కర్నాటక సీఎం మార్పు తప్పదా?.. నాలుగో కృష్ణుడు ఎవరో?

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. ఎన్నికలలో అధికారానికి అవసరమైన మెజారిటీ రాకున్న కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గతంలో కాంగ్రెస్ అనుసరించిన ఏ విధానాలనైతే విమర్శిస్తూ వచ్చిందో.. ఇఫ్పుడు అవే విధానాలను బీజేపీ అనుసరిస్తోంది. చీటికీ మాటికీ మంత్రులను మార్చే సంస్కృతి ఇప్పుడు బీజేపీది అయ్యింది. బొటాబొటీ మెజారిటీతో కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ నాలుగేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి ముఖ్యమంత్రి మార్పు కు రంగం సిద్ధం చేసిందంటున్నారు.   ఒక వైపు పార్టలో అసమ్మతి, మరో వైపు ప్రభుత్వంపై వల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు.   బెంగళూరు నగరాన్ని ఇటీవల అతలాకుతలం చేసిన వర్షాలు,వరదల సమయంలో ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై ఎగసిపడుతున్న ప్రజాగ్రహం. ఇలా అన్ని వైపుల నుంచీ ప్రభుత్వాన్ని సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  నాలుగేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ రాకున్నా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బీజేపీ. అప్పటి నుంచి అధికారాన్ని నిలుపుకోవడానికి నానా తంటాలూ పడుతోంది.   ఇటీవలకురిసిన వర్షాలకు బెంగళూరు ముంపునకు గురైంది. ఐటి కంపెనీలు నీట మునిగిపోయాయి.   ప్రభుత్వ పథకాల్లో అవినీతి పెచ్చరిల్లింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం వచ్చే ఎన్నికలలో అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజాగ్రహాన్ని తగ్గించి, వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు పావులు కదపడం మొదలెట్టింది. అందులో మొదటిగా  ప్రజాభిమానం పొందడంలో అన్ని విధాలుగా విఫలమైన ముఖ్యమంత్రి బొమ్మై స్థానంలో మరొకరిని సీఎం కుర్చీలో కూర్చో పెట్టాలని భావిస్తోంది. నాలుగో కృష్ణుడు ఎవరా అన్న ఆసక్తి కర్నాటక బీజేపీలో నెలకొంది. అసలే బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వ బండిని లాగిస్తున్న కర్నాటక బీజేపీలో సీఎం ఆశావహుల సంఖ్య భారీగానే ఉందంటున్నారు. ఇప్పుడు బొమ్మై స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తే ఎవరు అసమ్మతి రాగం ఆలపిస్తారో అన్న ఆందోళన బీజేపీ హైకమాండ్ లో వ్యక్తమౌతోంది. 

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు: స్పష్టం చేసిన సీఈసీ

ఏపీ సీఎంకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ   శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎంపిక చెల్లదని విస్పష్టంగా తేల్చేసింది.ఒక్క వైసీపీ అనే కాదు ఏ రాజకీయ పార్టీలోనూ  శాశ్వత పదవులు అనేవి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. పార్టీ శాశ్వత ఎన్నిక నియమాల ఉల్లంఘనేనని పేర్కొంది. ఈ మేరకు వైసీపీ  జనరల్ సెక్రటరీకి సీఈసీ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లుబాటు కాదని ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో జగన్మోహన్‌రెడ్డిని ఎన్నుకున్న సంగతి విదితమే. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించిన సంగతి విదితమే  సీఈసీ గైడ్ లైన్స్ మేరకు గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ  రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి  అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. అంతే తప్ప పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియామకాలు వీలు కాదు. నిబంధనలు విస్పష్టంగా ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీ నిర్దుష్ట కాలపరిమితిలో ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలి.  అందుకే వైసీపీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడంటూ ఆ పార్టీ చేసిన తీర్మానం, ఎన్నిక చెల్లదని సీఈసీ స్పష్టం చేసింది.

చిరును వదలని రాజకీయ బొమ్మాళి

అవును .. నిజం చిరును రాజకీయం వదలనంటోంది.  అవునండోయ్ .. నిజమే నండోయ్ తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు తన నుంచి ఇంకా దూరం కాలేదంటూ చిరంజీవి ఇటీవల చేసిన ఆడియో ట్వీట్,  గాడ్ ఫాదర్ సినిమా డైలాగే అయినా, నిజమేనండోయ్. చిరంజీవి రాజకీయాలకు దూరమైనా, రాజకీయాలు ఆయన్ని వదలడం లేదన్నది మాత్రం ‘రియల్’ గానూ నిజమేనండోయ్.   ఆయన రాజకీయాలను వదిలేసి చాలాకాలమే అయింది. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత ఇంకొంత కాలం, రాజ్యసభ సభ గడువు ముగిసే వరకు రాజకీయాల్లో ఉండీ ఉండన్బట్లు ఉన్నా, ఆ తర్వాత, రాజేకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. సినిమాల్లో బిజీ అయి పోయారు. తమ్ముడు పవన్ కళ్యాణ్’ రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు, ఎన్నికల్లో పోటీ చేసినా, చిరంజేవై మాత్రం, అసలు ఆ దిక్కు కేసి .. ఒక్క  స్టెప్ కూడా వేయలేదు. కనీసం ఒక్కసారి పేస్ టర్నింగ్ ‘ ఇచ్చి ఒక్క లుక్కైనా వేయలేదు.  అయినా .. .అయన పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, రాహుల్ గాంధీ ఏపీ పార్టీ అధ్యక్ష పదవి చిరంజీవికి ఇచ్చే ఆలోచన చేశారు. చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న ఉమెన్ చాంద్ కి అప్పగించారు.  ఆవసరమైతే    తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, చిరంజీవి పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతున్నారని అమరావతిలో-హైదరాబాద్’లో పార్టీ సమావేశాలు నిర్వహించినా దూరందూరంగానే ఉన్నారు. అప్పట్లోనే చిరంజేవి కాంగ్రెస్ పార్టీలో  ఉన్నట్లా, లేనట్లా అన్న చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సినిమా టికెట్’ రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా ప్యాలెస్కు పిలిచి చర్చలు జరిపారు. ఓ చిరు సన్మానం కూడా చేశారు. అప్పుడు మళ్ళీ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూ, ‘ఇదిగో తోక, అదిగో పులి’ వార్తలు షికారు చేశాయి. చివరాఖరుకు మెగా స్టార్, అబ్బే అలాంటిదేమీ లేదని సంజాయషీ లాంటింది ఇచ్చుకునేందుకు చాలా చాలా శ్రమ తీసుకోవలసి వచ్చింది.  అలాగే, ఈ మధ్యనే అల్లూరి సీతరామరాజు 125వ జయంతి సందర్భంగా, భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నఅల్లూరి విగ్రహవిష్కరణ సభలో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిపిచారు. ప్రధాని మోడీ ఎదురెళ్ళి మరీ చిరంజీవిని వేదిక మీదకు ఆహ్వానించారు. హగ్గులు, అలింగానాల ద్వారా ప్రధాని మోడీ స్వయంగా  ఇద్దరి మధ్య, ‘సంథింగ్, సంథింగ్’ ఎదో ఉందనే సంకేతాలను పంపించారు. అదే వేదిక మీదున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చివరకు మంత్రి రోజా, కంటే కూడా చిరంజీవికి మోడీ కొంచెం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో చిరంజీవిని బీజేపీ దువ్వుతోందనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే మెగా బ్రదర్  నాగబాబు, ఆ వేదిక మీద ఒక్క చిరంజీవి మినహా మిగిలిన అందరూ అద్భుతంగా నటించారని, ఓ కాంట్రవర్షల్ కామెడీ కామెంట్ కూడా చేశారు. బట్ ఇక్కడ అది అప్రస్తుతం అనుకోండి. సో .. చిరంజీవి, గాడ్ ఫాదర్ చితం ప్రమోషన్ కు రిలీజ్ చేసిన, డైలాగులో చెప్పినట్లుగా,  తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు ఆయన నుంచి దూరం కావడం లేదన్నది... నిజంగానే నిజం.అయిత ఇక్కడితో కథ కంచికి చేరలేదు. అసలు  అసలు ట్విస్ట్ ఇక్కడే ..ఉంది. ఇంచుమించుగా ఓ 25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగతున్న ఎన్నికల్లో, చిరంజీవికి ఓటు హక్కు ఉంది. అవును, అవును కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో ఆయనకు తెలుసో లేదో కానీ, కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవి పేరుతో ఉన్న ఐడీకార్డును కాంగ్రెస్ పార్టీ  విడుదల చేసింది. పోనీ అదేదో ఆకతాయలు పననుకుందామా అంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా  స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డు కాంగ్రెస్ పార్టీ  జారీ చేసింది. దీంతో, చిరంజీవి రాజకీయాలకు దూరమైనా .. రాజకీయాలు ఆయన నుంచి దూరం కావడం లేదని మరో మారు పక్కగా, కన్ఫర్మ్ అయింది ... అంతే మరి మామూలు గజ్జీ, తామర అయితే ఏ  జాలింలోషన్’తోనో నయం అవుతాయి.. ఇది రాజకీయ గజ్జీ,అంటుకుంటే అంతే.. ఇక వదలనే వదలదు. గోకుతూనే ఉంటుంది.

