ఎలిజ‌బెత్ రాణి 2 అంత్య‌క్రియ‌లు ... ప‌లు దేశాధినేత‌లు హాజ‌రు

బ్రిట‌న్ రాణి క్వీన్ ఎలిజ‌బెత్ 2 సెప్టెంబ‌ర్ 8న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా  విదేశాల నుంచి ఆమె పార్ధివ‌దేహాన్ని సంద‌ర్శించ‌డానికి వ‌చ్చిన ప‌లు దేశాల అధ్య‌క్షులు, ప్ర‌ధానుల‌కు లండ‌న్‌లోని బ‌కింగ్‌హామ్ ప్యాలె స్‌లో కింగ్ చార్లెస్ 3 ప్ర‌త్యేకంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా భార‌త్ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కూడా భార‌త్ త‌ర‌ఫున హాజ‌ర‌యి నివాళులు అర్పించారు.  ప్యాలెస్ స‌మీపంలోని లాన్సెస్ట‌ర్ హౌస్ లో ఏర్పాటు చేసిన రాణి  కండోలెన్స్ బుక్‌లో  ముర్ము సంత‌కం చేశారు. లండ‌న్‌లోని వెస్ట్‌మినిస్ట‌ర్ హాల్ లో భ‌ద్ర‌ప‌రిచిన రాణి ఎలిజ‌బెత్ 2 పార్ధివ దేహానికి  ముర్ము నివా ళులు అర్పించారు. భార‌త రాష్ట్ర‌ప‌తి ముర్ము బ్రిట‌న్‌లో సెప్టెంబ‌ర్ 17 నుంచి 19 వ‌ర‌కూ ప‌ర్య‌టించ‌నున్నారు.  రాణి అంత్య క్రియ లకు కూడా భార‌త ప్ర‌భుత్వం త‌ర‌ఫున  హాజ‌ర‌వుతారు.  శ‌నివారంనాడు ముర్ము  లండ‌న్ చేరుకు న్నారు. ఆమెతోపాటు విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విన‌య్ క్వాత్రా కూడా ఉన్నారు. ఆమెను లండ‌న్ గాట్విక్ విమానా శ్ర‌యంలో బ్రిట‌న్ ప్రెసిడెంట్‌, బ్రిట‌న్‌లో భార‌త హైక‌మీష‌న‌ర్ సాద‌రంగా ఆహ్వానించారు. 

ఎమ్మెల్యే మాగంటి  పి.ఏ వీరంగం

రాజుగారి కంటే రాజుగారి బామ్మ‌ర్ది చాలా ప‌వ‌ర్‌ఫుల్ .. అనాదిగా జాన‌ప‌ద క‌థ‌ల్లో వింటున్న మాట‌. కాలం ఎంత‌గా మారినా ఇది రాజ‌కీయాల్లో మ‌రింత స్ప‌ష్టంగా గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇదే పెద్ద దుర‌దృష్టం. ఎవ‌రూ ప్ర‌శాంతంగా ఉన్నా ఈ రెండో వ్య‌క్తి చొర‌బ‌డి దారుణాల‌కు తెగ‌బ‌డ్డం జ‌రుగుతోంది. రాజ్యం మాది, అధికారం మాది, రాజు మావాడు, అంతా నాయిష్టం అనే దుర్మార్గులు రెచ్చిపోతున్నంత కాలం పోలీసు వ్య‌వ‌స్థ‌కూడా ఏమీ చేయ‌ల‌ని స్థితి ఏర్ప‌డింద‌న్న‌ది అంత‌టా విన‌వ‌స్తున్న విమ‌ర్శ‌లు.  ఎమ్మెల్యేలు, ఎంపీల ద‌గ్గ‌ర ప‌నిచేసేవారికి కూడా సామాన్య‌జ‌నం లోకువే. అధికారుల ప‌ద‌వి బ‌లాన్ని అడ్డుపెట్టుకుని వారు కూడా ఆధిప‌త్యం, అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతుండ‌డ‌మే దారుణం. ఈమ‌ధ్య‌నే వైసీపీ ఎంపీగారి లీల‌లు బ‌య‌ట‌ప‌డి భ‌య‌పెట్టాయి. ఇపుడు తాజాగా ఎమ్మెల్యే పీఏ వీరంగా బ‌య‌ట ప‌డిం ది.  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ  వీరంగం సృష్టించాడు. మాగంటి పీఏ విజయ్ ఓ వివాహిత గొంతు కోశాడు. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను యశోద ఆస్ప త్రికి తరలించారు. బాధితురాలికి ఫేస్‌బుక్  ద్వారా  పరిచయమైన విజయ్..న్యూడ్ కాల్స్ చేసి మహి ళ ను వేధించడం మొదలు పెట్టాడు.  ఆదివారం రాత్రి ఆ మహిళ ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో మహిళ నిరాక రిం చింది. ఆ స‌మ‌యంలో ఆమె భ‌ర్త ఇంట్లో లేక‌పోవ‌డంతో త‌న కోరిక తీర్చాలంటూ వేధింపుల‌కు గురి చేశాడు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో త‌న వెంట తెచ్చుకున్న బీర్ బాటిల్ ను ప‌గ‌ల‌గొట్టి దాని గాజు ముక్క‌ను ఆమె గొంతులో దించాడు.  ఆమె అరుపులు విన్న స్థానికులు అక్క‌డికి రాగా అప్ప‌టికే విజ‌య్ అక్క‌డి నుం చి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆమెను చికిత్స కోసం య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుడు విజయ్ ఎమ్మెల్యే పీఏ కావడంతో..పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితురాలి కుటుంబీ కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

జగన్ నిర్వాకం.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉనికి ప్రశ్నార్థకం

సంచలన విజయం సాధించిన పుష్ప సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దొంగకు పోలీసుకు ఉన్న తేడా  బ్రాండేననీ, ఆ బ్రాండే ఇంటి పేరు అని అర్ధం వచ్చేలా ఓ ఇన్ స్పెక్టర్ ఆ డైలాగ్ చెబుతారు. అంటే ఇంటి పేరు లేని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదని ఆ పాత్ర ద్వారా చెప్పించారు. అయితే ఒక రాష్ట్రానికి ఇంటి పేరు ఆ రాష్ట్ర రాజధానే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలలో ఏపీ పరువు గంగలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు రాజధాని లేని రాష్ట్రం కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారు. వారందరూ మీ రాజధాని ఏదీ ఎంటు తోటి విద్యార్థుల ఎగతాళిని పంటి బిగువున భరిస్తున్నారు. అవమాన భారంతో తలదించుకుంటున్నారు. ఈ పరిస్థితి సాక్షాత్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద కుమార్తెకే ఎదురైంది. ఆయన కుమార్తె హస్తినలో చదువుకుంటోంది. ఆమెను తోటి విద్యార్థులు రాజధాని విషయంలో ఆటపట్టిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన జస్టిస్ భట్టు దేవానంద్ కష్టపడి అనుకున్నది సాధించే విషయంలో తెలుగువారికి విశ్వవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో అధిక శాతం మంది తెలుగువారే ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అయితే ఇప్పుడు విదేశాలలో ఉంటున్న ఏపీ వాసులు, దేశంలో ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న విద్యార్థులు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారనీ, వారి గుర్తింపే ప్రశ్నార్థకంగా మారిపోయిందని అంటున్నారు. ఈ విషయాన్ని ఒక సభలో న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ చెప్పారు. ఆయన న్యాయమూర్తిగా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. ఆయన వెల్లడించిన ఈ అభిప్రాయం, ఈ ఆవేదన ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఇది ఆ న్యాయమూర్తి అభిప్రాయం మాత్రమే కాదనీ, యావదాంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనకు ప్రతిబింబమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేని పరిస్థితి ఏర్పడటానికి జగన్ నిర్వాకమే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అపఖ్యాతి మూటగట్టుకున్నా చూస్తూ ఊరుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల మూడు ముక్కలాటకు ఇకనైనా తెరదించి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్రతిహాతంగా కొనసాగుతున్న అమరావతి రైతుల ఆందోళన, కోర్టు తీర్పు లను పరిగణనలోనికి తీసుకుని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న వితండ వాదానికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. పైపెచ్చు మద్దతు  తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. ప్రస్తుతం మూడు రాజధానులంటూ భీష్మించిన సీఎం జగన్ కూడా నాడు విపక్ష నేతగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారు. 2014 ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగిస్తానని హామీ కూడా ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్లేట్ ఫిరాయించారు. అమరావతి ఒక్కటే కాదు రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కొత్త పాట అందుకున్నారు. జగన్ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు. ఆఖరికి కోర్టు కూడా అమరావతి నిర్మించాల్సిందేనని విస్పష్ట తీర్పు ఇచ్చింది. అయినా కూడా మూడు రాజధానులంటూ జగన్ విన్యాసాలు ఆపడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. ఇంటా బయటా అవమానాలను, పరాభవాలను రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ వాసులు ఎదుర్కొంటున్నారు. వారి అందరి ఆవేదనే హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ మాటల్లో ప్రతిబింబించింది. 

