గూగుల్ మొదటి అడుగుకు 27వసంతాలు పూర్తీ!

గూగుల్ మనిషి రోజువారీ ఎక్కువగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్. హిస్టరీ గురించి వెతకాలా?  గూగుల్ లో సెర్చ్ చేస్తే వికీపీడియా వొస్తుంది. సినిమా సమాచారం కావాలా? గూగుల్ లో సెర్చ్ చేస్తే బోలెడు అప్డేట్స్ ఉంటాయి. అనారోగ్యానికి ఏవైనా చిట్కాలు కావాలా? గూగుల్ తల్లి మంచి మందులేవో చక్కగా చూపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, సినిమా, జోకులు, ప్రత్యేక దినాలు, చరిత్ర, చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు, గొప్ప వ్యక్తులు.. ఆఖరికి ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చేయాలి?  వంటి ప్రశ్నల నుండి.. ఎలా చచ్చిపోవాలి అనే పిచ్చి సమాధానాల వరకు అన్ని గూగులమ్మ చెబుతుంది. అయితే ఈ రోజు ప్రజలు ఇంతగా గూగులమ్మ మీద ఆధారపడటం అనేది ఒక ఏడాది, ఒక ప్రయత్నంతో జరిగింది కాదు. గూగులమ్మ ఇప్పుడు 27ఏళ్లు పూర్తీ చేసుకుంది. అసలు గూగుల్ ప్రయాణం ఏంటి? ఇది ఎలా మొదలైంది? వివరంగా తెలుసుకుంటే.. Google.com దినోత్సవం సెప్టెంబర్ 15న జరుపుకుంటారు.  గూగుల్ డాట్ కామ్ ను   ప్రారంభించిన మాతృ సంస్థ గురించి తెలుసుకుంటే గూగుల్ ప్రయాణం బాగా అర్థమవుతుంది.  గూగుల్ ప్రజల జీవితంలో పెద్ద భాగం. మొదట్లో ఇది  కేవలం సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందించే బహుళజాతి సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందింది. 'గూగుల్' అనే పదం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. గూగుల్ డాట్ కామ్ జనవరి 1996లో ప్రారంభమైంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని Ph.D విద్యార్థులైన  లారీ పేజ్,  సెర్గీ బ్రిన్ మెరుగైన సెర్చ్  ఇంజిన్‌ను రూపొందించడానికి పరిశోధన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వారు వెబ్‌సైట్‌ల మధ్య సంబంధాలను విశ్లేషించే పేజ్‌ర్యాంక్ అనే అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఇతర సైట్‌లకు లింక్‌ల సంఖ్య ఆధారంగా వాటి ఔచిత్యాన్ని నిర్ణయించింది. సెర్చ్  ఇంజిన్ మొదట డవలప్  చేయబడినప్పుడు దాని పేరు  “బ్యాక్‌రబ్”. ఈ పేరు ఆ తరువాత  Google గా మార్చబడింది, నిజానికి గూగుల్ అనేది  'గూగోల్' అనే పదాన్ని అక్షరదోషంలో పలకడం ద్వారా ఆవిష్కారమైంది.   గూగోల్ అనేది అతిపెద్ద సంఖ్య. ఒకటి తరువాత   100 సున్నాలను రాస్తే అది గూగోల్ అవుతుంది. ఇక Google చాలా సమాచారాన్ని అందిస్తుంది, ప్రస్తుతం   ఇంటర్నెట్‌లోని సమాచారం అంతులేనిదని. సెప్టెంబర్ 15, 1997న, పేజ్,  బ్రిన్ “ google.com ” డొమైన్‌ను నమోదు చేసుకున్నారు . 1998లో, పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించిన తర్వాత పేజ్,  బ్రిన్ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లోని స్నేహితుని గ్యారేజీకి అనుబంధంగా ఉన్న గదిలో అధికారికంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. డిసెంబరు 1999 నాటికి Google బీటా మోడ్‌లో ఉంది.  రోజుకు దాదాపు 10,000 సెర్చింగ్  ప్రశ్నలకు సమాధానాలు లభించేవి.  2003లో, గూగుల్ తన ప్రధాన కార్యాలయాన్ని ఇప్పుడు గూగుల్‌ప్లెక్స్ అని పిలవబడే చోటుకు మార్చబడింది. వాస్తవానికి ఇది కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో 40 ఎకరాల క్యాంపస్. కాలక్రమేణా వారు సైట్‌లో అనేక భవనాలను కొనుగోలు చేశారు,  వాటికి అనధికారిక పేర్లను ఇచ్చారు. క్యాంపస్‌లో క్యూబికల్స్ లేకుండా ఓపెన్ కాన్సెప్ట్ ఉంది,  ఇక్కడ  బంతులను కుర్చీలుగా ఉపయోగించారు. మెరియం-వెబ్‌స్టర్ 2006లో దాని కాలేజియేట్ డిక్షనరీకి 'గూగుల్' అనే పదాన్ని జోడించారు.  "ఇంటర్నెట్‌లో సమాచారాన్ని పొందడానికి Google సెర్చ్  ఇంజిన్‌ను ఉపయోగించడం." అని ఈ డిక్షనరీలో ప్రస్థావించారు.  కంపెనీ సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందిస్తుంది. 2015లో కంపెనీ పునర్నిర్మించబడింది.  ఆల్ఫాబెట్ ఇంక్.గా మారింది.  గూగుల్ దాని అతిపెద్ద అనుబంధ సంస్థగా మారింది. ఇదీ గూగుల్ తల్లి చరిత్ర.                                                      *నిశ్శబ్ద.

అంకెలతో మాయాజాలం.. సుడోకు పుట్టుక,చరిత్ర తెలుసా..

ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.  

డబ్బు సంపాదించే ఉపాయం చెప్పిన చాణక్యుడు..!!

చాణక్యుడి పేర్కొన్న అనేక అంశాల్లో డబ్బు ఒకటి. మన జీవితంలో డబ్బు ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని చాణక్య నీతిలో స్పష్టంగా వివరించారు. చాణక్యుడి విధానంలో, 'ధనమే మతాన్ని అనుసరించేవాడు'. ఎవరైతే డబ్బును సరైన మార్గంలో వినియోగిస్తారో...వారు మతాన్ని కూడా మంచి మార్గంలో అనుస్తారిస్తారని తెలిపారు. చాణక్యుడు చెప్పినట్లుగా మనం డబ్బును ఎలా ఉపయోగించాలి? సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభం పొందగలము. ధనం జనం పరిత్రయ: మనం సరైన మార్గంలో ధనాన్ని ఉపయోగించినప్పుడే..అది సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినట్లు అర్థం. తప్పుడు పనులు చేయడానికి లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి డబ్బు ఖర్చు చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి లేదా సమాజానికి మాత్రమే ఇబ్బంది లేదు. దీనితో మీరు సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మంచి మార్గంలో సంపాదించడం: మనం మంచి మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. చెడు లేదా హింసాత్మక మార్గాల ద్వారా సంపాదించిన లేదా సంపాదించిన డబ్బు మనకు సంతోషాన్ని లేదా సంతృప్తిని ఇవ్వదు. మీరు స్వచ్ఛమైన మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును మంచి పనుల కోసం ఉపయోగించాలి. కష్టపడి సంపాదించాలి: మనం ఎప్పుడూ కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించిన లేదా కష్టపడి సంపాదించిన డబ్బుతో మనం ఏ పని చేసినా, దాని నుండి మనకు మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి డబ్బు మాత్రమే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు తప్పుడు మార్గాల ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ, ఇది ఈరోజు కాదు రేపు మీకు సమస్య తీసుకురావడం ఖాయం. ధనభావానాం అపి స్వధర్మ నాశః మితిమీరిన కోరికలు, సంపాద...మీ స్వధర్మాన్ని నాశనం చేస్తుంది. డబ్బు సంపాదించాలన్న మితిమీరిన కోరిక అధర్మం వైపు నడిపిస్తుంది. దీంతో జీవితంలో ఎన్నో సమస్యలు తప్పవు. కాబట్టి.., డబ్బు సంపాదించాలనే మితిమీరిన కోరికను వదిలివేయడం మంచిది. ధనాని పూజ్య నరః వంటిది: అంటే ధనవంతులకు సమాజంలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. డబ్బు లేదా సంపద ఉన్నవారిని సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తులు చాలా సులభంగా గౌరవం మరియు కీర్తి పొందుతారు. దానేన విత్తం వినీతం: వినయంతో డబ్బు సంపాదించండి. తెలివిగా ఉపయోగించుకోండి. ఇలా డబ్బును వినియోగించినప్పుడే దానికి అర్థం ఉంటుంది.  ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేయడం మానేయండి.

