదివిన వాడిలో ఎంతో పరివర్తన కలుగుతుంది. కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఎందుకంత గొప్ప గ్రంధమైంది?? అసలు కృష్ణుడు ఈ లోకాన్ని ఉద్ధరించడం ఎందుకు?? అసలు కృష్ణుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి??  చాలామంది కృష్ణుడి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఎక్కడైనా చూశారంటే మిగిలిన దేవుళ్ళకు మ్రొక్కినట్టు మ్రొక్కరు. ఏదో షోకేస్ లో బొమ్మను చూసినట్టు చూస్తూ పోతారు. ప్రజానీకానికి అందుబాటులో ఉండే తొందరగా అందరికీ చేరవేయబడే సినిమాలలో కృష్ణుడిని కేవలం స్ట్రీలోలుడిగానూ, మాయలోడిగానూ చూపించడం వల్ల ఏర్పడిపోయిన భావమేమో!! కానీ సమాజం మాత్రం దాన్నే నమ్ముతుంది. కానీ కృష్ణుడు ఈ ప్రపంచానికి, ఈ మానవలోకానికి చెప్పిన మాటలు ఏంటి?? తను చెప్పిన తత్వమేంటి?? జైలు గోడలు మధ్య పుట్టినవాడు, చిన్నతనంలోనే తల్లి చనుబాల రుచి చూడకుండానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైనవాడు, రాజ్యానికి రాజుగా రాజకుమారుడిగా పెరగాల్సినవాడు, గోకులంలో గోవుల మధ్య తిరగాడుతూ బ్రతికాడు. కృష్ణుడు సమస్తము తెలిసినవాడు అయినపుడు తన జీవితాన్ని గోకులానికి తరలించుకోవలసిన అవసరం ఏమైనా ఉందా?? కానీ కారణజన్ముడు కాబట్టి కర్తవ్యం నెరవేర్చాలి కాబట్టి వెళ్ళాడు. ఎంతో సాధారణ జీవితాన్ని గడిపాడు. మరి ఆయనను భోగవిలాసుడు అనడం తగునా?? ఉన్ననాడు, లేనినాడు ఒకటిగానే బ్రతికేవాడు ఉత్తముడు. 16,000 మందిని భార్యలుగా స్వీకరించి వారికి ముక్తి కలిగించాడే కానీ ఎవరితోనూ శారీరక సంబంధం అనేది లేదు కృష్ణుడికి. చేసిందంతా కృష్ణుడే, మహాభారత మహాయుద్ధమైన కురుక్షేత్రానికి కారణం ఆయనే అంటారు కానీ పేరుకుపోయిన చెడును నిర్మూలించే దృష్ట్యా చేపట్టిన లోకసంరక్షణ కార్యమది అనే విషయాన్ని అంగీకరించరు ఎందుకో!! గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా, కాళీయుని పడగలపై నాట్యం చేసినా, మన్ను తిన్నా, వెన్న దొంగిలించినా, గోకులాన్ని పావనం చేసిన గోకుల కృష్ణుడు మధురను పునీతం చేయడానికి తరలిన తరువాత జరిగిన విషయాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  కృష్ణుడు ఎప్పుడూ ధర్మం పక్కనే ఉంటాడు. ధర్మాన్ని గెలిపించడానికే కృష్ణుడు ఆవిర్భవించాడు. అందుకే పాండవులకు మద్దతు ఇచ్చాడు. కానీ అందరూ అంటారు, మాయవి పాండవుల వైపే ఉంటాడు అని. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి ఉద్దండులు కౌరవుల వైపు ఉంటే కృష్ణుడు పాండవులవైపున్నాడు అంటారు. కానీ భీష్ముడు అయినా, ద్రోణుడు అయినా కట్టుబడిన నియమాలచేత కౌరవసేన వైపు నిలబడి పోరాడారు కానీ వారెప్పుడూ పాండవులకె వత్తాసు పలికారు. ఇకపోతే శ్రీకృష్ణుని జీవితమంతా ఒక ఎత్తు అయితే భగవద్గీత బోధ మరొక ఎత్తు. అందులో ఏముంది అంటే జీవిత సారముంది. సగటు మనిషి తన జీవిత కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలి?? ఎందుకు నెరవేర్చాలి?? అసలు మనిషి ఎలా బ్రతకాలి, యోగమంటే ఏంటి?? ధ్యానం అంటే ఏంటి?? కర్మలు అంటే ఏంటి?? కర్మలు మనిషిని ఎలా వెంటాడుతాయి?? మోక్షం ఎలా సాధ్యం?? దానికి ఆచరించవలసినదేమిటి?? ఇలా ప్రపంచంలో మనుషులందరూ తెలుసుకోవలసినదాన్ని  అర్జునుడికి చెబుతున్నట్టు చెబుతూ అందరికోసం చెప్పాడు. అది సమర్థవంతమైన గురువు లక్షణం కదా మరి!!  గురువెప్పుడూ తన శిష్యులను నిందించడు ఉదాహరణలు చూపిస్తూ పరోక్షంగా శిష్యుల మనసులోకి విషయాన్ని చొచ్చుకుపోయేలా చేస్తాడు. అందుకే కృష్ణుడిని బెస్ట్ మొటివషనల్ పర్సన్ అంటారు, ఇక భగవద్గీతను గొప్ప మానసిక విశ్లేషణా గ్రంధం అని అంటారు.  ఒకసారి గమనిస్తే కృష్ణుడు బాధపడుతున్న సందర్భం ఎక్కడా కనిపించదు. అలాగని విరగబడి నవ్వుతున్నట్టు ఎక్కడా ఉండదు. కేవలం పెదాల మీద సన్నని చిరునవ్వు పూయిస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితులలోనూ ఆ నవ్వు చెదిరిపోకుండా ఉంటుంది. అదే స్థిరత్వం అంటే!! కృష్ణుడు చెప్పేది అదే!! ఎలాంటి పరిస్థితిలో అయిన స్థిరత్వంగా ఉండాలని.                                           ◆నిశ్శబ్ద.

సంతోషం కావాలంటే స్విచ్ ఆన్ చేయాల్సిందే!

ప్రస్తుత జీవితం ఎట్లా ఉంది?? ప్రతిఒక్కరూ జీవితంలో సంతోషాన్నే కోరుకుంటారు. ఆత్మీయులు, స్నేహితులు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండు అని చెబుతూ ఉంటారు. కానీ సంతోషం ఏమి అంగట్లో దొరికేది కాదు. కాసింత డబ్బులిచ్చి తెచ్చుకోవడానికి. అయితే జీవితంలో సంతోషం ఉంటే ఆ మజా వేరు. చాలామంది అనుకుంటూ వుంటారు ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఎలానో?? అని. మరికొంత మంది ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఏదో ఒకటి చేస్తుంటారు. మరికొందరు స్నేహితులను కలుస్తూనో, కుటుంబసభ్యులతో గడుపుతూనో, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ విషయాల్లో లీనమవుతూనో ఉంటారు. కానీ ఎన్ని చేసినా సంతోషంగా మాత్రం ఉండరు. అవును మరి సంతోషం కోసం చేసే ప్రతి పనీ కేవలం తాత్కాలికం మాత్రమే. వర్షం కురిసినంత సేపే కురిసి మాయమవడం లాంటిదే ఈ సంతోషం కూడా. వర్షం తాలూకూ మట్టివాసనలా సంతోషం తాలూకూ జ్ఞాపకాలు కూడా కొన్ని మిగులుతుంటాయి అంతే.  సంతోషం కోసం వెతుకుతున్నారా?? కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీలో ఉన్న స్విచ్ ను ఆన్ చేయాలి మరి. ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో కానీ ఇదే నిజం. ప్రతి మనిషి తాను సంతోషంగా ఉండాలంటే మొదట తన ఆలోచన, తనకు తాను ప్రాధాన్యం ఇచ్చుకోవడం, తనకు సంబంధం లేని విషయాలను పట్టించుకోకుండా ఉండటం, తాను చేయవలసిన పనిని మనస్ఫూర్తిగా చేయడం వంటివి చేయాలి. పలితాన్ని గూర్చి, పరిధిని గూర్చి ఆలోచిస్తే మాత్రం మానసులో ఒకానొక కల్లోలం తెలియకుండానే మొదలైపోతుంది. వేగవంతమైన ప్రపంచంలో మనిషి చేస్తున్న తప్పేంటో తెలుసా?? చేసే ప్రతి పనిని ఆస్వాదించకపోవడం. కృత్రిమంగా ముందుకెళ్లిపోవడం. సరిగ్గా గమనించుకుంటే ప్రస్తుతం అందరూ రోజు చేస్తున్న పనులు కానీ, వృత్తి రీత్యా చేస్తున్న పనులు కానీ, తప్పక చేయాలనే ఉద్దేశంతోనో లేక, అవసరం కాబట్టి చేయాలనో లేక సంపాదన కావాలంటే చేయాలి కాబట్టి అనుకుని చేస్తూ ఉంటారు. 90% మంది ఇలా చేస్తున్నవాళ్లే. కాబట్టే చేస్తున్న పనిని ఆస్వాదించలేకపోతున్నారనేది వాస్తవం.  మరిప్పుడెం చేయాలి?? సంతోషానికి కావలసిందల్లా మనసు పాజిటివ్ గా ఉండటం మొదటి విషయమైతే, చేసే పనిని ఏదో మరయంత్రంలా కాకుండా ఆస్వాదిస్తూ, ప్రతిపనిలో ఉత్తమ పలితాన్ని ఇవ్వడానికి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ చేయడం.  చాలామంది ఏదో పెద్ద లాభం ఉన్న పనుల విషయంలో తప్ప మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోకుండా అలా చేసేస్తుంటారు. కానీ ఒక్కసారి అలాంటి ధోరణి వదిలి ప్రతి పనిని అంటే కనీసం తినడం కావచ్చు, తాగడం కావచ్చు, వంట చేయడం కావచ్చు, ఆఫీస్ పనులు, ఇతరులను పలకరించడం, కనీసం నవ్వడం ఇలా బోలెడు విషయాలు ఉంటాయి. ప్రతి ఒక పనిని మనపూర్వకంగా చేయగలిగితే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. 90% అపజయం అనే మాట దరిచేరదు. ఒకవేళ అలాంటి పరాజయాలు ఎదురైనా చిరునవ్వుతో వాటిని స్పోర్టివ్ గా తీసుకోవడం అలవాటు అవుతుంది.  ప్రపంచం చిన్నదని కొందరు అంటారు.  కాదు పెద్దదని మరికొందరు అంటారు. అంటే చూసే విధానంలోనే ఏదైనా ఉంటుందనేది నిజమని ఒప్పుకోవచ్చు కదా!! అలాగే సంతోషాన్ని ఎక్కడినుండో తెచ్చుకొనక్కర్లేదు. ఒకరి నుండి దాన్ని పొందడానికి అస్సలు ప్రయత్నించకూడదు. సంతోషం ఎప్పుడూ మనతోనే, మనలోనే, మనం ఆస్వాదించడంలోనే ఉంటుంది. దాన్ని రుచి చూడాలంటే కావలసిందల్లా కేవలం మనసును స్విచ్ ఆన్ చేయడమే. అన్నిటినీ మనసుతో ఆస్వాదిస్తూ చేసుకుపోవడమే. అలా చేసినపుడు సంతోషం కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదే మీ వెంట ఉంటుంది. ◆ వెంకటేష్ పువ్వాడ

అలోపతిని ఎక్కువగా వాడకండి!

