కరోనా చావు.. బంగారం పోవు..  

మీ ఇంట్లో ఎవరికైన కరోనా వచ్చిందా..? వాళ్ళకి సీరియస్ గా ఉంటే ఆసుపత్రిలో చేర్పించాలనుకుంటున్నారా..? అయితే వారి ఒంటి మీద ఏమైనా బంగారు ఆభరణాలు ఉంటే, ముందుగానే తీసుకోండి.. ఎందుకంటే..? ఆ బంగారాన్ని అమ్మితే కనీసం వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకైనా ఎంతో అంతో ఆసరావుతుంది. అదేంటి అలా చెపుతున్నాడు అనుకుంటున్నారా..?  ప్రస్తుతం కరోనా హాస్పిటల్ లో జరుగుతున్న సంఘటలను చూస్తే అదే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళా కరోనా వచ్చిన వాళ్ళ వంటి మీదా తాళి ఉంటే అని.. సందేహం పడుతున్నారా.. ? తాళి కూడా తీకుకొండి అని కూడా చెప్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు.  కరోనా కాలంలో మనుషులు మరణానికి దగ్గర అవుతూ.. బంధాలకు దూరమవుతున్నారు. మరి కొంత మంది సచ్చినోడి సొమ్ము వచినంతనే సాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు నీచమైన దారుణానికి వడిగడుతున్నారు. మానవత్వాన్ని మరిచిన మృగాలు అవుతున్నారు. ఒక వైపు కరోనా వచ్చిన వాళ్ళని హాస్పిటల్ సిబ్బంది ఆర్థికంగా పట్టి పీడిస్తుంటే.. హాస్పిటల్ లో సేవలు అందించే కొతం మంది ఆ పేషేంట్స్ వంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రిలో కరోనా శవాలను కూడా కుటుంబాలకు అప్పగించడం లేదని మరోవైపు ప్రచారం జరుగుతుంది.  పుంగనూరు కు  చెందిన ఓ బాధితురాలు ఈ నెల 3వ తేదీన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం చేరారు. మరుసటి రోజు మృతి చెందారు. మృతదేహాన్ని అప్పగించేటప్పుడు ఆమె మెడలోని 60 గ్రాముల బంగారం తాళిబొట్టు కనిపించలేదు. బాధితుల బంధువులు ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా గతంలో తిరుపతిలోని స్విమ్స్‌, రుయాతో పాటు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ మృతుల శరీరాలపై ఉన్న ఆభరణాలు మాయం అయ్యాయి. పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు సైతం నమోదయ్యాయి. రెండో కొవిడ్‌ అలలో మృతుల సంఖ్య పెరుగుతున్నందున ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ విషయంపై ఎలాంటి విధి విధానాలు పాటించడం లేదు. కొవిడ్‌ బారినపడ్డారని తెలియగానే బాధితులు భయాందోళనలకు గురవుతూ వెంటనే ఆస్పత్రికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తమ శరీరంపైౖ ఎలాంటి విలువైన ఆభరణాలు ఉన్నాయోనని గుర్తించే పరిస్థితి ఉండదు. ఆస్పత్రిలో చేరే వారికి కొంత దూరంగా బంధువులు ఉన్నప్పటికీ ఆభరణాలు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. తీరా మృతి చెందాక మృతదేహాన్ని పూర్తిగా కప్పి జిప్‌ బ్యాగ్‌లో పెట్టి దహన సంస్కారాలకు తరలిస్తారు.           పర్యవేక్షణ..        రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో సుమారు 900 మంది కొవిడ్‌ బాధితులు వైద్యం పొందుతున్నారు. వారి పడకల వరకు వైద్యులు, నర్సులు, అటెండర్లు వెళ్తుంటారు. బాధితుల శరీరంపై ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, వాటికి ఎలాంటి రక్షణ ఇస్తున్నామనే వ్యవస్థ అక్కడ కన్పించడం లేదు. కనీసం ఆస్పత్రిలో చేరే సమయంలో అయినా విలువైన ఆభరణాలు బంధువులకు అప్పగించాలని చెప్పడం, ఒక వేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రత్యేకంగా నమోదు చేయడం వంటివి చేయడం లేదు. ఆభరణాలు మాయం అయితే అందుకు దోషులు ఎవరని నిర్ధరించేందుకు ఎలాంటి ఆధారాలు అక్కడ లభించని పరిస్థితి.               స్విమ్స్‌లో సీసీ కెమెరాలే దిక్కు          గతంలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయమైన ఘటనలు స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకున్నాయి. చివరకు ముగ్గురు స్విమ్స్‌ సిబ్బందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదు అందలేదు. అన్ని వార్డుల్లో ఉన్న సీసీ కెమెరాలు దొంగలను పట్టిస్తాయనే నమ్మకంతో స్విమ్స్‌ యాజమాన్యం ఉంది. ఇదివరకటిలా బాధితులు చేరే సమయంలోనే ఆభరణాలు నమోదు చేసి.. డిశ్ఛార్జి సమయంలో అప్పగించే వ్యవస్థ ప్రస్తుతం కన్పించడం లేదు. ప్రస్తుతం ఆక్సిజన్‌ పడకల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తూ శరీరంపై ఎలాంటి ఆభరణాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించకుండా చేరిపోతున్నారు.                   అలాంటి ఫిర్యాదులు రాలేదు..     మరోవైపు స్విమ్స్‌ కరోనా ఆస్పత్రిలో బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు  ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదని. గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్స్ లో  సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు మృతదేహాల వద్దకు ఎవరు రాలేని పరిస్థితి ఉందని. కరోనా వల్ల చనిపోయిన పది నిమిషాలకే ఆ శవాలను కుటుంబ సభ్యులకు రెండు గంటల్లోనే  అప్పగిస్తున్నాం అని, చేర్చుకునే సమయంలోనే కేసు షీటులో ఆభరణాల గురించి నమోదు చేస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం చెపుతుంది.     

తెలంగాణలో లాక్ డౌన్! సీఎం కేసీఆర్ క్లారిటీ...

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు ఆక్సిజన్ రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని ద్రుష్టికి తెచ్చారు.  మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందును సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైద్రాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైద్రాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైద్రాబాద్ మీద భారం పెరిగిపోయిందని సిఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అదనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైద్రాబాద్ మీద ఆక్సిజన్ వాక్సీన్ రెమిడిసివర్ మంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సిఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్థుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నుల కు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల ద్రుష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతిరోజుకు 2 నుంచి2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరాచేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు.  సీఎం కెసిఆర్ విజ్జప్తితో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు  కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కేసీఆర్ తో మాట్లాడారు. ప్రధాని కెసిఆర్ విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమాకూరుస్తామని, ఆక్సిజన్ వాక్సీన్ రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సిఎం కు హామీ ఇచ్చారు. ఆక్సిజన్ ను కర్నాటక తమిళనాడులనుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు. కరోనా పరిస్థితుల పై గురువారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్నిసిఎం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సిఎం సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సిజన్ అందుతున్నది ఇంకా ఎంతకావలి? వాక్సిన్ లు ఎంత మేరకు అందుబాటులో వున్నవి రోజుకు ఎంత అవసరం ? రెమిడిసివర్ మందు ఏ మేరకు సప్లయి జరుగుతున్నది రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలను ఆక్సిజన్ బెడ్ల లభ్యత వంటి విషయాలమీద పూర్తిస్థాయిలో చర్చించారు.  రెమిడిసివర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన..  సిఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో  ఇప్పటివరకు 9500 ఆక్సిజన్ బెడ్లు వున్నాయని వాటిని హైద్రాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరోవారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000 కు పెంచాలన్నారు. మెరుగైన ఆక్సిజన్ సరఫరాకోసం వొక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యునిటీ హాస్పటల్స్ ఏరియా ఆస్పటల్స్ ల్లో మొత్తం 5980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటుచేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు ప్రభుత్వ ప్రయివేట్ ఆసుపత్రుల్లో కలిపి లక్షాయాభైయారు వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో లక్షా ముప్పయివేలు (85 శాతం)  కోలుకున్నారని అధికారులు సిఎం కు వివరించారు.  రోజువారిగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సిఎం తెలిపారు. దీనికి  డైరక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి  పాజిటివ్ కేసుల వివరాలు కోలుకున్న వారి వివరాలు హోం క్వారెంటైన్ లో ఎంతమంది వున్నారు ప్రభుత్వ దవాఖానాల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు ప్రయివేట్ దవాఖానాల్లో ఎంతమంది అనే వివరాలను పబ్లిక్ డోమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.  మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్నవాల్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సిఎం ఆదేశించారు. ఆక్సిజన్  సరఫరా గురించి సమీక్షించిన సిఎం రాష్ట్రంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఐఐసిటి డైరక్టర్ చంద్రశేఖర్ తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆరాతీసారు. వారి సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సిజన్ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తిని జరిపే వ్యవస్థలను నెలకొల్పేందుక చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం సూచించారు. పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సిఎం కేసీఆర్  కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే ....కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.