పాజిటివ్ థింకింగ్ పవర్ ఇదే..

సానుకూలంగా ఆలోచించడం చాలామందికి చేతకాదు. ఎంతోమంది పనులు మొదలు పెట్టడం నుండి ఒకటే అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే సానుకూలంగా ఉండటం లేదా పాజిటివ్ ఆలోచనలతో ఉండటం అనేది మనిషిని కొత్తగా ఆవిష్కరిస్తుంది. కౌరవుల సైన్యం చాలా పెద్దది మేము అస్సలు యుద్దం చెయ్యము అని పాండవులు వెనకడుగు వేసి ఉంటే మహాభారత యుద్దమనేది జరిగి ఉండేది కాదు.  నాకు కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి, ఇక నేను ఏమీ చెయ్యలేను అనుకుని ఉంటే అంతరిక్షంలో రహస్యంగా ఉన్న కృష్ణబిళాల గురించి స్టీఫెన్ హకింగ్ పరిశోధనలు చేసేవాడు కాదు. ఇలా చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు అనుమానాలతో, సందేహాలతో  అలా గొప్పగా మారలేదు. దీని వెనుక సానుకూల ఆలోచన అని చెప్పబడే పాజిటివ్ థింకింగ్ చాలా ఉంది. పాజిటివ్ థింకింగ్ గురించి, దాని గొప్పదనం గురించి, అది మనుషుల జీవితాల్లో కలిగించే మార్పుల గురించి తెలియజెప్పే ఉద్దేశంతో ప్రతి యేడు సెప్టెంబర్ 13న పాజిటివ్ థింకింగ్  డే జరుపుకుంటారు. ఈ రోజున ఏం చేయవచ్చో, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, దీని వల్ల  కలిగే లాభాలేంటో  పూర్తీగా తెలుసుకుంటే.. పాజిటివ్ థింకింగ్.. పాజిటివ్ థింకింగ్ అనే పేరులోనే ఒకానొక సానుకూల భావన ఉంది. ఇది మనిషికి ఎలాంటి ఒత్తిడిని, ఆందోళనను కలిగించదు. చేసేపని ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించి చేస్తే ఆ ఆలోచనతోనే సగం విజయం సాధించినట్టు. పాజిటివ్ గా ఆలోచిస్తూ మనిషి చేసే ప్రయత్నాలలో మనిషి పనితీరు పరిపూర్ణంగా ఉంటుంది. వ్యక్తి తన పూర్తీ సామర్థ్యాన్ని  పనిని పూర్తీ చేయడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి చేసేపనులలో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. అయితే ఎవరో చెప్పారని కొందరు, ఆ పని వల్ల లాభం  ఉంటుంది కాబట్టి చేయడం మంచిదని మరికొందరు,  గొప్పలు చెప్పుకోవడానికి అయిష్టంగానే మరికొందరు  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా మనసులో ఏ మూలో ఇష్ఠం ఉండదు కాబట్టి ఆ పనిని అంత సమర్థవంతంగా పూర్తీ చెయ్యలేరు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేముందు ఎలాంటి ప్రభావానికి, మరేవిధమైనా ప్రలోభాలకు లోను కాకుండా చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం.. పాజిటివ్ ఆలోచన అనేది గొప్ప ఔషదమే అనుకోవచ్చు. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నవారు కూడా పాజిటివ్ థింకింగ్ కారణంగా  వాటిని చాలా సులువుగా జయించగలుగుతారు. ఎంతో మంది  మృత్యు ఒడి దాకా వెళ్లి తిరిగి బయటపడుతున్నారు అంటే అది వారి సానుకూల ఆలోచన ప్రభావమే.  మనిషిని మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా దృఢంగా ఉండేలా చేయడంలో సానుకూల ఆలోచన ఎంతో గొప్పది. పాజిటివ్ గా ఉంటూ మంచినీరు తీసుకున్నా అది గొప్ప ఔషదంలా పనిచేస్తుంది. గొప్ప ఔషదాన్ని అయినా చాలా నెగిటివ్ గా తీసుకుంటే అది అస్సలు శరీరం మీద ప్రభావం చూపించదు. ఇదీ పాజిటివ్ ఆలోచనలో ఉన్న గొప్పదనం. సానుకూలమే విజయానికి  సోపానం.. ఎంత బాగా చదివినా సరే చాలామంది పరీక్ష హాలులో వెళ్లేసరికి అన్నీ మరచిపోయాం అంటుంటారు. మరికొంతమంది నేను చదివినవే వచ్చాయి కానీ అక్కడ సమాధానాలు గుర్తురాలేదు అంటారు. వీటన్నింటికి కారణం ఒకటే.. అదే పరీక్షలలో నేను చదివినవి రావేమో అనే నెగిటివ్ ఆలోచన. మనిషి మెదడు పదే పదే ఏ విషయాన్ని అయినా పదిసార్లు మననం చేసుకుంటే ఆ వలయంలో పడిపోతుంది. పరీక్షలు రాసేవారు ఎంత చదివినా, ఎంతబాగా సన్నద్దం అయినా మనసులో ఏ మూలో  నేను చదివినవి రావేమో నా అదృష్ణం ఎలాగుందో అనుకుంటే చివరికి ఆ అదృష్టం ప్రశ్నార్థకమే అవుతుంది. ఇది కేవలం పరీక్షలకు మాత్రమే కాదు. ఉద్యోగం కోసమయినా, బంధాలలో అయినా, సమాజ పరమైన విషయాలు అయినా పాజిటివ్ గా ఉన్నప్పుడే సానుకూల ఫలితాలు సాధ్యమవుతాయి.                                                         *నిశ్శబ్ద.

చాణక్యుడి ఈ నాలుగు సూత్రాలు అన్ని సమస్యలకు సహాయపడతాయి..!!

చాణక్యుడి నీతి సూత్రాలు మన జీవితాలను సులభతరం చేయడంలో సహాయపడతాయి. ఎలాంటి సమస్యలు ఎదురైనా చాణక్యుడి నీతితో వాటి నుంచి బయటపడే మార్గాన్ని కనుగొనవచ్చు. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి చాణక్యుడి సూత్రాలు సహాయపడతాయి. విజయవంతమైన వ్యక్తిగా మారడానికి ఏమి చేయాలో మీకు తెలుసా? ఆచార్య చాణక్యుడు తన నైతికతకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందాడు. అతను అర్థశాస్త్రంతో సహా అనేక ముఖ్యమైన రచనలను రచించాడు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా అతను సి. క్రీస్తు పూర్వం 376లో జన్మించినట్లు చెప్పారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, గొప్ప పండితుడు. నైపుణ్యం కలిగిన రాజకీయ చతురత ద్వారా, అతను చంద్రగుప్త మౌర్య సామ్రాజ్య స్థాపన, విస్తరణలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన ఆలోచనలు నేటికీ సంబంధితంగా ఉన్నాయి. చాణక్యుడి నీతిని అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించగలడు. మీరు కూడా మీ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే, ఈ 4 విషయాలను ఖచ్చితంగా పాటించండి. 1. దానం: ఆచార్య చాణక్యుడు ప్రకారం దానధర్మాలు చేసేవాడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ధార్మిక గ్రంధాలలో కూడా దానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మనకు చేతనైనంతలో దానధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తే పేదరికం కూడా తొలగిపోతుంది. కాబట్టి, ఒక వ్యక్తి తన ఆర్థిక స్థితిని బట్టి దానం చేయాలి. దానం చేయడం వల్ల సంపద తగ్గదని ధార్మిక పండితులు కూడా చెబుతున్నారు. 2. ప్రవర్తన: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి అనుభవించే అన్ని రకాల సమస్యలు, బాధలు అతని ప్రవర్తన ద్వారా మాత్రమే తొలగిస్తాయని చెప్పాడు. ఒక వ్యక్తి మంచి నడవడికతో తనను తాను ఉన్నతీకరించుకోగలడు. ఇది వృత్తి, వ్యాపారంలో ఒక వ్యక్తికి కూడా సహాయపడుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలోని అన్ని రకాల కష్టాలు,  దుఃఖాలను తొలగిస్తుంది. 3. భక్తి: ఒక వ్యక్తి జన్మించిన క్షణం అతని విధి నిర్ణయించబడుతుంది. ఈ భవిష్యత్తు బాగుండాలంటే భగవంతుని ధ్యానించాలి. మతపరమైన కార్యక్రమాలలో మనం నిమగ్నమై ఉండాలి. ఇది ఒక వ్యక్తి యొక్క తార్కిక శక్తిని అంటే ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో, దేవుని ఆశీర్వాదం వ్యక్తిపై ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్న ప్రకారం, ఒక వ్యక్తి పై విషయాలను అనుసరిస్తే అతను మంచి జీవితాన్ని పొందుతాడు. అతను తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, దాని నుండి బయటపడే మార్గాన్ని కనుగొంటాడు.  