త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర వైభోత్స‌వాలు

ఏడుకొండ‌లు ఎక్కి వెంక‌టేశ్వ‌రుని స‌న్నిధిలో కొంత‌స‌మ‌య‌మైనా గ‌డ‌పాల‌ని భ‌క్త‌జ‌న‌కోటి ఆశ‌. అంతే కాదు  వెంక‌టేశ్వ‌రుని ప్ర‌త్యేక ఉత్స‌వాల్లో పాల్గొని త‌రించాల‌నీ అనుకుంటారు. కానీ ఆ అదృష్టం అంద‌ రికీ ద‌క్కదు. కానీ భ‌క్తులు ఏమాత్రం చింతించ‌న‌వ‌స‌రం లేద‌ని భ‌గ‌వంతుడే భ‌క్తుల కోరిక‌ను తీర్చ‌ నున్నాడు. త్వ‌ర‌లో ఏకంగా ఆనంద‌నిల‌య‌మే త‌ర‌లిరానున్న‌ది.  తెలంగాణా ప్ర‌జ‌లు చాలాకాలంనుంచి ఎంత‌గానో ఎదురుచూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది. గ‌త ఆరేళ్ల నిరీక్ష‌ణ త్వ‌ర‌లో తీర‌నుంది. అక్టోబ‌ర్ 11 నుంచి 15 వ‌ర‌కూ శ్రీ వెంక‌టేశ్వ‌ర వైభోత్స‌వాల పేర తిరుమ‌ లలో శ్రీ‌నివాసునికి జ‌రిగే నిత్య కైంక‌ర్యాలు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు వీక్షింప‌చేయ‌డానికి టీటీడీ వారు  సిద్ధ‌మ య్యారు. ఇక సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు అందరూ కనులారా తిలకించవచ్చు. భాగ్య నగరం గోవిందా నామస్మరణతో మారుమోగనుంది. ఎన్టీఆర్ స్టేడియం అన‌గానే దీపోత్స‌వాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి మ‌హా భ‌క్తులు, ప్ర‌చార‌కులు వ‌చ్చి అద్భుత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం, ప్ర‌సంగాల‌తో భ‌క్తుల‌ను త‌రింప‌ జేయ‌డ‌మే మ‌నం ఇన్నాళ్లూ గ‌మ‌నించాం. ఇపుడు ఏకంగా ఆనంద‌నిల‌యాన్ని ద‌ర్శించుకోబోతు న్నా ము. తిరుమల శ్రీవారి ఆనంద నిలయాన్ని మన  హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం లో చూడవచ్చు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆనంద నిలయంలో (నమూనా ఆలయం)లో టీటీడీ అర్చకులే స్వామివారికి నిత్య కైంకార్యాలు చేస్తారు, అందరికీ ఇష్టమైన తిరుపతి లడ్లు, ఇతర స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఏ మా భాగ్యం. మనం ఏడుకొండలు ఎక్కి రాలేమనో  శ్రీవారే మన కోసం హైదరాబాద్ నడిబొడ్డునకు వచ్చి, తనకు నిత్యం   ఆనంద నిలయంలో జరిగే కైంకర్యాలు, ఇక్కడే అందుకొని మనల్ని  పరవశింప చేయనున్నారు. ఇక సరిగ్గా నెలరోజులే. ఇటువంటి మహా కార్యక్రమం నిర్వహిస్తున్న మ‌హాభ‌క్తులు, దాత‌ లు  భ‌క్త‌జ‌న‌కోటితో పాటు భ‌గ‌వంతుడి ఆశీస్సులు అందుకోనున్నారు. 

మూడు రాజధానులపై ప్రజా తీర్పు కోరాలి..జగన్ కు అయ్యన్న పాత్రుడు సవాల్

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామన్న భ్రమల్లో ఉన్న జగన్ కు సవాళ్లు, హితబోధలు, హెచ్చరికలు ఆనడం లేదు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మూడు రాజధానుల అంశంపై తన అభీష్ఠమే నెరవేరాలన్న మొండి పట్టుదల ప్రదర్శిస్తూ అడుగడుగునా భంగపాటుకు గురౌతున్నారు. అయినా కూడా మూర్ఖుడు రాజుకంటే బలవంతుడు అన్న చందంలో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానం రాజే మూర్ఖుడైతే పరిస్థితి ఇలాగే ఉంటుందని అనిపించేలా ఉంది. తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తరువాత తాపీగా మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది.  అన్ని రాజకీయ పార్టీలూ, అన్ని వర్గాల ప్రజలూ మూడు రాజధానులకు తమ వ్యతిరేకతను ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తున్నా జగన్ తన పట్టు విడవడం లేదు. తాజాగా జగన్ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు సవాల్ చేశారు. మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పు కోరే  ధైర్యం ఉందా  అని నిలదీశారు. మూడు రాజధానుల అంశంపై ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు వెళ్లాలని సవాల్ చేశారు. 2019 ఎన్నికలలో అమరావతికే మద్దతు అని ప్రకటించి విజయం అందుకున్న జగన్ ఇప్పుడు ఆ మాట విస్మరించి మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరలేపడం రాజకీయ దివాళా కోరు తనమేనని విమర్శించారు. మీడియాతో మాట్లాడిన అయ్యన్న పాత్రుడు అమరావతిలో భూ అక్రమాలు జరిగాయంటున్న జగన్ దమ్ముంటే ఆ విషయంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై టీడీపీ హయాంలో ఒకటి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరొక ‘సిట్‌’ వేశారని, ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.  రాజధాని కోసం 33 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారనీ,    వైసీపీ నాయకులు విశాఖలో భూములను ఆక్రమించుకున్నారనీ విమర్శించారు. అమరావతి రైతులు చేపట్టిన ‘అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర’ శాంతియుతంగా జరగాలని, ఇందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సహకరించాలని అయ్యన్న కోరారు. పాదయాత్రను అడ్డుకుని తీరుతామని వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం సరికాదన్నారు., రైతుల పాదయాత్రకు తాము రక్షణ కవచంగా ఉంటామన్నారు.  

 ట్రాఫిక్ స‌మ‌స్య‌...ప్ర‌శ్నించిన మ‌హిళ‌పై కేసు

ప్ర‌భుత్వాలు ప్ర‌జాహితం కోస‌మే ప‌నిచేయాలి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, ఇబ్బందులు ప‌ట్టించుకోవాలి.  కానీ చాల‌ప‌ర్యాయాలు చిన్న‌పాటి స‌మ‌స్య‌ల్ని కూడా నిర్ల‌క్ష్యం చేయ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్ష‌ల విష‌యంలో ప్ర‌జ‌లు, వాహ‌న‌దారులు ఎంతో ఇబ్బందిప‌డుతున్నారు. సీఎం నివాసం నుంచి క్యాంప్ ఆఫీస్‌కి, లేదా ఫామ్‌హౌస్‌కి వెళ్లే స‌మ‌యంలో గంట‌ల‌త‌ర‌బ‌డీ ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించ‌డం ఇబ్బందిక‌రంగా మారింది. ఉద్యోగులు చాలాప‌ర్యాయాలు చేసిన ఫిర్యాదులు బుట్ట‌దాఖ‌లు కావ‌డ‌మూ అయింది. దీనికి తోడు ఆ మ‌ధ్య అంటే ఈ నెల 17వ తేదీన పంజాగుట్ట పోలీసులు ఒక మ‌హిళ‌పై ఏకంగా కేసు న‌మోదు చేశారు. సీఎం వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ విధులకు ఆటంకం కలిగించిందిట‌.  ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో బహిరంగ సభ అనంతరం సాయంత్రం సమయంలో రాజ్‌ భవన్‌ రహదారిలో కాన్వాయ్‌తో ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రధాన రహదారి పైకి వచ్చే వాహనాలను నిలిపి వేశారు. రాజ్‌ భవన్‌ రోడ్‌ లక్కీ రెస్టారెంట్‌ వద్ద ట్రాఫిక్  కానిస్టే బుల్‌ బి.రాజు విధుల్లో ఉన్నారు. సీఎం కాన్వాయ్‌ వస్తోందని రెస్టారెంట్‌ మార్గంలో మెర్సిడస్‌ బెంజ్‌ కారు ను ఆపారు. ముందు సీట్లో కూర్చున్న మహిళ కిందికి దిగి ఎందుకు ఆపుతున్నారు, అత్యవసరంగా వెళ్లా లని అతడితో వాగ్వాదానికి దిగారు. ప్రధాన రహదారిపైకి నడుచుకుంటూ వెళ్తుండగా వీవీఐపీ వస్తు న్నా రు.. వెళ్లొద్దని కాని స్టేబుల్‌ వారించారు. అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పెట్రోలింగ్‌ పోలీసులు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆగలేదు. ఆ మర్నాడు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారి సూచనల మేరకు సదరు మహిళపై పంజా గుట్ట పీఎస్‌లో కానిస్టేబుల్‌ రాజు ఫిర్యాదు చేశాడు. తనను అసభ్య పదజాలంతో దూషించిందని ఫిర్యాదు లో పేర్కొన్నాడు. ఈ సంఘటన అంతా సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశానని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మ‌రి సీఎం దాదాపు ప్ర‌తీరోజూ రాక‌పోక‌ల స‌మ‌యంలో పోలీసులు విధిస్తున్న ట్రాఫిక్ ఆంక్ష‌ల‌తో  పెద్ద స‌మ‌స్య‌ల్నే ఎదుర్కొంటున్న ఉద్యోగులు, ప‌నుల‌కు వెళ్లే కార్మికుల మాటేమిటి?   దీన్ని గురించి ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అధికారులు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న లు. దీనికి  ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం ఆశిస్తున్నారు. 