దగ్గు, జలుబు, జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ మారే ఋతువులను బట్టి మనిషికి అంతో ఇంతో టచ్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటికి చాలా మంది కామన్ మెడిసిన్ గా కొన్ని టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. కొందరు ఇళ్లలో మెడికల్ కిట్ పేరుతో స్ట్రిప్స్ కొద్ది టాబ్లెట్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. కాస్త నలత అనిపించగానే చటుక్కున టాబ్లెట్ తీసి వేసుకోవడం, రిలాక్స్ అయిపోవడం కామన్ అయిపోతోంది ప్రతి ఇంట్లో. అయితే ఇలా మెడిసిన్ వాడటం ఎంతవరకు సరైన పని?? సీజనల్ స్టేటస్! మారే సీజన్ కు తగ్గట్టు వాతావరణానికి అలవాటు పడటానికి శరీరానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలో శరీరంలో చోటు చేసుకునే ఇబ్బందికి తగ్గట్టు ఆహారాన్ని, అలవాట్లను కాస్త అటు ఇటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కబడి శరీరం సెట్ అయిపోతుంది. అయితే అందరూ సీజనల్ ప్రోబ్లేమ్స్ అనగానే అడ్డమైన సిరప్ లు, టాబ్లెట్స్, ఇంకా ఎన్నోరకాల ఇమ్మ్యూనిటి బూస్టర్స్ తో ఏదేదో చెయ్యాలని అనుకుంటారు. అయితే అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే అనే విషయం చాలామందికి అర్థం కాదు. ఇమ్యూనిటీ వార్నర్! ఏదైనా జబ్బు శరీరాన్ని అటాక్ చేసిందంటే దాని అర్థం శరీరంలో చొచ్చుకుపోయిన ఏ బాక్టీరియా,  వైరస్  మీదనో శరీరం యుద్ధం మొదలుపెట్టిందని అర్థం. అలాంటి సమయంలో శరీరంలో జరిగే ఆ వార్ కి కాస్త కోపరేట్ చేస్తే అంతా సర్దుకుంటుంది. కానీ మందులు వేస్తే సహజమైన శరీర రోగనిరోధకశక్తి నశించిపోతుంది.  డోంట్ అట్టేన్షన్! ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకున్నప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ తీసుకోమని చెబితే అసలు ఒప్పుకోకండి. కండిషన్ ఎంతో సీరియస్ ఉంటే తప్ప అలాంటి ఆలోపతి మందులను అల్లో చేయకూడదు. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మందులతో జబ్బును తగ్గిస్తూ పోతే శరీరం కూడా మందులకే రెస్పాండ్ అవుతూ చివరికి ఒక డ్రగ్ కు ఆడిక్ట్ అయిన పేషెంట్ లాగా మార్చేస్తుంది శరీరాన్ని.  ఫాక్ట్! ఇక్కడ అందరూ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే కృత్రిమ మందులతో శరీరాన్ని బలంగా మార్చాలని చూడటం ముమ్మాటికీ మూర్ఖత్వపు పని. అమెరికా వంటి దేశాలలో జ్వరం, జలుబు వంటి సమస్యలకు కూడా రెగులర్ గా వ్యాక్సిన్ తీసుకుంటూనే ఉండాలి. అక్కడ అది చట్టబద్ధం చేశారు కూడా. ఫలితంగా అక్కడి ప్రజలలో భారతీయుల కంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ. కామన్ ప్రోబ్లేమ్స్! పైన చెప్పుకున్నట్టు సీజనల్ ప్రోబ్లేమ్స్ కానీ శరీరంలో మనం తీసుకునే ఆహారం వల్ల సత్వ, రజో, తమో గుణాలు అనబడే త్రిగుణాలు కానీ అస్తవ్యస్తం అయితే అది జబ్బులకు దారితీస్తుంది. అయితే వాటికి టాబ్లెట్స్ వాడటం వల్ల కొన్నిసార్లు అవి వ్యతిరేక ప్రభావం చూపించి చాలా సెరియర్ పరిస్థితులకు దారి తీస్తాయి కూడా. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో అన్నిటికీ ఆలోపతి మందులను వాడటం ఆపెయ్యాలి.  ప్రకృతికి దగ్గరగా వుండే శరీరానికి అదే ప్రకృతిలో భాగం అయిన మొక్కల నుండి తయారు చేసే ఔషధాలు ఎంతో గొప్పవి. ఆయుర్వేదం అదే చెబుతుంది. పెద్ద పెద్ద సమస్యలకు ఆయుర్వేదం చాలా ఆలస్యంగా పలితాన్ని ఇచ్చినా అది పూర్తిగా జబ్బును నయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదమే బెస్ట్. ఆలోపతి మందులతో గేమ్స్ ఆడద్దు.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

మీ మనసును మర్చివేసే కథ

కొన్ని కథలు మనుషుల జీవితాలను, ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. ప్రాంతాలు ఏవైనా సరే మనుషుల ప్రవర్తనలో అసూయ, ద్వేషం, కోపం వీటితోపాటు.. ప్రేమ, ఆప్యాయత కూడా ఉంటాయి. మనం ఏ కోణాన్ని చూస్తామో అదే మనలో నుండి వ్యక్తమవుతుంది కూడా..  మనిషి మనసుకు సంబంధించి ఓ కథ ఉంది.. ఇది ఒక చైనా దేశం కథ. వివాహానంతరం ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. మొదటి ఆరు నెలలు అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. గోరంతలు కొండంతలై చివరకు కోడలు పుట్టింటికి పరుగెడుతుంది. అక్కడ ఆమె తండ్రిగారి స్నేహితుడైన ఒక డాక్టర్తో తన బాధల్ని వెళ్ళబోసుకుంటూ 'ఎలాగైనా మా అత్త మరణిస్తే గాని నాకు సుఖశాంతులుండవు అని చెప్పింది. ఒకప్పుడు తన దగ్గర కూర్చొని ముద్దుమాటలతో చిలిపి చేష్టలతో ఆనందింపజేసిన ఆ చిన్నారిలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాక్షసత్వాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ డాక్టర్. తర్వాత ఇలా అన్నాడు. ' అమ్మా! నీ మీద ప్రేమతో ఈ పనిచేస్తున్నాను. ఒక మందు నీకిస్తాను. దానిని మీ అత్తగారికివ్వాలి. అది తీసుకున్న సంవత్సరం తరువాత ఆమె మరణిస్తుంది. వెంటనే చనిపోతే, అందరికీ అనుమానం రావొచ్చు. అప్పుడు మన పన్నాగం బయట పడుతుంది.  అందుకే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా చంపే మందు ఇస్తున్నాను. ఒక సంవత్సరం నీవు ఓపిక పట్టాలి. అత్త ఎలాగూ చనిపోతుంది. కాబట్టి నీవు ఆమెను ఈ సంవత్సర కాలం పాటు ప్రేమగా చూసుకుంటూ సేవ చేస్తానని నాకు హామీ ఇవ్వు. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు.  అమ్మాయి సరేనని అంగీకరించింది. మందు తీసుకుని అత్తగారింటికి వెళ్లింది.  అత్తకు తినిపించి ప్రేమతో సపర్యలు చేయడం ప్రారంభించింది. అత్తకు అమితానందం. తన కోడలు చేసే సేవకు స్పందించింది. ఆమె చూపిన ప్రేమకు దాసోహం అయ్యింది. తనకు ఓపికలేక పోయినప్పటికీ కోడలికి చిన్నచిన్న పనుల్లో సహాయం చేయడం మొదలు పెట్టింది. కోడలిని తన సొంత కూతురిలా భావించింది. అప్పుడు కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఆరు నెలలు గడిచాయి. కోడలు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఆ డాక్టర్ని కలిసింది. ఆమె ముఖంలో విషాదం. గద్గద స్వరంతో ఇలా అంది. 'డాక్టర్! నేను ఓ పెద్ద తప్పు చేశాను. దేవతలాంటి మా అత్తను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాను. నా చేతులతో ఆమెకు విషం తినిపించాను. ఆరు నెలల్లో నన్ను ప్రేమించే నాదేవత నాకుండదు. ఆమెను ఎలాగైనా నేను రక్షించుకోవాలి'. ఈ మాటలు విన్న డాక్టర్ నవ్వి 'అమ్మా నేనిచ్చిన మందు, విషం కాదు. మీ అత్తగారికి ఏ అపాయంలేదు. అప్పుడు నీ మనసులో ఉన్నది విషం. ఇప్పుడది లేదు. మీ అత్తాకోడళ్ళ మధ్య ఈ ఆరు నెలల్లో నెలకొన్న ప్రేమానురాగాల ప్రవాహంలో ఆ ''విషం' కొట్టుకు పోయింది. మనసులో ఏ కల్మషం లేకుండా జీవించు' అన్నాడు. ఇది మనసు కథ, ప్రతి మనిషి కథ.                                       ◆నిశ్శబ్ద.

గురక పెట్టడానికి కారణాలు ఇవే!