ప్రోత్సాహానికి కేరాఫ్ అడ్రస్ మీరే కావచ్చు…

అరేయ్ నువ్వు చేయగలవురా నీ వల్ల అవుతుంది. నీ గురించి నీకు అర్థం కావడం లేదు, హనుమంతుడికి తన బలం తనకే తెలియనట్టు.. నువ్వు కూడా ఇంతే.. ఊరికే ఎలాంటి అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా నువ్వు అనుకున్నది చెయ్యి.. నీ వెంట నేనుంటా కదా… ఇలాంటి మాటలు ప్రతి మనిషి జీవితంలో ఉంటే బహుశా ఓటమి  ఎదురవ్వడం అనే సందర్భం రాదేమో.  ఓ మనిషిని ప్రోత్సహించాలన్నా, వెనక్కు లాగాలన్నా అదంతా ఇంకొక మనిషి చేతిలో ఉంటుంది. ప్రతిభ ఉండి, ఆత్మవిశ్వాసం ఉండి కూడా ఒక్కో సందర్భంలో ఇతరులు నిరాశ పరచడం ద్వారా విఫలం అయ్యేవారు చాలామందే ఉంటారు. అందుకే ప్రోత్సాహం గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.  బద్దకస్తుడిని కూడా పరుగులు పెట్టిస్తుంది. ప్రోత్సాహంలో ఉన్న గొప్పదనాన్ని, ప్రోత్సాహం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఏడు సెప్టెంబర్ 12 ను నేషనల్ ఎంకరేజ్మెంట్ డే ని జరుపుకుంటారు. దీన్ని జాతీయ ప్రోత్సాహ దినోత్సవం అని తెలుగులో పిలుస్తారు. ఈరోజు ఏం చేయవచ్చంటే.. పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం.. ప్రతి మనిషి మొదట తన ఇంటిని బాగు చేసుకుంటే ఆ తరువాత సమాజాన్ని బాగు చేయడానికి అర్హుడు అవుతాడు అని అంటారు. దానికి అనుగుణంగానే… కుటుంబ సభ్యులు, పిల్లలు, తోడబుట్టిన వారు, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరూ ఏవైనా పనులలో కానీ, మరేదైనా విషయంలో కానీ జంకుతున్నా, సందిగ్ధంలో ఉన్నా వారికి ధైర్యం చెప్పి ఎంకరేజ్ చెయ్యాలి.  దీనివల్ల వారికి ఎక్కడలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కుటుంబ సభ్యులు విజేతలు అయినా, ఎదైనా సాధించినా పరోక్షంగా అధి ఆ ఇంటి విజయం అవుతుంది. కాబట్టి పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. పేదవారిని, స్నేహితులను వదలొద్దు.. పేదరికం కారణంగా ప్రతిభ ఉన్నా మరుగున ఉంటున్న పిల్లలు, యువత ఎంతోమంది ఉన్నారు. అందరినీ భుజాన వేసుకోకపోయినా వారికి కాస్త ఆర్థిక సాయం, మరికాస్త ధైర్యం చెబితే ఊహించని విధంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే  తల్లిదండ్రులలో కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహితులను వైఫల్యం బాటలో వదిలేయకుండా వారిని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ముందు తోయాలి. అప్పుడు వారి విజయంలో మీరు భాగమవుతారు. కళాకారులు,  ప్రతిభ గలవారిని ప్రోత్సహించాలి.. కళను తమలో నింపుకున్నవారు కళాకారులు. కానీ చాలావరకు కళలు కడుపు నింపవు అనే మాట వాస్తవ చిత్రంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తుంటుంది. ప్రతిభ కలిగిన కళాకారులను ఎంకరేజ్ చెయ్యాలి. ఏ వర్గంలో అయినా ప్రతిభ ఉంటే వారిని చేతనైన విధంగా మాటలతోనూ, ఆర్థికంగానూ సహాయం అందించాలి.  

సనాతన హిందూమతం ఎప్పుడు ఉద్భవించిందో తెలుసా...

పవిత్ర హిందూ మతం ఎప్పుడు ఉద్భవించిందో నేటికీ చాలా మందికి తెలియదు. మీకూ తెలియకపోతే ఖచ్చితంగా ఈ కథనాన్ని చదవండి.. ప్రతి మతానికి దాని స్వంత మూలం ఉంది. కానీ హిందూ మతం మూలం లేదా ప్రారంభం గురించి ప్రజలలో చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సనాతన ధర్మం గురించి అనేక ప్రకటనలు చేస్తున్నారు. మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, నేటికీ, హిందూ మతం  మూలం ఎలా జరిగిందో మనకు ఖచ్చితంగా తెలియదు. ఈ నేప‌థ్యంలో స‌నాత‌న హిందూమ‌తం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. గురునానక్: సిక్కు మత స్థాపకుడు గురునానక్ 1469 ఏప్రిల్ 15న జన్మించారు. సెప్టెంబర్ 22, 1539 న ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. భారతదేశం, హిందూమతం గురు సంప్రదాయానికి చెందిన మొత్తం 10 మంది గురువులచే రక్షించాయి. గురునానక్ కాలాన్ని తీసుకుంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే హిందూ మతం ఉందని చెప్పవచ్చు. జులేలాల్: సింధ్ ప్రావిన్స్‌లోని హిందువులను రక్షించడానికి వరుండేవ్ జులేలాల్‌గా అవతరించాడు. పాకిస్థాన్‌లో జులేలాల్జీని జింద్ పీర్, లాల్షా అని పిలుస్తారు. ఇతడు క్రీ.శ.1007లో జన్మించాడు. ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, హిందూ మతానికి 1,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ సమయంలో పాకిస్థాన్‌లో పెద్ద సంఖ్యలో హిందువులు నివసించేవారు. చక్రవర్తి హర్షవర్ధన: 1,400 సంవత్సరాల క్రితం హిందూమతం: గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు 590 AD లో జన్మించాడు. 647 AD లో మరణించాడు. హర్షవర్ధన్ అరేబియాపై దాడి చేసినట్టు ప్రస్తావనలు ఉన్నాయి. కానీ అతను ఎడారి ప్రాంతంలో పట్టుబడ్డాడు. భైవపురాణంలో ప్రస్తావన ఉంది. హర్ష హయాంలో చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ వచ్చాడు. గురు గోరఖ్‌నాథ్: 1,100 సంవత్సరాల క్రితం హిందూ మతం: రాహుల్ సాంకృత్యాయన్ ప్రకారం, గొప్ప యోగి గురు గోరఖ్నాథ్ లేదా గోరఖ్నాథ్ 845 ADలో జన్మించారు. గోరఖ్‌పూర్‌లోని గురు గోరఖ్‌నాథ్ ఆలయం 9వ శతాబ్దంలో పునరుద్ధరించబడిందని పేర్కొన్నారు. గోరఖ్‌నాథ్ చాలా కాలం జీవించాడు. అతను హిందూ మతంలోని శైవ శాఖకు చెందిన ముఖ్యమైన సాధువు. ఆదిశంకరాచార్య: 2531 సంవత్సరాల క్రితం హిందూమతం: ఆదిశంకరాచార్య హిందూమతాన్ని పునర్వ్యవస్థీకరించారు. క్రీ.శ.788లో జన్మించిన అతడు క్రీ.శ.820లో 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టాడు. కేరళలో జన్మించిన అతనిని కేదార్‌నాథ్‌లో ఖననం చేశారు. అతను హిందూ మతానికి చెందిన గొప్ప సాధువు. 2వ చంద్రగుప్తుడు : 1,650 సంవత్సరాల క్రితం హిందూమతం: చంద్రగుప్త II చక్రవర్తికి విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. అతని పాలన 380 AD నుండి 412 AD వరకు కొనసాగింది. మహాకవి కాళిదాసు అతని ఆస్థాన కవి సలహాదారు.  