పవన్ బస్సు యాత్ర వాయిదా.. సినిమాల కోసమేనా అని జనసేన శ్రేణుల అనుమానం

మామూలుగా రాజకీయ నాయకులు ప్రజలకు మతిమరుపు ఎక్కువ అనుకుంటారు.. అందుకే గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి కొత్త కొత్త హామీలతో ప్రజలను ఇట్టే మభ్యపెట్టేయచ్చనుకుంటారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వయంగా మతి మరుపు ఎక్కువ.. ప్రతి రోజూ పుస్తకాలు చదువుతాను.. పుస్తకాలు ఉంటే నాకింకేం అక్కర్లేదు అనే ఆయన ఏ రోజు చదివింది ఆ రోజే మరచిపోతారేమో అని పించేలా ఉంటుంది ఆయన వ్యవహారం. ఆయనకు తానో రాజకీయ పార్టీ అధినేతను అన్న సంగతి కేవలం వీకెండ్ లోనే గుర్తుకు వస్తుందా అన్న అనుమానం జన బాహుల్యంలో కలిగే విధంగా ఆయన కేవలం ఆదివారాలు (వీకెండ్)లో మాత్రమే మాట్లాడతారు. అదీ గత వారం ఏ మాట్లాడారో మరచిపోయి అందుకు పూర్తిగా భిన్నంగా తదుపరి వారం మాట్లాడతారు. సరిగ్గా ఈ విషయం మీదే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని జనసేనానిని విమర్శలతో ఓ ఆట ఆడుకున్నారు.  తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఆ తరువాత చాలా కాలం పాటు కేవలం సినిమాలే జీవితం అన్నట్లుగా బతికేసి ఆ తరువాత తీరిగ్గా జనసేనను స్థాపించారు. 2019 ఎన్నికలలో అధికారమే లక్ష్యం అంటూ ఒంటరిగా బరిలోకి దిగి కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికి  పరిమితమయ్యారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. సరే ఆ తరువాత ఏం జ్ణానోదయం అయ్యిందో ఏమో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. మొన్నీ మధ్య తన అన్న చిరంజీవి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉండి ఉంటే ఇప్పటి పరిస్థితుల్లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించి ఉండేదని అన్నారు. తన అన్న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఇప్పుడు వైసీపీలో కీలక స్థానాలలో ఉన్న వారే కారణమనీ, వారి తప్పుడు సలహాలతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారనీ సూత్రీకరించారు. ఆ విషయం మరచిపోయారో ఏమో తాజాగా తన అన్న చిరంజీవి రాజకీయంగా తప్పులు చేశారనీ, కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి ద్రోహిగా మారారనీ అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఈ విషయాన్ని పేర్ని నాని  2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున  తనతోపాటు 18 స్థానాలు గెలిపించుకుకున్న చిరంజీవి..  ఆ తరువాత వాస్తవం అర్ధం చేసుకుని రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారనీ, అయితే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ లా రోజుకో పార్టీ, పూటకో సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనీ విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి  వరదలు వస్తే బాధితులకు అండగా నిలబడ్డారు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. అయితే ఆ పార్టీ యువ నేతగా పవన్ కల్యాణ్ ఒకటి రెండు సభలలో ప్రసంగాలకే పరిమితమయ్యారని పేర్ని నాని గుర్తు చేశారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీకి కనీసం రాజీనామా కూడా చేయకుండా సినిమాలంటూ రాజకీయ తెర మీద నుంచి అదృశ్యమయ్యారని పవన్ పై విమర్శలు గుప్పించారు. ఆ విషయాలన్నీ విశ్మరించి ఇప్పుడు వైసీపీ ఇన్ని సీట్లకే పరిమితమౌతుందంటూ చిలక జోస్యం చెప్పడమేమిటని విరుచుకుపడ్డారు. అసలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ఎన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెడుతుందో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని విమర్శించారని కాదు కానీ, అసలు పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా స్థిరత్వం ప్రదర్శిస్తున్నారా అన్ని జనసేన శ్రేణుల్లోనే సందేహం వ్యక్తమౌతోంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అందరి కంటే ముందు పోత్తు ఊసెత్తిన పవన్ కల్యాణ్ ఇప్పుడా మాట విస్మరించి ఓటు చీల్చే రాజకీయం చేస్తున్నారా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. దసరాకు బస్సు యాత్ర అని ఘనంగా ప్రకటించి ఇప్పుడు వాయిదా వేయడానికి కారణాలే ఎందుకు చెప్పడం లేదని అంతర్గత చర్చల్లో మధన పడుతున్నారు. ఆయనకు రాజకీయాలు పార్ట్ టైమ్ లా ఉన్నాయనీ, ఫుల్ టైమ్ ప్రొఫెషన్ సినీమాలేనని అంటున్నారు. ఇప్పుుడ బస్సు యాత్ర వాయిదాకు కూడా సినిమా షూటింగులే కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 

 ఎడ్ల‌బ‌ళ్ల‌ను లాగుతూ టీడీపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

ఏపీలో రైతుస‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింద‌ని ప్ర‌ధాని విప‌క్షం తెలుగుదేశం భారీ ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టింది. సోమ‌వారం అసెంబ్లీ వ‌ద్ద కూడా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ నాయ క‌త్వంలో టిడిపి శాస‌న‌స‌భ ప‌క్షం నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించింది. అయితే వారంతా ఎడ్ల‌బండ్ల మీద వ‌చ్చి నిర‌స‌న‌కు దిగ‌డం ప‌ట్ల పోలీసులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయినా వారిని ప‌ట్టించు కోకుండా నినాదాలు చూస్తూ ప్ర‌భుత్వం ప‌ట్ల విముఖ‌త‌ను వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న ర్యాలీపై పోలీసులు ఆంక్ష‌లు పెట్టడంతో బండ్లు నిలిపివేశారు. ఎడ్ల‌బ‌ళ్ల‌ను పోలీసులు తీసికెళ్లారు. తెలుగుదేశం ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీ లు తూళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకుని అక్క‌డ కూడా నిర‌స‌నకు దిగారు. అక్క‌డి నుంచి ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్లు లేకుండానే కాడ తామే స్వ‌యంగా త‌గిలించు కుని మ‌రీ రోడ్ల‌మీద‌కు వ‌చ్చారు.  ఈ సందర్భంగా తెదేపా శాసనసభ పక్షఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కోటరీ వల్లే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మూడేళ్లుగా వ్యవ సాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. మూగజీవాల్ని పోలీసులు తరమటం దుర్మార్గమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎడ్లను పోలీసులు తీసుకెళ్లడంపై పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఎడ్లబండి కాడె  మోస్తూ అసెంబ్లీ కి లోకేష్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసు వలయాన్ని తోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ ఎడ్ల బండిని నేతలు లాక్కుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారన్నారు. రైతుపై చెయ్యి చేసుకున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతును కొట్టిన అంశంపై అసెంబ్లీలోనూ నిరసన తెలుపుతామన్నారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యల వల్లే  పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు  మండిపడ్డారు. 

ఏసీబీ అధికారుల‌ను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే అనుచ‌రులు

పార్టీకి అప్ర‌తిష్ట‌తెచ్చే ప‌నులు చేసిన‌పుడు, అవినీతిలో కూరుకున్న‌పుడు ఎవ‌రో ఒక‌రు హెచ్చరించ‌క‌ పోరు. మితిమీరిన‌పుడు సామా న్యుడైనా, ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే అయినా ఏసీబీకి ఒక‌టే. అవినీతి నిరోధ‌క శాఖ దృష్టిలో అంద‌రూ స‌మాన‌మే. త‌ప్పు చేసి దొరికిన‌పుడు సోదాల‌కు, త‌నిఖీ ల‌కు వ‌చ్చిన అధికారికి స‌హాయ ప‌డ‌ట‌మే మంచిది. మా ఇంటికే వ‌స్తారా.. అంటూ విర్ర‌వీగితే ప్ర‌తిష్ట గంగ‌ లో క‌లిసిన‌ట్టే. ఇపుడు ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లాఖాన్ ప‌రిస్థితి ఇదే.  అవినీతి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ  ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌  నివాసాలపై అవినీతి నిరోధక విభా గం  అధికారుల దాడుల సమయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ నెల 16న ఏసీబీ దాడులు జరిపిన సందర్భంలో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ మద్దతుదారులు ఏసీబీ అధికారి పై చేయి చేసుకున్నారు. సదరు అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాక దుర్భాషలాడారు.  అమానతుల్లాఖాన్‌ నివాసానికి సమీపం నుంచి ఏసీబీ అధికారిని దూరంగా తోసుకుంటూ వెళ్లిపోయారు. ఘటనపై ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల్లో ఉండగా ఏసీబీ అధికారిపై దాడి చేసిన వారిలో నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. విధుల్లో ఉన్న అధికా రులపై మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు యత్ని స్తున్నారు.    రెండేళ్ల క్రితం ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ ఢిల్లీ వక్ఫ్ బోర్డు  ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు నిబంధన లను ఉల్లంఘించి 32 మందిని అక్రమంగా నియమించారని ఆరోపణలున్నాయి. పైగా వక్ఫ్‌ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన నివాసా లు, సన్ని హితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. రెండు పిస్తోళ్లు, తూటాలు, రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇంగ్లండ్‌తో తొలి వ‌న్డే ...భార‌త్‌ను గెలిపించిన మంధాన‌, హ‌ర్మ‌న్ 