తిరుపతి ఓటమిపై బ్లేమ్ గేమ్! పవన్ ను టార్గెట్ చేసిన సోము టీమ్ 

పాయే. ప‌రువంతా పాయే. ఇచ్చిన బిల్డ‌ప్ అంతా నీరుగారిపాయే. జాతీయ పార్టీ అని ఫోజులు కొట్టారు. మోదీ బొమ్మ చూపిస్తూ చెల‌రేగిపోయారు. జ‌న‌సేన త‌మ‌కే స‌పోర్ట్ అంటూ ఊరేగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌తో ప‌వ‌ర్‌లోకి వ‌స్తామంటూ ఊద‌ర‌గొట్టారు. రిటైర్డ్ ఐఏఎస్‌ను తీసుకొచ్చి కాషాయ జెండా ఎగ‌రేయాల‌ని క‌ల‌లు గ‌న్నారు. ఇంతా చేస్తే.. అంత హంగామా సృష్టిస్తే.. తిరుప‌తితో బీజేపీ ప‌రువు బ‌జారు పాల‌య్యే. కొండంత రాగం తీసిన క‌మ‌ల‌నాథుల‌కు డిపాజిట్లు కూడా రాక‌పాయే. ఏపీలో బీజేపీ బ‌ల‌మెంతో తేలిపాయే. అందుకే ఇప్పుడు అన్నీ మూసుకొని.. మూటాముల్లె స‌ర్దుకొని.. త‌లెక్క‌డ పెట్టుకోవాలో తెలీక‌.. స‌తమ‌త‌మ‌వుతోంది కాషాయం పార్టీ.  తిరుప‌తి ఘోర ప‌రాభ‌వం నుంచి బీజేపీ ఇప్ప‌ట్లో బ‌య‌ట ప‌డ‌క‌పోవ‌చ్చు. తిరుప‌తి త‌మ‌కు కాస్తోకూస్తో ఉనికి ఉన్న‌ ఆధ్యాత్మిక న‌గ‌రం కావ‌డం.. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డం.. వ‌ల్ల గెలుపు ఈజీ అనుకున్నారు క‌మ‌ల‌నాథులు. కానీ, ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు బీజేపీని బండ‌కేసి కొట్టినంత ప‌ని చేయ‌డంతో ఇప్పుడు వారంతా ల‌బోదిబోమంటున్నారు. 50 వేల ఓట్లు తెచ్చుకోవ‌డ‌మే జాతీయ పార్టీకి అతిక‌ష్ట‌మైంది. ఇదంతా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు సోము వీర్రాజు వైఫ‌ల్య‌మేన‌ని అంటున్నారు. సోము వీర్రాజు మొద‌టి నుంచి వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌నే టాక్ ఉంది. సోముతో పాటు పార్టీ ఇంచార్జ్ సునీల్ ధియోదర్, విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న ఓవరాక్షన్ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందనే చర్చ బీజేపీలో జరుగుతోంది. అధికార పార్టీ  వైఫల్యాలపై మాట్లాడకుండా ఎంతసేపు టీడీపీపై విమర్శలు చేయడమే వీరి పనిగా ఉంది. అదే ఇప్పుడు పార్టీకి మైనస్ గా మారిందని, తిరుప‌తిలో బీజేపీకి డిపాజిట్ కూడా గ‌ల్లంతైంద‌ని అంటున్నారు.  తిరుపతి  దారుణ ప‌రాభ‌వం చూసి అధిష్టానం వీర్రాజుపై ఓ రేంజ్‌లో సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో తిరుప‌తి ప‌రాభ‌వ బారాన్ని మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌పై తోసేసే ప్ర‌య‌త్నం చేస్తోంది క‌మ‌ల‌ద‌ళం. ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో తాము ఓడిపోయామంటూ కొత్త రాగం తీస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక‌లో అలా క‌థ‌నం కూడా ప్ర‌చురిత‌మైంది. పవన్ ను టార్గెట్ చేస్తు సాక్షిలో వచ్చిన  కథనం వెనక సోము వీర్రాజు, సునీల్ దియోదర్, విష్ణువర్ధన్ రెడ్డి పాత్ర ఉందంటున్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్‌గేమ్ అంటూ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.   "న‌మ్మితే న‌ట్టేట ముంచార‌ట‌. భావి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా ద్రోహం చేశార‌ట‌. చంద్ర‌బాబుతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒప్పందం చేసుకున్నార‌ట‌. బీజేపీకి వెన్నుపోటు పొడిచార‌ట‌. అందుకే, వారం రోజులు ప్ర‌చారం చేస్తాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక్క రోజు ప్ర‌చారంతోనే పేక‌ప్ చెప్పాడ‌ట‌. తిరుప‌తిలో జ‌న‌సేన ఓట్లు బీజేపీకి ప‌డ‌లేద‌ట‌." ఇలా అంతా మీరే చేశారంటూ బీజేపీ ప్ర‌చారం చేస్తోంది. తిరుప‌తి ఓట‌మికి జ‌న‌సేన‌, ప‌వ‌న్‌క‌ల్యాణే కార‌ణ‌మంటూ కోడై కూస్తోంది. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబుపైనా అభాండం మోపుతోంది. అవును, వాళ్లిద్ద‌రూ ఒక‌ట‌య్యారంటూ మైండ్‌గేమ్ మొద‌లుపెట్టారు క‌మ‌ల‌నాథులు.  తిరుప‌తిలో బీజేపీకి 50వేల వ‌ర‌కూ ఓట్లు వ‌చ్చాయి. అవ‌న్నీ, జ‌న‌సేన ఓట్లేన‌నేది జ‌నాల మాట‌. కానీ, బీజేపీ మాత్రం జ‌న‌సేన ఓట్లు త‌మ‌కు బ‌దిలీ కాలేద‌ని అంటోంది. త‌మ‌కు ప‌డాల్సిన ఓట్లే ప‌డ్డాయి కానీ, జ‌న‌సేన శ్రేణులు త‌మ‌కు అంత‌గా స‌హ‌క‌రించ‌లేద‌ని ఆడిపోసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ దియోధ‌ర్‌ను.. వ‌కీల్‌సాబ్ సినిమా ప్ర‌మోష‌న్‌కు వాడుకున్నారు కానీ, త‌మ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారానికి  మాత్రం వ‌కీల్‌సాబ్ డుమ్మా కొట్టాడంటూ కాక రేపుతున్నారు. వారం రోజుల‌ని మాటిచ్చి.. ఒక్క రోజు మాత్ర‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్ర‌చారం చేయ‌డానికి చంద్ర‌బాబుతో కుదిరిన ఒప్పందమే కార‌ణ‌మంటూ కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేస్తోంది. ఇలా తిరుప‌తి ఓట‌మిని జ‌న‌సేన ఖాతాలో క‌లిపేసేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది క‌మ‌లం పార్టీ. బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను జ‌నాలు అస‌హ్యించుకుంటున్నారు. అస‌లు, జ‌న‌సేన కార‌ణంగానే తిరుప‌తిలో టీడీపీ రెండో స్థానానికి ప‌రిమిత‌మైంది. జ‌న‌సేనే క‌నుక టీడీపీతో చేతులు క‌లిపి ఉంటే.. తిరుప‌తి ఫ‌లితం మ‌రోలా ఉండేది. ఇటు చంద్ర‌బాబు నాయ‌క‌త్వం, అటు ప‌వ‌న్ ఛ‌రిస్మా క‌లిస్తే.. ప్ర‌భంజ‌న‌మే ఉండేదంటున్నారు. ఏపీలో పూర్తిగా తుడుచి పెట్టుకుపోయే ప‌రిస్థితికి దిగ‌జారి పోయిన బీజేపీ.. ఆ అవ‌మాన‌భారం నుంచి త‌ప్పించుకోడానికి.. జ‌న‌సేన స‌హ‌క‌రించ‌లేద‌ని, చంద్ర‌బాబుతో ఒప్పందం కుదిరింద‌ని.. సొల్లు వాగుడు వాగుతోందని అంటున్నారు. బీజేపీ న‌వ్యాంధ్ర‌కు తీర‌ని అన్యాయం చేసింది. బీజేపీ.. వైసీపీకి లోపాయికారిగా స‌హ‌క‌రిస్తోంది. ఢిల్లీలో ఆ రెండు పార్టీలు చ‌ట్టాప‌ట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. పార్ల‌మెంట్‌లో ప‌ర‌స్ప‌రం మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాయి. ఆ రెండూ.. దొందుదొందేన‌ని ఆంధ్రులంద‌రికీ తెలుసు. అందుకే, ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.. బీజేపీని దారుణంగా తిర‌ష్క‌రిస్తున్నారు ఓట‌ర్లు. ఆఖ‌రికి.. మంచి ప‌వ‌ర్ ఉన్న ప‌వ‌ర్ స్టార్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. బీజేపీని ఆద‌రించ‌కుండా గ‌ట్టి షాక్ ఇచ్చారు తిరుప‌తి ప్ర‌జ‌లు.  పార్టీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు అట్ట‌ర్ ఫ్లాప్‌. తిరుప‌తి ఎన్నిక‌ల ఓట‌మితో బీజేపీకి భ‌విష్య‌త్తుపై ఆశ‌లు లేవు. పోయిన ప‌రువు ఎలాగూ తిరిగిరాదు.. ఏపీలో కాషాయం పార్టీకి ఏమాత్రం ఉనికి లేదు. ఉన్న కాస్తంత ఇమేజ్ కూడా ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారంతో మంట‌గ‌లుస్తోంది. క‌మ‌ల‌నాథులు ఇప్ప‌టికైనా ఇలాంటి మైండ్‌గేమ్‌కు పుల్‌స్టాప్ పెడితే ఆ పార్టీకే మంచిది. లేదంటే, ఏపీలో బీజేపీకి మ‌రిన్ని దారుణ ప‌రాభ‌వాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