మనిషికి అయిదుగంటల నిద్ర పెర్ఫెక్ట్! ఆరుగంటల నిద్ర ఆరోగ్యానికి చాలామంచిది. ఏడుగంటల నిద్ర కొంతమందిలో సమంజసమే! ఎనిమిది గంటల నిద్ర ఫరవాలేదు. పది గంటల నిద్ర మనిషిలో బద్దకాన్ని... నిస్సత్తువనూ... నిరాసక్తతనూ సూచిస్తుంది. పన్నెండు గంటల నిద్ర మనిషిలో తెలియని వ్యాధికి సంకేతం. అంతకుమించిన నిద్ర ఖచ్చితంగా అనారోగ్యమే!  మానసికంగా శారీరకంగా అలసిపోయిన మనిషి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటాడు. అలాంటప్పుడు మరోగంటో గంటన్నరో ఎక్కువ నిద్రపోవడం కూడా జరుగుతుంది. ఇది అతని శరీర అలసటను తెలియజేస్తుంది. ఇటువంటప్పుడు ఎంతసేపు లేపినా నిద్రలేవరు. శారీరకంగా ఉండే అలవాటు బాగా తగ్గిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే నిద్రలేచి తమ రోజువారీ కార్యక్రమాలను చూసుకుంటుంటారు. వీరు ఈవిధంగా రోజూ నిద్రపోరు. ఎప్పుడో.. ఏవారం పదిరోజులకో ఓసారి ఇలా నిద్రపోతుంటారు. ఇలా రోజూ నిద్రపోతుంటే మాత్రం అది క్రమేపీ బద్దకంగా మారిపోతుంది. ఆఫీసులో గుమాస్తాలుగానూ, ఆఫీసర్లగానూ, ఎగ్జిక్యూటివ్ గానూ పనిచేసి వారు మానసికంగా అలసిపోతుంటారు. ఇటువంటివారు అయిదారు గంటలపాటు నిద్రపోయేసరికి మైండ్ ఫ్రెషయ్యి ఉత్సాహంగా తయారైపోతారు. కాయకష్టం చేసేవారు అంటే  ముఠా కార్మికులు, రిక్షా కార్మికులు, చిల్లరవర్తకులు, వ్యవసాయ కార్మికులు వంటివారు శారీరకంగా అలసిపోతారు. ఇటువంటి వారు అదనంగా మరో అరగంటో గంటో నిద్ర పోతారు. ఇది సహజమే! బాగా అలసిపోయి. ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవారు నిద్దట్లో తమకు తెలియకుండానే గురక పెడుతుంటారు. అయితే అలసటకు గురైనా గురికాకున్నా నిద్రపోయిన వెంటనే గురక గురక పెడుతుండటం సర్వసాధారణమే...! ఇది వారి అలసటను తెలియజేస్తుంది...! ఈ విధంగా గురక పెట్టడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. మనం ముక్కుద్వారా, నోటిద్వారా గాలి పీలుస్తూంటాం. ఈవిధంగా గాలి పీల్చడానికీ, వదలడానికీ ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు మరింత బలంగా గాలిపీల్చి వదులుతుంటారు. ఈ క్రమంలో కొండనాలిక కింద భాగానికి ప్రెస్ అవ్వడం ద్వారా శబ్దతరంగాలు వెలువడుతుంటాయి. గురకపెట్టేవారు మామూలు మనిషికన్నా ఏడురెట్లు అధికంగా గాలిపీలుస్తారని వివిధ పరిశోధనల్లో తేలింది. గురక రావడానికి కారణాలు! గొంతు మరియు శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యేవారు ఎక్కువగా గురకపెడుతుంటారు. మనగొంతులోని "యువులా" అనేభాగం ఈ శబ్దతరంగాలను సృష్టిస్తుంది. ముక్కుకు సంబంధించిన క్రానిక్ కోల్ట్, సైనసైటిస్, డీవియేటెడ్ సెప్టెమ్ వంటి వ్యాధులకు గురైనవారు ముక్కుద్వారా గాలిపీల్చడం కష్టమై నోటిద్వారా గాలి పీల్చడం జరుగుతుంది. ఎక్కువ భాగం గురకలు నోటిద్వారా గాలిపీల్చడం వల్లే సంభవిస్తుంటాయి.  నోటిద్వారా గాలిపీల్చడం వల్ల 'గురక' ప్రారంభమౌతుంటుంది. గురకలు ముక్కు ద్వారానూ, గొంతుద్వారానూ కూడా వస్తుంటాయి. అయితే ముక్కుద్వారా వచ్చేగురక చిన్నశబ్దం చేస్తే గొంతుద్వారా చేసే గురక పెద్దశబ్దంతో వస్తుంది.  ముక్కు దిబ్బడ వేయడం, పొక్కులు ఉండటం, అతిగా జలుబు చేసి ముక్కువెంటనీరు కారుతుండటం, ముక్కు అట్టకట్టిపోవడం, లేదా ముక్కు దూలం వంకరకావడం వంటి కారణాలతో మనిషి నోటిద్వారా గాలి పీల్చడానికి ప్రయత్నిస్తాడు. నోటిద్వారా గాలి పీల్చడం  వల్ల సాధారణంగా ముక్కుద్వారా పీల్చే గాలికంటే ఎక్కువగాలిని పీల్చవల్సివస్తుంది. కావాల్సిన గాలికంటే ఎక్కువగాలి పీల్చి వదులుతున్నప్పుడు ఆ గాలి వేగానికి కొండనాలుక అడ్డుబడి గురకవస్తుందని చెబుతారు.  గురక పెట్టే  వ్యక్తికి తాను గురకపెడుతున్నట్లు తెలియదు. అయితే గురక పెట్టేవ్యక్తి చేసే శబ్దాలు వినేవారికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి!                                       ◆నిశ్శబ్ద.

చాణక్యుడి ఈ నాలుగు సూత్రాలు అన్ని సమస్యలకు సహాయపడతాయి..!!

చాణక్యుడి నీతి సూత్రాలు మన జీవితాలను సులభతరం చేయడంలో సహాయపడతాయి. ఎలాంటి సమస్యలు ఎదురైనా చాణక్యుడి నీతితో వాటి నుంచి బయటపడే మార్గాన్ని కనుగొనవచ్చు. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి చాణక్యుడి సూత్రాలు సహాయపడతాయి. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి ఏమి చేయాలో మీకు తెలుసా? ఆచార్య చాణక్యుడు తన నైతికతకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందాడు. అతను అర్థశాస్త్రంతో సహా అనేక ముఖ్యమైన రచనలను రచించాడు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా అతను సి. క్రీస్తు పూర్వం 376లో జన్మించినట్లు చెప్పారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, గొప్ప పండితుడు. నైపుణ్యం కలిగిన రాజకీయ చతురత ద్వారా, అతను చంద్రగుప్త మౌర్య సామ్రాజ్య స్థాపన, విస్తరణలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన ఆలోచనలు నేటికీ సంబంధితంగా ఉన్నాయి. చాణక్యుడి నీతిని అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించగలడు. మీరు కూడా మీ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే, ఈ 4 విషయాలను ఖచ్చితంగా పాటించండి. 1. దానం: ఆచార్య చాణక్యుడు ప్రకారం దానధర్మాలు చేసేవాడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ధార్మిక గ్రంధాలలో కూడా దానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మనకు చేతనైనంతలో దానధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తే పేదరికం కూడా తొలగిపోతుంది. కాబట్టి, ఒక వ్యక్తి తన ఆర్థిక స్థితిని బట్టి దానం చేయాలి. దానం చేయడం వల్ల సంపద తగ్గదని ధార్మిక పండితులు కూడా చెబుతున్నారు. 2. ప్రవర్తన: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి అనుభవించే అన్ని రకాల సమస్యలు, బాధలు అతని ప్రవర్తన ద్వారా మాత్రమే తొలగిస్తాయని చెప్పాడు. ఒక వ్యక్తి మంచి నడవడికతో తనను తాను ఉన్నతీకరించుకోగలడు. ఇది వృత్తి, వ్యాపారంలో ఒక వ్యక్తికి కూడా సహాయపడుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలోని అన్ని రకాల కష్టాలు,  దుఃఖాలను తొలగిస్తుంది. 3. భక్తి: ఒక వ్యక్తి జన్మించిన క్షణం అతని విధి నిర్ణయించబడుతుంది. ఈ భవిష్యత్తు బాగుండాలంటే భగవంతుని ధ్యానించాలి. మతపరమైన కార్యక్రమాలలో మనం నిమగ్నమై ఉండాలి. ఇది ఒక వ్యక్తి యొక్క తార్కిక శక్తిని అంటే ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో, దేవుని ఆశీర్వాదం వ్యక్తిపై ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్న ప్రకారం, ఒక వ్యక్తి పై విషయాలను అనుసరిస్తే అతను మంచి జీవితాన్ని పొందుతాడు. అతను తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, దాని నుండి బయటపడే మార్గాన్ని కనుగొంటాడు.  

మరణాన్ని తెలుసుకోవడం సాధ్యమేనా?

