అప్పుడు కాంగ్రెస్ హీరో.. ఇప్పుడు కమల దళం సారధి..
అస్సాం 15 వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన, హేమంత్ విశ్వ శర్మ, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఈశాన్య రాష్టాలపై మంచి పట్టున్న నాయకుడు. అయితే, అదే శర్మ ఇప్పుడు, ఒక్క అస్సాంలోనే కాదు ఈశాన్య రాష్ట్రాలు అన్నింటా, కమల దళానికి అండా,దండా అన్నీ తానై పార్టీని విజయ పథంలో ముందుకు తీసుకు పోతున్నారు. ఒకప్పుడు, ఈశాన్య రాష్ట్రలలో బీజేపీ ఎప్పటికీ, అధికారంలోకి రాదు, రాలేదు అని ఘంటాపథంగా చెప్పిన రాజకీయ పండితుల అంచనాలను శర్మ ఐదేళ్ళు తిరక్కుండానే తల్లకిందులు చేశారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అస్సాంనే కాదు కమ్యూనిస్ట్ పార్టీల పెట్టని కోట త్రిపురలోనూ,బీజేపీ అధికారం హస్తగాం చేసుకుందంటే, అందుకు ఇంకా అనేక కారణాలు ఉన్నా, మూల కారణమా మాత్రం హేమంత్ విశ్వ శర్మ.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చియన్ సమయంలో అయన చేసిన ప్రతిజ్ఞ. ఒక్క అస్సాంలోనే కాదు, సెవెన్ సిస్టర్ స్టేట్స్’గా పిలుచుకునే ఏడు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ ఓక్ బలమైన శక్తిగా ఎదుగిందంటే, అందుకు శర్మ శపధమే ప్రధాన కారణం.
కట్ చేస్తే, ఇంతకీ శర్మ శపధం ఏమిటంటే, ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని నమ రూపాలు లేకుండా చేయడమే అయన చేసిన ప్రతిజ్ఞ. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, అదేపార్టీని భూస్థాపితం చేయాలన్న స్థాయిలో వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమిటి? అదొక కథలా సాగే నిజం. హేమంత్ విశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నరోజుల్లో,ఓరోజు,రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చర్చించేందుక శర్మ, అప్పటి అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తరుణ్ గోగోయి, అస్సాం పీసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పెంపుడు కుక్కతో అడుకుంటున్న రాహుల్ గాంధీ, నేతలను ఒక విధంగా నిర్లక్ష్యం చేశారు. పట్టించుకోలేదు. అవమాన పరిచారు. కుక్కకు ఇచ్చిన విలువను నాయకులకు ఇవ్వలేదు.ఇక అప్పుడే,శర్మ ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం వృధా ఆనం నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పుడే,అ దే రోజున రామ్ మాధవ్ ని కలిసి బీజేపే చేరారు.
ఇక అక్కడి నుంచి బీజేపీ నేతగా, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్’గా అవిశ్రాంతంగా శ్రమించారు. 2016 ఎన్నికల్లో అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపే గెలుపుకు మూలాధారం అయ్యారు. అయిన పార్టీ సర్బానంద్ సోనోవాల్’ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినా, మంత్రిగా సర్దుకు పోయారు. పార్టీ బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు, వరసగా రెండవసారి పార్టీ అధికారంలోకి రావడలోనూ కీలక పాత్రను పోషించిన హిమంత విశ్వ శర్మ.అస్సాం 15వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ జగదీష్ ముఖి ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మణిపూర్ ముఖఅయమంత్రి ఎన్.బీరేన్ సింగ్, నాగాల్యాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.