వ్యాక్సిన్ కూ కుల గజ్జి! అందుకే కొనడంలేదా జగన్ రెడ్డి?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. అధికారికంగా సర్కార్ చెబుతున్న లెక్కలకంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కరోనా రోగుల మరణాలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో నమోదైన ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనే ప్రచారంతో ఏపీ జనాలు హడలిపోతున్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని కోరుతున్నారు. కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను కట్టడి చేసిన దేశాలన్ని వ్యాక్సినేషన్ తోనే సక్సెస్ అయ్యాయి. అందుకే భారత్ లోనే వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. మోడీ సర్కార్ కూడా వ్యాక్సినేషన్ పైనే ఫోకస్ చేసింది. మే1 నుంచి మూడో దశలో భాగంగా 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం టీకాలకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. కాని ప్రమాదకర వైరస్ వ్యాప్తిలో ఉన్న ఏపీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేయకుండా 18 ఏండ్లు పైబడిన వారికి ఇప్పుడే టీకాలు ఇవ్వలేమంటూ  చేతులెత్తేసింది. ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీకా కోసం ఎదురు చూస్తున్న జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఇస్తున్నవి గాక రాష్ట్రం సొంతగా కొనుగోలు చేయడానికి 13.5లక్షల వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని, ఇందు కోసం రూ.45 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. పొరుగున ఉన్న కేరళ కోటి వ్యాక్సిన్లు, తమిళనాడు కోటిన్నర, కర్ణాటక కోటి, మహారాష్ట్ర మొత్తం జనాభాకు సరిపోయేంత వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించి వనరులు సిద్ధం చేసుకొన్నాయి. తెలంగాణ సర్కార్ కూడా 2 వేల 5 వందల కోట్లను వ్యాక్సిన్ కోసం ఖర్చు చేస్తామని ప్రకటించింది. దీంతో ఐదు కోట్లకు పైగా జనాలున్న ఏపీకి 13 లక్షల టీకాలు ఏ మూలకు వస్తాయి? మొత్తం వనరులన్నీ పోగుచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ చాలినన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.  కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఏపీలో 5 కోట్ల 26 లక్షల మంది ఉన్నారు. 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలి. అంటే ఏపీలో టీకా ఇవ్వాల్సిన వాళ్లే దాదాపు మూడున్నర కోట్ల మంది ఉంటారని అంచనా. మే ఐదవ తేది వరకు ఏపీలో కేవలం 69 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో 52.5 లక్షల మందికి ఫస్ట్ డోస్ట్ ఇవ్వగా.. 16.5 లక్షల మందికి సెకండ్ డోస్ కంప్లీట్ అయింది. ఈ లెక్కన ఇంకా 2.6 కోట్ల మందికి ఫస్ట్ డోస్.. 2.9 కోట్ల మందికి పైగా సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ఏపీకి ఇంకా దాదాపు ఐదున్నర కోట్ల వ్యాక్సిన్ కావాలి. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ అవసరం ఉన్నా ఏపీ సర్కార్ మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదు.  దేశంలో ప్రస్తుతం కోవిషీల్ట్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  ఏపీకి చెందిన కృష్ణ ఎల్లాకు చెందిన హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థలోనే కోవాగ్జిన్ తయారవుతుంది. అయినా కొవాగ్జిన్ కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదు జగన్ రెడ్డి సర్కార్. తెలంగాణ సర్కార్ మాత్రం కొవాగ్జిన్ కోసం భారత్ బయోటెక్ యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరుపుతోంది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ... కంపెనీకి వెళ్లి మరీ ఎండీతో చర్చలు జరిపారు. దేశ వ్యాప్తంగా కోవిషీల్డ్ కంటే కొవాగ్జిన్ కే ఎక్కువ డిమాండ్ ఉంది. కొవాగ్జిన్ కోసం ప్రైవేట్ సంస్థలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఇతర రాష్ట్రాలు  పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇవ్వడంతో పాటు త్వరగా పంపిణి చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. కాని ఆంధ్ర సర్కార్ మాత్రం చోద్యం చూస్తోంది. దీంతో ఏపీ సీఎంకు రాజకీయం, ఓటు పథకాలు తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్క లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  తెలుగు వ్యక్తికి చెందిన ఫార్మా సంస్థలో తయారవుతున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం జగన్ రెడ్డి సర్కార్ భారీగా ఆర్డర్లు ఇవ్వకపోవడంపై మరో చర్చ కూడా జరుగుతోంది. భారత్ బయోటెక్ ఎండీ కమ్మ కావడమే ఇందుకు కారణమంటూ సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. కమ్మ వ్యక్తి సంస్థలో తయారైనందువల్లే కొవాగ్జిన్ కు జగన్ రెడ్డి సర్కార్ ఆర్డర్లు ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ తో ఉన్న ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ లోని రెడ్డీస్ ల్యాబ్ లోనే ఆ టీకాలను తయారు చేస్తున్నారు. రెడ్డీస్ లో  ఉత్పత్తి అయ్యే స్పుత్నిక్ టీకా జూన్ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే కోవాగ్జిన్ వద్దనుకుంటున్న ముఖ్యమంత్రి... రెడ్డీస్ లో రూపొందుతున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసమే మూడో దశ వ్యాక్సినేషన్ ను జూన్ నెలకు వాయిదా వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కమ్మ వ్యక్తి సంస్థ నుంచి తీసుకోకుండా రెడ్డీస్ లో తయారైన వ్యాక్సిన్ కోసమే జగన్ రెడ్డి ఇలా చేస్తున్నారని అంటున్నారు.  వ్యాక్సిన్ విషయంలో జగన్ సర్కార్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజలంతా ప్రాణాలు కోపాడుకోవాలని ఆరాటపడుతుంటే... ప్రభుత్వం రాజకీయం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్ పైనా కుల రాజకీయం చేయడం ఏంటని మండిపడుతున్నారు. వ్యాక్సిన్ కోసం నెల రోజులు ఆగితే... అప్పటివరకు కరోనా కాటుకు ఎవరైనా బలైతే బాధ్యులు ఎవరిని నిలదీస్తున్నారు.  ఇప్పటికైనా కుల. కక్ష రాజకీయాలు మాని... రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు తెప్పించాలని ఏపీ ప్రజలు, విపక్షాలు కోరుతున్నాయి. లేదంటే కరోనా చావులకు జగన్ సర్కార్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు .

అన్నను రోకలి బండతో కొట్టి  చంపిన తమ్ముడు.. 

అది రంగా రెడ్డి జిల్లా. కందుకూరు మండలం. మురళి నగర్. అతని పేరు వడ్త్యవాత్ బాల్ రామ్. అతనికి ఇద్దరు పెళ్ళాలు. మొదటి భార్య పేరు గోరి, ఆమె 8 సంవత్సరాలు క్రితం అనారోగ్యం తో మృతి చెందింది. కట్ చేస్తే..  బాల్ రామ్. సరికోండకు చెందిన జయలక్ష్మి ని వివాహం చేసుకొన్నాడు. వీరికి 3 సంవత్సరాల బాలుడు (దేవరాజ్) ఉన్నాడు. కాపురం సజావుగా జరుగుతుందని     కందుకూరు సీఐ కృషంరాజు తెలిపిన కథనం ప్రకారం.. వడ్త్యవాత్ బాల్ రామ్ ఈ నెల 2వ తేదీన బాల్ రామ్ మద్యం తాగి వచ్చి భార్య, పిల్లలను ఇంట్లో ఉండోదాన్ని గొడవ చేశాడు.దీంతో గ్రామ సమీపన ఉన్న పల్లె ప్రకృతి వణంలోనే జయలక్ష్మి పిల్లలతో కలిసి సాయంత్రం వరకు ఉండగా.. రాత్రి తన తోడి కోడలు.. వారిని ఇంటికి తీసుకువచ్చింది. అయితే, మంగళవారం జయలక్ష్మి.. తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులతో మాట్లాడానికి బాల్ రామ్‌ను కోరగా.. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చాడు. భార్యను ఎందుకు కొడుతున్నావని బాల్ రామ్ అత్తమామలు అడగా, అత్త మామలని బూతు మాటలు తిట్టడంతో పాటు.. బాల్ రామ్ సొంత తమ్ముడు వడ్త్య వాత్ మోహన్ ను  కూడా బూతులు తిడుతూ.. కొట్టడానికి రావడంతో మోహన్ ప్రక్కనే ఉన్న రోకలి బండ తీసుకొని బాల్ రామ్ (అన్న)ను తలపై కొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో వెంటేనే బాల్ రామ్‌ను 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం (తెల్లవారుజామున) 2:43 సమయంలో చనిపోయడాని డాక్టర్లు తెలిపారు.    

జగన్ పై  కోర్టు ఫైర్.. 