ఇది అనైతిక‌, అనారోగ్య రాజ‌కీయం.. సుజ‌నా చౌద‌రి 

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్చ‌డం అంశంపై బుధ‌వారం అసెంబ్లీలో విప‌క్షం విరుచుకు ప‌డింది. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌.టి.రామావు హెల్త్ యూనివ‌ర్సిటీ క‌ల సాకారం చేయ‌ డానికి స్థాపించిన వ‌ర్సిటీకి ఆపేరు ఉండ‌డాన్ని అన్ని వర్గాల‌వారూ, అన్ని పార్టీల‌వారూ ఆమోదించార‌ని. అదే పేరుతో కొన‌సాగుతోంద‌ని ఇపుడు ఆ పేరు మార్చాల‌నుకోవ‌డం దారుణ‌మ‌ని తెలుగుదేశం స‌భ్యులు ఆగ్ర హించారు.  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడం ఏపీ ప్రభుత్వ  అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి  అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు తన తండ్రిపై అంత ప్రేముంటే ఏదైనా  కొత్త సంస్థను స్థాపించి దానికి ఆయన పేరు పెట్టుకుంటే ఎవరూ తప్పు పట్టరని అన్నారు. ఇలాం టి చర్యలు రాబోయే రోజుల్లో అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుజనా చౌదరి అన్నారు. కాగా,  బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ బుధవారం  మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు పిచ్చి బాగా ముదిరిందన్నారు. అధికార మదం తలకు ఎక్కి పేర్లు మార్పు చేస్తున్నారని మండి పడ్డారు. బుద్ధి, జ్థానం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ఆభిమా నులమని చెప్పుకునే వైసీపీ నేతల చర్య సిగ్గుచేటన్నారు. జగన్‌ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకు వచ్చింది.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపుపై ప్రతి తెలుగువాడు తిరగబడాలని, ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేయా లని సీఎం రమేష్‌ పిలుపిచ్చారు. అలాగే,  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజా త మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు మార్చి యావత్ తెలుగుజాతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోని జగన్రెడ్డి.. యూనివర్శిటీ నిధులు రూ.400 కోట్లు లాక్కు న్నారని ఆమె ఆరోపించారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించకపోతే.. జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.  ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు దుర్మార్గమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ,  అసలు అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  ఎక్కడ ఉన్నారని ప్రశ్నిం చారు. లక్షలాది డాక్టర్‌లు తయారయ్యే యూనివర్శిటీకి రౌడీ పేరు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయం మార్చుకోకపోతే  చరిత్ర కూడా క్షమించదని హెచ్చరించారు. 

జగన్ సర్కార్ పతనం ఖాయం.. రైతల పాదయాత్రలో కంఠంనేని రవిశంకర్

అమరావతి రైతుల పాదయాత్రలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ పాల్గొన్నారు. వరుసగా రెండో రోజూ ఆయన అమరావతి రైతులతో అడుగు కలిపి నడిచారు.  అమరావతి నినాదంతో దివిసీమ మార్మోగింది.  అమరావతి రైతుల మహాపాదయాత్ర పదో రోజు బుధవారం (సెప్టెంబర్21) కృష్ణా జిల్లా చల్ల పల్లి నుంచి చిన్నాపురం వరకూ సాగింది.  తెలుగువన్ ఎండీ, తెలుగుదేశం నాయకుడు కంఠంనేని రవిశంకర్ వందలాది మంది మద్దతుదారులతో కలిసి రైతులతో పాటు  నడిచారు. చల్లపల్లిలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి పదో రోజు యాత్ర ప్రారంభించిన రైతులకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర అరసవల్లి చేరేసరికి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకతప్పదని, ఆ తరువాత జగన్ సర్కార్ పతనం కావడం కూడా తథ్యమని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతే జనం మూడు రాజధానులను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారనడానికి తార్కాణమన్నారు.  రైతుల పాదయాత్రకు రవిశంకర్ స్వంత నియోజకవర్గమైన అవనిగడ్డలో  జనం బ్రహ్మరథం పట్టారు.  రైతుల పాదయాత్రకు మద్దతుగా దివి సీమ  జనం  ఉప్పెనలా కదిలారు. రైతులపై పూల వర్షం కురిపించారు. దీంతో రైతులు నేల మీద కాకుండా పూలపాన్పుపైన నడుస్తున్నారా అనిపించింది. ఆకుపచ్చ ప్రవాహంలా రైతుల పాదయాత్ర సాగుతుంటే, వారికి మద్దతుగా  జనం జై అమరావతి నినాదాలు చేశారు. ఎడ్ల బళ్లకు అమరావతి ప్రభలు కట్టి అమరావతి రైతుల పాదయాత్రకు దివిసీమ వాసులు స్వాగతం పలికారు. జనసేన, కాంగ్రెస్, వామపక్షాల నేతలు కూడా తరలి వచ్చి అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలికారు. 

వినాశకాలే విపరీత బుద్ధి..!

రాజకీయాలలో, ఆత్మ హత్యలే కానీ, హత్యలు ఉండవు అంటారు పెద్దలు. అది నిజమని గతంలో అనేక మంది రుజువు  చేశారు. ఇప్పుడు ఎన్డీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అటువంటిదే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏ దేవుడు ఏ కలలో ఆదేశించాడో ఏమో కానీ, అయన  రాత్రికిరాత్రి  ఆత్మహత్యా సద్రుస్యమైన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఉన్నమంద బలాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో తెలుగు ప్రజలను అవమానించే నిర్ణయాన్ని తీసుకున్నారు.  తెలుగు దేశం పార్టీతో ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో,అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  ఎన్నైనా విభేదాలు ఉండవచ్చును. కానీ, ఆ కారణంగా, దివంగత నేత, నందమూరి తారక రామా రావు పేరును తుడిచేయడం అపచారం, నేరం అంటే సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే,  వినాశకాలే విపరీత బుద్ధి.. అంతకు మించి వేరే చెప్పవలసింది లేదు, ఉండదు. రాజకీయంగా, పోగాలం దాపురించిన వారు మాత్రమే ఇలాంటి అపచారానికి ఒడిగడతారు. నిజానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడచిన మూడు సంవత్సరాలలో తనకు తానుగా ఎన్నెన్ని గోతులు తవ్వుకుందో లెక్కలేదు. అయితే, ఇప్పుడు చేసిన తప్పు, సామాన్యమైన  తప్పు కాదు. మహా పాపం. ఒక విధంగా తమ రాజకీయ సమాధికి తామే ఇటుకలు పేర్చుకోవడంతో  సమానం. ఎన్టీఅర్, తెలుగు దేశం పార్టీ స్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు పరిమితం అయిన సమాన్య వ్యక్తి, నాయకుడుమ నటుడు మాత్రమే కాదు. కుల మత రాజకీయాలకు అతీతంగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామ రావు. ఆంధ్రుల  అన్నగా తెలుగు వారి గుండెల్లో గుడికట్టుకున్న శ్రీరామ చద్రుడు. శ్రీ కృష్ణుడు, ఎన్టీఅర్. అలాంటి మహనీయుని  ఇలా అవమానిస్తే, తెలుగు ప్రజలు క్షమించరు. క్షమిస్తే వారు తెలుగు ప్రజలు కాదు. నిజానికి, వైఎస్సార్ బతికుంటే, ఎన్టీఆర్ పేరు తీసి తన పేరు తగిలించడాన్ని, ఎట్టి పరిస్థితిలో అంగీకరించకపోవునేమో, నిజమే, వైఎస్సార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరును మార్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒత్తిడితో  ఎన్టీఆర్ పేరును తీసి, రాజీవ్ గాంధీ పేరును తగిలించారు. కానీ, ఆయన ఏ నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచన కూడా చేయలేదు. కారణం ఎన్టీఅర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఅర్ మానస పుత్రిక. హెల్త్ యూనివర్శిటీ పెట్టాలనే ఆలోచన ఎన్టీఆర్‌ది. ఆచరణలోకి తెచ్చింది ఎన్టీఆర్. అందుకే ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఆయన పేరు పెట్టారు. పాతికేళ్లుగా ఆ పేరు అలాగే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎవరూ పేరు గురించి ఆలోచించలేదు. అసలు పేరు మార్చాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు. జగన్మోహన్ రెడ్డికే వచ్చింది. అవును, తమ గొయ్యి తామే తవ్వుకునే వారికే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలోస్తాయి. దుష్ట సంకల్పం కలుగుతుంది. అందుకే, వినాశకాలే విరీత బుద్ధి: అనవలసి వస్తోంది.