ఈ జీవితంలో మనిషిని వేధించే ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటిలో చాలా ప్రశ్నలకు మనిషి సమాధానాన్ని కనుక్కుంటాడు. కనుక్కోవడం అంటే కొత్తగా కనిపెట్టడం కాదు, ఎన్నో చూసి, చదివి, చర్చించి తెలుసుకుంటాడు. ఒక మనిషి పుట్టుకకు గర్భంలో నెలల కాలాన్ని నిర్ణయిస్తూ పుట్టుకను లెక్కిస్తారు. అయితే అందరికీ అంతు చిక్కని ప్రశ్నగా నిలబడేది ఒకటి ఉంటుంది. అదే మరణం. ఈ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మరణాన్ని జయించడం కుదరదు. కనీసం మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాలను కూడా ఎవరూ చెప్పలేరు. సైన్స్ పరంగా మనిషి జీవిత కాలాన్ని నిర్ణయిస్తున్నారు కానీ మరణాన్ని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. అయితే అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరొకవైపు మన భారతీయ యోగుల జీవితంలోకి వెళితే, వారి జీవనవిధానం, వారి యోగా శక్తి గురించి తెలుసుకుంటే మాత్రం మరణాన్ని కూడా నిర్ణయించగల అద్భుతాలు మన భారతీయ యోగులు అని అర్థమవుతుంది.  మునులు, సన్యాసుల గురించి వదిలేస్తే మన యువతకు ఎంతో ప్రేరణ అయిన స్వామి వివేకానంద కాలినడకన మన దేశం మొత్తం ప్రయాణం చేసారు. మన దేశం మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా పర్యటించి చాలా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. హిందూ ధర్మాన్ని, భారతీయ తత్వాన్ని ప్రపంచదేశాలకు వ్యాప్తం చేసినవారు స్వామి వివేకానంద. ఈయన భారతీయ సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక, తాత్విక శాస్త్రాలను తన ఉపన్యాసాలలో ఎంతో గొప్పగా నేటి కాలానికి  చాటి చెప్పారు. విదేశాలలో మన భారతీయ ధర్మాన్ని నిస్సంకోచంగా, నిర్భీతిగా చెప్పినవారు ఈయనే. ఈయన తన  చివరి రోజుల్లో ఆశ్రమంలో గడిపేవారు.  అయితే స్వామీజీ ఒక రోజు పేపర్ మీద ఒక తేదీని రాసి తనతోపాటు ఆశ్రమంలో ఉన్న ఒక యోగికి ఇచ్చారు. ఆ యోగికి ఆ తేదీ గురించి ఏమి అర్థం కాలేదు కానీ ఆ రోజు రానే వచ్చింది, ఆ రోజున స్వామిజీ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన్ను అందరూ ఎంత పిలిచినా పలకకపోవడంతో ఆశ్రమ వాసులు వచ్చి పరిశీలించారు.  అంతా పరిశీలించిన తరువాత చివరకు  స్వామీజీ పరమపదించారు అని తెలుసుకున్నారు. ఇలా స్వామి వివేకానంద తన మరణ తేదీని ముందుగానే తెలుసుకున్నారని అర్థం చేసుకోవచ్చు.  ఇక స్వామి వివేకానంద ధ్యానం చేస్తూ మరణించడం అనే విషయం వెనుక కారణం చూస్తే యోగులు ఎప్పుడూ తమ ప్రాణాన్ని ధ్యానంలో ఉండి వెన్నుపూస నిటారుగా ఉంచి, సహస్రారం ద్వారా ప్రాణాన్ని విడవాలని అనుకుంటారు.  నిజానికి ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోవచ్చు. మనిషి ఎప్పుడూ శరీరాన్ని నాది అనే భావనతో ఉంటాడు. కానీ  ధ్యానంలో ఒక లెవెల్ దాటిన తర్వాత  ఈ శరీరం, నేను ఒకటి కాదని తెలుసుకుంటారు. అలా శరీరం ఆత్మ వేరు వేరు అనే విషయం తెలిసిన తరువాత చనిపోవడం అనే విషయం గురించి పెద్దగా బాధ ఉండదు. అలాగే గొప్ప తత్వవేత్త అయిన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా తాను చనిపోయేమదు నేను ఇవ్వబోయే చివరి ఉపన్యాసం ఇదే అని ముందే చెప్పారు. అంటే ఆయనకు కూడా అధ్యాత్మికపరంగా తన శరీరాన్ని, తన ఆత్మను వేరు చేసి చూసే భావన స్పష్టంగా తెలిసింది కాబట్టి ముందుగా తన చివరి ప్రసంగాన్ని గురించి చెప్పారు. ఎలా తెలుస్తుంది? మరణం గురించి తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది.  అయితే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోగలం ఎందుకంటే ఇక్కడ ధ్యానం ద్వారా జరిగేది అంతర్గత ప్రయాణం.  బాహ్య ప్రపంచంలో మనిషి కోతిలాగా ఆలోచించినవాడు అంతర్గత ప్రపంచంలో తనని తాను స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. తనని తాను తెలుసుకున్నప్పుడు తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఎలాంటి ఆలోచన లేకుండా చెప్పగలిగే యోగ శక్తి మనిషికి లభిస్తుంది.  అపనమ్మకం కాదు! మనిషి మరణాన్ని కూడా చెప్పవలగడం సాధ్యమేనా?? ఇదంతా ఒట్టి పిచ్చితనం అని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను నేను అని మెలుకువతో ఉన్నప్పుడు మనం అనుకుంటాం కానీ మనం గాఢ నిద్రలో నేను అనేది ఉండదు. నిద్రిస్తున్నామా చనిపోయామా అసలు ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు కానీ ప్రపంచం అనేది అక్కడే ఉంటుంది. అక్కడే అంటే స్థిరంగా ఉంటడం. ఇక్కడ ప్రపంచం ఏమి మారదు కేవలం మనుషులు,మనుషులు చేస్తున్న పనుల వల్ల పరిసరాలు మార్పుకు లోనవుతాయి. ఎప్పుడైతే మెలుకువతో ఉన్నపుడు కూడా నేను అనేది ఉండదో అప్పుడు మనకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. ఆ ప్రపంచంలో పుస్తకాలలో చదవని ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది పూర్తిగా చదివి, లేదా సినిమాల ద్వారా చూసి తెలుసుకునేది కాదు. ఇది పూర్తిగా అనుభవపూర్వక ప్రపంచం. అనుభవం ద్వారా ఎవరిది వారికి అర్థమయ్యేది.  పంచభూతాల కలయిక అయిన ఈ ప్రకృతి మనిషిని మాయలో ఉంచినప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తాడు. ఈ ప్రకృతి, బాహ్య జీవితంలో జరిగే విషయలు అన్నీ ఒక నాటకం వంటిది అని తెలిసినప్పుడు మనిషి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడడు, అందుకోసమే యోగులు విరక్తి లో ఉంటారు.  అయితే ధ్యానం ద్వారా మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకున్నప్పుడు తన జీవితాన్ని తన చేతుల్లోనే ఎంతో నిరాడంబరంగా ఆధ్యాత్మిక సాధనలో గడిపేసి చివరికి తన మరణాన్ని తాను తెలుసుకుని దాన్ని ప్రశాంతంగా ఆహ్వానిస్తాడు. ఇదీ మరణాన్ని తెలుసుకునే విధానం. అయితే ఇది కేవలం ధ్యానంలో ఎంతో లోతుకు, మెరుగైన స్థాయికి చేరి, ఈ బాహ్య ప్రపంచ వ్యామోహనికి అసలు లోనుకాకుండా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.

అన్నింటికంటే విలువైనది

అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది. ‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.   కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.   ‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.   కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.   ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది. (జానపద కథ ఆధారంగా) - నిర్జర.

బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?

ప్రపంచంలో యువతరం నేడు ఆత్మహాత్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా పోటీ తత్వాన్ని అంగీకరించకపోవడం, ఆత్మన్యూనతా భావం వెంటాడుతూ ఉండడంతో ఒక వైపు ఉద్యోగభధ్రత లేకపోవడం ఆర్ధిక సమస్యలు మరోవైపు కరోనా యువతను కుంగ దీస్తూ ఉండడంతో బతుకు పోరాటం చేయలేక భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న నమ్మకం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి ఓర్పు సహనం లేని కుర్రకారు యదార్ధ గాధ మీ ముందు ఉంచుతున్నాను. అతను ఒక ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతం అయినా పెళ్ళిచేసుకున్నాడు. భార్య గర్భవతి. ప్రసవం ఎలా చేయించాలి అన్న దగ్గర నుంచి అంతా ఏమౌతుందో అన్న స్ట్రెస్. ఎలాగో ఒకలా బాబు పుట్టాడు అంతా బాగుంది అనుకున్నారు. బారసాలకు ఊరు వెళ్ళారు. పూజా పునస్కారం బాగానే ఉంది. అప్పుడే మొదలైంది అసలు కథ. పిల్లాడికి డాక్టర్ చెప్పిన విధంగానే పాలపొడి డబ్బాలు కొనాలని గట్టిగా చెప్పాడు. అసలు మీరు ఏ డబ్బాలు కొన్నారో నాకు వాట్సాప్ చెయ్యాలంటాడు. రోజూ వీడియో కాల్ చెయ్యాలి అన్నాడని అమ్మాయి అంటుంది. అలాకాకపోతే నాతో మాట్లాడవద్దని అంటూ అత్తామామతో గొడవకు దిగాడు. బావమరిదిని సైతం వదలలేదు నువ్వెంత అంటే నువ్వెంత అన్నాడు. నీ అంతు చూస్తానంటూ అనుకున్నారు. కొద్దిరోజులకు అంతా సద్దుమణిగింది అనుకున్నారు.   ఊరినుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్నారు అనుకున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. తన భార్య ఫోన్ మాట్లాడలేదని, మామ తనను అవమానించాడని మనసులో పెట్టుకున్న అతగాడు అంతా నిద్రపోయాక తనదగ్గర ఉన్న సానిటైజర్ తీసుకున్నాడు. మొబైల్ ఫోనులో నా చావుకు అత్త మామ భార్య కారణమంటూ పేస్ బుక్ లో పెట్టాడు. ఆఘమేఘాల మీద వెళ్లిన బావమరిది పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. వెంటనే వచ్చిన పోలీసులను చూసి మరింత రెచ్చిపోయాడు. మళ్ళీ సానిటైజర్ తీసి పోలీసుల ముందు తాగే ప్రయత్నం చేయడంతో, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి ఇంటికి పంపారు. అసుపత్రి ఫీజ్ 15000 పైమాటే. అసలు సమస్య పక్కకి పోయింది. ఉరిలో పరువుపోయింది, చుట్టాల్లో ఉన్నగౌరవం పోయింది. కేవలం ఒక పట్టుదల మనిషిని చావువరకూ తీసుకెళ్ళింది. అన్నిసమస్యలకి చావు ఒక్కటే పరిస్కారం కాదన్న విషయం ఎందుకు గ్రహించరు. స్త్రీలకంటే ముందు పురుషులే ఆత్మహత్య చేసుకుని తనువు చలిస్తున్న వారి సంఖ్య 3.5% ఎక్కువగా ఉందని ఒక సర్వేలో వెల్లడించింది. నానాటికీ పెరుగుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని, సహజంగా ఇతరులపై ఆధారపడని, సహాయం తీసుకోకపోగా ఇతరుల పట్ల తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారని మానసిక నిపుణులు అంటున్నారు. దీనికితోడు మొండితనం కూడా తోడవ్వడంతో తను అనుకున్నది జరగలేదన్న సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుందని ఆందోళనతోనే ఆత్మాహాత్యలకు పాల్పడుతూ ఉంటారని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అంశంపై పరిశోదన చేయడమంటే సవాళ్ళతో కూడుకున్నదని న్యూయార్క్ చెందిన ఫోర్ దానా విశ్వ విద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ సర్వీస్ కు చెందిన కాల్ మాన్ ఈ విషయం వెల్లడించారు. చావు అన్నింటికీ పరిస్కారం కాదు. బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?

ఆగస్ట్ 15 తేదీ వెనుక చాలామందికి తెలియని నిజం!