మరోసారి ఏపీ హై కోర్టు జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ విప‌రీతంగా వున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో పడకల లభ్యతతో పాటు ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఫీజుల వసూళ్ల వంటి అంశాల‌పై  హైకోర్టులో విచారణ కొన‌సాగుతోంది. సామాజిక కార్య‌క‌ర్త తోట సురేశ్ బాబుతో పాటు ప‌లువురు వేసిన పిటిష‌న్లు విచార‌ణ‌కు వ‌చ్చాయి.   క‌రోనా నియంత్ర‌ణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవట్లేద‌ని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేదని మొన్న ప్ర‌భుత్వం  అఫిడవిట్‌లో పేర్కొంద‌ని, ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులే చెబుతున్నారని  హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో వివ‌రించిన దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ కోసం తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది హైకోర్టుకు వివ‌రిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న.. తమకు ఏం పట్టనట్లు కూర్చున్న సీఎం లు ఇద్దరే ఇద్దరు. ఒకరు జగన్ రెడ్డి మరొకరు కేసీఆర్ దొర. ఎన్ని ఏపీలో కరోనా పేషంట్ కి పాడైన ఆహరం..   శ్రీకాకుళం జిల్లాలోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో వసతుల లేమిపై వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) మురళీకృష్ణ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కరోనా చికిత్సకు డబ్బు చెల్లించి తన తల్లితో పాటు తాను కూడా ఆస్పత్రిలో చేరారని.. సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదని వాపోయారు. పాడైన ఆహారం పెడుతున్నారని.. పదేపదే అడిగినా వాటర్‌ బాటిల్‌ కూడా  ఇవ్వడం లేదని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేరినప్పటి నుంచి డ్యూటీ డాక్టర్‌ను చూడలేదని చెప్పారు.   కానూరు లో ఆక్సిజన్ అందక..  కానూరు పరిధిలోని టైమ్‌ ఆసుత్రిలో కరోనా బాధితులకు అందించే ఆక్సిజన్‌ నిండుకోవడంతో బుధవారం రాత్రి ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తం 40 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 30 మందికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఉంది. ఆక్సిజన్‌ అందించాల్సిన ఏజెన్సీ బుధవారం సరఫరా చేయలేకపోయింది. రోజూ ఇక్కడ 80 ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు బుధవారం సాయంత్రం వరకు వచ్చేలా ఉండడంతో బాధితుల్లో ఆందోళన చెలరేగింది. ఆసుపత్రి వర్గాలు ఎంతప్రయత్నించినా సాయంత్రం వరకు దొరకలేదు. చికిత్స పొందుతున్న 30 మందికి రాత్రి 9 గంటల వరకు ఆక్సిజన్‌ నిల్వలు సరిపోతాయి. ఆ తరువాత రాకపోతే పరిస్థితి ఏమిటి అని తర్జనభర్జనలు పడడం మొదలు పెట్టారు. కానీ ఫలితం కనపడలేదు. దీంతో అక్కడ ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.   

బీజేపీ మంత్రి పై దాడి.. 

వివాదాల మధ్య విమర్శల మధ్య, ఘర్షణల మధ్య దేశంలో  5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలు అన్ని రాష్ట్రలో ఒక ఎత్తు  అయితే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమత బెనర్జీ ఒక వైపు, బెంగాల్ బీజేపీ నాయకత్వం, కేంద్ర బీజేపీ పెద్ద తలకాయలు ఒక వైపు. బెంగాల్ మాది అంటే మాదని గొప్పలు చెప్పుకున్నారు. చివరికి బెంగాల్ ప్రజలు మమతేకే పట్టం కట్టారు.  ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయినా బెంగాల్ నిత్యం ఏదో ఒక చోట హింసకాండ కొనసాగుతుంది. ఎన్నికల సమయం లో సహజంగానే ఏ రాష్ట్రము లో నైనా ఇరుపక్షాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కానీ బెంగాల్ లో మాత్రం ఎన్నికలు ముగిశాక కూడా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుంది అక్కడి స్థానికులను.   దాడులు అంటే ఏ కార్యకర్త్య పైనో, గల్లీ లీడర్ పైనో కాదు, ఏకంగా ఢిల్లీ నాయకులపైనే జరుగుతుండడడం గమనార్హం. తాజాగా బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. కొందరు వ్యక్తలు కర్రలు, రాళ్లతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ లోని పంచక్కుడిలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో కేంద్రమంత్రి మురళీధరన్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయని మురళీధరన్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన వాహనంపై దాడికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. కాగా, బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుసగా హింస చోటుచేసుకోవడం పట్ల బెంగాల్ గవర్నర్ నుంచి కేంద్రం నివేదిక కోరింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.

కొవిడ్ ను వదిలేసి పాస్టర్లపై ఫోకస్! జగన్ సర్కార్ పై జనాల ఫైర్ 

ఏపీలో రోజుకు 20వేల‌కు పైగా కేసులు. ఐదు రోజుల్లోనే ల‌క్ష దాటిన పాజిటివ్ కేసులు. హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ క‌రువు. ఆక్సిజ‌న్ కొర‌త‌తో పిట్టల్లా రాలుతున్న జనాలు.. హాస్పిటల్స్ లో శవాల గుట్టలు. శ‌వ‌ద‌హ‌నాల‌కూ ఇబ్బందులు. మందులు లేవు. టెస్టింగ్ కిట్స్ లేవు. ఇక వ్యాక్సిన్ ఊసే లేదు. మొత్తంగా చూస్తే హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు. అయినా క‌ర్ఫ్యూ పెట్టేసి చేతులు దులిపేసుకుంది స‌ర్కారు. ఇంత‌లా క‌రోనా క‌ల్లోలం రేపుతుంటే.. సీఎం జ‌గ‌న్ మాత్రం నీరో చ‌క్ర‌వ‌ర్తిలా తాడేప‌ల్లి ప్యాలెస్‌లో పిడేలు వాయించుకుంటున్నారనే విమ‌ర్శ‌లు. ప్రభుత్వ ఉదాసీన‌త‌పై రాజ‌కీయ ర‌చ్చ చెల‌రేగుతున్నా.. న‌వ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న‌ట్టు ఉంది పాల‌కులు వ్య‌వ‌హార శైలి. తాజాగా జ‌రిగిన ఏపీ కేబినెట్ స‌మావేశంలో అత్యంత ప్రాధాన్య‌మైన క‌రోనా అంశానికి.. అతి త‌క్కువ ప్ర‌యారిటీ ఇచ్చింది మంత్రి మండ‌లి.  దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనాపైనే ఫోకస్ చేస్తే.. జగన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ ఎజెండాలో మాత్రం 33వ అంశంగా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను చేర్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 10 రోజులుగా క‌రోనా కాకుండా వేరే ముఖ్య‌మైన టాపిక్ ఏదైనా ఉందా?  కొవిడ్ ఇంత‌లా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తుంటే.. మంత్రి మండ‌లిలో చ‌ర్చించ‌డానికి క‌రోనా కంటే ముఖ్య‌మైన అంశాలుగా మ‌రో 32 టాపిక్స్‌ను ఎజెండాలో ముందు ఉంచ‌డం ఏంటి? ఇంత‌కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ప్ర‌భుత్వానికి ప్ర‌జాల ప్రాణాల‌న్నా.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌న్నా ఎందుకింత నిర్ల‌క్ష్యం? ఎందుకింత ఉదాసీన‌త‌? ఎందుకింత చేత‌గానిత‌నం? అంటూ ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తోంది.  కేబినెట్ భేటీలో ప్రధాన అంశం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ల‌సిందే. ఫాస్టర్లు, అర్చ‌కుల‌ప, ఇమామ్‌, మౌజ‌మ్‌ల‌కు జీతాలు పెంచ‌డం. ఈ టాపికే అజెండాలో ప్రియారిటీ ఐట‌మ్‌.  ఫాస్టర్లకు  రూ. 5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపునకు బినెట్‌ ఆమోదం తెలిపింది. ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం. బీ కేటగిరి ఆలయాల్లోరూ.10వేల గౌరవ వేతనానికి, ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు ఏపీ కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనాతో ఇంత‌లా అల్లాడిపోతుంటే ప్ర‌భుత్వం.. జీతాలు పెంచే టాపిక్‌ను టాప్ ప్ర‌యారిటీగా తీసుకోవ‌డంపై దుమారం చెల‌రేగుతోంది. అస‌లే ఖ‌జానాలో కాసులు లేవు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దివాళా తీసింది. గొప్ప‌ల‌కు పోయి చేప‌ట్టిన‌ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు కోసం అప్పులు చేయ‌డం, ప్ర‌భుత్వ భూముల‌ను అడ్డంగా అమ్ముకోవ‌డం చేస్తూ.. పాల‌న‌ను ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఇంతగా ఆర్థిక లోటు వేధిస్తున్న ఈ స‌మ‌యంలో ఇలా జీతాలు పెంచే అంశానికి కేబినెట్‌లో తొలి ప్రాధాన్యం ఇవ్వ‌డం చోద్యం కాక మ‌రొక‌టి కాదు. ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌, స‌రైన నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఏపీలో క‌రోనా విజృంభిస్తోంద‌నేది అంద‌రి మాట‌. ఆసుప‌త్రిల్లో బెడ్స్ సంఖ్య పెంచ‌డం, ఆక్సిజ‌న్ కొర‌త రాకుండా చూడ‌టం.. మందులు అందుబాటులోకి ఉంచ‌డంపై కేబినెట్ ఫోక‌స్ అంతా పెట్టాల్సింది పోయి.. మొద‌ట మ‌రో 32 అంశాలు చ‌ర్చించి.. ఆ త‌ర్వాత తీరిగ్గా క‌రోనాపై దృష్టి పెట్టేలా కేబినెట్ ఎజెండా ఉండ‌టం క్ష‌మించ‌రాని నేరం అంటున్నారు. అందుకే, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తాజా మంత్రిమండ‌లి స‌మావేశంపై ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు. అటు, వ్యాక్సిన్ స‌న్న‌ద్ధ‌త‌పైనా ప్ర‌భుత్వాన్ని ఏకిపారేశారు చంద్ర‌బాబు. కరోనా విలయంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటే కేబినెట్‌ భేటీలో 33వ అంశంగా కరోనా అంశాన్ని చర్చకు తీసుకొన్నారని, అన్నీ అయిపోయిన తర్వాత చివర్లో దీన్ని పెట్టారని చంద్ర‌బాబు ఆక్షేపించారు. ‘ప్రభుత్వానికి ఇతర పనులు ఉండవచ్చు. కానీ ప్రజల ప్రాణాలు కాపాడటం అన్నిటికంటే అత్యవసరం. ప్రభుత్వం పెట్టిన డ్యాష్‌ బోర్డులో పడకలు, వెంటిలేటర్లు ఎన్ని ఖాళీలున్నాయో కచ్చితమైన సమాచారం ఉండటం లేదంటూ మండిప‌డ్డారు.  ప్ర‌తిప‌క్ష‌మ‌నే కాదు.. స్వ‌ప‌క్షం నుంచీ ఇదే స్థాయి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్వ‌యంగా అధికార పార్టీ నేత‌లే సీఎం జ‌గ‌న్ తీరును త‌ప్పుబ‌డుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్‌రెడ్డి చేతులెత్తేశారంటూ స్వయంగా వైసీపీ నేతలే మాట్లాడుకుంటుండం సంచలనంగా మారింది. ఈ నెల 3న రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ నివాసంలో ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కరోనా సంక్షోభం గురించి మాట్లాడుకున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి 30 వేలు, దహన సంస్కారాలకు 12 వేలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని అభిప్రాయపడ్డారు. సీఎం ప్రవర్తనతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ నేతలు మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇలా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో విఫ‌లం అయ్యారంటూ అన్ని వ‌ర్గాల నుంచి సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయినా మ‌న ముఖ్య‌మంత్రి తాడేప‌ల్లి ప్యాలెస్ వీడి క‌ద‌లిరావ‌డం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించి అంచ‌నా వేయ‌డం లేదు. ప్ర‌జాక్షేత్రంలోకి వస్తేనే క‌దా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలిసేవి? క‌రోనా క‌ల్లోలం సీఎం జ‌గ‌న్‌ కంటికి క‌నిపించేది. ముఖ్య‌మంత్రికి రాజ‌కీయ‌ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌పై ఉన్నంత‌ ఇంట్రెస్ట్‌.. కొవిడ్ క‌ట్ట‌డి, నివార‌ణ చ‌ర్య‌ల‌పై చూప‌డం లేదు. ప్ర‌జ‌ల ప్రాణాలంటే లెక్క‌లేదు. ఇదేం ముఖ్య‌మంత్రో ఏమో.. అని ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు.