త్వరలో ప్రగతి భవన్ లో ఈడీ, ఐటీ జమిలి దాడులు

కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష్యంగా ఇక ఈడీ, ఐటీ జమిలి దాడులకు రంగం సిద్ధమైందా అంటే అధికారవర్గాల నుంచి ఔననే బదులు వస్తోంది. ఒక అధికారి  బదలీ.. ఒకే ఒక్క అధికారి బదలీ... తెరాస ప్రభుత్వం కాళ్ల కింద భూమి కదిలిపోతోందా అన్నట్లుగా ప్రకంపనలు సృష్టిస్తోంది.  తెలంగాణ డీజీపీ రేసులో ఉన్న ఒక  సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య అయిన హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా  వసుంధర సిన్హా  బదలీ ,ఆమె స్థానంలో ముంబై ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే సంజయ్ బహదూర్ ని తీసుకురావడంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   గత కొద్ది రోజులుగా కేసీఆర్ కుటుంబ సన్నిహితులను విచారిస్తున్న ఈడీకి  ఇప్పుడు ఇక ఐటీ దాడులు తోడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.   కేసీఆర్ కు  సన్నిహితురాలైన వసుంధర సిన్హా   ఐటీ దాడులు, విచారణకు సంబంధించిన సమాచారాన్నికేసీఆర్ కు లీక్ చేస్తున్నట్లుగా అనుమానించిన  పై అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆమెను ఆ స్థానంలో నుంచి తప్పించి సమర్ధుడైన అధికారిగా పేరున్న సంజయ్ బహదూర్ ను తీసుకు వచ్చారని అంటున్నారు. సంజయ్ బహదూర్ ఇప్పటికే తన పని మొదలెట్టేశారని కూడా అధికార వర్గాల విశ్వసనీయ సమాచారం.  ఈ నేపథ్యంలోనే  ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో   సన్నిహిత సంబంధాలు ఉన్న వారి ఆఫీసులు, నివాసాల్లోనే జరుగుతున్న సోదాలు ఏ క్షణంలోనైనా సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ కు చేరే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ నెలలో రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు దాడులు చేసిన ఈడీ బృందాలు పలు వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆదాయ వివరాలను పరిశీలించేందుకు ఐటీ సహకారం కోరాయి. దీంతో అగ్నికి అజ్యం పోసినట్లు  జమిలిగా ఈడీ, ఐటీలు దూకుడు పెంచినట్లైంది. ఢిల్లీ  లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ,ఐటీ  సమష్టిగా కేసీఆర్ కు బంధువు అయిన వెన్నమనేని శ్రీనివాసరావును విచారించాయి. ఈ విచారణలో ఆయన నిర్వహిస్తున్న సంస్థలు అన్నీ సూట్ కేసు కంపెనీలేనని తేలింది. కేవలం మనీ లాండరింగ్ కోసం వాడుకుంటున్నవేననీ తెలినట్లు తెలుస్తోంది.  కాగా ఈ  దాడులపై టీఆర్ఎస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందాయన్న ప్రచారాన్ని కవిత వినా మిగిలిన టీఆర్ఎస్ నేతలు ఎవరూ ఖండించకపోవడమే ఇందుకు తార్కాణంగా పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో సంతోష్ కుమార్ పేరు కూడా బయటకు వచ్చింది. ఈడీ..బోడీ ఎవరూ ఏమీ చేయలేరంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. మోడీ నన్ను గోకకపోయినా నేను ఆయనను గోకుతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మోడీ సర్కార్ ఢిల్లీ లిక్కర్ స్కారం వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం నిగ్గు తేల్చేందుకు నిర్ణయించుకుందని అంటున్నారు. కేసీఆర్ కు సమాచారం లీక్ చేస్తున్నారన్న అనుమానంతో వసుంధర సిన్హా ను బదిలీ చేసి ఆమె స్థానంలో సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందిన సంజయ్ బహదూర్ ను తీసుకురావడం కీలక పరిణామంగా చెబుతున్నారు. సంజయ్ బహదూర్ అప్పుడే తన పని ప్రారంభించేశారనీ, ఈ కేసులు సంబంధించి ఏ క్షణంలోనైనా సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అధికార వర్గాల బోగట్టా. ఇప్పుడు ఇక ఈడీ, ఐటీ దాడులు ప్రగతి భవన్ కు చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు.  కేంద్ర హోమంత్రి హోదాలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా  ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీ (ఎస్ వీపీ ఎన్ పిఏ) పోలీసు అకాడమీలో ఈడీ, ఐటీ అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా ఈ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయనడానికి తార్కాణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ సాగిన దాడులు, విచారణలు ఒకటైతే ఇక ముందు  జరగబోయే దాడులు, విచారణలు ఒకెత్తుగా వారు అభివర్ణిస్తున్నారు. మొత్తంగా డిల్లీలిక్కర్ స్కాం తీగ లాగితే కేసీఆర్ కుటుంబం డొంక కదులుతోందన్న అభిప్రాయం అయితే అధికారులలో వెల్లడౌతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రెండు మూడు రోజులలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  

టిడబ్ల్యు జెెె ఎఫ్ పాద‌యాత్ర‌ను అనుమ‌తించండి.. కోర్టు  ఆదేశం

తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యుజెెె ఎఫ్) మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నాయ‌కుడు వి.అశోక్ కుమార్ పాద‌యాత్ర‌కు అనుమ‌తించాల‌ని సైబ‌రాబాద్‌, హైద‌రాబాద్‌, సిపిలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్‌పీకీ బుధ‌ వారం తెలంగాణా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కె.ల‌లిత ఆదేశాలు జారీ చేశారు. వి.అశోక్ కుమార్ సెప్టెం బ‌ర్ 25 నుంచి 30 తేదీవ‌ర‌కూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు పాద‌యాత్ర చేయ‌ను న్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 2008లో జారీచేసిన  జీఓ 424, 2008 ప్ర‌కారం జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వా ల‌ని  తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను త‌మ ఫెడ‌రేష‌న్ త‌ర‌ఫున ప్ర‌తిపాద‌న‌ను అంద‌చేయ‌ డానికి అశోక్ కుమార్ పాద‌యాత్ర చేయ‌త‌ల‌పెట్టిన‌ట్టు హైకోర్టుకు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  2008 జీఓ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు 2010లో త్రోసిపుచ్చారు. కాగా ఇటీవ‌ల మాజీ ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి. ర‌మ‌ణ నేతృత్వంలో  సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్, దేశంలో జ‌ర్న‌లిస్టులు అంద‌రికీ ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయిం చాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. 

లోకేష్ యాత్ర‌తో వైసీపీ సీన్ సితారేనా?