ప్రస్తుతం భారతదేశం ఎన్నో మతాలకు నిలయం. ఎక్కడినుండో వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటుంది. శరణార్థులకు భరోసా ఇస్తుంది, విదేశీ కంపెనీలకు వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి వేదిక ఇచ్చింది, పొరుగువారిని ప్రేమించాలి అనే మాటను పాటిస్తుంది. అయితే ప్రపంచదేశాలతో అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్న భారతదేశం ఒకప్పుడు బానిసగా మారి ఉక్కు పిడికిళ్లలో చిక్కుకుని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి చివరికి ప్రాణత్యాగాలు చేసి తన స్వేచ్ఛను సంపాదించుకుంది.   గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి కారణంగా స్వాతంత్ర్య సంబరాలను ఘనంగా జరుపుకున్న దాఖలాలు లేవు. ఈసారి మాత్రం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా దేశం యావత్తు ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.    ఎర్రకోట మీద భారతీయ జండాను ఎగురవేసి భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించే ప్రధానమంత్రుల ఆలోచనల్లో నాటి జవాహార్ లాల్ నెహ్రు నుండి నేటి ప్రధాని మోడీ వరకు అందరూ ఆగస్టు 15న కాకుండా జనవరి 26 నే స్వతంత్య్ర దినోత్సవాన్ని ప్రకటించే ఉద్దేశంలోనూ, అదే అసలైన స్వాతంత్ర్య దినమని భావిస్తారట. అయితే దీని వెనుక కారణం ఏమిటనేది పరిశీలిస్తే.   జవహర్ లాల్ నెహ్రు తన తండ్రి మోతీలాల్ నెహ్రు నుండి భారతజాతీయ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించారు. మోతీలాల్ నెహ్రూకు డొమినియన్ హోదా పట్ల ఆసక్తి ఉండేది. అయితే 40 సంవత్సరాల జవహర్ లాల్ నెహ్రూకు అది నచ్చలేదు ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా విడిపోవాలని ప్రతిపాదించారు. అప్పటి జాతీయ కాంగ్రెస్ సభ్యులయిన బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, అరబిందో మరియు బిపిన్ చంద్ర పాల్ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ ప్రతిపాదన కాస్తా భారతదేశ స్వతంత్ర్యాన్ని కోరుతూ డిమాండ్ గా ఏర్పడింది. ఆ తీర్మానం ఆమోదించబడిన కారణంగా 1930 జనవరి చివరి వారంను "పూర్ణ స్వరాజ్" గా నిర్ణయించింది.    దీని ఆధారంగానే జనవరి 26 న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భారతీయులను కోరింది. అంతకు ముందు 1929, డిసెంబర్ లో లాహోర్ లో రావి ఒడ్డున జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా "కాంగ్రెస్ అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటు చేయబోతోంది, స్వాతంత్య్రం కోసం పోరాడండి" అని పిలుపునిచ్చింది. అప్పటి నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26 నే స్వతంత్రంగా జరుపుకునేవారు.   అనేక సంవత్సరాల పోరాటం తరువాత బ్రిటిష్ వారు భారతదేశం మీద తమ ఆధిపత్యాన్ని వదులుకోవలసి వచ్చింది. అప్పుడు భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ గా లార్డ్ మౌంట్ బాటన్ ఉండేవారు. జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి అధికారం బదిలీచేయాలని అతనికి ఆదేశాలు వచ్చాయి. అయితే అది ఆలస్యమవుతుందని, పట్టులో ఉన్న భారతదేశ పోరాటాన్ని ఎక్కడ నీరుగారుస్తారో అని భారతదేశ సమరయోధులకు ఈ తతంగం నచ్చలేదు. భారత జాతీయ కాంగ్రెస్ వారు కూడా దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు.    ఈ ఒత్తిడుల కారణంగా మౌంట్ బాటన్ బ్రిటిష్ వారికి ఇంత ఆలస్యం చేయడం వల్ల రక్తపాతం, అల్లర్లు పెరుగుతాయని సూచించాడు.    ఆగస్ట్ 15 తేదీ వెనుక తిరకాసు!! రెండవప్రపంచం యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. అది కూడా ఆగస్ట్ 15 వ తేదీన లొంగిపోయిన కారణంగా అదేరోజును తాను భారతదేశానికి స్వతంత్ర్యాన్ని ప్రకటించడంలో నిర్ణయించుకున్నట్టు మౌంట్ బాటన్ తన మాటలలో వ్యక్తం చేశారు. అదికూడా మొదట ఆగస్ట్ లేదా సెప్టెంబర్ అనే ఆలోచనలో ఉన్నా కేవలం జపాన్ ప్రపంచ యుద్ధంలో లొంగిపోయి రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న కారణంగా దానికే మౌంట్ బాటన్ మొగ్గుచూపారు. అంటే భారతదేశం విషయంలో తాము ఓడిపోయినా భారతీయులకు ఇచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ తేదీ విషయంలో తమ విజయాన్ని వ్యక్తం చేసుకున్నారు.    బహుశా ఇదొక పైశాచిక ఆనందం కావచ్చు. భారతీయ ప్రజలకు కేవలం స్వేచ్ఛ దొరికిందనే ఆనందంలో ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు. దీనివల్ల భారతీయులకు నష్టమైతే ఏమి లేదు. కానీ తమ ఓటమిలో కూడా తమదే పైచేయి అనిపించుకున్న ఈ బ్రిటిషు వారి ఆలోచన తెలిస్తే మాత్రం అందరూ ఆగస్టును కాదని జనవరికే జైకొడతారేమో!! -నిశ్శబ్ద

ఈ పనులు చేయండి.. అందరూ మీరు చెప్పిన మాట వింటారు..!

  నేటికాలంలో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేలా చేయడం, తమ మాటను ఎదుటివారు ఆమోదించేలా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని ఎంతో లోతుగానూ, అంతకు మించి ఇగో తోనూ డీల్ చేస్తుంటారు.  ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి ఆఫీసులో కొలీగ్స్,  బాస్  వరకు ప్రతి ఒక్కరిని చాలా విషయాల దగ్గర డీల్ చెయ్యాల్సి ఉంటుంది.   ఏదైనా విషయంలో వాళ్లను ఒప్పించాలంటే  చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.  అయితే అలా కాకుండా మీరు మీ అభిప్రాయాన్ని ఇతరులు ఒప్పుకునేలా చేయాలంటే కొన్ని పనులు చేయాలి. అవేంటో తెలుసుకుంటే.. ఏదైనా ఒక విషయం మంచిదే అయినా దాన్ని చెప్పే పద్దతి సరిగా లేకుండా ఆ విషయాన్ని ఎవరూ ఆమోదించరు. కాబట్టి చెప్పాలనుకునే విషయాన్ని అర్థం అయ్యేలా, ఆకట్టుకునేలా,  దాని వెనుక ఉన్న  లాభాలు,  అందులో ఉన్న ప్రత్యేకత, దాని అవసరం అన్ని వివరంగా చెప్పాలి.  ఇలా చెప్తే ఎవరూ దేన్నీ కాదనరు. ఎవరికి అయినా ఏదైనా చెప్పేముందు ఆ చెప్పాల్సిన వ్యక్తి ఎలాంటి వారో అర్థం చేసుకోవాలి.  వారి స్వభావాన్ని బట్టి విషయం చెప్పే విధానం మార్చాలి. ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు చెప్తున్న విషయం పట్ల స్పష్టతతో ఉండాలి.  ఆ విషయం నుండి ఇంకొక విషయానికి డైవర్ట్ కాకూడదు.  ఇది చెప్పాలనుకున్న విషయాన్ని దారి మళ్లిస్తుంది. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు సమయం కూడా ప్రదాన పాత్ర పోషిస్తుంది.  ఎదుటి వ్యక్తి ఉన్న మూడ్ ను బట్టి విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఎలాంటి విషయం చెప్పాలో అర్థం చేసుకోవాలి. కొందరికి ఎక్కువ సేపు మాట్లాడితే నచ్చదు. కుటుంబ సభ్యులు అయినా సరే విషయాన్ని సాగదీసి సుత్తి కొట్టినట్టు చెబితే తల ఊపుతారు తప్ప విషయాన్ని బుర్రకు ఎక్కించుకోరు.  కాబట్టి చెప్పాలనుకున్న విషయాన్ని సింపుల్ గా, అర్థం అయ్యేలా,  తక్కువ సమయంలో చెప్పాలి.  చెప్పే విషయం కేవలం మాటల ద్వారానే కాదు కొన్ని సార్లు శరీర హావభావాలు కూడా దానికి మద్దతు ఇస్తాయి. అయితే అతిగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు.  ముఖ్యంగా గొడవలకు సంబంధించిన విషయాలు అయితే చెయ్యి చూపించడం, వేలు చూపించడం,  ఎదుటి వ్యక్తిని ఇమిటేట్ చేసి చెప్పడం  లాంటివి చేయకూడదు.  దీని వల్ల చెప్పాలనుకున్న విషయం కూడా మళ్లీ వివాదానికి,  గొడవకు దారితీస్తుంది. చెప్పే విషయం సరైనదేనా అని ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.  అది న్యాయబద్దమైనదైనా,  ఇతరులకు ఎలాంటి సమస్య తలపెట్టినది అయినా అప్పడు మాత్రమే దాన్ని ప్రస్తావించాలి. మంచి చెప్పే విషయం లేదా చేసే పని ఇతరులకు మంచి చేయకపోయినా చెడు తలపెట్టకూడదు.                                             *రూపశ్రీ.

అనుమానం!

అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.   శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు. ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది. ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!

విడాకులు వెక్కిరిస్తాయ్ జాగ్రత్త!