బెంగాల్లో రాష్ట్రపతి పాలన?

తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడవసారి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా అద్భుత విజయాన్ని సాధించి, హట్రిక్ కొట్టిన ఆమె బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ ఆమెతో  ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెను అభినందిచారు. మమత బెనర్జీ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు, ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం, గవర్నర్’తో కలిసి విలేకరుల సమావేసంలో మాట్లాడిన మమతా దీదీ, క్లుప్తంగా, తమ ప్రాధాన్యాలను వివరించారు. కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొని, పరిస్థితిని అదుపులోకి తేవడమే తన ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె సంకేతమాత్రంగానే అయినా,కేంద్రంతో సయోధ్యతను కోరుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్ పై కలిసి పోరాటం సాగిద్దామని అన్నారు. అలాగే.. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చెలరేగుతున్న రాజకీయ హింసపై ఉక్కుపాదం మోపుతానని, హింసకు పాల్పడుతున్నవారిని వదిలిపెట్టబోనని పేర్కొన్నారు. “ఈ రోజు నుంచి శాంతిభద్రతల బాధ్యత నేనే తీసుకుంటా. దీనిపై కఠినంగా వ్యవహరిస్తా” ఇది నా రెండో ప్రాధాన్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడానికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు.  మరోవంక గవర్నర్ ధన్‌కర్‌, ముఖ్యమంత్రి తమకు సోదరి సమానురాలు అంటూ, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసను అరికట్టి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలూ దీదీ  తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఇలా తెరమీద కనిపించిన ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది చిత్రం ఎలాఉన్నా, ఎన్నికల సందర్భంగా ఎగిసిపడిన రాజకీయ విద్వేష, వైషమ్యాలు ఇంకా పుర్తిగా పోలేదు. ఇప్పట్లో సమసి  పోయాయని, పోతాయని ఆశించే పరిస్థితులు కూడా  రాష్ట్రంలో కనిపించడం లేదు. అటు ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైన కమలనాధులు కుతకుతా ఉడికి పోతున్నారు. మరో వంక, బ్రహ్మాండ విజయం ఇచ్చిన ఉత్సాహంలో, ఒక రకమైన విజయగర్వంలో  మునిగి తేలుతున్నతృణమూల్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్ధులను మట్టు పెట్టేందుకు ఇదే మంచి అనువుగా బావించి దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులలో ఇంతవరకు 14 మంది పైగా తమ కార్యకర్తలు హత్యకు గురయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది.  మరో వంక ఇరుపక్షాలు కూడా రాజకీయ వైరాన్ని మరో రూపంలో కొనసాగించే వ్యూహాలను రచిస్తున్నారు. మమత ప్రమాణస్వీకారానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్’కు ఫోన్ చేసి రాష్ట్రంలో జరుగతున్న హింస పట్ల ఆవేదన వ్యక్త పరిచారు. మరోవంక, మమత ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా ఆ పార్టీ నాయకులు, ‘రాజకీయ హింస అనే విషచక్రం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుతామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని’ కోలకతాలో ప్రమాణం చేశారు. అదే క్రమమలో నడ్డా ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్న హింసను దేశ విభజన సందర్భంగా హిందువులపై జరిగిన హింసాకాండతో పోల్చడం ద్వారా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తృణమూల్ ఆరోపిస్తోంది.  అదే విధంగా కేంద్ర హోమ్ శాఖ  రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కోరింది. అంతేకాదు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో, నివేదిక పంపకపోతే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హోమ్ శాఖ పేర్కొంది. మరోవంక రాష్ట్రంలో సాగుతున్న హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్‌ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘బెంగాల్‌ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వారిని టీఎంసీ గూండాలు హత్య చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దుకాణాలను లూటీ చేస్తున్నారు’ అని గౌరవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ఎన్నికల అనంతర హింస ఆసరాగా కమల దళం మమతా బెనర్జీ ప్రభుత్వంపై మరో యుద్దానికి సిద్దమవుతోందనిపిస్తోంది. ఇటు రాజకీయం, న్యాయ పరంగానే కాకుండా కేంద్ర ప్రభుత్వం తనకున్న విశేష అధికారాలను వినియోగించుకుని, మమతా బెనర్జీ ప్రభుత్వానికి ముందరి కాళ్ళకు బంధాలు వేయాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఇటు పార్టీ ఫిరాయించి గెలిచిన ఎమ్మెల్ల్యేలు మళ్ళీ మాతృ సంస్థ వైపు చూడకుండా చూడడంతో పాటుగా రాష్ట్రంలో వచ్చిన ఊపును మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో, అదే విధంగా తమ కార్యకర్తలను కాపాడుకునే వ్యూహంతో బీజేపీ ఎన్నికల అనంతర హింసను అస్త్రంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, తృణమూల్ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దుస్సాహసం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయక పోవచ్చును. కానీ, ఆర్టికల్ 356 రాష్ట్ర ప్రభుత్వ మెడ మీద కత్తిలా ఉంచి మమత దూకుడుకు కళ్ళే వేసే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అయితే, ‘పోరాటమే’  ప్రధాన ఆయుధంగా  రాజకీయాలలో ఎదిగొచ్చిన మమత బెనర్జీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదురుతారని, అనుకుంటే, బీజేపీకి మరో మారు శృంగభంగం తప్పదని తృణమూల్ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే ఏది ఎలా ఉన్నా, బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సంకేతాలు ప్రస్తుతానికి అయితే లేవనే చెప్పవచ్చును.

నారి నారి నడుమ మురారి.. 