యాత్ర‌లంటే బామ్మ‌గారి తిరుప‌తి యాత్ర‌, కాశీయాత్రో అనుకునేవారు. కాల‌క్ర‌మంలో భ‌క్తిపూర్వ‌కంగానే కాదు, సామాజిక న్యాయం కోస‌మో, రాజ‌కీయ‌ల‌బ్ధికో ఒక యాత్రకు వెళ్ల‌డం చూస్తున్నాం. ఇపుడు  రాను రాను యాత్ర అంటే పాద‌యాత్ర‌లకే అధిక ప్రాధాన్యం ఏర్ప‌డింది. రాజ‌కీయ‌పార్టీల‌వారు అన్ని ప్రాంతా ల్లోనూ ప్ర‌జ‌ల‌కు త‌మ అజెండానో, మానిఫెస్టోనో తెలియ‌జేడానికి, ఓట‌ర్ల‌ను త‌మ‌వేపు తిప్పుకోవ‌డానికీ పాద యాత్ర‌లు చేప‌డుతున్నారు. వీటికీ రంగుమారి పాద‌యాత్రలే విజ‌య‌ర‌హ‌స్యాలు అన్న అభిప్రా యాలు స్థిరమైనాయి. ఒక్క పాద‌యాత్ర వీల‌యినంత దూరం చేస్తే రాజ‌కీయ‌భ‌విత‌ను మార్చే స్తుంద‌న్న గ‌ట్టి న‌మ్మ కం ఇపుడు రాజ‌కీయ‌పార్టీల అధినేత‌ల నుంచి మామూలు కార్య‌క‌ర్త‌కూ ఏర్ప‌డింది.  ఏపీలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు కాపాడేందుకు, వారి ఆశ‌లు ఫ‌లించేలా చేయ‌డానికి, వారి వ్య‌ధ‌ల‌ను తొల‌గించ డానికి తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రాన్ని జే గ్యాంగ్ సంకెళ్ల నుంచి త‌ప్పించ‌డానికి ఆయ‌న కంక‌ణం కట్టుకున్నారు. ప్ర‌తీ ప్రాంతంలోనూ ప్ర‌జ‌లు వైసీ పీ పాల‌న ప‌ట్ల విముఖ‌త‌తోనే ఉన్నారు. ఇటీవ‌ల వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం ఘోరంగా విఫ‌లం కావ‌డం అందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌. మూడేళ్ల పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఇద‌మిద్ధం చేసిన మేలు అంటూ ఏమీ లేక‌పోగా హామీలు, ఉప‌న్యాసాలు, బోధ‌న‌లే ఎక్కువ‌య్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అభి వృద్ధి అనేది ఏరంగంలోనూ క‌నిపించ‌డంలేదు. పైగా విప‌క్షాల మీద దుర్భాష‌లాడుతూ విరుచుకు ప‌డ‌టం త‌ప్ప ప్ర‌త్యేకించి చేస్తున్న‌దేమీ లేదు. ఇది ప్ర‌జ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత బాగా గ‌మ‌ని స్తున్నారు.  ప్ర‌శ్నించేవారిపై దాడులు చేప‌ట‌ట‌డం త‌ప్ప సంక్షేమప‌రంగా చేస్తున్న‌దేమీ లేదు.  ఈ ప‌రిస్థితుల్లో, నారా లోకేశ్ పాదయాత్రకు ముహూ ర్తం ఖరారైంది. నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు జనవరిలో శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నిజానికి అక్టోబర్ నుంచే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టాలని లోకేశ్ మొదట అనుకున్నారు. ఆ దిశగా కొంత కసరత్తు కూడా చేశారు. కానీ అంతర్గత చర్చల తర్వాత ఆ ముహూర్తాన్ని జనవరికి మార్చారు. ఎన్నికల వాతావరణం నెలకొన్నతర్వాత చివరి ఏడాదిలో పాదయాత్ర చేస్తే వ్యూహాత్మకంగా కలిసివస్తుం దని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. వచ్చే జనవరిలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తే ఆపై ఏడాది మార్చి నాటికి మొత్తం 450 రోజుల సమ యం ఉంటుందని టీడీపీ నేతలు లెక్కగట్టారు. 2024 మార్చి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉం ది. అప్పటికి రాష్ట్రం మొత్తం పాదయాత్ర పూర్తవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించారు. రాయలసీమ నుంచి ప్రారంభ మయ్యే లోకేశ్ పాదయాత్ర ఉత్తరాంధ్రలో ముగుస్తుంది. వీలున్నంత వరకూ ఏపీలోని అన్ని ప్రాంతాలనూ లోకేశ్ పాదయాత్ర స్పృశించేలా రూట్ మ్యాప్ను టీడీపీ నేతలు రూపొందిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడు వారంలో రెండు రోజులు విరామం ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరు కావలసి ఉండడంతో ఆ రోజుతో పాటు మరో రోజు కూడా విశ్రాంతి తీసుకుని ఐదు రోజులు మాత్రమే జగన్ నడిచేవారు. అయితే.. తనకు కోర్టు హాజరు సమస్య లేదు కాబట్టి వారంలో ఏడు రోజులూ పాదయాత్ర చేయాలని లోకేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్ని హితవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి పక్ష నేతగా పాదయా త్ర  చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ పాదయాత్ర చేసిన చివరి ప్రతి పక్ష నేత చంద్రబాబు. జగన్ పాదయాత్ర సమయానికి రాష్ట్రం విడిపోవడంతో ఆయన ఏపీలో మాత్రమే నడిచారు. ఈసారి టీడీపీ తరఫున పాదయాత్ర చేసే అవకాశం లోకేశ్ కు వచ్చింది. ఏపీలో నెలకొన్న వివిధ అంశాలపై తెలుగుదేశం పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దూర మైన వర్గాలను దరి చేర్చుకోవడానికి.. ప్రజావ్యతిరేక వైసీపీ పాలనను తూర్పారబట్టేందుకు పాద యాత్రే సరైన సాధనమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా విస్తరిస్తున్నా ఆ స్థాయిలో మరికొన్నిచోట్ల పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరగలేదని, అలా వేగం పెరగడానికి పాదయాత్ర దోహదం చేస్తుం దని అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక తకు ప్రభంజన రూపం తేవాలంటే ఒక చోదకశక్తి అవసరం. లోకేశ్ పాదయాత్ర అలా ప్రభం జనం తీసుకొ స్తుం దని టీడీపీ నేతలు, శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.

ఇక సుప్రీం విచారణలు ప్రత్యక్ష ప్రసారం

ఇక కోర్టు సీన్లు సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోనే  కాదు, ప్రత్యక్షంగానూ చూడ వచ్చును. అవును, సుప్రీం కోర్టులో విచార జరగే సమయంలోనే, వాద ప్రతివాదనలతో పాటుగా న్యాయమూర్తులు ఇచ్చేతీర్పులు, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం త్వరలో రాబోతోంది. ఈ మేరకు భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టులో కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం అందరికీ కలిపించాలని నిర్ణయించింది. ఇంత వరకు పార్లమెంట్,అసెంబ్లీ సమావేశాలు, టీవీ చర్చా కార్యక్రమాలు, రాజకీయ సభలు, సమావేశాలకు ఇతరత్రా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విధంగానే, ఇకపై, సుప్రీంకోర్టులో కీలక విచారణలకు సంబంధించి వాద ప్రతివాదనలను ప్రజలంతా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుంది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు. లలిత్‌ ఆధ్వర్యంలో జరిగినమంగళవారం (సెప్టెంబర్ 20) జరిగిన ఫుల్ కోర్ట్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. నిజానికి, కేసుల విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఈనేపధ్యంలో సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సహా పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోర్టు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది. కానీ, దాన్ని అమలు చేయడంలో జాప్యం జరిగింది. తాజాగా వచ్చేవారం నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఆచరణలో పెట్టనున్నారు. తొలుత రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్‌ చేయనున్నారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు యూట్యూబ్‌లో వీటిని టెలికాస్ట్‌ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను తయారుచేసుకోనుందని తెలిపాయి. అయితే, ఇటీవల భారత  ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పదవీ విరమణను పురస్కరించుకుని ఆగస్టు 26న ప్రత్యేకంగా సమావేశమైన సెరిమోనియల్‌ ధర్మాసనం కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంతో, జస్టిస్ రమణ  న్యాయస్థానాల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పడు, మరో అడుగు ముందుకుపడింది. ముందు ముందు, అన్ని కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా ప్రత్యక్ష ప్రసారం చేయడం వలన ప్రజలకు ఫస్ట్ హ్యాండ్ సమాచారం అందుబాటులోకి రావడమే కాకుండా పారదర్శకత పెరుగుతుంది.

ఆట‌ను ఆట‌గా చూడలేరా?