మామిడాకుల తోరణాల మధ్య, మంగళ వాయిద్యాల మురిపెంలో, మూడుముళ్ళతో ఒక్కటై, జీవితాంతం ఒకరికి ఒకరని ఉండాల్సిన దంపతులు కాస్తా  విడాకులను పంచేసుకుంటున్నారు.  ఈమధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువైపోతొంది. విడాకులకు చెబుతున్న కారణాలకు కోర్ట్ లోని జడ్జ్ లు కూడా విస్తు పోతూ ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న సమస్యలను కారణంగా చూపుతూ విడాకులు కావాలని అడగుతున్నందుకు.  ప్రతి మనిషి ప్రతి సమస్యను స్వయానా అనుభవిస్తున్నపుడే ఆ సమస్యలో తీవ్రత అర్థమవుతుంది. అందుకే సమస్యలు చిన్నవి అయినా  అవి వాళ్ళను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బయటి వాళ్ళు మాత్రం చాలా తొందరగా విమర్శలు  చేసేస్తారు. అయితే సమస్యలు ఎలాంటివి అయినా మనుషులు బంధాలను అంత సున్నితంగా వదిలేయడం, విడిపోవడం అనేవి కాస్త కలవరపరిచే విషయాలే.  అసలు విడాకులు ఎందుకు? ఒకరితో మరొకరు కలిసి బతకలేం అనే విషయం పూర్తిగా అర్థమైనపుడు అలా విడిపోవడం అనే సందర్భం వస్తుంది. చాలామంది పరువు కారణంగానో, పిల్లల భవిష్యత్తు కారణంగానో, మరీ వేరే ఇతర కారణాల వలనో ఇష్టం లేకపోయినా బతుకు వెళ్లదీస్తుంటారు.  విడాకుల వల్ల నష్టపోయేది అమ్మాయిలే అనే ముఖ్య విషయం చాలా చోట్ల అర్థమవుతూ ఉంటుంది. కారణాలు చాలానే ఉన్నాయి. పిల్లలు అమ్మాయిల దగ్గరే ఉండటం, ఆర్థికంగా మరియు ఉద్యోగ విషయంగా మంచి స్థాయిలో లేకపోవడం.  విడాకుల తర్వాత సమాజం దృష్టిలో చులకన అయిపోతామనే భావం గట్టిగా బలపడి ఉండటం. అటు తల్లిదండ్రుల వైపు నుండి, ఇటు అత్తమామలు వైపు నుండి ఎలాంటి ఆదరణ లేకపోవడం.  మరి అమ్మాయిలు స్ట్రాంగ్ అవ్వడం ఎలా? చాలావరకు విడాకుల విషయంలో నెలనెలా భార్యకు భరణం ఇస్తున్న భర్తలు చాలా తక్కువని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో మొదట్లోనే కొద్దీ మొత్తం ఇచ్చి పూర్తిగా వదిలించేసుకుంటారు. అలాంటి విషయాలపై ఆధారపడకుండా…. మహిళలు చదువు లేకపోయినా కొన్ని నైపుణ్యాలు నేర్చుకుని ఉండాలి.  కుట్టు పని, అల్లికలు, ఆర్ట్&క్రాఫ్ట్స్, ఇతర చేతి పనులు వంటివి నేర్చుకుని ఉండాలి. విడాకుల విషయంలో అనవసర ఇగో లకు పోకుండా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చర్చించుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఒకవేళ ఆ చర్చలో కలిసి ఉండలేం అనే విషయం ఫైనల్ అయినా ఆరోగ్యంగా విడిపోవాలి. ఎవరూ ఎవరిని అనవసర విమర్శలు చేసుకోకూడదు. విడాకుల వల్ల తదుపరి తమ జీవితాలు బాగుంటాయా లేదా అనే విషయం ఆలోచించాలి. లేకపోతే పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డ చందాన తయారవుతాయి జీవితాలు. అమ్మ నాన్నలో, అక్కా తమ్ముల్లో, అన్నా వదినలో లేక స్నేహితులో ఇరుగు పొరుగు వాల్లో ఇలా ఎవరిని జోక్యం చేసుకొనివ్వకూడదు. ఎందుకంటే ముడిపడిన జీవితాలు రెండైనపుడు, ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సింది మొదట ఇద్దరే.  ఆర్థిక విషయాల పట్ల ఎలాంటి మోహమాటాలు లేకుండా మాట్లాడుకోవడం ఉత్తమం. ఎందుకంటే జీవించాలంటే డబ్బు కూడా అవసరమే. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే విడాకుల ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే వ్యక్తి గతంగా ఉత్తమంగా ఉండగలరు. పిల్లల భవిష్యత్తు గందరగోళానికి గురవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దగ్గర విడిపోయిన భాగస్వామి గురించి చెడుగా మాట్లాడకూడదు.  మంచి ముహుర్తాలు పెట్టుకుని జతకావడం, విడాకుల ద్వారా విడిపోవడం అనేది జీవితాల్లో కచ్చితంగా అలజడి సృష్టిస్తుంది. అయితే ఆలోచించి అడుగు వేయడం ముఖ్యం. ఎందుకంటే  మీరు వేసేది  తప్పటడుగై ఏడడుగులను వెక్కిరించకూడదు మరి. ◆ వెంకటేష్ పువ్వాడ  

మూఢనమ్మకాలు వాటి ప్రభావం!

నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు పునాది లాంటిది. మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డగోడ లాంటిది. ప్రస్తుత సమాజంలో నమ్మకమనే పేరులోనే మూఢనమ్మకాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల వారికి మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్నవారికి, చుట్టూ ఉన్న వారి జీవితాలకు కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది.  నమ్మకాన్ని నమ్మచ్చుకాని, మూఢనమ్మకాలను నమ్మకూడదు. మూఢత్వం అనేది అంత మంచిది కాదు. అసలు మూఢ నమ్మకాలు నమ్మడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్న వేసుకుంటే అది ఎందుకూ పనికిరాదనే విషయం అర్థమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాటిని గుడ్డిగా నమ్మటం, ఎప్పుడో ఎవరికో ఏదో జరిగిందని ఆ పని చేస్తే ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతుందని నమ్మడం, శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా ఉన్న విషయాలను విశ్లేషించకుండా, ఆలోచించకుండా పిచ్చితనంతో ఫాలో అయిపోవడం మొదలైనవాటిని మూఢనమ్మకాలు అంటారు.  మూఢనమ్మకాలను మన దగ్గరకి రానియ్యకూడదు. ఒకసారి మనం వాటిని నమ్మినట్లయితే అవి మనల్ని వదిలిపెట్టవు. ఏ పని మొదలు పెట్టాలన్నా భయమే. పిల్లి ఎదురొస్తే భయం, విధవరాలు ఎదురొస్తే ఏదో చెడు జరుగుతుందని భయం, ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు తుమ్మితే భయం, ఈ రకంగా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు చాలా మంది.  వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమీ వుండదు. కొన్ని కొన్నిసార్లు మనకు పిల్లి ఎదురొచ్చినా మంచి జరుగుతుంది. అలాగే విధవరాలు ఎదురొచ్చినా మంచి జరుగుతుంది. తుమ్ము వచ్చినా అదేదో జలుబు వల్ల వచ్చి ఉంటుంది. కానీ అందరూ మాత్రం వాటిని కాదు, జరిగే నష్టాన్ని మాత్రమే కొండంత చేసి చూపిస్తారు. దాన్నే ఇంకొకరికి చెబుతారు కూడా.   కొన్నిసార్లు దేవుణ్ణి తలచుకుని వెళ్ళినా అనుకోకుండా చెడు జరుగుతుంది. ఇవన్నీ కామన్ ఇలా జరుగుతుంటాయి. వాటన్నింటిని పట్టించుకుంటే మనం మనశ్శాంతిగా వుండలేము అని ఎవరూ అనుకోరు. అట్లాగే ఏ పని చెయ్యాలన్నా ముందుకు రాకుండా భయపడుతూ వుంటారు. ఈ మూఢనమ్మకాల వల్ల కొన్ని సార్లు అర్జంటుగా వెళ్ళవలసి వచ్చిన ప్రయాణాలను కూడా వాయిదా వేస్తుంటాము. తద్వారా మనం ఎంతో కొంత నష్టపోవలసి వస్తుంది. కాని మనం నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని మనం గుర్తించము. ఆ నష్టాన్ని గురించి కూడా ఆలోచించము. మనకు మూఢనమ్మకాల పైన వున్న అభిమానాన్ని, నమ్మకాన్ని మరింత పెంచుకుంటాము. వాటి ప్రకారం చేశామా?? లేదా అన్న విషయాన్నే మనం పరిగణనలోకి తీసుకుంటాం...! మనం ఒక పనిచేయాలంటే ఆ పని చేయడం వల్ల జరిగే మంచేమిటి చెడేమిటి అనే విషయం ఆలోచించాలి.  మంచి, చెడులు ఆలోచించుకొని ఆ పని చేయాలో, వద్దో నిర్ణయించుకుంటే సరిపోతుంది. అంతేకాని ఎవరో ఎప్పుడో ఆ పని చేస్తే వారికి నష్టం కలిగిందని ఇప్పుడు మనం చేస్తే కూడా నష్టం జరుగుతుందని చేయవలసిన పనిని చెయ్యకుండా మానేయటం మంచిది కాదు. దానిలో పిరికితనం కూడా పెంపొందుతుంది. అన్ని వేళలా మనం మూఢనమ్మకాలను నమ్ముకుంటూ కూర్చుంటే అది మనకు అడ్డుగోడలుగా వుండి మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. చాలా సందర్భాలలో జరుగుతున్నది ఇదే… అందుకే నమ్మకాలు ఎప్పుడూ మనుషుల్ని బలవంతులుగా మార్చాలి కానీ బలహీనులుగా చేసి అభివృద్ధికి అడ్డు పడకూడదు.                                    ◆నిశ్శబ్ద.

నేటికాలం అనారోగ్యాలకు హేతువు ఇదే!

డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి. జీవితంలో చాలామందికి ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. ప్రపంచ జనాభాలో నూటికి 80% మంది ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కు గురి అవుతుంటారు. ప్రపంచం అభివృద్ధి చెందేకొద్ది, మనుషులు అన్ని రకాల అవసరాలను చాలా సులభంగా తీర్చుకునే కొద్దీ మనుషులకు మానసిక వ్యాధులు ఎక్కువ అవుతూ ఉన్నాయి.  చాలామంది మానసిక సమస్యతో బాధపడుతున్నా సరే అది మానసిక వ్యాధి అని వారు గుర్తించరు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో దీన్ని గుర్తించేవారు లేరు. డిప్రెషన్ తో బాధపడే వారిని పొగరు మనుషులుగా ముద్ర వేస్తుంటారు చాలా మంది. డిప్రెషన్కు గురి అయినవారు ఏదో ఒక బాధతో, దుఃఖంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి లక్షణాలు వున్నవారు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు. ఏదో చిరాకు, ఇష్టమైన వాటి మీద కూడా అయిష్టంగా వుంటారు. అంతేకాకుండా వారు చెయ్యగలిగిన వాటిని చెయ్యలేరు, నా వల్లకాదు అన్న ఆలోచనలు కలిగివుంటారు. అందుకే వారు ఏ పనికి ముందుకు రారు, చేయమని ఎవరైనా చెప్పినా కాదని చెబుతారు. ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. కానీ ఇదంతా వారి నాటకం అని, పని తప్పించుకోవడానికి వారు అలా చేస్తున్నారని చుట్టూ ఉన్నవారు చెబుతారు.  జీవితానికి అవసరం అయిన ఎన్నో విషయాలపై మనం ఇంట్రస్టును కోల్పోతుంటాము. మనకు ఆనందాన్నిచ్చే విషయాలపై ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు, పిక్నిక్ లు, మొదలైన వాటిపట్ల కూడా ఆసక్తి కోల్పోతారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి నిద్రపట్టకపోవడం, నిద్రపట్టినా కలతనిద్రే తప్ప సుఖనిద్ర లభించదు. అంతేకాకుండా నిద్రలో ఏదో భయంకరమైన కలలు రావటం జరుగుతుంది. మరణం గురించిన ఆలోచనలు తరుచుగా వస్తూ వుంటాయి. జీవితం మీద విరక్తి వస్తుంది. బతకటం కంటే చావటం మేలు అనుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. జీవితాన్ని భారంగా భావిస్తారు.  మార్పు అన్నది జీవితంలో అత్యంత సహజమైన విషయం. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే అందరూ ఆ మార్పులను తట్టుకోలేరు. జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం అన్నాక సుఖదుఃఖాలు రెండూ వుంటాయి. దుఃఖం కలిగినప్పుడు తల్లడిల్లిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోకుండా జరిగిన అనుభవించిన సుఖాల గురించి, మంచిని గురించి ఆలోచించాలి. అప్పుడు మనం దుఃఖం గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళకుండా వుండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మార్పులకు అనుగుణంగా మనం మారాలే తప్ప బాధ పడకూడదు. ఏ మార్పు జరిగినా అది మన మంచికే అన్న భావనను కలిగి ఉండాలి. అప్పుడే మానసికంగా ఎంతో కొంత ఓదార్పు లభిస్తుంది. మనం మనకి సంబంధించిన వారు ఎవరైనా దూరమైపోతున్నప్పుడు చాలా బాధపడుతుంటాం. కొంతమంది ఈ చిన్న విషయానికి డిప్రెషన్ కు గురి కావటం జరుగుతుంది. మనుషులు దూరమైనంత మాత్రాన వారిలో మార్పు సంభవించదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.  ఎంతదూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అన్న సత్యాన్ని ఆలోచించినట్లయితే డిప్రెషన్కు టాటా చెప్పవచ్చు.                                        ◆నిశ్శబ్ద.