హోవ్‌లో జరిగిన తొలి వన్డేలో స్మృతి మంధాన 91 పరుగుల బ్యాటింగ్ హోరు  హర్మన్‌ప్రీత్ కౌర్ అజే యంగా 74 పరుగులు చేయడంతో భారత మహిళలు ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. మంధాన, హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించి 228 పరుగుల ఛేదనలో భారత్ ఎప్పుడూ డ్రైవింగ్ సీట్లో ఉండేలా చూసుకున్నారు. అంతకుముందు షఫాలీ వర్మ వికెట్ కోల్పోయిన తర్వాత మం ధాన, యాస్తిక భాటియా భారత్‌ను ఆదుకున్నారు. భాటియా 50 పరుగుల వద్ద పడిపోయాడు  కెప్టెన్ హర్మన్ ప్రీత్ మంధానతో కలిసి మిడిల్‌కి వచ్చాడు,  ఇద్దరూ తృటిలో సెంచరీని  కోల్పో యినప్పటికీ, ఇద్దరూ మ్యాచ్ను ఇంగ్లాండ్ కు దూరం చేశారు.  హర్మన్‌ప్రీత్ తన హాఫ్ సెంచరీని కొట్టి, భారత్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసింది  సరిగ్గానే, విజయవంతమైన సిక్స్‌ను కొట్టింది. ఇంగ్లండ్‌ స్కోరు 227/7. భారత్ తరఫున దీప్తి శర్మ రెండు వికెట్లు తీయ గా, మేఘనా సింగ్, ఝులన్ గోస్వామి, స్నేహ రాణా, హర్లీన్ డియోల్, రాజేశ్వరి గయక్వాడ్  తలో వికెట్ తీశారు. మరోవైపు, ఆలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్ అజేయంగా 50 పరుగులతో నాక్   డానియెల్ వ్యాట్ నుండి 43 పరుగులతో ఇంగ్లాండ్‌ను క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ  గౌరవప్రదమైన స్కోరు కు తీసుకె ళ్లడంలో కీల‌క‌ పాత్ర పోషించారు. మరోవైపు ఇంగ్లండ్ మహిళలు తమ కోసం ఎలా ముగించారో సంతోషంగా ఉంటుంది. ఒక దశలో 200 కాస్త దూరం అనిపించినా, మిడిల్ ఆర్డర్ బాగానే 200 మార్కును అధిగమించేలా చేసింది. డాని వ్యాట్ మరియు ఆలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్ ఇద్దరు బ్యాటర్లు ఇంగ్లండ్ ఉమెన్‌లను సమాన స్థాయికి తీసుకు రావడానికి ప్రధాన బాధ్యత వహించారు. డాని వ్యాట్ 43 పరుగులతో రాణించినప్పటికీ, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ చివరి వరకు ఉండి తన తొలి హాఫ్-టన్ను సాధించారు. సోఫీ ఎక్లెస్‌స్టోన్ , షార్లెట్ డీన్ కూడా చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఆడారు. చివరికి ఇంగ్లండ్ మహిళలు 227 స్కోరును సాధించడంలో సహాయ పడింది. వారు ప్రస్తుతం తమ బౌలర్‌లకు బౌలింగ్ చేయడానికి కొంత ఇచ్చారు. వారు ఈ లక్ష్యా న్ని కాపాడుకోగలరా? మేము కను గొంటాము.  ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది. వారి పేసర్లు పరిస్థితులను సరిగ్గా ఉపయోగించారు మరియు ఇంగ్లీష్ ఓపెనర్లను వరుసగా అవుట్ చేశారు. వారు దానిని సద్వినియోగంచు కున్నారు.  27వ ఓవర్ ముగిసే సమయానికి 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. అయినప్పటికీ, వారు చివరివరకు వేగంగా వికెట్లు సాధించలేకపోయారు మరియు ఇంగ్లాండ్‌ను కొన్ని భాగస్వామ్యాలతో దూరం చేయలేకపోయారు. కానీ మొత్తంమీద ఇది బౌలర్ల నుండి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రద ర్శన. భారత మహిళలు ఈ సిరీస్‌లో  మ‌రింత ధాటిగా ఆడి  సిరీస్‌లో ముందంజ వేసే అవకాశాలను కోరు కుందాం.

వైఎస్ ది హత్య.. నా ప్రాణాలకూ ముప్పు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, ఏపీ సీఎం జగన్ సోదరిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆమెది పరిచయం అక్కర్లేని పేరు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలు పాలైన సందర్భంగా జగనన్న విడిచిన బాణాన్ని అంటూ ఆమె చేసిన పాదయాత్ర, ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలూ అప్పట్లో ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి, ఆకట్టుకున్నాయి. ఏపీలో 2019 ఎన్నికలలో వైసీసీ విజయం సాధించి అధికారంలోకి రావడానికి షర్మిల ప్రచారం కూడా ఓ కారణం అని అనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఆ తరువాత కారణా లేమైనా ఆమెకు ఏపీ సీఎం జగన్ కూ మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమె ఆంధ్రను వదిలేసి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్నారు. ప్రజా సమస్యలపై  నిరంతర యాత్రలలో ఆమె జనం మధ్యే ఉంటున్నారని చెప్పాలి. అయితే తెలంగాణలో ఆమె యాత్రను అసలెవరైనా పట్టించుకుంటున్నారా? అంటే అనుమానమే. తీవ్ర పదజాలంతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై చేస్తున్న విమర్శలకు ఎవరూ స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఆమెపై చర్యలు తీసకోవాలంటూ మంత్రులు తెలంగాణ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా అదేమంత పెద్ద విషయంగా ప్రజలెవరూ భావించలేదు. అయితే ఇప్పడు ఆమె గురించి ఈ ప్రస్తావన ఎందుకంటే..తాజాగా ఆమె తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు తన తండ్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాదని బాంబు పేల్చారు.  హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిది  ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదంటూ ఆయన కుమార్తె, వైఎస్సార్ టీపీ అదినేత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా సంచలనం రేపాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి, జగన్ ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, తద్వారా వచ్చిన సానుభూతే కారణమని పరిశీలకులు అంటారు. ఇప్పుడు అన్నతో విభేదించి తెలంగాణ రాజకీయాల్లో ఒంటరి పోరు సాగిస్తున్న షర్మిల తన తండ్రి మరణం అనుమానాస్పద స్థితిలో సంభవించిందంటూ చేసిన వ్యాఖ్యలు మామూలుగా తీసుకోవడానికి వీల్లేదు. కేవలం తన సోదరుడిలా తన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించు కోవాలని ఆమె భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో తన సోదరుడికి కలిసి వచ్చిన ఈ సెంటిమెంట్ తెలంగాణలో తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ హెలికాప్టర్ వెనుక కుట్ర ఉందని చెప్పిన షర్మిల తన ప్రాణాలకూ ముప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అయితే   వైఎస్ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం ఆయన పిల్లలైన జగన్, షర్మిలలకు ఇదే మొదటి సారి కాదు.   గతంలో   ఏపీలో ప్రచార సమయంలో జగన్, షర్మిలలు రిలయన్స్ పై ఇటువంటి  ఆరోపణలే చేశాడు. అప్పట్లో రిలయన్స్ షోరూలంపై దాడులు కూడా జరిగిన సంగతి విదితమే. ఇంత కాలం తరువాత ఇప్పుడు ఇప్పుడు మళ్లీ షర్మిల మళ్లీ తన తండ్రి మరణం వెనుక కుట్ర.. ఆయనది హత్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడానికి ఆమె పార్టీని కానీ, ఆమె యాత్రను కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడమే కారణమని అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 2 వేల కిలోమీటర్లు నడిచినా (పాదయాత్ర) ఫలితం లేకపోవడం.. ప్రజలే కాదు.. పార్టీలూ పట్టించుకోకపోవడం టీఆర్ఎస్ అధినేత, నేతలను తీవ్ర పదజాలంతో విమర్శించినా వారి నుంచి స్పందన లేకపోవడంతో    షర్మిల సంచలనం కోసం, గుర్తింపు కోసం వైఎస్ మరణం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారంటున్నారు.  వైఎస్ఆర్ ను చంపారని.. తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని  ఆరోపణలు చేశారు.   

చైతన్య కాలేజీ విషయంలో ఒకలా.. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మరోలా!