క్రికెట్ అన‌గానే అంత‌ర్జాతీయ స్థాయిలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పోటీకి స‌మానంగా చూసేది  భార‌త్‌, పాకి స్తాన్ పోటీలే. ఏ టోర్నీ అయినా, వేదిక ఏద‌యినాస‌రే ఇంగ్లండ్‌, ఆసీస్‌ల మ‌ధ్య మ్యాచ్‌ల‌కి ఉండే అత్యం త ప్రాధాన్య‌త  భార‌త్‌, పాక్ మ్యాచ్‌ల‌కీ ఉండ‌డం విశేషం. అలాగే ప్లేయ‌ర్ల‌న్నా వీరాభిమానుల మ‌ధ్య పెద్ద‌గా తేడా ఉండ‌దు. స‌చిన్‌, కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ను మ‌నం ఎంత‌గా అభిమానిస్తామో అటు పాకిస్తాన్‌ లోనూ అంతే అభిమానిస్తారు. అదేవిధంగా మ‌న‌దేశంలోనూ అబ్దుల్ ర‌జాక్‌, వ‌సీం అక్ర‌మ్‌ను అభిమా నించిన‌ట్టే బాబ‌ర్ అజామ్‌, ర‌షీద్‌, రిజ్వాన్‌ల‌ను అంతే స్థాయిలో అభిమానిస్తున్నారు.  కాబోతే మ్యాచ్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి ఎవ‌రి దేశం జ‌ట్టు వారు గెల‌వాల‌నే  కోరుకుంటారు. ఓడినా ఈజీగా  తీసుకోలేక‌పోవ‌డ‌మే అభిమానుల  మ‌ధ్య విద్రోహ‌పు ఆలోచ‌నల‌కు దారితీస్తోంది. అదే మ‌ళ్లీ బ‌య‌ట ప‌డింది. ఆసియాక‌ప్ జ‌రిగి  చాలారోజుల‌యింది. చిత్ర‌మే మంటే తొలిమ్యాచ్‌లో భార‌త్‌చేతిలో పాకిస్తాన్ ఓట‌మి తాలూకు ప్ర‌భావం ఇంకా పోలేదు. పాక్ వీరాభిమా నులు లండ‌న్‌లో విప‌రీత ధోర‌ణిలో వ్య‌వ‌హ రిస్తున్నారు.  భారత్- పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆయా జట్ల అభిమానుల్లో ఉత్కంఠ, ఉద్వేగం పీక్స్ కి వెళ్లి పో తుంది. ఇప్పుడు గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్- పాక్ ల మధ్య జరి గిన మ్యాచ్ లండన్ లో హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలను తార స్థాయికి చేర్చింది. మ్యాచ్ జరిగి రోజు లు గడిచిపోతున్నా.. ఆ ఉద్రిక్తతలు సడలడం లేదు.తాజాగా లండన్ లోని వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలోని దేవాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసనకు దిగారు. అల్లాహో  అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత  తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో  న హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్ష ణల  నేపథ్యంలోనే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  లీసెస్టర్ అల్లర్ల కు సంబంధించి ఇప్పటివరకు పలువురిని  అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయ కులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.  తాజాగా లండన్ లోని వెస్ట్ మిడ్ లాండ్స్ లోని  ఒక  పట్టణంలోని దేవాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసనకు దిగారు. అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత  తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో  హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్ష ణల  నేపథ్యంలోనే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  లీసెస్టర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు పలువురిని  అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయకులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.  

ఏసీసీ టీ-20 కి  హ‌ర్మ‌న్‌ప్రీత్ జ‌ట్టు

ఏసీసీ టీ-20 ఛాంపియ‌న్‌షిప్‌కి  హ‌ర్మ‌న్ ప్రీత్ నాయ‌క‌త్వంలో భార‌త్ మ‌హిళ‌ల జ‌ట్టు ఎంపిక‌ చేశారు.  బెంగుళూరులో  ఈ టోర్నీ అక్టోబ‌ర్ 1 నుంచి 15 వ‌ర‌కూ జ‌రుగుతుంది.  ఇటీవ‌లి ఇం గ్లండ్ సిరీస్లో పాల్గొన్న జ‌ట్టులో ఉన్న‌వారే తిరిగి ఎంపిక‌య్యారు. స్టాండ్‌బైలుగా తానియా భాటి యా, సిమ్ర‌న్ బ‌హ‌దూర్ ఎంపిక‌య్యారు.  ఆరుప‌ర్యాయాలు ఛాంపియ‌న్‌గా నిలిచిన భార‌త్ ఈ ఛాంపియ‌న్‌షిప్‌లో మొద‌టి మ్యాచ్ శ్రీ‌లంక‌తో  త‌లప‌డుతుంది. అక్టోబ‌ర్ 7న పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డు తుందని ఆలిండియా మ‌హిళ‌ల క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. బెంగుళూరులో జ‌రిగే ఛాంపి య‌న్‌షిప్‌లో మొత్తం ఏడు జ‌ట్లు పాల్గొంటాయి. వీటిలో బంగ్లా దేశ్‌, పాకిస్తాన్‌, శ్రీ‌లంక‌, థాయ్‌లాండ్‌, మ‌లేషియా, యుఏఇ జ‌ట్లు ఉన్నాయి.  హ‌ర్మ‌న్‌ప్రీత్ నాయ‌క‌త్వంలోని భార‌త్ జ‌ట్టులో స్మ్రితీ మంధాన‌(వైస్‌కెప్టెన్‌), దీప్తిశ‌ర్మ‌, ష‌ఫాలీవ‌ర్మ‌, రోడ్రిగ్స్‌, మేఘ‌న‌, రిచాఘోష్ (వికెట్‌కీప‌ర్‌), స్నేహారాణా, హేమ‌ల‌త‌, మేఘ్నాసింగ్‌, రేణుకాథాకూర్‌, పూజా, రాజేశ్వ‌రి గైక్వాడ్‌, రాధాయాద‌వ్‌, కె.పి.నావ‌గిరె ఉన్నారు. 

మునుగోడుకు ముందే ముందస్తు.. కేసీఆర్ వ్యూహమిదేనా?

 తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాజకీయ విజ్ఞత, వివేచన విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమనాలు అక్కరలేదు. సమయానుకూలంగా స్ట్రాటజీలను మార్చడంలో ఆయన దిట్ట. అందులో సందేహం లేదు. అయితే, కారు జోరు రివర్స్ లో పరుగులు తీస్తున్న ప్రస్తుత సమయంలో కేసీఆర్ అడుగులు తడబడుతున్నాయి. జాతీయ స్థాయిలో జెండా ఎగరేసే విషయంలో అయితే నేమి, రాష్ట్రంలో రోజు రోజుకు పైకి పాకుతున్న ప్రభత్వ వ్యతిరేకతను కట్టడి చేసే విషయంలో అయితే నేమి కేసేఆర్ వ్యూహాలు గతంలో పనిచేసినంత చురుగ్గా పనిచేయడం లేదు. జాతీయ రాజకీయాలకు ఒక బ్రేక్ ఇచ్చి, రాష్ట్రం  మీద దృష్టిని కేంద్రీకరించారు. కేంద్ర ప్రభుత్వం ,బీజేపీపై యుద్ధాన్ని కొనాసగిస్తునే, రాష్ట్రంలో కరిగి పౌతున్న ఓటు బ్యాంకు కాపాడు కునేందుకు కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. కొత్త పథకాలతో కొత్త కొత్త ఎత్తులతో, పోగుట్టుకున్న ప్రతిష్టను, నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజనుల రిజర్వేషన్ ను ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నట్ల ప్రకటించారు. అది కూడా ఎప్పుడో కాదు, జస్ట్ ఒక వారం రోజుల్లోనే జీవో వస్తుందని తెలంగాణ విమోచన దినం ( సెప్టెంబర్ 17) రోజున ప్రకటించారు. అంతేకాదు,  తెలంగాణ ఏర్పాటయ్యాక గిరిజనుల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా.. ఇప్పటికీ స్పందన లేదని విమర్శించారు. కేంద్రానికి మొరపెట్టుకొని.. విసిగిపోయామని..ఇక ఓపిక లేదని.. వారం రోజుల్లోనే రిజర్వేషన్ల జీవోను జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ జీవోను గౌరవించి అమలు చేస్తావా? లేదంటే దానిని ఉరి తాడు చేసుకుంటావా? అని ప్రధాని నరేంద్రమోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటన విషయంలో, ఎవరికుండే అనుమానాలు వారికున్నాయి. ముఖ్యంగా, ఎస్సీలు, ఇతర వెనకబడిన కులాలు, గిరిజనుల రిజర్వేషన్ పెరిగితే, మొత్తం రిజర్వేషనలు, సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిధ్జిని దాటి పోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే ముఖ్యంత్రి, అధికార పార్టీ నాయకులు  మాత్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను అనుమతించిన సుప్రీం కోర్టు, తెలంగాణలో ఎందుకు అనుమతించదని ప్రశ్నిస్తున్నారు. అయితే, గతంలో ఇదే వ్యూహంతో అడుగులు వేసిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బొక్కబోర్లా పడ్డాయని, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.   తాజాగా, ఛత్తీస్ సగఢ్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ పదేళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ పి.పి.సాహూల ధర్మాసనం రెండు రోజుల క్రితం (సోమవారం) తీర్పు వెలువరించింది. 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను పెంచడం సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యంపై ఎలాంటి అధ్యయనం కూడా చేయలేదని పేర్కొంది. ఛ త్తీస్ గఢ్‌ ప్రభుత్వం కూడా తమిళనాడు ఉదాహరణను ఉతకిస్తూ తెలంగాణ ప్రభుత్వ చేసిన వాదనే చేసింది.అయినా,  న్యాయస్థానం పెంపు చెల్లదని తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎంతవరకు న్యాయ విచారణకు  నిలుస్తుందనే విషయంలో సందేహాలున్నాయి. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక గిరిజనులకు మేలు చేయాలనే సంక్సల్పం కంటే, పార్టీ, కుటుంబ సభ్యలను కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు నుంచి కాపాడుకునే కాపాడుకునే సంకల్పమే బలంగా పనిచేస్తోందని, అంటున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి, అక్కడితోనూ ఆగలేదు. హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రకటించిన దళిత  బంధు తరహాలో, గిరిజన బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి గిరిజన కుటుంబానికి రూ.10 లక్షలు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలో దళిత బంధుతో పాటుగా ఇంకా అనేక ప్రయోజనాలు వెదజల్లినా తెరాస అభ్యర్థి ఓడిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి  ఉద్దేశపూర్వకంగా మరిచి పోతున్నారని అంటున్నారు.  ఆదలా ఉంటే, గిరిజనులకు ఈ జంట వరాలను ప్రసాదించడం వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అలోచన చేస్తున్నారా, అనే సదేహలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా, ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. అది ఆందోళనల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత  ప్రతిష్టాత్మకం, పారదర్శకం అటూ తెచ్చిన ధరణి పోర్టల్ దగాకు మోసపోయిన నలుగురు రైతులు ఒకే రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేశారంటే, ఒక్క ధరణి ఎకౌంటులో ప్రభుత్వ ప్రతిష్ట ఎంతగా దిగజారిందో, ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయికి చేరిందో, వేరే చెప్పనవసరం లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చకక్దిద్దుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.  నిజానికి, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు కాదు, తెరాస రెండవసారి, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.86 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెరాస, సంవత్సరం తిరగకుండా 2019 లోక్ సభ ఎన్నికల నాటికే, 41.29 శాతం ఓట్లతో తొమ్మిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. అంటే సంవత్సర కాలంలోనే ఐదు శాతం ఓటు కోల్పోయింది . మరో వంక  అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 7.1 శాతం ఓటుతో, ఒకే ఒక్క స్థానం గెలుచుకున్నబీజేపీ, లోక్ సభ ఎన్నికలలో 19.45 శాతం ఓటుతో, 4 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. అంటే ఒకే ఒక్క సంవత్సరంలో బీజేపీ ఓటు షేర్ 12 శాతం పెరిగింది.   ఆతర్వాత జరిగిన దుబ్బాక, హుజురా బాద్ ఉపఎన్నికలు, జీహెచ్ఎంసి ఎన్నికలు బీజేపీ లో జోష్ ను పెంచాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తారుమారైతే, ఇక ఆతర్వాత ఏ బంధు ప్రకటించినా ఫలితం ఉందని ముఖ్యమంత్రి గమనించారు. అందుకే, మునుగోదుకు ముందే ముందస్తు ఎన్నికలకు పోవడం మంచిదనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకే, మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే విషయంలోనూ ముఖ్యమంత్రి వెనకా ముందు అవుతున్నారని అంటున్నారు.