పెళ్లి చూడడానికి, పలకడానికి రెండు పదాలే కానీ, చాలా పవిత్రమైనది. దానికి మన దేశంలో పురాతనం నుండి ఒక ప్రత్యకమైన స్థానం ఉంది. రాను రాను పవిత్రమైన పెళ్లిని అపవిత్రం చేస్తున్నారు. కొంత మంది అయితే సోలోబతుకే సోబెటర్ అనుకుంటారు. మరికొంత మంది అయితే వద్దురా సోదర పెళ్లంటే నూరేళ్ళ మంటారా.. అంటూ పెళ్లి మీద పాటలు వచ్చాయి. సినిమాలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ప్రతి మనిషి లైఫ్ లో బాల్యం, యవ్వనం, ఒక భాగం అయితే పెళ్లి అనేది మరో భాగం, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషి జీవితం పెళ్ళికి ముందు పెళ్లి తరువాత అని చెప్పుకోవాలి. ఏ ఆడపిల్లకు పెళ్లంటే ఎన్నో భయాలు ఉంటాయి. తల్లిదండ్రులను, బంధువులను, సొంత ఇల్లును వదిలి ఎవరో తెలియని వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండడానికి వెళ్తుంది. అలా వచ్చిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ మోజులో పడి, భార్యను మరిస్తే.. సొంత తల్లిదండ్రులుగా చూడాల్సిన అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తుంటే… ఆ బాధలు తట్టుకోవడం కన్నా చావే పరిష్కారమనుకున్న ఓ యువతి.. తన తనువు చాలించింది. కూతురికి పెళ్లి చేసి పంపించామని సంతోషంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది.  తంజావూరు సమీపంలో ఉన్న తిరుకాట్టుపల్లి వేలంగుడికి చెందిన కల్యాణసుందరం చిన్న కుమార్తె భువనేశ్వరి (25)ను ఆర్కాడ్‌కు చెందిన కలియమూర్తి కుమారుడు రంగరాజ్‌ (30)తో ఏడాది క్రితం వివాహం అయింది. ఎన్నో ఆశలతో భువనేశ్వరి అత్తవారింట అడుగుపెట్టింది. కానీ ఆమె ఆశలు అడియాశలేనని  ఆమెకు కొద్దీ రోజులోనే అర్ధమయ్యింది. పెళ్లై  సంవత్సరం అవుతున్నా భర్త తనతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. చుట్టుపక్కల వాళ్లు భర్తకు, వేరే యువతితో సంబంధం ఉందని చెప్తుండడంతో షాకయ్యింది. దీంతోపాటు అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేసేవారు. ఈ బాధలను ఆ యువతి  తట్టుకోలేకపోయింది. ఈ నరకయాతన కన్నా చావే పరిష్కారమనుకొని మంగళవారం ఇంట్లో భువనేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతి పట్ల అనుమానం ఉన్నట్లు కల్యాణసుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.   

కలియుగం కరోనా.. ఇన్ని కేసులా..! 

దేశం లో రోజు రోజు కరోనా దాటికి హద్దులు లేకుండా పోతుంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. కేంద్రం మాత్రం కరోనా మరణాలను చూస్తూ ఉండడం తప్పిటిస్తే చేసేదేమి లేదని చేతులు ఏతేసింది. మోడీ పాలనలో ప్రజా ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయింది. కరోనా కారణంగా దేశ వ్యాపితంగా మరణాలకు స్మశానాలు సైతం కన్నీరు పెడుతున్నాయి గని మోడీ హృదయం మాత్రం చలించడం లేదు. మొదటి దాప కరోనా లాక్ డౌన్ పెట్టినప్పుడు వలస కార్మికుల ప్రాణాలు తీశాడు. ఎప్పుడు ఆక్సిజన్ అందక, వ్యాక్సిన్ ఇవ్వక ప్రాణాలు తీస్తున్నారు. ఈ విషయమై సుప్రీమ్ కోర్టు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన మూతి పక్కకు తిప్పడం తప్పితే మోడీ చేసింది ఏం లేదు.   దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. 4లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  ఒక్కరోజులో 3,29,113 మంది కోలుకున్నారు.    తాజా కేసులతో దేశంలో ఇప్పటి  వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,10,77,410కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2,30,168 మంది మరణించగా.. 1,72,80,844 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 16,25,13,339 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.   తెలంగాణలో ఇలా..  గడిచిన 24 గంటల్లో 6026 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 6,551 మంది కోలుకోగా.. మరో 52 మంది మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. వీరిలో 3,96,042 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 2579 మంది మరణించారు. కరోనా సెకండ్ వేవ్‌లో రికవరీ రేటు కాస్త పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 83.24గా ఉంది. మరణాల రేటు 0.54గా ఉంది. ఇక జాతీయ స్థాయిలో రికవరీ రేటు 82శాతం, మరణాల రేటు 1.1గా నమోదయింది. తెలంగాణలో బుధవారం 79,824 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 1,33,47,076 టెస్ట్‌లు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందిలో 3,58,599 మంది పరీక్షలు చేశారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ నుంచే వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో నిన్న 1115, మేడ్చల్‌లో 418, రంగారెడ్డిలో 403, నల్గొండలో 368, సంగారెడ్డిలో 235, సిద్దిపేటలో 231, వరంగల్ అర్బన్‌లో 224, కరీంనగర్‌లో 223, నాగర్‌కర్నూలులో 206, ఖమ్మంలో 205, మహబూబ్‌నగర్‌లో 204 కేసులు నమోదయ్యాయి.    

కరోనాపై జగన్ చేతులెత్తేశారు! వైసీపీ నేతల వీడియో వైరల్ 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హాస్పిటల్స్ లో చికిత్స అందక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ అందక చనిపోతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమి లేదని చెబుతోంది. కరోనా కట్టడిలో జగన్ రెడ్డి సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తీరుపై జనాలు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  విపక్షాలే కాదు వైసీపీలోనే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వైసీపీ నేతలు... కరోనా కట్టడిలో సర్కార్ విఫలమైందని మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోసుతో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా కరోనా గురించి మాట్లాడుకున్న నేతలు.. ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కరోనాతో చనిపోతే డెడ్ బాడీ తరలింపునకు 30 వేల రూపాయలు, దహన సంస్కారాలకు 12 వేలు వసూల్ చేస్తున్నారని వైసీపీ నేతలు మాట్లాడుకున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం ఏమి చేయడం లేదని చెప్పుకున్నారు. కరోనాతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నా... జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ నేతలు గుసగుసలాడుకున్నారు.  కరోనా కట్టడి, జగన్ సర్కార్ తీరుపై రాజమండ్రిలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాము మొదటి నుంచి చెబుతున్న మాటలే వైసీపీ నేతలు అంటున్నారని, ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండో దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చని విపక్ష నేతలు అంటున్నారు. రాజమండ్రి వైసీపీ నేతల వీడియో అధికార పార్టీలో కలవరం రేపుతుందని తెలుస్తోంది. 

వామ్మో.. ఈ నెల 8 న భూమి పైకి  చైనా రాకెట్..  

దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం నుంచి. కరోనా కారణంగా ప్రపంచదేశాలు చైనా దేశం మీద గుర్రుగా ఉన్నాయి. కరోనాకు సంబందించిన వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే. మళ్ళీ ఇప్పుడు ప్రపంచదేశాలు అన్నీ మరోసారి చైనా గురించి ముక్కుమ్మడిగా మాట్లాడుకుంటున్నాయి. ఇంతకీ  చైనా రాకెట్ గురించే చర్చ జరుగుతోంది. ఇంతక ఆ రాకెట్ వల్ల  ఏం జరుగుతుంది. ప్రపంచం పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది. అనే ఆందోళన ప్రపంచదేశాల్లో నెలకొంది.   చైనా ప్రయోగించిన ఓ రాకెట్ అదుపుతప్పింది. నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకొస్తోంది. ఐతే అది జనావాసాల్లో కూలిపోయే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో మిగతా దేశాలు కలవరపడుతున్నాయి. చైనా సొంతంతా అంతరిక్ష కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత వారం లాంగ్ మార్చ్ 5బీ (Long March 5b) అనే పెద్ద రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్‌ను అది విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. అనంతరం నియంత్రణ కోల్పోవడంతో తిరిగి భూమిపై కూలుతుందని అంతరిక్ష నిపుణులు విశ్లేషించారు. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మే 8న రాకెట్ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ రాకెట్ ప్రయాణ మార్గాన్ని ఎప్పటికప్పుడు యూఎస్ స్పేస్ కమాండ్ పరిశీలిస్తోందని అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి మైకో హోవర్డ్ వెల్లడించారు. ఐతే భూవాతావరణంలోకి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది? ఎక్కడ కూటిపోతుంది? అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే కొన్ని గంటల ముందు మాత్రమే స్పష్టత వస్తుందని.. అప్పటి వరకూ ఏమీ చేయలేమని స్పష్టం చేారు. ఐతే రాకెట్ భూమిపై కూలినప్పటికీ పెద్దగా నష్టముండదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భూమిపైకి చేరేలోపే.. భూవాతావరణ ఒత్తిడికి ఆ శకాలన్ని కాలిబూడిదయ్యే అవకాశముందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్ మార్చ్ రాకెట్ బరువు 22 టన్నుల వరకు ఉంటుంది. అంత భారీ రాకెట్ భూమి వైపు వస్తున్నప్పుడు... పెద్ద పెద్ద విడిభాగాలు భూమిపై అలాగే పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ రాకెట్ శకలాలు భూమిని తాకితే చిన్న విమానం కూలినట్లుగా ఉంటుందని వెల్లడించారు. రాకెట్ శకలాలు సముద్రంలోనే పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్‌పర్ట్ జొనాథన్ మెక్‌డోవెల్ పేర్కొన్నారు. జనావాసాలపై కూలే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. గత ఏడాది కూడా చైనాకు చెందిన రాకెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. చైనా తొలిసారి లాంగ్‌మార్చ్‌ 5బిని ప్రయోగించినప్పుడు దాని శకలాలు నేరుగా భూమిపై కూలిపోయాయి. ఐవరీ కోస్ట్‌లోని జనవాసాల్లో పడడంతో పలు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్కైలాబ్ తర్వాత భూమిపై కూలిన అతి పెద్ద రాకెట్ అదేనని అప్పట్లో అంతరిక్ష రంగ నిపుణులు తెలిపారు.1979లో ఆస్ట్రేలియాలోని ఎస్పెరాన్స్ సముద్ర జలాల్లో స్కైలాబ్ కూలిపోయిన విషయం తెలిసిందే. గతంలో చైనా కరోనా ప్రపంచదేశాలనే వాణికించిందని ఇప్పుడు ఈ రాకెట్ ఏంచేస్తుందో అని ప్రపంచదేశాలు వాపోకుండా ఉండలేకుడా పోతున్నాయి. చూద్దాం ఈ నెల 8 న ఏం జరుగుతుందో..       