ఆత్మహత్యలు వద్దే వద్దు!

మనిషి ప్రాణం చాలా విలువైనది. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు, కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొని విజేతలుగా నిలిచినప్పుడు మనిషిగా పుట్టినందుకు చాలా సంతోషపడతాం. కేవలం అవి మాత్రమే కాదు జీవితంలో ఎంతో సంతోషకరమైన క్షణాలలో ఉన్నప్పుడు ఫలానా వారికి పుట్టినందుకు ఎంత సంతోషంగా ఉన్నామనో, ఈ జీవితం ఇలా సాగుతున్నందుకు మనం అదృష్టవంతులమనో అనుకుంటాం ఖచ్చితంగా. కానీ జీవితంలో చెప్పలేనంత విరక్తి వచ్చి చచ్చిపోవాలని నిర్ణయించుకుని, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే?? ఎంతో గొప్పగా జీవించాల్సిన వాళ్ళు అర్థాంతరంగా జీవితానికి ముగింపు ఇస్తే!! ప్రస్తుత సమాజాన్ని ఎంతో భయపెడుతున్న విషయం ఇదే!! ఏ విషయాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు చాలామంది ఉంటున్నారు. ఈ ఆత్మహత్యల మీద దృష్టి సారించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఆత్మహత్య చేసుకోవడం రాను రాను పెరుగుతున్న సమస్య. వీటి నమోదు సంఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమైన కథనాలు చెబుతాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.  ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8,00,000(ఎనిమిది లక్షల) మంది ప్రజలు మరణిస్తున్నారు.  కొన్ని అంచనాల ప్రకారం ఆ సంఖ్య పది లక్షలకు దగ్గరగా ఉంది.   మరీ ముఖ్యంగా 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారి మరణానికి ఆత్మహత్య ప్రధాన కారణం అనే విషయం కలవరపెడుతోంది.  ప్రయత్నించే ప్రతి 40 మందిలో కనీసం ఒక్కరు అయినా చనిపోతున్నారు. మనిషి జీవించడానికి చాలా గొప్ప గొప్ప అవకాశాలు, మార్గాలు ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు. మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఎందుకు?? ఆత్మహత్యలకు ప్రధాన కారణం!! ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే. మందులతో బాగు చేయలేని, ఇదీ అని నిర్ధారించలేని సమస్య అది. ఏమిటా సమస్య అంటే?? మానసిక అనారోగ్యం. మానసిక ఇబ్బందులతో బాధపడేవారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిలో అర్థం చేసుకునే ఆలోచనా స్థాయిలు తక్కువ. అతిగా ఆలోచించడం ఎక్కువ. ఈ కారణంగా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి.  ఏం చెయ్యాలి?? కౌన్సెలింగ్ ఇవ్వడం, సపోర్ట్ గా ఉండటం వల్ల  ఆత్మహత్యలను నివారించవచ్చు. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని వారితో ఎప్పుడూ దగ్గరగా ఉంటూ, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారికున్న సమస్యలను చెప్పుకునే స్నేహాభావాన్ని కలిగిస్తే దాదాపుగా ఆత్మహత్య అనే భావనను రానివ్వకుండా చేయచ్చు.   ఇతరులకు వారి జీవితాలకు బాధ్యత వహించడానికి, వారి జీవితానికి వారు ఇచ్చుకోవలసిన ప్రాధాన్యత, వారి మీద వారికి ఉండాల్సిన బాధ్యత మొదలైనవి గుర్తుచేయడం కూడా వారిలో ఆత్మహత్య ఆలోచనను రానివ్వకుండా చేయడానికి ఒక గొప్ప మార్గం. ఆత్మహత్య అనేది అన్ని వయసుల వారిని సమానంగా ప్రభావితం చేస్తుంది.  అందువల్ల మానసిక ఆరోగ్యం గురించి చర్చలు జరపడం చాలా ముఖ్యం, ఇతరులు వారు ఎదుర్కొంటున్న కష్ట సమయాల గురించి మాట్లాడటం వల్ల అవసరమైతే వృత్తిపరమైన లేదా మానసిక ఆలోచనలకు సంబంధించిన సహాయం పొందడం సులభం చేస్తుంది. 'టేక్ ఎ మినిట్, చేంజ్ ఎ లైఫ్' ఒక్క నిమిషం ఆగండి జీవితాన్ని మార్చుకోండి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేసిన ఒక గొప్ప వాక్యం. ఆత్మహత్యలు ఎప్పుడూ తొందరపాటుగా జరిగిపోతుంటాయి. అలాంటి సందర్భంలో ఒక్క నిమిషం ఆగి, జీవితం గురించి, భవిష్యత్తు గురించి, బ్రతకాల్సిన ఆవశ్యకత, జీవితానికి ముఖ్యమైన మార్గాలు వంటివి ఆలోచిస్తే జీవితం చెయ్యిజారిపోదనే విషయం అర్థమవుతుంది. ఆత్మహత్య నిరోధక దినోత్సవం సందర్భంగా ఈవెంట్‌లు, సమావేశాలు, సెమినార్‌లు చర్చా వేదికలను నిర్వహిస్తారు. ఆత్మహత్యల నివారణకు కొత్త విధానాలను రూపొందిస్తారు.  వ్యక్తులలో జీవితం పట్ల అవగాహనను కలిగించడానికి సాధనంగా మీడియాను ఉపయోగించవచ్చు.  మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కుటుంబం, డాక్టర్ల కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుంది.  సమాజ పౌరులుగా మన చుట్టూ ఉన్న వారికి మనవంతు సాయం చేయడం అనుసరించాల్సిన విషయమే!! కాబట్టి మీ వంతు మీరూ కృషి చేయండి. ఆత్మహత్యల నివారణకు తోడ్పాటు అందించండి.                                   ◆నిశ్శబ్ద.

అంకెలతో మాయాజాలం.. సుడోకు పుట్టుక,చరిత్ర తెలుసా..

ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.  

పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు

చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు * రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగేసుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేసి.. పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్‌ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి. ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. * చర్మం రఫ్‌గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి. నిమ్మ చెక్కని పగుళ్ళకి రుద్దడం వలన కూడా పగుళ్లు తగ్గుతాయి . * పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి. * గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను తొలగించొచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.  

శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.  కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన  ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి ,  భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు  బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు.  ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు.  జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి. మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు  ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది.  కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు. గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు.  ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి. కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు   సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు. శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.                                                 *నిశ్శబ్ద.

సర్వేపల్లి రాధాకృష్ణన్.. ఈ విలువైన ఆలోచనలు జీవితానికి సరైన మార్గాన్ని చూపుతాయి!

ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఈ రోజు దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి అంకితం చేయబడింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబరు 5, 1888న తమిళనాడులోని చిత్తూరు జిల్లాలోని తిరుటని గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నప్పటి నుంచి మతపరమైన ఆసక్తి ఉన్న వ్యక్తి. అతను మతపరమైన పనిలో లోతైన ఆసక్తిని కలిగి ఉన్నారు. మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి అత్యున్నత విద్యను అభ్యసించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నతనం నుండి చదవడం, రాయడం పట్ల మక్కువ కలిగి ఉన్నారు. వివేకానంద ఆలోచనలచే బాగా ప్రభావితమయ్యారు. ఆయన పుట్టిన రోజున ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన ఆలోచనలు నేటికీ సంబంధించినవి. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆలోచనలను అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించగలడు. రండి, ఆయన అమూల్యమైన ఆలోచనలను తెలుసుకుందాం. రాధాకృష్ణన్  విలువైన ఆలోచనలు: 1.కాలక్రమానుసారం వయస్సు లేదా యవ్వనంతో సంబంధం లేదు. మనం భావించేంత చిన్నవారం లేదా పెద్దవాళ్లం. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ముఖ్యం. 2. ఒక మనిషి రాక్షసుడిగా మారితే అది అతని ఓటమి, ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే అది అతని అద్భుతం. మనిషి మనిషిగా మారితే అది అతని విజయం. 3. సనాతన ధర్మం కేవలం విశ్వాసం కాదు. ఇది తర్కం, అంతర్గత స్వరం కలయిక, ఇది కేవలం అనుభవించవచ్చు, నిర్వచించబడదు. 4. ఒక వ్యక్తి యొక్క చేతన శక్తుల వెనుక ఆత్మ ఎలా ఉంటుందో, అలాగే పరమాత్మ ఈ విశ్వం యొక్క అన్ని కార్యకలాపాల వెనుక అనంతమైన ఆధారం. 5.దేవుడు మనందరిలో జీవిస్తున్నాడు, అనుభూతి చెందుతాడు. కాలక్రమేణా అతని లక్షణాలు, జ్ఞానం, అందం, ప్రేమ మనలో ప్రతి ఒక్కరిలో వెల్లడవుతాయి. 6.పుస్తక పఠనం మనకు ఏకాంతాన్ని అలవాటు చేస్తుంది. నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. 7. విభిన్న సంస్కృతుల మధ్య వారధిని నిర్మించడానికి పుస్తకాలు సాధనం. 8. మీరు దేనిని విశ్వసిస్తారు. ప్రార్థిస్తారు. మీరు ఖచ్చితంగా దాన్ని పొందుతారు. 9. వ్యక్తి (విద్యార్థి) ఊహాత్మకంగా అలాగే ఆరోగ్యంగా, నమ్మకంగా ఉండాలి. ఇది అతని లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. 10.జీవితాన్ని దుర్మార్గంగా చూడటం,  ప్రపంచాన్ని గందరగోళంగా చూడటం తప్పు.