 నెల్లూరు జిల్లాలో బరితెగించిన వైసీపీ నేతలు  

జానెడు స్థ‌లం ఉన్నా వెయ్యేనుగుల బ‌లంతో ఉంటారు పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తివారు, అదీ ప‌ట్ట‌ణ ప్రాం తంలో ఉంటే మ‌రీ ధైర్యంగా ఉంటారు. కానీ అది త‌మ‌ది అంటూ రిజిస్ట‌ర్ చేయించుకున్న కాయితాలు ఉంటే స‌రిపోదు. రోజూ వెళ్లి చూసుకున్నా చాల‌దు. ఎందుకంటే ఇది భూక‌బ్జాదారుల కాలం. వాళ్ల‌కి ఊరు, పేరు, కాలం, స్థ‌లం ఎంత అనేదానితో సంబంధం లేదు, చూపు ప‌డిందంటే అది వాళ్ల‌ది అయి పోవాలి. అందు కు ఎలాంటి దారుణాల‌యినా చేసేస్తున్నారు. వారికి చ‌ట్టాలు, కోర్టులు, పోలీసులు అంటే బొత్తిగ భ‌యం భక్తీ  ఉండ‌దు. దాడి చేయ‌డం ఆక్ర‌మించుకోవ‌డ‌మే తెలుసు.  తాజాగా రాజ‌కీయ‌రంగుపూసుకుని మ‌రీ దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఏమ‌న్నా అంటే ఫ‌లానా ఆయ‌న మ‌ద్ద‌తు ఉంద‌ని బాహాటంగానే ప్ర‌క‌టించి మ‌రీ కాజేస్తున్నారు. అదుగో అలా దాడిచేసిన సంఘ‌ట‌న ఒక‌టి నెల్లూరు జిల్లాలో జ‌రిగింది. అబ్దుల్లా అనే ఆయ‌న‌ నెల్లూరుజిల్లా మ‌ర్రిపాడు మండ‌లం కృష్నాపురానికి చెందిన రైతు. ఆయ‌న‌కు మూడు ఎక‌రాల భూమిఉంది. పొలాన్ని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆమ‌ధ్య హ‌ఠాత్తుగా కొంద‌రు గూండాలు వ‌చ్చి ఇది మాది, దీన్ని వదిలేయ‌మ‌ని దాడి చేశారు.  వైసీపీ నేత చింత‌గుంట ర‌విరెడ్డి  అలా అబ్దుల్లా భూమిని ఆక్ర‌మించేసుకున్నాడు. దీన్ని గురించి అబ్దుల్లా కోర్టుకి వెళ్లాడు. ర‌విరెడ్డి దురాక్ర‌మ‌ణ చేశార‌ని, ఆ భూమి అబ్దుల్లాదేన‌ని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది.  కోర్టు తీర్పు ధైర్యంతో అబ్దుల్లా మ‌ళ్లీ పొలంప‌నుల‌కు వెళ్లారు. మ‌ళ్లీ ర‌వి గూండాల‌తో  వ‌చ్చి అబ్దుల్లా ను ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌పైనా విరుచుక‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. గాయ‌ప‌డిన‌వారు ఆత్మ‌కూరు ఆస్ప‌త్రిలో చికిత్స‌కు చేరారు. కోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత కూడా వైసీపీ నాయ‌కుడు ఇలా దాడికి పాల్ప డటం దారుణ‌మ‌ని గ్రామ‌స్తులు అంటున్నారు. కాగా త‌న కుటుంబానికి వైసీపీ నేత‌ల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని అబ్దుల్లా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని అబ్దుల్లా వేడుకుంటున్నారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే!

కొంద‌రికి శ‌త్రువులు, మిత్రులు, వీరాభిమానుల కంటే భ‌క్త‌గ‌ణ‌మే ఎక్కువ ఉంటారు. అదుగో అలాంటి మ‌హామ‌నిషి నంద‌మూరి తార‌క‌రామారావు. ఎన్‌టిఆర్ అంటూ వీరాభిమానంతో పిలుచుకునే తార‌క రాముడు సినీన‌టునిగా, రాజ‌కీయ‌నాయ‌కునిగా, మ‌రీ ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రిగానూ ప్ర‌జ‌ల హృద యాల్లో నిలిచిన వ్య‌క్తి. ఆయ‌నంటే ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా అరుదు. ఆయ‌న పేరుతో హెల్త్ యూని వ‌ర్సీటీ ఏర్పాటు అయిన‌పుడు సంతోషించ‌ని వారులేరు. అది ఆయ‌న్ను హృద‌య‌పూర్వ‌కంగా గౌర‌వించు కోవ‌డ మే అన్నారంతా.  ఇపుడు ఆ యూనివ‌ర్సిటీ పేరు మార్చ‌డం విష‌యంలో అన్ని పార్టీల‌వారూ ప్ర‌బుత్వా న్ని ప్ర‌శ్నిస్తున్నారు. హెల్త్ యూనివ‌ర్సిటీ అనేది ఎన్టీఆర్ క‌ల అని అందువ‌ల్ల‌నే ఆయ‌న పేరిట‌నే స్థాపించడం జ‌రిగింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు.   ఆయ‌నంటే పార్టీలు, కుల‌మ‌త వ‌ర్గాల‌తో సంబంధంలేకుండా ప్రేమించేవారి శాత‌మే ఎక్కువ‌. ప్రాంతీయా భిమానానికి ప్ర‌తినిధిగా పార్టీ పెట్టి అన‌తికాలంలో ముఖ్య‌మంత్రి అయి, అటు కేంద్ర రాజ‌కీయాల్లోనూ ప్ర‌భావం చూపిన ఘ‌నుడు ఎన్టీ ఆర్‌. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు జాతికి దుర‌దృష్ట‌మంది యావ‌త్ లోకం. అందులో ఏమాత్రం సందేహం లేద‌న్నారు అన్నివ‌ర్గాల‌వారూ, అన్ని పార్టీల‌వారూ. అదీ ఎన్టీఆర్ అంటే. వ‌ర్సిటీ పేరు మార్చ‌డం స‌బ‌బు కాద‌ని అంటూ  అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. వ‌ర్సిటీకి ఆయ‌న పేరు మార్చాల‌న్న‌ది స‌రైన నిర్ణ‌యం కాద‌ని ఆయ‌న అన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉంది. ఎన్టీఆర్ పేరు తొలగించ డం సరైన నిర్ణయం కార‌ని ఆయ‌న అన్నారు.  ఆయ‌నే కాదు,  ట్విట్టర్ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా స్పందించ‌డం గ‌మ‌నార్హం.  ఆయ‌న కావ‌డానికి వైసీపీకి చెంద‌న‌వార‌యిన‌ప్ప‌టికీ  ఎన్టీఆర్ విష‌యంలో త‌న మ‌న‌సును చంపుకోలేక పోయారు. అందుకే  ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని మార్చుకోవాల‌ని ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్‌కు విన్న‌వించారు. మీరు ఎంతో పెద్ద మనసుతో  తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారకరామారావు గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. నిజంగా అది ఎంతో చారిత్రాత్మకం..విప్లవాత్మకం..అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవ తోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనఃపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాన‌ని  వల్లభనేని వంశీ ట్విట‌ర్ ద్వారా కోరారు. 