 ఏపీలో జగన్ సర్కార్ ఇష్టారాజ్యం నడుస్తోంది. చట్టాలు, నిబంధనలనూ పట్టించుకోకుండా అసమదీయుల విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరోకలా వ్యవహరించడం పరిపాటి అయిపోయింది. వడ్డించే వాడు మనవాడైతే  పంక్తిలో చివర కూర్చున్నా ఫరవాలేదు అన్నది నానుడి.. జగన్ పాలనలో దానిని మార్చి నేరం చేసిన వాడు మనవాడైతే ఫర్లేదు వదిలేయండి అన్నట్లుగా మార్చుకోవలసిన అవసరం కనబడుతోంది. విజయవాడ చైతన్య కాలేజీలో ఓ టీచర్ విద్యార్థిని కొడుతున్ వీడియో ఒకటి బయటపడగానే జగన్ సర్కార్ ఆఘమేఘాలపై స్పందించింది. కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఐదు రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించింది. దాడి చేసిన లెక్చరర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌బోర్డు ప్రకటించేసింది. విద్యార్థిని దారుణంగా కొట్టిన లెచ్చరర్ పై చర్యలు తీసుకోవాలన్న జగన్ సర్కార్ ను, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయడానికైనా వెనుకాడని ప్రభుత్వ తీరును కచ్చితంగా స్వాగతించాల్సిందే. అదే సమయంలో అసభ్య వీడియోలో అడ్డంగా దొరికిపోయిన వైసీసీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో సర్కార్ ఈ వేగంతో ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చర్యల సంగతి దేముడెరుగు.. అసలు ఆయనను సమర్థిస్తూ వైసీపీ రంగంలోకి దిగి.. ఆరోపణలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి పాల్పడడమేమిటని నిలదీస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సదరు కాలేజీలో లెచ్చర్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి కానీ, అతడి తల్లిదండ్రులు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. కనీసం ఇంటర్ బోర్డు దృష్టికీ తీసుకు వెళ్లలేదు. కానీ వీడియో చూసి సర్కార్ కదిలిపోయింది. ఆ వీడియో ఫేకా, ఒరిజనలా అన్న మీమాంసే రాలేదు. వీడియో వైరల్ కాగానే చర్యలకు ఉపక్రమించేసింది. ఆ వేగాన్నికచ్చితంగా అభినందించాల్సిందే. కానీ అదే సమయంలో గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో విషయంలో జగన్ సర్కార్ లో ఆ వేగం ఎందుకు కనిపించలేదు అని సామాజిక మాధ్యమం వేదికగడా నెటిజన్లు నిలదీస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఏమీ మామూలు మనిషి కారు. ఆయన ఓ ఎంపీ.. అందులోనూ అధికార పార్టీ ఎంపీ. అటువంటి వ్యక్తి సభ్య సమాజం ఏహ్యతతో ఉమ్మేసే లాంటి చర్యకు పాల్పడినప్పుడు... చర్య తీసుకోవలసింది పోయి.. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు నిస్సిగ్గుగా మీడియా ఎదుట మాట్లాడడమేమిటి. పైగా గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ అని ఎవరూ అనే ధైర్యం చేయడం లేదు. తెలుగుదేశం నాయకులు అయితే అది ఒరిజనల్ వీడియోయే అని అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును కూడా బయట పెట్టారు. ఎలాంటి ఫిర్యాదు, క్రాస్ చెకింగ్ లేకుండా విద్యార్థిని కొట్టాడన్న వీడియో ఆధారంగానే, విద్యారంగంపై  అచంచల విశ్వాసం, గౌరవంతో ఆ కేసును సుమోటోగా తీసుకుని, తానే స్వయంగా చర్యలకు దిగిన జగన్ సర్కార్.. తమ పార్టీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, చట్టాన్ని లెక్కచేయకుండా మరీ తనంతట తాను చర్యల కొరడా ఝళిపించిన జగన్ సర్కారు  మిగిలిన కేసులలో ముఖ్యంగా గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో ఎందుకు ఇంత చైతన్యరహితంగా ఉందని నెటిజన్లు నిలదీస్తున్నారు. వైసీపీ ఎంపీ మాధవ్  అసభ్య వీడియోకు సంబంధించి మహిళల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా మహిళా నేతలు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసినా ఆయనపై జగన్ సర్కార్ చర్యలు తీసుకోలేదు సరికదా.. మాధవ్ తరఫు వారు ఇచ్చిన ఫిర్యాదుపైనే మాధవ్ ను విమర్శించిన వారిపై కేసులు పెట్టారు. మరి మాధవ్ పై ఎందుకు కేసు పెట్టలేదంటే.. ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని బదులిస్తున్నారు.  మరి చైతన్య కాలేజీ సంఘటనపై ఫిర్యాదు చేసిన వారెవరు? ఎవరూ లేకపోతే మరి ఫిర్యాదు లేకుండా ఎందుకు కేసులు పెట్టి నోటీసులు జారీ చేశారు అని సామాన్య జనం నిలదీస్తున్నారు.  

రాహుల్ కే కాంగ్రెస్ పగ్గాలు.. తీర్మానాలు చేస్తున్న పీసీసీలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. ఆ పార్టీలో ఖంగారు, అయోమయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబం ఆవలి వ్యక్తి అధ్యక్షుడు అయ్యే అవకాశం లేకుండా పార్టీ అధిష్టానం ఒక్కటొక్కటిగా పావులు కదుపుతోంది. ఎత్తులు వేస్తున్నది. ఇప్పటికే పార్టీ అధ్యక్ష నియామక బాధ్యతలు తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ తీర్మానాలు చేయాలని హైకమాండ్ పీసీసీలు, డీసీసీలకు స్పష్టమైన సంకేతాలిచ్చిన  సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలూ పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీయే చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. అలాగే ఛత్తీస్ గఢ్ కూడా అదే దారిలో నడిచింది. రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని మరో సారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ఛత్తీస్ గఢ్ సీఎం బూపేష్ బఘేల్ అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని తీర్మానాలు చేశాయి,  మరిన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే విధంమైన డిమాండ్లు, తీర్మానాలు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఏదో విధంగా ఒత్తిడి తీసుకువచ్చైనా రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేలా చేయాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తున్నది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల పార్టీ కమిటీలూ రాహుల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి.  ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్న సంగతి విదితమే. ఐదు నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగి కాశ్మీర్ లో ముగుస్తుంది.ఇదిలా ఉంటే అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 22న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8 అని.. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంతకు ముందు 2017లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ.. 2019 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2019లో మరోసారి కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే విషయమై రాహుల్ గాంధీని విలేకరులు ప్రశ్నించిన సందర్భంగా రాహుల్ గాంధీ సూటిగా సమాధానం చెప్పలేదు. పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో సుముఖతనూ వ్యక్తం చేయలేదు. అలాగని వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. మీరే చూస్తారుగా అంటూ సస్పెన్స్ మెయిన్ టైన్ చేశారు. ఈ నేపథ్యంలోనే  కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు, ఇదే  కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన ప్రశ్న. నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి, కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఖాళీగానే వుంది.అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ, తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా ఆమె పార్టీ బాధ్యతలను నిర్వహించలేక పోతున్నారు. ఓ వంక వయో భారం, మరో వంక అనారోగ్యం, ఆమెను వెంటాడుతున్నాయి.ఈ కారణంగా ఆమె క్రియాశీలంగా వ్యవహరించలేక పోతున్నారు. మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు.  ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహుర్తహం ఖరారు చేసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక  కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నా,ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా, ఖాయంగా పోటీ చేస్తామని ప్రకటించలేదు. అదలా ఉంటే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం ఏమిటి అనే విషయంలో మొదటి నుంచి ఉన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. నిజానికి, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలోనే తమ మనసులోని మాటను స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు మరోమారు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు  గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తులు పార్టీ అధ్యక్ష బాద్యత తీసుకోవాలని, సిడబ్ల్యూ సమావేశంలో తెగేసి చెప్పారు. మూడేళ్ళుగా అయన అదే మాట మీదున్నారు.  అయినా, ఇంకెవరు ముందుకు రాకపోవడం వల్లనే, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టుకొస్తున్నారు.  మరో వంక ఆమె నిరాసక్తత కారణంగానే కావచ్చును కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా స్వతత్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాహుల్ గాంధీ అప్రకటిత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, జీ23 నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ సదిగ్ధ వైఖరి కారణంగానే పార్టీ నష్ట పోయిందని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. నిన్న మొన్న పార్టీని వదిలి వెళ్ళిన, పార్టీ సీనియర్  నాయకుడు గులాంనబీ ఆజాద్, ఇంకా పార్టీలోనే ఉన్నఆనంద శర్మ, మనీష్ తివారీ వంటి  సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ నిర్వాకం వల్లనే పార్టీ కోలుకోలేని విధంగా బలహీనమైందని, మండి పడుతున్నారు. నిజానికి, వాస్తవానికి రాహుల్ గాంధీ  అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. తాజాగా, భారథ్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, నిన్న(శుక్రవారం) విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ... అదే సందిగ్ధత, సస్పెన్సు కొనసాగించారు. అధ్యక్ష బాధ్యతల విషయంలో ఎప్పుడోనే  నిర్ణయం తీసేసుకున్నను ఈ విషయంలో నాకెలాంటి అయోమయమూ లేదు. అధ్యక్షుడిని అవుతానో లేదో ఎన్నిక జరిగినప్పుడు స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేచి చూడండి  అంటూ, అటూ ఇటూ కాని, సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఒకవేళ తాను పోటీ చేయకుంటే విలేకరులు తనను అడగొచ్చని.. అందుకు జవాబు చెబుతాననీ సమాధానం ఇచ్చి సస్పెన్స్ కొనసాగేందుకు అవకాశమిచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ సమాధానంతో మీడియాయే కాదు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆయన ఔనన్నారా, కాదన్నారా అర్ధం కాక అయోమయంలో పడ్డాయి. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్డమయ్యారని అనికోవాలా?  లేదని సరిపుచ్చుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులే తలలు పట్టుకుంటున్నాయి.  అదలా ఉంటే రాహుల గాంధీ సాగిస్తున్న, భారత్ జోడో యాత్ర లక్ష్యం విషయంలోనూ అదే సందిగ్దత వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నాయకులు, ఓ వంక ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న యాత్ర కాదని అంటారు. మరో వంక, యాత్ర ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తున్నారని అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, అధ్యక్ష పదవి విషయంలో సందిగ్దత తోలిగితేనే కానీ, కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలదని, రాహుల్ గాంధీ, ఇప్పటిలా బాధ్యతలు లేని అధికారం చెలాయించాలని కోరుకుంటే, పార్టీ పరిస్థితి కూడా  ఇప్పటిలానే దినదిన ప్రవర్తమానంగా దిగాజారుతుందని అంటున్నారు.