ఉపాధ్యాయ దినోత్సవం.. జ్ఞానప్రదాతకు నీరాజనం..

ఉపాధ్యాయుడు  జ్ఞాన జ్యోతిని వెలిగించి మూర్ఖత్వపు పొరను తొలగిస్తాడు.  నేటికాలం పాఠశాలలో ఉపాధ్యాయులు అయినా, ఒకప్పుడు గురుకులాలలో విధ్యను బోధించే గురువులు అయినా, మంచి చెడులు చెప్పే తల్లిదండ్లులు, అవ్వతాతలు, ఆత్మీయులు, ఆప్తులు అందరూ గురుసమానులే.  అయితే పాఠశాలలో విద్యను బోధించిన ఉపాద్యాయుల గౌరవార్థం ఉపాద్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటారు.  ఇదే రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  జన్మదినం కూడా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన కృషికి, ఆయన సాధించిన  విజయాలకు గుర్తుగా  ప్రతి సంవత్సరం భారతదేశమంతటా  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోబడుతుంది. సెప్టెంబరు 5, 1888న జన్మించిన డాక్టర్ రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా పనిచేశారు.  ఈయన స్వయానా  పండితుడు, తత్వవేత్త,  భారతరత్న అవార్డు గ్రహీత కూడా.  నిరుపేద తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ తన విద్యాభ్యాసమంతా స్కాలర్‌షిప్‌ల ద్వారానే పూర్తి చేశారు.  తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని సాధించాడు. 1917లో 'ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్' అనే పుస్తకాన్ని రచించాడు.  1931 నుండి 1936 వరకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా,  1939లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) వైస్-ఛాన్సలర్‌గా కూడా పనిచేశాడు. అసలు  ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు? మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయన  సమకాలీన భారతదేశంలోని ప్రముఖ రచయితలలో ఒకరు.  సైద్ధాంతిక, వేదాంత, నైతిక, బోధనాత్మక, మతపరమైన, జ్ఞానోదయం కలిగించే విషయాల నుండి ప్రారంభించి విభిన్న విషయాలపై గణనీయమైన కృషి చేసాడు. ఆయన ఎన్నో ప్రాముఖ్యత కలిగిన,  గుర్తింపు పొందిన పత్రికలలో లెక్కలేనన్ని వ్యాసాలను వ్రాసాడు. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5, 1962న ఆయన 77వ జన్మదినమైన రోజున జరుపుకున్నారు.  ఈయన  ఎడిఫికేషన్  న్యాయవాది,  విశిష్ట దూత, విద్యావేత్త  అన్నింటికంటే గొప్ప ఉపాధ్యాయుడు. డాక్టర్ రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతి అయ్యాడు. ఆయన  స్నేహితులు,  విద్యార్థులు కొందరు ఆయనను సంప్రదించి  సెప్టెంబర్ 5న తన పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. దీనికి ఆయన స్పందిస్తూ, "నా పుట్టినరోజును నిష్కపటంగా పాటించే బదులు, సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా పరిశీలిస్తే అది నాకు గర్వకారణం." అని చెప్పారు. దీంతో సెప్టెంబర్  5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. రాధాకృష్ణన్ గారి అభ్యర్థన  ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న  ఆప్యాయతను, ఆ వృత్తి మీద ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అప్పటి నుండి భారతదేశం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఒక దేశం  భవిష్యత్తు  ఆ దేశంలో పిల్లల చేతుల్లో ఉంటుంది. అలాంటి పిల్లలను  మార్గదర్శకులుగా భారతదేశ విధిని రూపొందించే భవిష్యత్తు నాయకులుగా ఉపాధ్యాయులు మాత్రమే తయారుచేయగలరు . జీవితంలో ఉపాధ్యాయులు పోషించే సవాళ్లు, కష్టాలు,  ప్రత్యేక పాత్రలను గుర్తించడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ప్రైమరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్,  సెకండరీ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉత్తమ  ఉపాధ్యాయులకు  ఈ అవార్డులు అందించబడతాయి.  ఇక వివిధ పాఠశాలలో కూడా ఉపాద్యాయుల  గౌరవార్థం సభలు, సన్మానాలు, విద్యార్థులు చెప్పే కృతజ్ఞతల వేడుకలతో  ప్రతి పాఠశాల ప్రతి కళాశాల  కళకళలాడిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కోసం జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుకు  కృతజ్ఞతలు చెప్పడం వారి కనీస కర్తవ్యంగా భావించాలి.                                                           *నిశ్శబ్ద.

ప్రతిభకు-ప్రవర్తనకు గల సంబంధం తెలుసా?