ట్రాఫిక్ జామ్  సాక్షిగా ..!

ప్రేమ‌వ్య‌వ‌హారాలు ఎప్పుడూ చిత్రంగానే ఉంటాయి. పొలంలో ప‌నిచేస్తూ నాగేస్స‌ర్రావు సావిత్రిని, ప్ర‌బాస్ వ‌ర్షంలో త్రిష‌ని, క్లాస్లో రామ్ని నిధిఅగ‌ర్వాల్ ప్రేమించేసారు.. ఓ కుర్రాడు చాలారోజుల క్రిత‌మే బెంగు ళూరులో ట్రాఫిక్ జామ్‌లో ఓ అమ్మాయిని అమాంతం ప్రేమించేశాడు! అదెలా సాధ్యం అని ప్ర‌శ్నించుకోవ‌డం, ఆలోచించి బుర్ర‌పాడుచేసుకోవ‌డం అక్క‌ర్లేదు. ఎందుకంటే అది ప్రేమ‌.. దానికి ప్లేసు, టైమ్, వ్య‌క్తుల‌తో పెద్ద స‌మ‌స్య ఉండ‌దు. అదంతే ఎవ‌ర్నియినా ఎవ‌ర‌యినా ఫ్రేమిం చే య‌చ్చు! రైల్వే జ‌ర్నీలో తీరిగ్గా ప్రేమించేయ‌డం, దిగి పాట‌లు పాడేసుకోవ‌డం సినిమాల్లో చూపుతున్నా రు. అలాంటిది నిజ‌జీవితంలో జ‌రుగుతుందా? అని మామ్మ‌గారు మ‌న‌వ‌డినో మ‌న‌వ‌రాలినో తిట్ట‌వ‌చ్చు.. కానీ అదీ జ‌ర‌గ‌నూ వ‌చ్చు! కాల మ‌హిమ‌.  ట్రాఫిక్‌లో అంతా ఇళ్ల‌కు వెళ్లే స‌మ‌యంలో విసిగెత్తి ఉంటారు. ఎవ‌రో ఏదో గొడ‌వ‌ప‌డి ట్రాఫిక్ జామ్ అయిన సంద‌ర్భంలో ఈ ప్రేమ‌లు, బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకోవ‌డాలు జ‌రుగుతాయా? ఇది ఊహించ‌ లేని వ్య‌వహారం. కానీ ప్రేమ వ్య‌వ‌హారాలెప్పుడూ ఇంతే గురూ! అయినా ఈ బెంగుళూరు ల‌వ్‌స్టోరీ తెలుసుకోను కాస్తంత ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంటుంది. బెంగుళూరులో ఓ ప్రాంతంలోని సోనీ వ‌ర‌ల్డ్ సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర ఒక రోజు మామూలుగానే ట్రాఫిక్ జామ్ అయింది. వాహ‌నాల రొద‌. అంత‌లో ఒక కుర్రాడు విసుగ్గా  అటూ ఇటూ చూస్తున్న‌పుడు మెరుపుతీగె లాంటి అమ్మాయి క‌న‌ప‌డింది. ఆమె కూడా అదే ట్రాఫిక్‌ లో  కాస్తంత దూరంలో ఇబ్బందిప‌డుతోంది. ఆమె అవ‌స్థ‌లు చూసి న‌వ్వొచ్చిం ది. న‌వ్వుకున్నాడు. ఆమె విసుగ్గా చూస్తూ  అతన్ని చూసింది. ఈ హీరోగారు చాలా స‌ర‌దాగా అంద‌రినీ చూస్తూ న‌వ్వుకుంటున్నాడు. ఇంత చిరాకు స‌మయంలోనూ అంత ఆనందంగా ఎలా ఉన్నాడ‌ను కుందిట‌. అంతే ట్రాఫిక్‌లో ఉన్న సంగతి మ‌ర్చిపోయి అత‌న్నే చూస్తూండిపోయింది. త‌ర్వాత హార‌న్ల మోత కూడా అంత‌గా తెలియ‌లేదు. అదే ఫ్రేమ మ‌హ‌త్తు! అత‌గా డూ అంతే. త‌ర్వాత ఇద్ద‌రిమ‌ధ్యా మాట‌లు క‌లిశాయి.  ఇక్క‌డ ట్విస్ట్ ఏమంటే... వాళ్లిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం జ‌రిగి మూడేళ్ల‌యింది. అంటే వారి పెళ్లీ అయింది. కానీ వారు తొలిచూపుల్లో క‌లిసిన ఆ మ‌హ‌త్త‌ర ప్ర‌దేశం లోని ఎజిపూర ఫ్లైఓవ‌ర్ ప‌నులు మాత్రం ఇంకా పూర్తి కాలేదుట‌!