తైవాన్ లో కంపించిన భూమి.. కుప్పకూలిన భవనాలు

 తైవాన్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.8గా నమోదంది. పలు భవనాలు కుప్పకూలాయి. రైళ్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. టైటుంగ్ కౌంటీలో సంభవించి ఈ భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగుతు తీశారు. అంతకు ముందు కూడా ఇదే ప్రాంతంలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ముందు సంభవించిన భూ కంప తీవ్రత 6.4కాగా, 24 గంటల వ్యవధిలో మరో సారి భూమి కింపించిందని వివరించారు.భవన శిధిలాల కింద చిక్కుకున్న పలువురిని అధికారులు రక్షించారు. కాగా భూకంపం కారణంగా భవనాలు కుప్పకూలడంతో పలువురు గాయపడ్డారు. అలాగే బ్రిడ్జి కుప్పకూలడంతో పలువురు గాయపడ్డారు. పలు రైళ్లు పట్టాలు తప్పాయి. రైల్వే స్టేషన్లలో నిలిపి ఉన్న రైళ్లు అట్టబొమ్మల్లా ఊగిసలాడాయి. ఆస్తి నష్టం వివరాలు అందాల్సి ఉంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

మాతోనే ఉండు చెల్లీ..!

ఒక ధ‌నికుడు, పోనీ వ్యాపారి ఒక మ‌హాన‌గ‌రానికి వెళ‌తాడు. అక్క‌డో మ‌హిళ ప్రేమ‌లో ఊహించ‌నివిధంగా ప‌డ‌తాడు. ఆమెను అక్క‌డే పెళ్లాడ‌తాడు. కొద్దిరోజుల‌కు ఇంటికీ తీసుకువ‌స్తాడు.. అప్ప‌టికే పిల్ల‌తో ఆడుతున్న అత‌గాడి భార్య చూసి ఆశ్చ‌ర్య‌పో తుంది. మెల్ల‌గా వివ‌రిస్తాడాయ‌న‌. మెలోడ్రామా అయ్యాక‌..సంగ‌తి తెలిసి, మ‌న‌సు పెద్ద‌ది చేసుకుని.. పోనీ మాతోనే ఉండిపో చెల్లీ.. అంటుంది అప్ప‌టికే కొంగు మొత్తం క‌న్నీళ్ల‌తో త‌డిపేసుకున్న గృహిణి.. ఇదే అనాదిగా సినిమాల దృశ్యం. స‌రిగ్గా ఇలాంటిదే ఒరిస్సాలో రిపీట్ అయింది.   32 ఏళ్ల వ్యక్తి, రెండేళ్ల పాప తండ్రి, ఒక ట్రాన్స్ వుమన్‌తో ఒక సంవత్సరం పాటు రహస్యంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె భర్త, అతని ప్రేమికుడి కలయికకు సంతోషంగా అంగీకరించింది. ఆమె వారిని క‌లిసే ఉండడానికి కూడా అనుమతించింది. అయితే, ఈ చర్యలకు చట్టపరమైన ఆంక్షలు లేవు. ఒరిస్సా నార్లలోని ఓ దేవాలయంలో పరిసర ప్రాంతాలలోని ట్రాన్స్ కమ్యూనిటీ సమక్షంలో నిరాడంబరమైన కార్యక్రమంలో వివా హం కూడా జరిగింది. సెబకారీ కిన్నర్ మహాసంఘ అధ్యక్షురాలు కామిని వివాహ నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. ఒక బిడ్డ భార్యతో ఉన్న వ్యక్తి తాను ప్రేమిస్తున్న ట్రాన్స్‌వుమన్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుండి ట్రాన్స్ కమ్యూ నిటీకి ఇది అసాధారణమైన సంఘటన. హిందూ ఆచారాల ప్రకారం, మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు చేయబడే వరకు రెండవ వివాహం చట్టబద్ధం కాదని తనకు తెలుసునని కామిని చెప్పారు. అయితే ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.   ఇద్దరు భాగస్వాముల కోరిక, భార్య సమ్మతి ఈ అరుదైన 'వివాహానికి' దారితీసింది. లింగమార్పిడి సంఘంలోని సభ్యులందరూ కూడా వారికి రెండవ ఆలోచనలు ఉన్నాయా అని వారిని పదే పదే అడిగారు. వారికి లిఖితపూర్వకంగా తెలియజేయడానికి తాము కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లాము, కాని వారు ఈ విషయంతో తమకు పెద్దగా సంబంధం లేదని చెప్పారని ట్రాన్స్‌జండ‌ర్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అన్నారు. అయితే, నార్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రకారం, వివాహానికి సంబంధించి ఎవరైనా మూడవ వ్యక్తికి ఫిర్యాదు చేస్తే, ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఒడిశా హైకోర్టులో పనిచేస్తున్న ఒక న్యాయవాది ప్రకారం, మొదటి వివాహం రద్దు చేయబడకపోతే, రెండవది చట్టబద్ధమైన వివాహంగా పరిగణించబడదు. ఈ సంబంధాన్ని లివ్-ఇన్ లేదా వివాహేతర సంబంధం అని పిలవవచ్చని, అయితే దానిని వివాహం అని పిలవలేమని చెప్పింది. అయితే, కొత్త జంటకు వారి పరిస్థితికి ఇబ్బంది లేదు. వారి ప్రకారం, వారిలో ముగ్గురు ఒకే పైకప్పు క్రింద సంతోషంగా జీవిస్తున్నారని మరియు అదే విధంగా ఉండాలని కోరు కుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ ఐఏ సోదాలు

ఇది క‌నీవినీ ఎరుగ‌నిది. సాధార‌ ణంగా ఉగ్ర‌కార్య‌క‌లాపాలు అన‌ గానే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ లేదా ఇటు ద‌క్షిణాదిన హైద‌రా బాద్‌తో సంబంధాల గురించే వార్త‌లు వస్తుంటాయి, ఎన్ ఐఏ సోదాలు భారీ ఎత్తున చేప‌ట్ట‌డం జ‌రుగు తూంటుంది. కానీ మొద‌టిసారి గా ఆంధ్రా, తెలంగాణా జిల్లా ల్లోనూ సోదాలు చేప‌ట్ట‌డం విం టున్నాం.  తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్య కలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు  నిర్వహిస్తోంది. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుం టూరు జిల్లాల్లో దాడులు చేప ట్టింది. నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించగా..కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఇప్పటికే పీఎఫ్‌ఐ  జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా ఇమ్రాన్, అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరిపై పోలీ సులు దేశద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహి స్తోంది. మతకలహాలు సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. పీపుల్స్ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహి స్తున్నారు. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లో అబ్ధుల్ ఖాదీర్ నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి 200 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. కేరళ, ఢిల్లీ, కర్ణాటకలతో కూడా పీఎఫ్ఐ కార్యకలాపాలు ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అదేవిధంగా నిర్మల్ జిల్లా బైంసాలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మదీనా కాలనీలో అధికారులు సోదాలు చేపడుతున్నారు. రాత్రి మూడు గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పీపుల్స్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతోనే ఈ దాడులు నిర్వహించి అనుమానితులను అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పోలీసులు సుప్రీం ఆదేశాలు పాటించ‌మ‌నండి...సీఎస్‌కు టీడీపీ విన‌తి