కరోనాతో అజిత్ సింగ్ మృతి 

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరిగింది. మరణాలు ప్రమాదకరంగా నమోదవుతున్నాయి.  కరోనా కాటుకు మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు ప్రాణాలొదిరారు.  రాష్ట్రీయ‌ లోక్‌దళ్ అధ్యక్షుడు , కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. 82 సంవత్సరాల వయసులో చౌదరి అజిత్ సింగ్ తుది శ్వాస విడిచారు. కరోనా బారిన ప‌డిన ఆయ‌న గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.  చౌదరి అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. అనంత‌రం చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత‌ ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా అతని పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు.అజిత్ సింగ్ మృతి పట్ల వివిధ పార్టీల రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.  మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్  సింగ్.. రాజ్యసభ, లోక్ సభ సభ్యుడిగా పని చేశారు. రైతు నేతగా ఆయన పేరు గడించారు. దేశంలో ఎక్కడా రైతు సమస్యలు ఉన్నా అజిత్ సింగ్ స్పిందించేవారు. అజిత్ సింగ్ 1939లో జ‌న్మించారు. ఆయ‌న ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (చికాగో)లో ఉన్న‌త విద్య అభ్య‌సించారు. అమెరికాలో 15 ఏండ్ల‌పాటు కంప్యూట‌ర్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన ఆయ‌న.. త‌న తండ్రి చ‌ర‌ణ్ సింగ్‌ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత దేశానికి తిరిగి వ‌చ్చారు. 1986లో తొలిసారిగా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాఘ్‌ప‌ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏడు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మాజీ ప్ర‌ధాని వీపీ సింగ్ ప్ర‌భుత్వంలో కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా, పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో ఆహార శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 1996లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ పార్టీ (ఆర్ఎల్డీ)ని స్థాపించారు. అనంత‌రం 2001లో వాజ‌పేయి ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2003 వ‌రకు ఎన్‌డీఏ భాగ‌స్వామిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికారు. 

నాలుగు నెలల పెళ్లి.. ఆ తర్వాత పెళ్ళాం బలి.. 

పెళ్లి ఒక ఆడ, మగ. మూడు ముళ్ళు. ఏడు అడుగులు. పంచభూతాలు. వేదమంత్రాలు పెద్దల ఆశీర్వాదాలు. పచ్చని పందిరి. ఒక పెళ్లి జరగాలంటే ఇంత తతంగం ఉంటుంది. ఏ అమ్మాయి అయినా తన భర్త బాగుండాలి, తనని బాగాచూసుకోవాలి అని కలలు కంటుంది. అలాంటి భర్త దొరికితే ఏ అమ్మాయి కైనా అంతకంటే ఎక్కువ ఏం కావాలనుకోదు. కానీ ఒక  వేల సీన్ రివర్స్ అయిందనుకో ఇక ఆ అమ్మాయి జీవితం నరకం కంటే దారుణంగా ఉంటుంది.. జీవితం అంత కష్టాల కొలిమిలో కాలిపోవాల్సిందే..  తన ఆశలు పెళ్లి ఆహుతులో కలిసిపోవాల్సిందే. పెళ్ళికి ముందు బాగుండి.  మూడు ముళ్ళు, ఏడు అడుగులు నడిచిన కొద్దిరోజులకే కొత్త మంది  భర్తల  నిజస్వరూపం బయట పడుతుంది. తన భర్త రాముడు కాదు, రావణాసురుడు అని తెలుస్తుంది. ఇక పెళ్లి కూతురు పని స్వాహా..ఆ అమ్మాయి కలలు గాల్లో కలిసిపోతాయి. కలిసి జీవితాంతం బతుకుదాం అనుకున్న ఆమె మనసులో ఆవేదన అంత అంత కాదు. ఇంతకి ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా.. మీరు చదవపోయేదానికి సంబంధం ఉంది మేరే చూడండి..   అది విజయవాడ. పాయకాపురం. అతని పేరు దుర్గారావు. ఆమె పేరు నీరాజ. వారిద్దరికీ నాలుగు నెలల కింద పెళ్లి అయింది. పసుపుతాడు ఎండలేదు. పెళ్లి పందిరి తియ్యలేదు. రెండు మూడు నెలలు సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా జపాన్ నాగసాకి  మీద బాంబు పడ్డట్లు.. ఆ ఇంట్లో గొడవలు. ఆ గొడవలు ఆమె నిండు నూరేళ్ళకు శుభం కార్డు పడింది. ఇంతకి ఆ గొడవలు ఏంటనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం..  దుర్గా రావు తన భార్యని మూడు వేలు అడిగాడు. ఆమె కరోనా టైం కదా..? చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే , మళ్ళీ తమ ఇంటి అవసరానికి డబ్బులు దొరకవు అనుకుందో ఏమో.. భర్త అడిగిన డబ్బులు ఇవ్వలేదు. తను ఆర్ధిక భవిష్యత్తు గురించి ఆలోచింది కానీ .. ఆ డబ్బులు ఇవ్వకపోతే భర్త చేతిలో మరణాన్ని గుర్తించలేదు.  మూడు వేయిల గొడవ ముదిరి ముదిరి చివరికి ఆ భర్త తన భర్య ప్రాణాలు తీశాడు. ఆ నీచుడు. ఒక్కసరిగా కత్తి తీసుకుని దాడి చేసి హత్య చేశాడు. అంతే ఒక నిండు ప్రాణం వెళ్లిపోయింది. ఆమె కలలు, ఆశలు, కష్టాలు, సుఖాలు కత్తి కి బలైపోయాయి. చివరికి ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పెండ్లి చేసినా నాలుగు నెలలకే కూతురు శవంగా మారడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.      

ఏపీ కరోనా బలహీనమైందే! భయం వదన్న కేంద్రం 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉండటంతో వేగంగా విస్తరిస్తోంది. రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా భారీగా ఉంటున్నారు. అధికారికంగా సర్కార్ చెబుతున్న లెక్కలకంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కరోనా రోగుల మరణాలు ఉంటున్నాయని చెబుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏపీలో గుర్తించిన  వైరస్ అత్యంత బలమైనదనే భయాందోళన వ్యక్తమవుతోంది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనే ప్రచారంతో ఏపీ జనాలు హడలిపోతున్నారు.  అయితే ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పింది కేంద్ర బయోటెక్నాలజీ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా రకంపై  స్పష్టతనిచ్చింది. ఏపీలో వెలుగు చూసిన రకం అంత బలమైనదేమీ కాదని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు. వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్.440కె రకం బయటపడిందని, అయితే అంతే వేగంగా అది మాయమైందని అన్నారు. దాని విస్తరణ కనిపించలేదని స్పష్టం చేశారు. దాని క్లినికల్ ప్రభావం కూడా ఏమీ కనిపించలేదన్నారు.  ప్రస్తుతం దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా కొత్త వైరస్ రకాలేమీ లేవని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ పేర్కొన్నారు. ఇది వ్యాప్తి పరంగా, తీవ్రత పరంగా ప్రభావం చూపుతోందన్నారు. బి.618 రకాన్ని కనుగొన్నప్పటికీ అది త్వరగానే అంతర్థానమైందని రేణు స్వరూప్ తెలిపారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు.. దేశంలో కల్లోలమేనా! 

దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారిపై మరో షాకింగ్ న్యూస్. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ పంజా విసురుతుండగా... కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి థర్డ్‌ వేవ్‌ తప్పదనిదంటూ బాంబు పేల్చారు. థర్డ్ వేవ్‌ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదన్నారు విజయరాఘవన్. అంతేకాదు థర్డ్‌ వేవ్‌ నాటికి వైరస్‌ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు  కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని విజయరాఘవన్‌ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని తెలిపారు. దేశంలో మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా విజృంభణ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది.ఒక్క రోజుకు చనిపోతున్న సంఖ్య రోజు  రికార్డు స్థాయిలో 3,780కి పెరిగింది. ప్రపంచ కేసులలో 46 శాతం భారత్ వాటా ఉందని, గత వారంలో ప్రపంచ మరణాలలో నాలుగింట ఒక వంతుగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వీక్లీ నివేదికలో వెల్లడించింది.  మరోవైపు దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై  హెచ్చరికలపై బీజేపీ ఎంపీ  సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి కేంద్ర మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం సూచించారు స్వామి. తాజాగా ఇదే విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తూ  ‘‘కోవిడ్ థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్నారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని నేను రెండు రోజుల క్రితమే హెచ్చరించాను. ఈరోజు నీతి అయోగ్ సభ్యుడు కూడా కోవిడ్ థర్డ్ వేవ్‌ను నిర్ధారించారు. కోవిడ్‌ను అరికట్టడానికి సరైన వ్యూహరచన వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పీఎంవో సైకోలు కాకుండా ప్రత్యేకమైన టీం కావాలి’’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.   