కేసీఆర్ జాతీయ‌పార్టీకి  కుద‌ర‌ని ముహూర్తం

అన్నీ అనుకోగానే అయిపోతాయా? అది కొంద‌రికి ప‌ట్టే అదృష్టం.  చాలామంది విష‌యంలో జ‌ర‌గ‌ని క‌ల‌. కొంద‌రికి ఇవాళ‌, రేపు.. అంటూ ముహూర్తాల తేదీ మారిపోతూంటుంది. ఇపుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఆయ‌న జాతీయ‌పార్టీ ఏర్పాటు ముహూర్తం తేదీ మళ్లీ మారింది. అదిగో ఇదిగో అన్న‌ది అభిమానుల‌ను ఊరించింది. ఈమ‌ధ్య ఇదుగో ద‌స‌రాకి ప్ర‌క‌టిస్తార‌ని అంతా సినిమాకోసం ఎదురుచూసిన‌ట్టు చూస్తున్నారు. ఇంత‌లో అబ్బే అక్టోబ‌ర్ 5కి ప్ర‌క‌టించ‌డం క‌ష్టమ‌న్న‌ది తేలిపోయింది. ద‌స‌రా ముహూర్తం దాటిపోయింది గ‌నుక ఇక ఈ ఏడాది డిసెం బ‌ర్ లోనే బిఆర్ ఎస్ పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌వ‌చ్చు.  ముహూర్తం మార్పు పంతులుగారు ఇంకా తేల్చ‌లేక‌పోవ‌డం కాదుట‌..కొత్త పార్టీ మానిఫెస్టోలో అంశాలు ఇద మిద్ధం ఏమి ఉండాల‌న్న‌ది ఇంకా తేల‌క‌పోవ‌డ‌మేన‌ట‌. మ‌రీ ముఖ్యంగ నీరు,విద్యుత్‌, వ్య‌వ‌సాయం, జాతీ య పార్టీ ప‌తాక రూప‌క‌ల్ప‌న మొద‌లైన అంశాల్లో పాల‌సీ ఎలా ఉండాల‌న్న‌ది  ఇంకా నిపుణుల క‌మిటీ తేల్చలేద‌ట‌. అంతేకాదు పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి ముందు మ‌రిన్ని కీల‌కాంశాల గురించి దాదా పు ప్ర‌తీరోజూ ఇంకా చ‌ర్చిస్తున్నారని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. జాతీయ‌స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌పుడు విజ‌య‌ద‌శ‌మిరోజునే ప్ర‌క‌టించా ల‌నుకున్నారు. అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద పార్టీ రిజిస్ట‌ర్ చేయించే ప‌నులు ఇంకా పూర్త‌గాక‌పోవ‌ డంతో అపుడు అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి వీలులేక‌పోయింది. కాగా టీఆర్ ఎస్ పార్టీని  కొత్త‌గా ప్ర‌తిపాదిస్తున్న జాతీయ‌పార్టీలో క‌ల‌ప‌డం విష‌యంపైనా  పార్టీ ఎగ్జిక్యూటివ్ స‌మావేశంలో ఇంకా చ‌ర్చిం చాల్సి ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై సుదీర్ఘ చ‌ర్చ త‌ర్వాత ఆ రిజ‌ల్యూష‌న్ కాపీని ఈసీకి అంద‌జేయ వ‌ల‌సి ఉంటుంది.  ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జాత‌కాల‌మీద ఎంతో న‌మ్మ‌కం ఉంది. క‌నుక మంచి ముహూర్తం కోసం ప‌ట్టుప‌డు తుం డ‌డంతోనూ కొత్త జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న జాప్యం అవుతోందని అంటున్నారు. అంద‌రూ ఎంతో ఆలోచించి, ఎంత‌మందితోనో స‌మాలోచ‌న చేసి అక్టోబ‌ర్ 5ని నిర్ణ‌యించారు. ఆ రోజు మంచి కార్య్ర‌ క‌మాలు ఆరంభించ‌వ‌చ్చ‌ని అంద‌రూ ఒక్క‌మాట‌గా సీఎంకి తెలియ‌జేశారు.  కాగా ప్ర‌స్తుతం మూఢాలు న‌డుస్తున్నాయి క‌నుక కొత్తపార్టీ ప్ర‌క‌ట‌న ముహూర్తాన్ని డిసెంబ‌ర్ 12కి వాయిదా వేశారు. అందువ‌ల్ల అప్ప‌టివ‌ర‌కూ వేచి ఉండాల్సి వ‌స్తుంది. ఈలోగా పార్టీ సంబంధించిన ఇత‌ర అంశా ల‌పై, విధివిధానా ల‌ను నిర్ణ‌యించుకో వ‌డంపై చ‌ర్చ‌లమీద దృష్టిపెడుతున్నారు.  ఒక‌వేళ డిసెంబ ర్ 12 కూడా కుద‌ర‌క‌పోతే ఇక వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ వేచి ఉండాల్సి వ‌స్తుందని రామ‌డుగు క‌ళ్యాణ‌శ‌ర్మ పండితులు తెలియ‌జేశార‌ట‌. 

మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కనిపించుట లేదు..!

ఎంత అన్నారు.. ఎంత ఎగిరారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.. మంత్రి హోదాలో ఆ  టైమ్‌లో హీరోలాగా కోర మీసాన్ని   మెలి తిప్పేశాడు.. తొడ కొట్టేశాడు. కానీ మంత్రి పదవిని   మిఠాయి పొట్లాన్ని కాస్తా కాకి ఎత్తుకుపోయిన చందంగా ఆయన జిల్లాకే చెందిన కాకాణి గోవర్థన్ రెడ్డి ఎత్తుకెళ్లిన తర్వాత, మాజీ అయిన అనిల్ కుమార్ యాదవ్ సోదిలోనే లేకుండా పోయారు. దీంతో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ అదృశ్యమైపోయారంటూ సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  మంత్రి పదవి ఊడిపోయి ... ఇంకా   ఆరు  నెలలు పూర్తి కాలేదు... అప్పడే... అనీల్ కుమార్ యాదవ్ కషాయం కట్టేశారా?.. కమండలం పట్టేసి.. సైలెంట్‌గా చెక్కేశారా? అంటూ ఆయన ప్రత్యర్థి వర్గం వ పంచ్‌లు మీద పంచులు పేలుస్తున్నారు తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే ఆ సమావేశాల్లో ఎక్కడా అనిల్ కుమార్ యాదవ్ కనిపించలేదు. దీంతో వైసీపీలోనే  అనీల్ కుమార్ అంతర్ధానంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్ష టీడీపీని చీల్చి చెండాడే  బృహత్తర అవకాశం. ఇలాంటి అవకాశాన్ని  నెల్లూరు సీటి ఫైర్ బ్రాంబ్ అనీల్ కుమార్ యాదవ్ ఎందుకు ఉపయోగించుకోలేదన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.    మరోవైపు నెల్లూరు నగర ప్రజలు తమ ఎమ్మెల్యే   కనిపించడం లేదంటూ రేపో మాపో  స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుు సమాయత్తమౌతున్నారని ప్రచారంలో ఉంది.   2019 ఎన్నికల్లో   విజయం సాధించి  జగన్   తొలి కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. దీంతో నెల్లూరు జిల్లాలో పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లను కూడా   కాదని అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు  జగన్ మంత్రి పదవి కట్టబెట్టడంతో సీనియర్లు మింగలేక కక్కలేక మథన  పడ్డారు.  అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను మీడియా సమావేశాలలో  విమర్శలతో రఫ్పాడించాలంటే  కొడాలి నాని  తరువాత  అనిల్ కుమార్ యాదవే అని అనుకునే స్థాయికి ఆయన ఎదిగిపోయారనడంలో సందేహం లేదు.  మరోవైపు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్.... ఆయన సొంత జిల్లా నేతలతోనే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించేవారని.. కానీ మంత్రి పదవి కాస్తా పోయే సరికి ఇటు  సొంత జిల్లాలో పార్టీ నేతలతో సఖ్యత లేక.. అటు నియోజకవర్గంలో ఏ పనులూ చేయకపోవడంతో జనానికి ముఖం చూపించలేక సైలంటైపోయారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.    కాగా వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మార్పుపై అనిల్ కుమార్ యాదవ్ దృష్టి కేంద్రీకరించారని.. ఆయన వెంకటగిరి నుంచి బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారని.. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే  అనిల్ కుమార్ యాదవ్‌కు ఆయన బాబాయి రూప్ కుమార్ యాదవ్ మధ్య రాజకీయంగా ఓ రేంజ్ లో ఫైట్ జరుగుతోందనీ, దీంతో  పరిస్థితి ప్రతికూలంగా ఉందని అర్థమైన అనిల్ కుమార్ యాదవ్ సైలంటై సైడైపోయారని అంటున్నారు.   

ఎన్టీఆర్ వ‌ర్సీటీకీ మీకూ సంబంధ‌మేమిటి.. చంద్ర‌బాబు

ఏపీ అసెంబ్లీ ఐదో రోజు బుధ‌వారం స‌మావేశం అయిన వెంట‌నే స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప్ర‌శ్నోత్త రాలు చేప‌ట్టారు. కానీ ఎన్టీఆర్ హెల్త్వ‌ర్సిటీ పేరు మార్పుపై స‌భ‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. హెల్త్ వ‌ర్సిటీ పేరు ఎలామారుస్తారంటూ టీడీపీ స‌భ్యులు భారీ నినాదాల‌తో హోరెత్తించారు. అయితే ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్ప టికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన ల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.  ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీకి వైఎస్ఆర్‌  పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో  వైఎస్ఆర్‌కు సంబంధమేమిట‌ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వ విద్యాలయానికి  మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావని సీఎం జ‌గ‌న్‌ని ప్ర‌శ్నించారు. హెల్త్ యూనివ ర్సి టీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగానిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకి స్తుందని ఆయన అన్నారు. వైద్య‌విద్య‌కు ప్ర‌త్యేక వ‌ర్సిటీ అవ‌స‌ర‌మ‌ని భావించే నాడు ఎన్టీఆర్ ఈ వ‌ర్సిటీని ఏర్పాటు చేశార‌ని చంద్ర బాబు గుర్తుచేశారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం త‌మ ప్ర‌భుత్వంలో ఆ వ‌ర్సిటీకీ ఎన్టీఆర్ పేరు పెట్టామ‌న్నారు. కానీ  వ‌ర్సిటీ స్థాపించిన 36 యేళ్ల త‌ర్వాత ఈ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించి వైఎస్ ఆర్ పేరు పెట్ట‌డం అర్ధ ర‌హిత‌మ‌ని టీడీపీ అధినేత అన్నారు.  మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని మండిపడ్డారు. వర్సిటీ  రూ.450 కోట్ల నిధులు కూడా బల వంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం.. ఏ హక్కుతో పేరు మార్చుతుందని నిలదీశారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా అంటూ బాబు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు. వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సీఎం జగన్ తెలుసు కోవాలి .ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగిం చాల‌ని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.