అక్రమంగా అరెస్ట్, లాకప్డెత్, కోర్టుకు హాజరుపరచకుండా నిర్బంధించి హింసించటం..ఇలా పోలీస్ శాఖపై ఎన్నో సందర్భాల్లో ఆరోపణలు చూశాం..చూస్తూనే వున్నాం. విచారణ పేరుతో నింది తులకు చిత్రహింసలు, ఒక్కోసారి నిరపరాధులు కోర్టు మొహం చూడకుండానే పోలీస్ అతి మర్యాదలు, ఇలా కక్షపూరితంగా హింసించిన సందర్భాల్లో లాకప్ డెత్లు దానిపై విచారణలు కూడా జరిగాయి. పోలీస్ శాఖలో ఈ తరహా హింసను అరికట్టడా నికి ఎన్నోమార్గదర్శకాలు వెలు వడ్డా, ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రావటంలేదని న్యాయ నిపుణు లు, మానవ హక్కుల సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసుల విచారణ సమయంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారం వ్యవహరించేలా ఆదేశా లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ న్యాయ విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ విభాగానికి చెందిన ప్రముఖ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు ఒక లేఖ రాశారు.  రాష్ట్రంలో పోలీసులు మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు అవసరం. నిందితు లను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు, సీఐడీ, ఏసీబీ సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బంది వేధింపులకు, శారీరక హింస కు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి వేళ తలుపులు పగలగొట్టి మరీ అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. విచారణ పేరుతో అనుమానితులను చిత్రహింసలకు, భావోద్వేగ వేధింపులకు గురి చేస్తున్నారు. అనుమానితులకు చెందిన డెస్క్‌టాప్‌ కంప్యూ టర్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఐపాడ్‌లు వంటి వాటిని దోచుకొంటున్నారు. తీసుకొన్న వస్తువుల వివరాలు దర్యాప్తు సమయంలో రికార్డుల్లో నమోదు చేయడం లేదు. విచారణ ప్రదేశాల్లో సీసీ కెమేరాలు పెట్టడం లేదు. దర్యాప్తు సంస్థల అధికారులు, సిబ్బంది వారి శాఖకు, హోదాకు సంబంధించిన బ్యాడ్జీలు పెట్టుకోవడం లేదు. ఇటువంటి చర్యలు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. అనుమానితులను విచారంచే ముందు దర్యాప్తు సంస్థల అధికా రులు, సిబ్బంది తమ పేరు, హోదా తెలిపే బ్యాడ్జీలు తప్పనిసరిగా ధరించాలి. కోర్టు ఆదేశాలకు కట్టుబడి విచారణ ప్రదేశంలో సీసీ  కెమేరాలు అమర్చాలి. విచారణ దృశ్యాలు రికార్డు చేయాలి. పోలీస్‌ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల వద్ద తప్పని సరిగా సీసీ కెమేరాలు అమర్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.   పోలీసులపై వలసవాద ముద్ర తొలగిపోవడం లేదు. వేధింపులను, అణచివేతలను వారు ఓ సాధనంగా ఇంకా ఉపయోగిస్తు న్నారు. అరెస్టు చేసే అధికారాన్ని వినియోగించడంలో పోలీసుల అహంకార ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. పోలీసుల అవినీతికి అరెస్ట్ అనేది లాభదాయకమైన వనరుగా మారిపోయింద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది.   పోలీసుల అధికార దుర్వినియోగా నికి అడ్డుకట్ట వేయకపోవడం మేజిస్ట్రేట్ ల వైఫల్యం. నిందితుడిని ముందుగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతా విషయాలను పరిశీ లించడం సరికాదు. అరెస్ట్ సమయంలో సెక్షన్​41 నిబంధనలను సరిగ్గా పాటిస్తే  ముందస్తు బెయిల్ కోసం వచ్చే వారి సంఖ్య గణ నీయంగా తగ్గుతుంది. యాంత్రికంగా రిమాండ్ చేయడం మేజిస్ట్రేట్ లకు తగని పని. అరెస్ట్ అధికారాన్ని వాడే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక క్రమం మధ్య సమతుల్యతను పాటించాలి. అరెస్టు వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. స్వేచ్ఛ ను కోల్పోతాడు. అతనిపై పడిన అరెస్టు మచ్చ జీవితాంతం కొనసాగుతుంది. ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప అరెస్ట్ అధి కారాన్ని ఉపయోగించకూడదు. కొంత దర్యాప్తు చేసిన తర్వాత ఆ వ్యక్తి మీద వచ్చిన ఆరోపణల్లో సత్యం ఉందని పోలీస్ అధికారి సంతృప్తి చెందినప్పుడు అరెస్టు చేయవచ్చు. అయితే ఆ నేరం కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అయినంత మాత్రాన అరెస్టు చేయడం చట్టబద్ధం కాదు. అరెస్టు చేసే అధికారం ఉండటం ఒక ఎత్తయితే, దానికి న్యాయబద్ధత ఉండటం మరొక ఎత్తు. ఆరోపణలు రాగానే వ్యక్తులను అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయడానికి ముందు పోలీస్ అధికారి తనని తాను ప్రశ్నించుకోవాలి. అరెస్టు ఎందుకు చేయాలి? నిజంగా అవసరమా ? ఏ ప్రయోజనం కోసం అది ఉపయోగపడుతుంది ? ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది ? ఈ ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబులు దొరికిన తర్వాత ఒకటి రెండు కారణాలు సంతృప్తికరంగా అనిపిస్తే అరెస్టు అధికారాన్ని ఉపయోగించాలి. ఏడేండ్ల కన్నా తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో లేదా ఏడేండ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో పోలీసులకు సంతృప్తి కలిగినప్పుడు కూడా అరెస్టు చేసే అధికారం లేదు. ఆ వ్యక్తి తిరిగి నేరం చేయకుండా నిరోధించడానికి, అరెస్టు తప్పనిసరని పోలీస్ అధికారి సంతృప్తి చెందినప్పుడు, కేసును సరైన దిశలో దర్యాప్తు చేయడానికి, సాక్ష్యాన్ని ఆ వ్యక్తి అదృశ్యం, తారుమారు చేయకుండా ఉండటానికి, ఇతర  నేరాలు చేయకుండా ఉండటానికి అరెస్టు చేయవచ్చు. ఆ వ్యక్తిని అరెస్టు చేయకుండా భవిష్యత్తులో కోర్టు ముందు హాజరు పరచలేమని భావించినప్పుడు కూడా అరెస్టు చేయవచ్చు. అయితే ఈ కారణాలని పోలీస్ అధికారి రాతపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

మోదీజీ ... ఇది  మీకు త‌గునా!