వర్తమానంలో  మనిషి నిలకడగా ఉండకపోవడానికి ఉన్న పెద్ద కారణాలలో గతంలోకి తొంగి చూస్తూ ఉండటం ముఖ్యమైనది.  గతంలో ఎన్నో పరాజయాలు ఎదురై ఉండవచ్చు. కానీ, వాటిని వేటినీ పట్టించుకోకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు, పరాజయాలు సర్వసాధారణమే. అవి మీ జీవితానికి మెరుగులు దిద్దేవే! ఓటములే లేని జీవితం ఎంత నిస్సారంగా ఉంటుందో తెలుసా! అలాంటి జీవితంలో నేర్చుకోవడానికి ఎవరికీ ఏమీ లభ్యం కాదు. కేవలం కాలంతో ఊరికే అట్లా నడుస్తూ పోవడం అనేది మొదట్లో సుఖవంతంగా అనిపిస్తుందేమో కానీ అది తరువాత ఒక పెద్ద చిరాకుగానూ శూన్యంతో నిండినట్టుగానూ అనిపిస్తుంది.  అలాంటి శూన్యమే మనిషిలో నిస్సహాయత, నిరాశ వంటి వాటిని పొగుచేస్తుంది. ఏదీ చేయలేకపోతున్నామే అనే ఆందోళన, కలవరపాటు చోటుచేసుకుంటుంది. వాటినే కష్టాలనీ, అవి ఎంతగానో బాధిస్తున్నాయని భ్రమ పడుతూ ఉంటారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే.. సమస్య తెచ్చిపెట్టుకున్నది, ఆ తరువాత దాని వల్ల ఇబ్బంది పడి బాధపడుతున్నది కూడా మనిషే… అలాంటప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేమో అని దిక్కులు చూస్తారు. కానీ అది తప్పు.   Pull yourself out of difficulties by your- self. There is none to help you... కష్టాలనూ, కడగండ్లనూ స్వశక్తితోనే అధిగమించండి. చాలా మందికి ఇతరుల ముందు చాలా కఠినంగా ఉంటారు.  ముఖ్యంగా ప్రతి చిన్నదానికీ ఇతరులను నిందించడమంటే మహా సరదా.. అలాంటి మనస్తత్త్వాన్ని విడనాడాలి. ఎవరి సమస్యలకు వారే కారణం అయినప్పుడు వాటికి ఇతరులను బాద్యులను చేయడం తప్పు. పైపెచ్చు ఇతరులను నిందించడం వల్ల ఎదురయ్యే పరాభవాలు, పరాజయాలు తోడయ్యి మనిషికి విలువను తగ్గిస్తుంది.   అది మనిషిని ఉన్నతస్థానం నుంచి నీచస్థాయికి దిగజారుస్తుంది. అందుకే మనిషిలో ఉన్న ఆ దుర్గుణాన్ని మెల్లగా తుంచేయాలి.  జీవితంలో ఎద్గురయ్యే వైఫల్యాలనూ, తప్పిదాలనూ ఎదుటి వ్యక్తులపైనో, సమాజంపైనో వేసి పరిస్థితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. పలాయనవాదులుగా, పరాన్నభుక్కులుగా మిగిలిపోతున్నారు. పరీక్షల దగ్గర నుంచి వివాహ వ్యవహారాల వరకు ప్రతి విషయంలో ఇలాంటి పరిస్థితులలోకి వెళ్ళిపోయి అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుఃస్థితి నుంచి బయటపడటం చాలా ముఖ్యం.  రాజ్యాలు, వైభవాలు, యుద్ధాలు, విజయాలు ఇవేవీ నిజానికి చరిత్ర కాదు! అద్భుతాలను సాధించిన కొందరు మహాపురుషుల జీవనప్రవాహమే చరిత్ర. ఆత్మవిశ్వాసం ఆ మహానుభావుల హృదయాలలో ప్రకాశించింది. నాగరకత అభివృద్ధిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియాశక్తి ఏదైనా ఉందంటే అది ఈ ఆత్మవిశ్వాసమే! మనకు ఏదైనా నష్టం, దోషం సంభవించాయంటే  అవన్నీ కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాటి నుంచే ప్రారంభమయ్యాయి. ప్రపంచం అభివృద్ధి చెందుతుంది కానీ.. నేటికీ మనిషి ఎక్కడో అలాంటి తప్పటడుగులే వేస్తున్నాడు. ఆత్మవిశ్వాసాన్నీ, ఆత్మాభిమానాన్నీ కోల్పోయి అభివృద్ధి పేరుతో, ఆధునికత పేరుతో సానుకూలం కాని సరంజామాను జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ రోజుల్లో అన్నీ తెలిసినా, కర్ణుడి శస్త్రజ్ఞానంలా అవసరానికి అవి ఉపయోగపడడం లేదు. ఇప్పటి యువతలో సామర్థ్యానికి కొదవలేదు. సౌశీల్యమే కొరవడింది. సామర్థ్యం మనిషిని ఉన్నతస్థాయికి తీసుకువెళుతుంది. కానీ, సౌశీల్యం మనిషిని ఆ ఉన్నతస్థానంలో శాశ్వతంగా ఉంచుతుంది. నేడు సమాజంలో ఎన్నో ఉన్నతస్థానాలను అధిరోహించ గలుగుతున్నా, అక్కడి నుంచి కొన్నాళ్ళకే పతనమైపోవడానికి కారణం  ప్రతిభకు తగ్గ ప్రవర్తన లేకపోవడమే! ఈ ప్రవర్తన ఎంత ముఖ్యమో తెలుసుకున్నవాడు మెట్టు దిగజారకుండా పటిష్టమైన కోటను కట్టుకుంటాడు. కానీ ప్రవర్తన సరిగ్గా లేనివాడు తనకు తానే వైఫల్యాలను కొనితెచ్చుకుని పేకమేడలా కూలిపోతాడు. అందుకే ప్రతిభకు తగిన ప్రవర్తన అలవరచుకుని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మారాలి. ఆ దిశగా అడుగులు వేయాలి.                                       ◆నిశ్శబ్ద.

భయాల స్వరూపాన్ని తెలిపే విశ్లేషణ!!

మనిషిని పిరికివాడిగా చేసేది, లక్ష్యాలకు దూరం చేసేది భయమే. మన భయాలు అర్థరహితం అని చెప్పేందుకు ఓ ప్రయోగం ఉంది. ఓ తరగతిలో టీచర్ చేసిన ప్రయోగం అది. కుర్చీల్లో కూర్చున్న విద్యార్థులను అందరినీ లేచి ఓ వైపు వచ్చి నిలబడమన్నాడు. ఆపై అందరినీ మరో వైపు కు పొమ్మన్నాడు. అడ్డుగా ఉన్న కుర్చీలను దాటుకుంటూ, ఆ వైపు చేరారు విద్యార్థులు. మళ్లీ ఈ వైపు రమ్మన్నాడు టీచర్. అయితే ఈ సారి విద్యార్థుల కళ్లకు గంతలు కట్టాడు. ఆపై నిశ్శబ్దంగా, గదిలో ఉన్న కుర్చీలు తీయించేశాడు. ఇప్పుడు మరో వైపు రమ్మన్నాడు. ఒక్క విద్యార్థి కూడా కదలలేదు. "దారిలో కుర్చీలు, బల్లలు అడ్డుగా ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టారు. వాటిని దాటుతూ ఆ వైపు రావటం కష్టం" అన్నారు. చివరికి ఓ విద్యార్థి ధైర్యంగా ముందుకు వచ్చాడు. తడబడుతూ, లేని టేబిళ్ల కోసం వెతుకుతూ అడుగులు వేయటం ఆరంభించాడు. అతడి వల్ల మరి కొందరు ముందుకు వచ్చారు. అయితే, చేతికి ఏమీ తగలకపోవటంతో సందిగ్ధంలో పడి సగంలో ఆగిపోయారు. అన్ని సందిగ్ధాలను మించి, లేని అడ్డంకులను దాటుకుంటూ, అడ్డేమీ లేదని నిర్ధారించుకుంటూ ఒక విద్యార్థి గమ్యం చేరాడు. ఇదీ మనలో నాటుకుపోయిన భయాల స్వరూపం! అక్కడెమీ లేకున్నా లేని అనుమానాలతో ఏదో ఉందని తమని తాము మభ్యపెట్టుకునే వారు చాలామంది. మనం ఏదైనా పని సాధించాలనుకోగానే ముందుగా సందేహాలు ముసురు కుంటాయి. ఆపై అడ్డంకులు గుర్తుకు వస్తాయి. దారిలోని అవరోధాలను స్మరిస్తాం. దాంతో అడుగు ముందుకు వేయం. ఆలోచన ఉంటుంది కానీ అది ఆచరణలోకి రాదు. ఒకవేళ ఆచరణ ఆరంభించినా, మొదటి ప్రతి బంధకంలోనే వెనక్కు తిరుగుతాం. ఎవరైతే ఆలోచనను ఆచరణలో పెట్టటమే కాదు, ప్రతిబంధకాలన్నీ ఊహాత్మకమైనవే తప్ప నిజమైనవి కావు అని గ్రహించి గమ్యం వైపు సాగిపోతారో, వారు తమ గమ్యం చేరుతారు లక్ష్యాన్ని సాధిస్తారు. అందుకే మన పూర్వికులు మనుషులను మూడు రకాలుగా వర్గీకరించారు. 'ఆరంభించరు నీచమానవులు' అన్నారు.. ఎవరైతే ఏదైనా పని చేయాలనుకోగానే, రకరకాల అవరోధాలను ఊహించి, అడ్డంకులను చూసి భయపడుతూ పని ఆరంభించనే ఆరంభించరో వారు అధమస్థాయి మానవులు. ప్రగల్భాలు పలుకుతూ, తాము చేయగల పనులు సాధించగల గొప్ప లక్ష్యాల గురించి మాటలు మాట్లాడతారు తప్ప చేతల దగ్గరకు వచ్చేసరికి అడుగు ముందుకు పడదు. తాము అడుగు ముందుకు వేయకపోవటమే కాదు ఇతరులనూ అడుగు ముందుకు వేయనీయరు వీరు. అందుకే వీరు నీచమానవులయ్యారు. ఇక్కడ 'నీచం' అంటే 'చెడు' అని కాదు. 'నీచులు' అంటే నేరస్థులు, హంతకులు, మోసగాళ్లు కారు. వారి కన్నా తక్కువస్థాయి వారు వీరు. ఎందుకంటే ప్రతివ్యక్తికీ కర్తవ్యపాలన తప్పని సరిగా పాటించవలసిన ధర్మం అని భగవంతుడు నిర్దేశించాడు. అది సాధించదగ్గదా, అందుబాటులో ఉన్నదా అన్నది కాదు ముఖ్యం. కర్తవ్య నిర్వహణ ముఖ్యం. అటువంటి కర్తవ్యనిర్వహణను విస్మరించే వారంతా నీచులే. వారు ధనవంతులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు. నాయకులు కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. స్వధర్మాన్ని పాటించకుండా, కర్తవ్యనిర్వహణను విస్మరిస్తే వారు నీచులే అవుతారు. ఇలా మనుషుల్లో మొదటి రకం వారు నీచులుగా గుర్తించబడ్డారు.                                     ◆నిశ్శబ్ద.