ఒత్తిడులను అధిగమించకపోతే జరిగే నష్టమిదే...

సమస్య ఎదురవగానే మనస్సు దానిని అసలు గుర్తించదు. అది ఒక గదిలో జంబుఖానా క్రింద దుమ్మును దులపడం లాంటిది. నేలపై బాహ్యంగా ఏమీ కనిపించకపోయినా, జంబుఖానా క్రింద చాలా దుమ్ము ఉంటుంది. కానీ దుమ్మును ఆ విధంగా కప్పి ఉంచడం వల్ల గది అంతా ఎంతో పరిశుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే విధంగా, సమస్య ఉత్పన్నమైనప్పుడు, శిక్షణ లేని మనస్సు ఆ సమస్యను తనకు తెలియకుండానే చైతన్యయుతమైన మనస్సు నుండి బయటకు త్రోయాలని అనుకుంటుంది. అప్పుడా సమస్య జంబుఖానా క్రింది దుమ్ము లాగా అచేతనమైన మనస్సు పొరలలోకి వెళ్ళి, అక్కడ స్థిరపడుతుంది. ఆ సమస్య తీరిపోదు కానీ, జరిగేది ఏమంటే అది మన కళ్ళ ముందు ఉండదు, కనిపించదు. ఏ సమస్య అయినా సరే పై స్థాయిలో కనిపిస్తూ ఉంటేనే మనం దాన్ని పట్టించుకోగలుగుతాం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. మనస్సు సమస్యలను ఎదుర్కోలేదు. ఎందుకు ఎదుర్కోలేదు అంటే.. సమస్యలను ఎదుర్కోవడం అంటే బాధాకరం కాబట్టి, సమస్యలు అంటేనే శారీరకంగానో.. మానసికంగానో.. భౌతికంగానో.. ఇబ్బంది పడటం. ఆ ఇబ్బందిని ఓర్చుకోవడం.. చాలామందికి అలా ఓర్చుకోవడంలో కష్టం, బాధ ఎదురవుతాయి. కాబట్టి సమస్యను ఎదుర్కోవడం మనిషికీ.. మనసుకు కూడా అసలు ఇష్టముండదు. కానీ సమస్య అలాగే ఉంటే ఏమి జరుగుతుంది?? అది అట్లాగే ఒక దొంతర కింద దాగిపోయి ఎప్పుడో ఆ దొంతర తొలగ్గానే దుమ్ము మురిగ్గా.. పరిసరాలను అపరిశుభ్రం చేసి, శ్వాసకు ఇబ్బంది కలిగించినట్టు సమస్య కూడా మనిషిని ఇబ్బంది పెడుతుంది.   కానీ మనసు ఏమి చేస్తుంది??  సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవిక పరిస్థితులను ఆ విధంగా అణచి వేయడం వల్ల సమస్యల పట్ల మనకున్న భయాలు, అపోహలు మనస్సులోని అచేతనమైన పొరకు త్రోసివేయబడతాయి. అప్పుడు ఈ అచేతనపు పొరలలో ఉన్న అచేతన ప్రేరణలు, శక్తులు మనస్సును నియంత్రించడం ప్రారంభిస్తాయి. అప్పుడది సమస్య పరిష్కారాలను అన్ని రకాల పద్ధతుల ద్వారా వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ రోజు ఎన్నడూ రాదు. సుదీర్ఘకాలం అట్లాగే దాన్ని పరిష్కరించకుండా ఉంచితే చిన్న సమస్యలు కూడా క్లిష్ట సమస్యలుగా మారతాయనే విషయం మనస్సు మరచిపోతుంది. సమస్యలను పరిష్కరించడం ద్వారానే వాటిని అధిగమించగలం. ఒక సామెతలో చెప్పినట్లు, "సరియైన సమయంలో ఒక కుట్టు వేస్తే, తొమ్మిది కుట్లు వేయాల్సిన అవసరం రాకుండా నివారించవచ్చు" ఒక చిన్న నిప్పురవ్వను ఆర్పకపోతే పెద్ద మంట అవుతుంది. నిప్పురవ్వగా ఉన్నప్పుడు దాన్ని ఆర్పడం తేలిక. కానీ సరైన సమయంలో ఆ పని చేయకపోతే, అది ప్రజ్వరిల్లుతుంది. దీని ఫలితంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్య నుండి పారిపోవడం, అసలు చూడకుండా ఉండడం, లేదంటే వాయిదా వేయడం అనే స్వభావాన్ని మానేయాలి. ఏదో ఒక భయంతో బయటకు చెప్పలేనిదాన్ని మనం తరచూ పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేస్తుంటాం. ఉదాహరణకు నలుగురితో చెడుగా ప్రవర్తించడం మర్యాద కాదు కాబట్టి మన కోపాన్ని వ్యక్తపరచం. కానీ అది ఎంతకాలం కొనసాగుతుంది? ఏదో ఒక రోజున అంతా బట్టబయలవుతుంది. ఇతరులపై కోపం చూపలేకపోతే అది మన ఆరోగ్యాన్నే దెబ్బ తీస్తుంది. అది కడుపులో పుండునో, అధిక రక్తపోటునో, లేదంటే గుండె ఆగిపోవడాన్నో, గుండె పోటునో కలగజేస్తుంది. అందుచేత మన లోపల ఉన్న ఈ ఒత్తిళ్ళను అధిగమించడం నేర్చుకోవాలి. అది కూడా ఇతరులను నొప్పించకుండా.. మన అసంతృప్తులు ఇతరుల మీదకు వెళ్లకుండా మన ఒత్తిడులను అధిగమించాలి.                                        ◆నిశ్శబ్ద.

నిబంధనలు మంచివేనా?

మనిషికి జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబాలలో, సమాజంలో నిబంధనలు తప్పనిసరి. కొందరికి కొన్ని నియమాలు చాలా కటినంగా అనిపిస్తూ ఉంటాయి, మరికొందరికి అవే మంచి చేస్తుంటాయి. మన చుట్టూ ఉన్న చాలామందితో మాట్లాడేటప్పుడు అలా కనుక లేకపోతే ఇంకేదో అయిపోయి ఉండేవాన్ని/ఉండేదాన్ని అంటూ ఉంటారు. ఇంకేదో అంటే ఇక్కడ ఉన్న స్థాయి కంటే మరోలా ఉండేవాళ్ళమని వాళ్ళ అభిప్రాయం. అంటే ఇక్కడ ఇంకా ఉన్నతంగా వెళ్ళడానికి సరైన దారులు కొరవడ్డాయని(లభ్యం కాలేకపోవడం లేదా అందుబాటులో లేకపోవడం) వాళ్ళ అభిప్రాయం. చిన్నప్పటి నుండి కొన్ని నిబంధనల చుట్టూ పెరిగి, కాస్త ఊహ వచ్చాక, ఆ తరువాత మరికొంత ఎదిగాక ఒకానొక స్వేచ్ఛను కోరుకోవడం మొదలుపెట్టినప్పుడు నిబంధనలు అన్నీ పెద్ద గుదిబండలులా అనిపిస్తాయి అందరికీ. అయితే అవన్నీ మనిషిని ఒక గీత దాటకుండా నియంత్రిస్తూ ఉంటాయి. పెద్దల అజమాయిషీ కాదు అతిజాగ్రత్త!! ప్రతి ఇంట్లో ఇంకా కొన్ని చోట్ల పిల్లల మీద పెద్దలు ఎప్పుడూ నిఘా వేసి ఉంచుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని నిబంధనలు విధిస్తారు. ఆ నిబంధనలు దాటి పిల్లలు ఎక్కడ తప్పటడుగులు వేస్తారోననే భయం వాళ్లలో ఉంటుంది. ఆ భయం నుండే పెద్దలకు తమ పిల్లలు తమ కనుసన్నల్లో మెలగాలని అలాగే వాళ్ళను డిమాండ్ చేయాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. అయితే ఇదంతా స్వేచ్ఛను ఎక్కువగా కోరుకునే వయసు వాళ్లకు చాలా విసుగు తెప్పిస్తుంది. ఆ విసుగు నుండే ఒత్తిడి ఎక్కువై ఒకానొక వ్యతిరేక భావం ఏర్పడుతుంది.  ఆ వ్యతిరేక భావంలో నుండే పెద్దలు అది చేయద్దు అంటే అదేపనిగా దాన్ని చేసే బుద్ధి పుడుతుంది.  కాబట్టి పెద్దలు పిల్లలకు విధిస్తున్న నిబంధనలు ఏవి ఎందుకోసం అనే విషయాన్ని పక్కన కూర్చోబెట్టుకుని వివరంగా చెబుతుంటే వాళ్ళు కూడా ఆ నిబంధనలను గౌరవిస్తారు. వాటిని పాటిస్తారు. వాటితో పాటు పెద్దలను కూడా ప్రేమిస్తారు. మనకు మనం విధించుకోవాల్సినవి!! చెప్పుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ మనకు మనం కొన్ని నిబంధనలు విధించుకోవడం వల్ల  మనకంటూ ఓ ప్రత్యేక జీవితాన్ని సృష్టించుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత అనేది అందరికీ విభిన్నంగా ఉండాలనే ఆలోచనతో అనుకుంటే పొరపాటు. మనకున్న ఇష్టాలు, అభిరుచులు అనేవి మనలో ఉన్న ప్రత్యేకతలు, మనకున్న ఆసక్తులు ఇతరుల కంటే బిన్నంగానే ఉంటాయి. ఒకే ఇంట్లో ఉండే వాళ్లకు కూడా వేరు వేరు అభిప్రాయాలు, ఆసక్తులు ఉండేటప్పుడు ఎవరికి వారు కొన్ని నిబంధనలు విధించుకోవడం వల్ల తమకు నచ్చినట్టు ఉండే అవకాశం చేకూరుతుంది. అంతే కాదు ఆ నిబంధనలు ఎదుటి వారు మన జీవితాన్ని ప్రభావితం చెయ్యకుండా ఉండేలా చేస్తాయి కూడా. ఆలోచనా విస్తరణ, ఆత్మవిశ్వాసపు వీక్షణ!! పెట్టుకునే నిబంధనలు ఎప్పుడూ ఆలోచనా పరిధిని పెంచుకునేలా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని ఒక చిన్న స్పూన్ లో పట్టుకున్నట్టు ఫీలైపోవడం మానుకుని అన్నిటినీ తెలుసుకునేలా ఉండాలి. దీని ఉద్దేశ్యం ఏమిటంటే ఎంతో పరిధి ఉన్న ఈ ప్రపంచంతో పాటు ఆలోచనా పరిధి కూడా పెరుగుతూ పోతుంది. నిబంధన అంటారు విస్తరణ అంటారు ఎలా సాధ్యం అని అందరికీ అనిపించవచ్చు. అయితే ఇక్కడే ఒక విషయం అర్ధం చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు బిపి పేషెంట్ ఉప్పు తక్కువే తినాలి. అలా తినాలని డాక్టర్ చెప్పినా సమస్య ఉన్న వ్యక్తి తనకు తాను నియంత్రించుకుంటూ నిబంధనలు పెట్టుకోకపోతే అతనికి నష్టం కాబట్టి. ఆలోచనా పరిధి పెంచుకునే దారిలో కూడా కొన్ని అనవసర విషయాలను పట్టించుకోకుండా ఉండేలా నిబంధనలు పెట్టుకోవాలన్నది దీని ఉద్దేశ్యం.  ఆరోగ్యవంతమైన జీవితం!! తినే పదార్థాలు కావచ్చు, రోజువారీ అలవాట్లు కావచ్చు, సంపాదించే మార్గాలు కావచ్చు, చదివే విషయం కావచ్చు, ఇతరుల జీవితాలు కావచ్చు. జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు. ఇలా ప్రతి దాంట్లో కూడా మనిషి కొన్ని నిబంధనలు పెట్టుకుంటే గనుక అనవసర విషయాలు జీవితాల్లో నుండి వాటికవే తొలగిపోతాయి.  లేకపోతే అవి అప్రయత్నంగా వచ్చి చేరడం, వాటిని తొలగించుకోవడానికి సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది.                                     ◆వెంకటేష్ పువ్వాడ  