ప్రాణాలు పోతున్నా పట్టదా! ఏపీ ప్రభుత్వంపై బాబు ఫైర్ 

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. అతి తీవ్రమైన కరోనా సమస్యకు మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యత కల్పించలేదని చంద్రబాబు విమర్శించారు. కేబినెట్ మీటింగ్ లో 33వ అజెండాగా కరోనాను చేర్చారని మండిపడ్డారు. రూ.వేలకోట్లు దుబారాకు ఖర్చు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువేంటని ప్రశ్నించారు.  కొవిడ్‌ రెండో దశ చాలా ఉద్ధృతంగా ఉందని.. ఏపీ నుంచి వెళ్లేవారికి పొరుగు రాష్ట్రాలు నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నాయన్నారు చంద్రబాబు. తమ ప్రజలకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు ఏపీ పట్ల ఆంక్షలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కొత్త స్ట్రెయిన్‌ ఎన్‌440కె కర్నూలులో ప్రారంభమై దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతుంటే.. దీనిపై అప్రమత్తంగా లేకుండా ఎన్‌440కె అసలు లేదని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పడకల కొరత లేదంటూ అసత్యాలు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాదని, ఏకంగా ముఖ్యమంత్రే సమీక్ష చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు.  పార్టీ పరంగా కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్నామని.. ఆన్‌లైన్‌ ద్వారా వైద్య సూచనలు అందజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం ఇచ్చిన ఫలితాలకు అనుగుణంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.తమ ఆఫీసులో కొందరికి కరోనా వచ్చిందని, అయితే అమెరికా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించామని చెప్పారు.ప్రభుత్వానికి ఎన్నో వనరులున్నాయని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని చంద్రబాబు అన్నారు.  

మోదీకి మూడిన‌ట్టేనా? కాషాయం క‌నుమ‌రుగేనా?

బెంగాల్‌లో బేజార్‌. కేర‌ళ‌లో ఖ‌తం. త‌మిళ‌నాడులో తుస్. ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన మూడు పెద్ద రాష్ట్రాల్లో బీజేపీని బండ‌కేసి కొట్టారు ఓట‌ర్లు. ఉప ఎన్నిక‌లు జ‌రిగిన ఏపీ, తెలంగాణ‌లోనూ క‌మ‌లం పార్టీ ఖ‌ల్లాస్‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే కాదు.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని స్థానిక సంగ్రామంలోనూ బీజేపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది.  యూపీలో బీజేపీ అధికార పార్టీ. ఆ యూపీ ద‌య వ‌ల్లే మోదీ రెండుసార్లు ప్ర‌ధాని కాగ‌లిగారు. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు ఓడిపోవ‌డం క‌మ‌ల‌నాథుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ప్ర‌ధాన మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో.. 40 జిల్లా పంచాయ‌తీ స్థానాలుంటే అందుకే కేవ‌లం 8 సీట్ల‌కే బీజేపీ మ‌ద్ద‌తుదారులు ప‌రిమిత‌మ‌వ‌డం ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం. ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలోనూ సేమ్ సీన్‌. 40 సీట్ల‌లో బీజేపీ కేవ‌లం 6 చోట్ల మాత్ర‌మే గెలువ గ‌లిగింది. అంటే, హిందుత్వ నినాదం నుంచి ప్ర‌జ‌లు దూరం జ‌రుగుతున్న‌ట్టేనా? రాజకీయంగా కీల‌క‌మైన వారణాసి, అయోధ్యలో బీజేపీ ఓడిపోవ‌డం దేనికి సంకేతం?  ప్ర‌ధాని మోదీ ప్రాభ‌వం అధఃపాతాళానికి ప‌డిపోతోందా?  దేశ వ్యాప్తంగా క‌మ‌ల వికాసం మ‌స‌క‌బారుతోందా?  అటు.. కర్ణాటకలోనూ అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఒకే ఒక్క స్థానానికి ప‌రిమిత‌మై ప‌రువు పోగొట్టుకుంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే బళ్లారి కార్పొరేషన్ సైతం కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. బళ్లారిలో గాలి సోదరులకు గ‌ట్టి షాక్ తగిలింది.  ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌లోనే ఎంతోకొంత బ‌ల‌మున్న బీజేపీ ఇప్పుడు అక్క‌డ కూడా చ‌తికిల ప‌డుతోంది. మోదీ ఇమేజ్ డ్యామేజ్ అవ‌డ‌మే ఇందుకు కార‌ణం అంటున్నారు. ద‌క్షిణాదిన ఇప్ప‌ట్లో పువ్వు గుర్తు అధికారంలోకి రాలేద‌ని.. తాజా ఎన్నిక‌ల‌తో తేలిపోయింది. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫ‌లితాల‌తో.. ఇక సౌత్‌పై కాషాయం ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే.  అటు, ఉత్త‌రాదిలోనూ బీజేపీ ప‌రిస్థితి ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. గెలుస్తామ‌నుకున్న బెంగాల్‌లో.. బెంబేలెత్తిపోయింది బీజేపీ. మోదీ, అమిత్‌షా, జేపీ న‌డ్డాలు.. ముగ్గురూ క‌లిసి దాదాపు 100 వ‌ర‌కూ ఎన్నిక‌ల ర్యాలీలు నిర్వ‌హించగా.. జ‌స్ట్‌, వీల్ ఛైయిర్‌లో కూర్చొని, త‌న‌పై దండెత్తి వ‌చ్చిన క‌మ‌ల‌దండును దంచికొట్టింది దీదీ. బెంగాల్ టైగ‌ర్ పంజా దెబ్బ‌కు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. మ‌మ‌త బ‌ల‌మెంతో క‌మ‌ల‌నాథుల‌కు తెలిసొచ్చేలా చేసింది.   యూపీలోనూ కాషాయం వెల‌వెల‌పోతోంది. హిందుత్వ నినాదం పాత చింత‌కాయ ప‌చ్చ‌డిగా మారింది. మోదీ మాట‌ల‌ను, యోగి చేష్ట‌ల‌ను.. ఎల్ల‌ప్పుడూ న‌మ్మే ప‌రిస్థితి లేదు. యూపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో ప‌రాభ‌వ బారంతో కుమిలిపోతున్నారు కాషాయ శ్రేణులు. ఇక‌, ఢిల్లీలో కేజ్రీవాల్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. పంజాబ్‌లో కెప్టెన్ సాబ్ క‌ర్చీఫ్ వేసుకున్నారు. రాజ‌స్థాన్, గుజ‌రాత్‌లో 50-50. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన పాగా. ఇలా లెక్కేస్తూ పోతే.. చిన్నా చిత‌కా రాష్ట్రాలే క‌మ‌లం ఖాతాలో క‌నిపిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాల‌న్నీ ప్రాంతీయ పార్టీలో జాబితాలో చేరిపోయాయి. మరో ఏడెనిమిది నెలల్లో జరగాల్సిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నిక‌లు.. వచ్చే ఏడాది ఆఖర్లో జరగాల్సిన హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మోదీ, అమిత్ షా నాయకత్వానికి మరింత అగ్నిపరీక్షగా మారతాయనడంలో సందేహం లేదు.  మాట‌లు త‌ప్ప మోదీ చేసేదేమీ లేద‌నే అభిప్రాయానికి ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన‌ విభ‌జ‌న హామీలేవీ నెర‌వేర్చ‌న‌ప్పుడే మోదీ మాట మీద నిల‌బ‌డే మనిషి కాద‌ని తేలిపోయింది. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేస్తున్నా మౌనంగా ఉంటుండ‌టం ఆయ‌న హోదాకే మ‌చ్చ తెస్తోంది. ఇక‌, ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో మోదీ అవ‌లంభిస్తున్న‌ ఉదాసీన వైఖ‌రి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. దేశ ప్ర‌జల ప్రాణాలు బ‌లిపెట్టి.. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం.. విదేశాల‌కు వ్యాక్సిన్ ఎగుమ‌తి చేశార‌నే అప‌వాదు ఆయ‌న్ను వెంటాడుతూనే ఉంది. వీడియో ప్ర‌సంగాలు మిన‌హా.. కొవిడ్ క‌ట్ట‌డికి ప్ర‌ధాని చేసిందేమీ లేద‌నే అభిప్రాయం దేశ ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుపోయింది. అందుకే, ఎక్క‌డ‌, ఎలాంటి ఎన్నిక‌లు జ‌రిగినా.. వాటిలో బీజేపీకి ప‌రాభ‌వ‌మే ఎదుర‌వుతోంది. యావ‌త్ దేశాన్ని కాషాయమ‌యం చేయాల‌నే క‌మ‌ల‌నాథుల క‌ల‌.. క‌ల్లే కానుంది. యావ‌త్ దేశం నుంచి కాషాయ పార్టీ తుడుచుకుపెట్టుకు పోయే ప‌రిస్థితి వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు మోదీ.. ఒట్టి మాట‌లు క‌ట్టిపెట్టి.. గ‌ట్టి మేలు త‌ల‌పెట్ట‌వోయ్‌...