పదే పదే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా? దాని వల్ల కలిగే నష్టాలు తెలిస్తే షాకవుతారు!!

టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా రకాలుగా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు. ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలంటే  ఆటో లేదా టాక్సీ కోసం ఎక్కువసేపు  వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు. వివిధ రకాల యాప్స్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. షాపింగ్ చేయడానికి చేతిలో క్యాష్ లేకపోయినా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. టెక్నాలజీ మాయ వల్ల చాలా మంది కాలం మొత్తం బిజీ బిజీగా గడుపుతారు. ఈ కారణంగా కనీసం వంట చేసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది చాలామందికి. ఈ కారణంగా నగరాలలో, ఓ మోస్తరు పట్టణాలలో  ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తుంటారు.  బిజీ జీవితాలకు ఆన్లైన్ ఫుడ్ అనేది శ్రమ తగ్గించి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. దీని వల్ల  ఇంట్లో కూర్చొని  ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. కానీ ఇంతకు ముందు  ఈ సౌకర్యాన్ని అయిష్టంగా  ఉపయోగించుకునేవారు. ఆన్లైన్ ఆర్డర్ అంటే ఖర్చు నుండి బోలెడు ఆలోచనలు చుట్టుముట్టేవి. కాస్త వంట వస్తే ఎంతో సులువుగా అయిపోయే భోజనం వందలాది రూపాయలు ఖర్చుపెట్టి కొనాలా అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.  సమయాన్ని సంపాదించడానికి వెచ్చించేవారు  వంట చేసుకునే సమయంలో డబ్బు సంపాదించి అందులో కొంత ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే వింత ఆలోచనకు అలవాటు పడ్డారు. ఇక పెద్దవాళ్లు ఇంట్లో లేక అడిగేవారు లేకపోతే ఈ తరం దంపతుల నుండి బ్యాచ్లర్స్ వరకు అందరిదీ ఇదే పంధానే.  తోచినప్పుడల్లా ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టేయడమే.  నిమిషాల్లో వేడివేడిగా ఆహారం డోర్ డెలివరీ అవుతుంది. ఈ వ్యసనం చాలా దారుణంగా తయారవుతోంది.  ఇది మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  ఆన్లైన్ ఫుడ్ తినడం వల్ల జరుగుతున్న సమస్యలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చాలా వరకు  ఫుడ్ డెలివరీ ఎంపికలలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అలాగే అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారాలే ఉంటాయి. కాలక్రమేణా వీటిపై  ఆధారపడటం అసమతుల్య ఆహారం  తీసుకోవడానికి దారితీస్తుంది.  ఇది శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాల లోపానికి దారితీస్తుంది. నేటి కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఉబకాయం, అధికబరువు, మధుమేహం వంటి సమస్యకు ఇదిగో ఈ ఆన్లైన్ ఫుడ్ లే కారణమవుతాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి. ఈ రకమైన ఆహారంలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు,  సోడియం ఉంటాయి, ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది.  శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడేవారిలో బయటపడిన మరొక దారుణ నిజం ఏమిటంటే చిన్నవయసులోనే వస్తున్న గుండె సంబంధ సమస్యలు. అనారోగ్యకరమైన ఆహారాలు అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా వేయించిన,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనులలో  పేరుకుపోతుంది. ఫైబర్  పోషకాలు లేని  ఆహారాలు మలబద్ధకం, కడుపులో వికారం,  పేగుల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలకు కారణమవుతాయి.  అలాగే వీటిలో అధిక చక్కెర,  అధిక కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇలాంటి ఆహారాలను  తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఊహించనివిధంగా పెరుగుతాయి.  ఇది క్రమంగా  టైప్-2 డయాబెటిస్,  ఇతర జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది . ఆహారాన్ని ఆర్డర్ చేసే వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంటే సాధారణ ఆహారం ఆరోగ్యానికి అలాగే మనస్సుకు కూడా మంచిది. కానీ  వేయించిన, అధిక కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల  అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. ఇది  ఒత్తిడి, ఆందోళన,  నిరాశకు  కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పదే పదే బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం ఖర్చుతో కూడుకున్నది.  ఇది  బడ్జెట్‌ను పాడుచేస్తుంది ఆహారంపై అధికంగా ఖర్చు చేయడం వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్యాకేజింగ్,  వ్యర్థాలు తరచుగా ఆహార పంపిణీతో ముడిపడి ఉంటాయి, ప్లాస్టిక్ కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలకు ఇది  దారి తీస్తుంది.                                                       *నిశ్శబ్ద.

ఒక బంధంలో విజయం సాధించాలంటే, ప్రేమలో విఫలమవడం నేర్చుకోవాలి.!!

  నేటి కాలంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొందరి ప్రేమకథ పెళ్లికి దారితీయదు. ఏదైనా ప్రేమ బంధం దృఢంగా ఉండాలంటే సద్గురువు చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  కొన్నిసార్లు ఇది బంధాన్ని విజయవంతం చేయడానికి సరిపోదు. బంధంలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య అలాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారు తమ కోసం వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలి.  వివాహాన్ని ప్రేమకు గమ్యస్థానంగా పరిగణించనప్పటికీ, జీవితాంతం కలిసి ఉండటమే అత్యంత అందమైన, పవిత్రమైన బంధం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తమ ప్రేమికుడితో కలిసి కుటుంబాన్ని గడపాలని కలలు కంటారు. కానీ మీ ప్రేమను పెళ్లి దశకు ఎలా తీసుకురావాలో మీకు తెలియదు. అలాంటి వారికి సద్గురు సలహా ఉపయోగపడుతుంది. సంబంధాన్ని కాపాడుకోవడానికి సద్గురు సలహా: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు, యువ తరం సమస్యలను బాగా అర్థం చేసుకుని, వారికి బాధ కలిగించకుండా వాటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన మత గురువులలో ఒకరిగా పరిగణిస్తున్నారు. ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి.. అతను ఇచ్చిన చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ సంబంధాన్ని ప్రతి సమస్య నుండి కాపాడుకోవచ్చు. దానిని విజయవంతం చేయవచ్చు. ఈ విషయం మాత్రమే ప్రేమ సంబంధాన్ని విజయవంతం చేస్తుంది: సద్గురు చెప్పినట్లుగా, మీలో ఉన్న ప్రేమ సఫలీకృతం కావాలంటే, మీరు ముందుగా ఓడిపోవడం నేర్చుకోవాలి, ఎక్కువ కాలం ఉండకూడదు లేదా అంతం కాదు. మీ సంబంధాన్ని గెలవాలంటే మీరు ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి అయి ఉండాలి. సంబంధంలో జీవిస్తున్న ఇద్దరూ దీనిని అర్థం చేసుకున్నప్పుడు, వారి జీవితమంతా ఏదీ వారిని వేరు చేయదు. వారి ప్రేమ అజరామరం. ప్రేమలో ఓడిపోవడం అంటే ఏమిటి? జీవితంలో ఎప్పుడూ ఓడిపోకండి, కానీ మీ ప్రేమికుడితో మీ సంబంధాన్ని చిరస్థాయిగా మార్చుకోవడానికి మీరు ఓడిపోవడం మంచిది. యుద్ధాల్లో గెలవాలంటే ఓడిపోయినట్లే, ప్రేమ కూడా వీటిలో ఒకటి మాత్రమే. అయితే అంతకు ముందు రిలేషన్ షిప్ లో లూజర్ అంటే అర్థం తెలుసుకోండి. మీ భాగస్వామి కోసం ఏదైనా చేయండి: ప్రతి ఒక్కరూ ప్రేమలో లావాదేవీల గురించి మాట్లాడుతారని సద్గురు చెప్పారు. అయితే అందులో ఓడిపోయిన వారిని ఎంచుకుంటేనే మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేయగలరు. దీని కోసం మీరు కోల్పోయేది ఏమీ లేదు. మీ భాగస్వామి నుండి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడం అంటే. ఇలా చేయడం వల్ల మాత్రమే ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు చిరస్థాయిగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల సంబంధం విజయవంతం కాదు: ఇతరులు మీ నుండి తీసుకోవాలని మీరు ఎల్లప్పుడూ ఆశించినట్లయితే, ఎవరూ మీతో సంబంధాన్ని కలిగి ఉండకూడదని సద్గురు వివరిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించకూడదు: రిలేషన్‌షిప్‌లో ప్రతి ఒక్కరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. భాగస్వామి మీతో నిజాయితీగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. అంతే కాకుండా అనవసరమైన అంచనాల భారాన్ని వారి భుజాలపై వేసుకోవడం సరికాదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. విజయవంతమైన ప్రేమ సంబంధం అంటే ఏమిటి? ప్రేమ సంబంధం  విజయం ప్రతి జంటకు భిన్నంగా ఉంటుంది. కొందరు వివాహ దశకు చేరుకోవడం ద్వారా తమ సంబంధాన్ని విజయవంతంగా భావిస్తారు, కొందరు దీనిని ఎల్లప్పుడూ ఒకరికొకరు సుఖంగా ఉన్నట్లు భావిస్తారు, తద్వారా మూడవ వ్యక్తి రాక వారి సంబంధాన్ని మార్చదు.