పిల్ల‌వాడి పుట్టిన‌రోజు. పక్కింటి పిన్నిగారు, మామ్మ‌గారుతో పాటు అంతా వ‌చ్చారు. పిల్ల‌డికి కేక్ తినిపించారు. మీవాడు  బా వుంటాడు, బాగా అల్ల‌రి చేస్తాడు అంటూ తోటి అమ్మ‌ల‌క్క‌లంతా ఆ పిల్ల‌వాడి త‌ల్లికి చెబుతూనే కాస్తంత కంట్రోల్‌లో  పెట్టుకో మ్మా.. మ‌రీ బాగుంటది అనీ చిన్న‌గా వాడి బుగ్గ గ‌ల్లి మ‌రీ వెళ్లారు. ఇలా ఉంది మోదీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం. ఆవేశం, ఆగ్ర‌హం, దూకుడు.. ఎక్క‌డ చూపించాలో, ఆయా సందర్భాల్లో అక్క‌డే ప్ర‌ద‌ర్శంచాలి. కేవ‌లం ప్ర‌శాంతంగా ఉన్న‌చోట గొడ‌వ‌లు, విభేదాలు సృష్టించి త‌గుదున‌మ్మా అంటూ వ‌చ్చి ప్ర‌బోధ‌చేసి పాల‌కుడు మంచివాడు కాదంటూ ఉప‌న్యాసాలు దంచి  అధికారం చేజిక్కిం చుకునే కుయుక్తులు రాజ‌కీయంగా అంత మంచిది కాదు. ఇది చూచాయిగా బీజేపీ వారికి విప‌క్షాల‌న్నీ క‌లిసి బోధిస్తున్న బ్ర‌హ్మ సూత్రం. చిత్ర‌మేమంటే ఇది బీజేపీ వారికీ బాగా ఎరుకే. కాని పాటించ‌న‌వ‌స‌రం లేద‌న్న‌ది వారి నియ‌మం. దీని కి ఎవ‌రి నుంచి స‌మాధానం ఉండ‌దు. మూర్ఖ‌త్వం నిలువెల్లా ఉన్న‌ప్పుడు ఎవ‌రు చెప్పినా ఎక్క‌దంటారు పెద్ద‌లు. అదే పంథాలో మోదీ స‌ర్కార్ ప‌రుగులు పెడుతోంది, ఆవేశ‌ప‌డుతోంది.  పులుల‌తో ఫోటోలు, ప‌రుగులు కాకుండా కాస్తంత నిమ్మ‌ళంగా ఉండాలి. త‌మ పాల‌న లేని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాన్ని అమాంతం దింపేసి మ‌నోళ్ల‌ని పెట్టుకుని పాల‌న సాగించాల‌నుకోవ‌డ‌మే పొర‌పాటు. అన్నిచోట్లా ఇది సాగ‌దు. ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ కులలో ఒకరిగా తరచు వార్తల్లో ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మహువ మొయిత్రా  శనివారంనాడు ఆయ నకు ఒక ట్వీట్లో పుట్టినరోజు శుభాకాంక్షలు   తెలి పారు. ఇదే సమయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వేగంగా అంతరించి పోతున్న రాజ్యాంగ రక్షణను ప్రస్తావించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతరించి పోతున్న చిరుత పులుల విషయంలో ఏమి చేశారో అదే విధంగా అంతరించిపోతున్న రాజ్యాంగ విలువలను కూడా పునరుద్ధరించాలి అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం అధికార ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యా స్త్రాలు సంధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు చిరాయువు ప్రసాదించాలి. ఈ దేశ యువతకు మీరు చాలా చేశారు. ఈరోజు జాతీయ నిరుద్యోగ దినోత్సవం జరుపుకోవడానికి ఇదో కారణం. ఈ దేశంలోని ప్రతి నిరుద్యోగి మీకు రుణ పడి ఉంటారని భారత జాతీయ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖమంత్రి కె.చంద్రశేఖరరావు తదితరులు ప్ర‌ధానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. కానీ కేక్ తినేముందు, శుభా కాంక్ష‌ల ట్వీట్ చ‌దివిన త‌ర్వాత కాస్తంత పాల‌నావ్య‌వ‌హారాల ప‌ద్ధ‌తిని స‌రిచూసుకోవాల‌న్న హెచ్చ‌రిక‌ను గుర్తుచేశారు.  ఇటీవ‌లి కాలంలో దేశంలో అంద‌రి వ్య‌వ‌హారాల్లోనూ త‌ల‌దూర్చి ఏదో ర‌హ‌స్యం క‌నుగుని ఈడీ,సిబిఐ అధికారుల‌ను గిల్లి మ‌రీ పంప‌డం బ‌తుకు గంద‌ర‌గోళం చేయ‌డం అనే ఆట‌లు బాగా ఆడుతున్నారు బీజీపీవారు. అవ‌త‌లివాడిని గిల్లి ఆనందించే స్కూలు స్థాయి ఆనందం వారికి ఇంకా పోలేదు. ఇద్ద‌రి మ‌ధ్య గిల్లికజ్జాలు పెట్టి అధికారం చేజిక్కించుకునే నైజం బాగా ప్ర‌ద‌ర్శిస్తు న్నారు. అంతే త‌ప్ప దేశ ప‌రిస్థితులు, ప్ర‌జ‌ల ఆర్ధిక‌, సామాజిక‌, విద్యా,ఉద్యోగ రంగాల్లో ప‌రిస్థితుల‌ను అంత‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు విదేశీ సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్నాయ‌ని బీజేపీ వందిమాగ‌దుల బాకాలు చెవికి ఇంపుగా ఉంటే మోదీ నిద్రిస్తున్నార‌న్న‌ది అంద‌రికీ అర్ధ‌మైంది.  తాజాగా షాంగైలో జ‌రుగుతున్న ఎస్‌సీఎస్ స‌ద‌స్సులో ఆయ‌న చైనా, పాక్ నేత‌ల‌తో ఎడ‌మొగం పెడ‌మొగంగానే వ్య‌వ‌హ‌రిం చారు. కార‌ణం వారిద్ద‌రు దేశానికి ప‌క్క‌లో బ‌ల్లెలుగా మారార‌ని. కానీ దేశంలో ప్ర‌జ‌ల‌తో మాత్రం అబ్బే వారు మ‌న‌కు మంచి మిత్రులే అంటూంటారు. చైనా వ్య‌వ‌హార‌మే తీసుకుందాం.. పైకి దొంగ న‌వ్వులు న‌వ్వుతూనే స‌రిహ‌ద్దుల్లో ఆక్ర‌మ‌ణ‌లు చేస్తూనే ఉన్నారు, సైనిక విన్యాసాలూ సాగిస్తున్నారు. ప్ర‌ధాని మోదీకి మాత్రం అదేదో బ‌చ్చన్ సినిమాలా అనిపిస్తోంది.  తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో సైనికులు ఘర్షణ పడినప్పుడు మే ప్రారంభంలో భారత్ , చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్త తలు మరింత హింసాత్మకంగా మారాయి. దేశం ఒక కమాండింగ్ అధికారితో సహా 20 మంది సైనికులను కోల్పోయింది. 45 ఏళ్ల తర్వాత చైనాతో జరిగిన మొదటి హింసాత్మక ఘర్షణ తర్వాత మరో వైపు కూడా ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యం తెలిపింది. ప్ర‌పంచ వార్త‌ల్లో కరోనావైరస్ సంక్షోభం  ఆధిపత్యం చెలాయించినప్పటికీ, భార‌త్‌-చైనా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు ఒక నెలకు పైగా ముఖ్యాంశాలుగా మారాయి. సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇంతకుముందు కుదిరిన ఏకాభి ప్రాయం  చైనా నిర్ల‌క్ష్యం చేసినప్పటికీ, దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను నిర్ధారించడానికి కట్టు బడి ఉన్నామని భారత్‌ తెలిపింది.

టీ-20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌...ష‌మీ ఔట్‌, ఉమేష్ ఇన్‌

టీమ్ ఇండియాకు మ‌రో షాక్‌. అస‌లే ఆల్‌రౌండ‌ర్ జ‌డేజా గాయాల‌తో జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ఇపుడు పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ కోవిడ్ పాజిటివ్‌తో జ‌ట్టుకు దూరం కావ‌డం క్రికెట్ అభిమానుల‌ను ఇబ్బందిపెడుతుంది. ఇప్పటివరకు షమీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలడం గురించి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి అధికారిక ప్రక టన చేయ‌లేదు. కాగా, ష‌మీ స్థానంలో మ‌రో పేస‌ర్ ఉమేష్ యాద‌వ్‌ను తీసుకున్న‌ట్టు తెలిసింది.  ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచ కప్ 2022కి ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20I సిరీస్ కోసం జట్టులో ఎంపికైన షమీ, ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌ వేదిక మొహాలీకి ఇంకా చేరుకోలేదు. ఉమేష్ యాదవ్ తన ఐపీఎల్‌ కెరీర్‌లో చాలా స్థిరంగా ఉన్నాడు, గత క్యాష్ రిచ్ లీగ్ సీజన్ లో ఉమేష్ అత్యుత్తమ పవర్‌ప్లే బౌలర్ లలో ఒకడు, అతని ఎకా నమీ 7.06 తో 16 వికెట్లు పడగొట్టాడు. అతను రాయల్ లండన్ వన్డే కప్‌లో మిడిల్‌సెక్స్ కోసం చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండ టం అత‌ను మంచి ఫామ్ లో ఉండ‌టాన్ని తెలియ‌జేస్తుంది. ఈ కార‌ణంగానే ష‌మీ స్థానంలో టీమ్ ఇండియాలోకి మ‌ళ్లీ ఉమేష్ యాద‌వ్‌ను తీసుకున్నారు.  టీ-20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు నుండి తప్పుకున్న తర్వాత షమీకి ఈ సిరీస్ ముఖ్య మైనది, అయినప్పటికీ అతను స్టాండ్-బై ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు. దాదాపు ఏడాది తర్వాత టీ20కి ఎంపికైన షమీకి ఇది ఊహించని ఎదురుదెబ్బ. అతను చివరిసారిగా నవంబర్ 2021లో యుఏఇ లో జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్‌లో T20I ఆడాడు, అతను ఐదు గేమ్‌లలో 140 పరుగులకు తక్కువ సిక్స్‌తో మరియు ఆ గేమ్‌లలో టోర్నమెంట్ ఎకానమీ రేటు 8.84తో ముగించాడు. టీ-20  ప్రపంచ కప్‌కు ముందు  పేస్ బౌల‌ర్‌గా షమీ ఫామ్‌ను పరిశీలించడం జట్టు మేనేజ్‌మెంట్‌కు అనువైనది, ఎందుకంటే అతను గత ఏడాది టీ-20 ప్రపంచ క‌ప్‌లోనూ త‌ను మంచి ఫామ్‌లో లేక‌పోవ‌డంతో ఆడ‌లేదు. అయితే,ఈ ఏడాది ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించినప్పటికీ, ఏ ఆటగాడికి ఏదైనా గాయం అయితే షమీకి జట్టులోకి వచ్చే అవకాశాలను పెంచేది - భారత ఫాస్ట్ బౌలర్‌కు సిరీస్ ముఖ్యమైనది. దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 I సిరీస్‌కు ముందు షమీ కోలుకుంటాడని సెలెక్టర్లు, భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆశించింది, ఇది వచ్చే నెల ప్రపంచ కప్‌కు ముందు అతని ఫామ్ గురించి వారికి కొంత ఆలోచన ఇస్తుంది. సెప్టెంబర్ 20, 2022 మంగళవారం జరగాల్సిన మొదటి టీ-20 కోసం ఇరు జట్లు మొహాలీ చేరుకున్న సంగతి తెలిసిందే.