ఇటు జై శ్రీరామ్ ...అటు బెంగాల్ పుత్రిక
అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్’లో నినాదాల హోరు ఉపందుకు కుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, జై శ్రీరామ్ నినాదాన్ని హోరేతిస్తుంటే, అదికార తృణమూల్ కాంగ్రెస్ తాజగా, స్థానిక సెంటిమెంట్’ను జోడిస్తూ ‘బెంగాలీ పుత్రిక’ నినాదాన్ని తెరమీదకు తెచ్చింది. అ వారాంతంలో కోల్కతాలో ఎక్కడికి వెళ్ళిన, ఎక్కడ చూసిన మమత బెనర్జీ ఫోటో, ‘బంగ్లా నైజర్ మేయేకే చాయే’(బెంగాల్ పుత్రికనే ..బెంగాల్ కోరుకుంటోంది) అనే నివేదిక ఉన్న పోస్టర్లు దర్శన మిచ్చాయి.
ఎన్నికల రాజకీయలలో, రాజకీయ ఉద్యమాలలో నినాదాలు చాలా కీలక పాత్రనే పోషిస్తాయి.స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ ఇతర నేతలు పోషించిన పాత్ర ఎంత గొప్పదో, ‘వందేమాతరం’ నినాదం పోషించిన పాత్ర అంతకంటే గొప్పది. అలాగే, ఇందిరా గాంధీ 1969లో కాంగ్రెస్ పార్టీని చీల్చి సమయంలో ఇచ్చిన రెండు పదాల నినాదం, ‘గరీబీ హఠావో’ ఆమెను తిరుగులేని నాయకురాలిగా నిలిపింది. ఆ ఒక్క నినాదంతో మొరార్జీ దేశాయ్’వంటి మహానాయకుల ఓల్డ్ కాంగ్రెస్’ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. అలాగే, ‘అగలీ బారీ అటల్బిహారీ’ , అలాగే, తెలుగు రాష్ట్రాలలో జై తెలంగాణ నినాదంతోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఇలా చెప్పుకుంటూ పొతే, పొలిటికల్ ఈక్వేషన్స్’ను మార్చి వేసిన నినాదాలు చాలానే ఉన్నాయి.
మరో రెండు నెలల్లో ఎన్నికలు పశ్చిమ బెంగాల్’లో ఇతర అమసలు అన్నీ పక్కకు పోయి కేవలం నినాదాలే కీలకంగా మారాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్’ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన భారతీయ జనత పార్టీ, సంధించిన ‘జై శ్రీరామ్’ నినాదం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆమెలో ‘జై శ్రీరామ్’ వ్యతిరేక ఆందోళన, ఆగ్రహం ఏ స్థాయికి ఎదిగిందో,వేరే చెప్పనకక్రలేదు.ఇటీవల సుభాష్ చంద్ర బోసు బాబు జయంతి ఉత్సాలలో ప్రధాని నరేంద్ర మోడీతో వేదికను పంచుకున్న ఆమె,సభలో ఎవరో ‘జై శ్రీరామ్’ నినాదం చేశారని ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రసంగం చేయకుండా మికే పక్కన పెట్టి వెళ్లి పోయారు.
మమతలో ‘జై శ్రీరామ్’ నిందం కంపరం పుట్టించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఆమె కాన్వోయ్ వెళుతున్న మార్గంలో రోడ్డు పక్కన నిలుచున్నప్రజలు ‘జై శ్రీరామ్’ అనగానే, ఆమె కాన్వోయ్ ఆపి, కారు దిగివచ్చి మరీ, సామాన్య ప్రజలతో వాదులాటకు దిగారు. అంతే కాదు, అసలు ‘జై శ్రీరామ్’ నినాదాన్ని రాష్ట్రంలో బ్యాన్ చేయాలనే ఆలోచన కూడా చేశారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టె ఆలోచన చేశారు. అయితే, బీజేపీతో పాటుగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో వెనక్కి తగ్గారు. జై శ్రీరామ్’ నినాదం పట్ల మమతా దీదీకి ఉన్న వ్యతిరేకతను, బీజేపీ బాగా సొమ్ము చేసుకుంది.నినాదాన్ని,నినాదం పట్ల మమతకు,ఆమె పార్టీకి ఉన్న వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. దీంతో ఇప్పటికే చాలావరకు కంసాలిడేట్’ అయిన 70 శాతం వరకు ఉన్న హిందూ ఓటు మరింతగా బలపడింది. ఈ ధీమాతోనే కావచ్చును, పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి బెంగాల్ ఎన్నికల ప్రధాన వ్యూహ కర్త అమిత్ షా 200 ప్లస్ సీట్లు ఖాయమని ధీమాను వ్యక్త పరుస్తున్నారు.
మమతా బెనర్జీ జై శ్రీరామ్కు వ్యతిరేకంగా బంగ్లా నైజర్ మేయేకే చాయే’(బెంగాల్ పుత్రికనే ..బెంగాల్ కోరుకుంటోంది) అనేనినాదాన్ని తెర మీదకు తెచ్చారు.మమత ఫోటో, నినాదం ఉన్న హోర్డింగులు నిన్న కొల్కతా అంతటా దర్శనమిచ్చాయి.భారతీయ జనతా పార్టీని, స్థానికేతర పార్టీగా చిత్రించే వ్యూహంతో ఆమె బెంగాలీ సెంటిమెంట్’ను ఆశ్రయించారు. అయితే, ఇప్పటికే, అమిత్ షా, స్థానికులే పశ్చిమ బెంగాల్’ ను పాలిస్తారని, అది ఎవరన్నది, బెంగాలీ ప్రజలు ఎన్నుకున్నబీజేపీ ఏమ్మేల్ల్య్యేలే నిర్ణయిస్తారని వివరణ ఇచ్చారు. ఈ నేపద్యంలో, మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో,ఎవరు గెలుస్తారు అనే దాని కంటే ఏ నినాదం గెలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.