నేటికాలం అనారోగ్యాలకు హేతువు ఇదే!

డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి. జీవితంలో చాలామందికి ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. ప్రపంచ జనాభాలో నూటికి 80% మంది ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కు గురి అవుతుంటారు. ప్రపంచం అభివృద్ధి చెందేకొద్ది, మనుషులు అన్ని రకాల అవసరాలను చాలా సులభంగా తీర్చుకునే కొద్దీ మనుషులకు మానసిక వ్యాధులు ఎక్కువ అవుతూ ఉన్నాయి.  చాలామంది మానసిక సమస్యతో బాధపడుతున్నా సరే అది మానసిక వ్యాధి అని వారు గుర్తించరు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో దీన్ని గుర్తించేవారు లేరు. డిప్రెషన్ తో బాధపడే వారిని పొగరు మనుషులుగా ముద్ర వేస్తుంటారు చాలా మంది. డిప్రెషన్కు గురి అయినవారు ఏదో ఒక బాధతో, దుఃఖంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి లక్షణాలు వున్నవారు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు. ఏదో చిరాకు, ఇష్టమైన వాటి మీద కూడా అయిష్టంగా వుంటారు. అంతేకాకుండా వారు చెయ్యగలిగిన వాటిని చెయ్యలేరు, నా వల్లకాదు అన్న ఆలోచనలు కలిగివుంటారు. అందుకే వారు ఏ పనికి ముందుకు రారు, చేయమని ఎవరైనా చెప్పినా కాదని చెబుతారు. ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. కానీ ఇదంతా వారి నాటకం అని, పని తప్పించుకోవడానికి వారు అలా చేస్తున్నారని చుట్టూ ఉన్నవారు చెబుతారు.  జీవితానికి అవసరం అయిన ఎన్నో విషయాలపై మనం ఇంట్రస్టును కోల్పోతుంటాము. మనకు ఆనందాన్నిచ్చే విషయాలపై ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు, పిక్నిక్ లు, మొదలైన వాటిపట్ల కూడా ఆసక్తి కోల్పోతారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి నిద్రపట్టకపోవడం, నిద్రపట్టినా కలతనిద్రే తప్ప సుఖనిద్ర లభించదు. అంతేకాకుండా నిద్రలో ఏదో భయంకరమైన కలలు రావటం జరుగుతుంది. మరణం గురించిన ఆలోచనలు తరుచుగా వస్తూ వుంటాయి. జీవితం మీద విరక్తి వస్తుంది. బతకటం కంటే చావటం మేలు అనుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. జీవితాన్ని భారంగా భావిస్తారు.  మార్పు అన్నది జీవితంలో అత్యంత సహజమైన విషయం. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే అందరూ ఆ మార్పులను తట్టుకోలేరు. జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం అన్నాక సుఖదుఃఖాలు రెండూ వుంటాయి. దుఃఖం కలిగినప్పుడు తల్లడిల్లిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోకుండా జరిగిన అనుభవించిన సుఖాల గురించి, మంచిని గురించి ఆలోచించాలి. అప్పుడు మనం దుఃఖం గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళకుండా వుండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మార్పులకు అనుగుణంగా మనం మారాలే తప్ప బాధ పడకూడదు. ఏ మార్పు జరిగినా అది మన మంచికే అన్న భావనను కలిగి ఉండాలి. అప్పుడే మానసికంగా ఎంతో కొంత ఓదార్పు లభిస్తుంది. మనం మనకి సంబంధించిన వారు ఎవరైనా దూరమైపోతున్నప్పుడు చాలా బాధపడుతుంటాం. కొంతమంది ఈ చిన్న విషయానికి డిప్రెషన్ కు గురి కావటం జరుగుతుంది. మనుషులు దూరమైనంత మాత్రాన వారిలో మార్పు సంభవించదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.  ఎంతదూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అన్న సత్యాన్ని ఆలోచించినట్లయితే డిప్రెషన్కు టాటా చెప్పవచ్చు.                                        ◆నిశ్శబ్ద.

మీ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ మూడు చిట్కాలు ఫాలో అవ్వండి!

ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాం. మొదలు పెట్టిన పని సగంలోనే ఆగిపోతోంది. లేదంటే అసంపూర్తిగా మిగులుతుంది. అయితే చాణక్యుడు తన చాణక్యనీతిలో కష్టమైన పనిని సులభం చేసేందుకు మూడు చిట్కాలను పేర్కొన్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో ఒక వ్యక్తి తను చర్యలకు అనుగుణంగా మంచి, చెడు ఫలితాలను అనుభవిస్తాడని తెలిపారు. మానవసంబంధాల గురించి కొన్ని ముఖ్యవిషయాలను ప్రస్తావించారు. జీవితంలో కొన్ని ఆలోచణల గురించి పేర్కొన్నారు. మనం చివరి శ్వాసతీసుకునే వరకు మనల్ని ఆలోచనలు విడిచిపెట్టవు. ఆ ఆలోచనలు ఒకవ్యక్తి తనకు వచ్చిన కష్టమైన పనిని సులభంగా పూర్తిచేయగలడు. మన పనులు చాలా సులువుగా పూర్తిచేసేందుకు చాణక్యుడ చేసిన సింపుల్ టిప్స్ తెలుసుకుందాం. 1. జ్ఞానం:  జ్ఞానం అనేది కఠినమైన గోడను ఛేదించి విజయాన్ని సాధించే ఆయుధం వంటిది. జ్ఞానాన్ని మించిన స్నేహితుడు మరొకరు లేరు.  తెలివైన వ్యక్తి తన పనులన్నింటినీ సులభంగా పూర్తి చేస్తాడు. జ్ఞానం ఉన్న వ్యక్తికి తను చేసే పని ఒప్పో, తప్పో తెలుసు. దాని ఆధారంగా తన పని తాను చేసుకుంటాడు. 2. విజయం గౌరవానికి చిహ్నం: జ్ఞానం ఒక వ్యక్తి  విజయానికి దారితీసినట్లే, విజయం కూడా వ్యక్తి  గౌరవానికి ప్రధాన కారణమవుతుంది. అలాంటి గౌరవం మీ జీవితాంతం మీతోనే ఉంటుంది. అంటే, జ్ఞానం నుండి పొందిన విజయం ఎప్పుడూ లోపించదు. 3. మతం: డబ్బు కంటే మతం గొప్పదని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. మతం మనిషిని జీవితంలోనే కాదు, మరణానంతరం కూడా వదిలిపెట్టదని తన చాణక్య నీతిలో పేర్కొన్నారు. మన మతాన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. ఒక వ్యక్తి మతానికి కట్టుబడి ఉండటమే అతని విజయానికి కారణమని చెప్పాడు. ఎంత పెద్ద కార్యమైనా భక్తిశ్రద్ధలతో పనిచేస్తే అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ధర్మాన్ని అనుసరించి దాని మార్గంలో నడిచేవాడు పుణ్యఫలాలను పొందుతాడు. ధర్మాన్ని అనుసరించేవాడు ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతాడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పినట్లుగా పై మూడు ఆలోచనలను మనసులో ఉంచుకుని ఆ ప్రకారం నడుచుకుంటే ఎంత పెద్ద వారైనా నిస్సందేహంగా వాటన్నింటిని తొలగిస్తాడు. అతని ముందు ఎంత పెద్ద పని వచ్చినా అతను ఎదుర్కొనే సమస్య. వీటిని మనం నిత్య జీవితంలో పాటించడం చాలా ముఖ్యం.