కాన్ఫిడెన్స్‌ పెరగాలా... నిటారుగా కూర్చోండి చాలు!

ఆత్మవిశ్వాసం పెరగడానికి చాలా చిట్కాలే వినిపిస్తూ ఉంటాయి. వినడానికి అవన్నీ బాగానే ఉంటాయి కానీ, పాటించడం దగ్గరకి వచ్చేసరికి తాతలు దిగి వస్తారు. దాంతో చిట్కాలన్నింటినీ మూటగట్టి... ఉసూరుమంటూ పనిచేసుకుపోతాం. కానీ ఇప్పుడు మనం వినబోయే చిట్కా పాటించడానికి తేలికే కాదు, దీంతో అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు పరిశోధకులు. కొంతమందిని చూడండి... వాళ్లు నిటారుగా నడుస్తారు, కూర్చున్నా కూడా నిటారుగానే కూర్చుంటారు. వాళ్లని చూసి- ‘అబ్బో వీళ్ల మీద వీళ్లకి ఎంత నమ్మకమో’ అన్న ఫీలింగ్‌ తెలియకుండానే కలుగుతుంది. నిటారుగా కూర్చుంటే ఎవరిలో అయినా ఆత్మవిశ్వాసం పెరుగుతుందా! అనే అనుమానం వచ్చింది అమెరికాలో కొంతమంది పరిశోధకులకి. దాంతో వాళ్లు ఓ ప్రయోగం చేసి చూశారు.ఈ ప్రయోగంలో భాగంగా 71 మందిని ఎన్నుకొన్నారు. ‘ఒక ఉద్యోగం చేసేందుకు మీలో ఉన్న మూడు పాజిటివ్‌ లక్షణాలు, మూడు నెగెటివ్‌ లక్షణాలు ఒక పేపరు మీద రాయండి,’ అని అడిగారు. అయితే ఇలా రాసే సమయంలో ఓ సగం మంది నిటారుగా కూర్చుని రాయాలనీ, మిగతావాళ్లు చేరగిలబడి రాయాలనీ సూచించారు. నిటారుగా కూర్చుని రాసినవాళ్లు తమలో ఉన్న పాజిటివ్‌ లక్షణాలను చాలా బాగా ప్రజెంట్‌ చేయగలిగారు. అదే సమయంలో నెగెటివ్‌ లక్షణాలు అసలు పెద్ద విషయమే కాదన్న అభిప్రాయం కలిగేలా రాసుకొచ్చారు. ఇక చేరగిలబడి కూర్చున్నవారి పద్ధతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తమలో ఉన్న పాజిటివ్ లక్షణాలను కూడా చాలా సాధారణంగా రాసుకొచ్చారు. ఇక నెగెటివ్‌ లక్షణాలను గొప్ప సమస్యలుగా చిత్రీకరించారు. విచిత్రం ఏమిటంటే... నిటారుగా కూర్చున్నప్పుడు తమ కాన్ఫిడెన్స్‌లో మార్పు వచ్చిన విషయం వాళ్లకి కూడా తెలియలేదు. కానీ వాళ్ల చేతల్లో మాత్రం గొప్ప మార్పు కనిపించింది. అదండీ విషయం! ఈ చిన్న చిట్కా కనుక పాటిస్తే... పరీక్షలు రాయడం దగ్గర నుంచి ఇంటర్వ్యూలో జవాబులు చెప్పడం వరకూ ఎలాంటి సందర్భంలో అయినా మనలో కాన్ఫిడెన్స్‌ రెట్టింపు అవుతుందని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. నిటారుగా కూర్చోవడం, నడవడం వల్ల... మన ఆలోచనల్లో స్పష్టత వస్తుందనీ, అదే కాన్ఫిడెన్సుకి దారితీస్తుందనీ చెబుతున్నారు. - నిర్జర.

సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరగాలంటే ఈ పనులు చేయండి..!

సెల్ఫ్ కాన్పిడెన్స్.. ఏ పనిలో అయినా విజయం సాధించడానికి మొదటి సూత్రం ఇదే..  ఒక వక్తికి తన మీద తనకు స్పష్టమైన నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి విజయాన్ని చాలా సులువుగా సాధించగలుగుతాడు. అయితే ఈ సెల్ఫ్ కాన్పిడెన్స్ అనేది అనుకోగానే వచ్చేది.  ఇది జీవితంలో అలవాట్ల ద్వారా, వ్యక్తిత్వం ద్వారా ఏర్పడేది.  కానీ కొన్ని పనులు చేయడం ద్వారా ప్రతి వ్యక్తి తమ సెల్ఫ్ కాన్పిడెన్స్ ను పెంచుకోవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. పాజిటివ్ ఆలోచనలు.. మంచి అయినా, చెడు అయినా మొదట ఆలోచనలే మనిషి మీద ప్రభావం చూపిస్తాయి.  పాజిటివ్ ఆలోచనలు ఉన్నవారికి వారి జీవితంలో తాము చేసే పనులలో కూడా పాజిటివ్ వైఖరి ఉంటుంది. తమ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా వారి ఆలోచనలే ప్రేరేపిస్తాయి. సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరగాలంటే పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి. లక్ష్యాలు.. పెద్ద  పెద్ద లక్ష్యాలు నిర్థేశించుకుంటేనే గొప్పవాళ్లు కాగలం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.  కొందరు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్తుంటారు. అయితే గొప్ప కలలు కనడంలో, గొప్ప స్థాయికి వెళ్లాలని అనుకోవడంలో తప్పు లేదు.. కానీ చిన్న చిన్న లక్ష్యాలను నిర్థేశించుకుని వాటిని సాధిస్తూ వెళితే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం.. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా సరే లక్ష్యాలు సాధించాల్సిందే.. అనుకున్న పనులు చేయాల్సిందే అనే మొండితనం ఎప్పటికైనా తీవ్ర నష్టం కలిగిస్తుంది.  అందుకే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి.  ఆరోగ్యం బాగుంటే ఎంత కష్టమైన పనులైనా ఉత్సాహంగా చేయగలుగుతారు. నేర్చుకోవాలి.. అంతా తెలుసు అనేది అహంకారం అవుతుంది.  ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనుకున్నప్పుడే ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. విషయాన్ని కూడా ఇంకా బాగా నేర్చుకుంటారు. ఇది లక్ష్యాల పట్ల ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. బలహీనతలు.. బలహీనతలు కప్పిపుచ్చుకోవడం చాలా మంది చేసే పని. కానీ బలహీనతలపై దృష్టి పెట్టాలి. వాటిని అధిగమించాలి. అలాగే బలాలను కూడా గుర్తు  చేసుకోవాలి.  బలాల ద్వారా సాధించిన విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఓటమి.. జీవితంలో ఓటమి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదురవుతుంది.  విజయమే కావాలి అనే మెంటాలిటీ మనిషిని సెక్యురిటీ జోన్ లో ఉంచుతుంది.  కానీ ఓటమిని కూడా అంగీకరించగలిగేవారికి జీవితంలో  కాన్పిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. ప్రతి వైఫల్యం గొప్ప అనుభవాన్ని ఇస్తుంది.  వ్యక్తిత్వ పరంగా బలంగా మార్చుతుంది. పరిచయాలు.. సెల్ఫ్ కాన్సిడెన్స్ మెరుగ్గా ఉండాలంటే నెగిటివ్ గా ఆలోచించకుండా ఉండటమే కాదు.. నెగిటివ్ మాటలు మాట్లాడే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి.  నెగిటివ్ గా మాట్లాడేవారు ప్రతి ప్రయత్నంలో వెనక్కు లాగే మాటలే మాట్లాడతారు.  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. భయం.. దేనికీ భయపడకూడదు. సమస్యలు ఏవైనా వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వాటిని ఎదుర్కోగలం అనే నమ్మకాన్ని పెంచుకోవాలి.   ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.                                      *రూపశ్రీ.